A homepage subtitle here And an awesome description here!

Wednesday, November 30, 2022

శ్రీ గురజాడ అప్పారావు గారి వర్థంతి

🌹🙏వెలుగుజాడ...గురజాడ....
నవయుగ వైతాళికుడు, "కవి శేఖర"
శ్రీ గురజాడ అప్పారావు  గారి వర్థంతి
 సందర్భంగా🙏🌷





#తెలుగు సాహిత్యంలో నూతన యుగావిర్భావాన్ని సూచించే ‘#వేగుచుక్క’ గురజాడ అప్పారావు.
తెలుగు భాష మహా కవి, తన రచన ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించినవారు. గురజాడ అప్పారావు తెలుగు సాహిత్యాన్ని #సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో ఒకడు.
తెలుగు సాహిత్యానికి వెలుగు జాడ - గురజాడ. 
#అభ్యుదయమే నిబద్ధతగా సాగిన ఆయన జీవితం- చైతన్య గీతం. మూఢ విశ్వాసాలు, దురాచారాలు సమాజాన్ని పట్టి పీడిస్తున్నపుడు తన కలంతో ప్రజలను చైతన్య పరిచేందుకు ఉద్యమించిన నవయుగ వైతాళికుడు- గురజాడ అప్పారావు.హేతువాది 19 వ శతాబ్దంలోను, 20 వ శతబ్ది మొదటి దశకంలోను ఆయన చేసిన రచనలు ఈనాటికీ ప్రజల మన్ననలను పొందుతున్నాయి. రాశిలో తక్కువైనా, ఆయనవి వాసికెక్కిన రచనలు.

#వ్యావహారిక భాషలో రచనలు చేయడం తప్పుగానూ, చేతకానితనం గాను భావించే ఆ రోజుల్లో ఆయన ప్రజలందరికీ అర్ధమయ్యే జీవ భాషలో రచనలు చేసాడు వీరి "కన్యాశుల్కం" తెలుగు అన్నిటికన్నా గొప్ప నాటకం అని చెప్పవచ్చు. అభ్యుదయ కవితా పితామహుడు అని బిరుదు పొందిన వీరు, తెలుగు సాహిత్యంలో వాడుక భాష ఒరవడికి కృషి చేసిన వారిలో ముఖ్యులు. వీరికి "కవి శేఖర" అనే బిరుదు కూడా కలదు.హేతువాది అయిన అప్పారావు రచనలు 19వ శతాబ్ది ఆఖర్లోనూ మరియు 20 వ శతాబ్ది మొదట్లో వ్రాసినవి అయినప్పటకీ ఈనాటికీ ప్రజల మన్ననలను పొందుతున్నాయి.

 #విజయనగరం జిల్లా రాయవరంలో 1862, సెప్టెంబరు 21న గురజాడ వెంకట రామదాసు, కౌసల్యమ్మల సంతానంగా పుట్టిన ఈ పంధొమ్మిదో శతాబ్దపు వ్యక్తి ఇరవై ఒకటో శతాబ్దంలోనూ సజీవ స్ఫూర్తిగా ప్రకాశిస్తున్నాడంటే ఆయన పురోగామి దృక్పథం ప్రజాస్వామిక లక్షణాలు కారణం. సనాతన కుటుంబంలో పుట్టినా మానవతా చైతన్యాన్ని ప్రబోధించాడు గురజాడ. ఆధునిక మహిళ భారత చరిత్రను పునర్లిఖిస్తుందని గురజాడ అప్పారావు ఓ వంద సంవత్సరాలకు పూర్వమే విశ్వసించాడు. ఆయన భావాలు, అభ్యుదయం, స్త్రీ జన ఉద్దరణ ఆనాటి కాలానికే కాదు, ఈ నాటి విశ్వాసాలకంటే కూడా ముందు వున్నాయి అంటే అతి శయోక్తి   కాదు. రాశిలో తక్కువైనా, ఆయనవి వాసికెక్కిన రచనలు.

#వ్యావహారిక భాషలో రచనలు చేయడం తప్పుగానూ, చేతకానితనం గాను భావించే ఆ రోజుల్లో ఆయన ప్రజలందరికీ అర్ధమయ్యే జీవ భాషలో రచనలు చేసాడు. అటు గ్రాంధికం లోను, ఇటు ఆంగ్లం లోనూ గొప్ప పట్టు ఉన్నప్పటికీ ఆయన రచనలు “జనం భాష” లోనే చేసాడు. సామాన్య జనానికి అందని సాహిత్యం సముద్రం లోని ధన రాశి  గానే అయన భావించాడు. బ్రతుకు తెరువుకై రాజు కొలువు చేసినప్పటికీ రాజ్యం కంటే దేశమే గొప్పదని భావించిన అప్పారావు “దేశమును ప్రేమించు మన్నా … మంచి యన్నది పెంచు మన్నా“, “దేశమంటే మట్టి కాదోయ్…దేశమంటే మనుషులోయ్“ అని గొంతెత్తి అరిచాడు. దేశభక్తిని పెంపొందించిన ప్రజాకవి గురజాడ.

#ఈనాటి వర కట్నం, ఆ నాటి కన్యా శుల్కం రెండూ అనాచారాలే, స్త్రీ ల పట్ల వివక్షే ! రెండూ సమాజపు విలువలను కలుషితం చేసే కాల కూట విషాలే! కన్యా శుల్కం పేరిట ముక్కు పచ్చలారని బాలికలను డబ్బు ఆశతో, తల్లి దండ్రులు జబ్బు ముదిరి  కాటికి కాళ్ళు జాచిన వృద్దులకిచ్చి బెడితే, భర్త ఆనతి కాలం లోనే కాలం చేస్తే బాలికలు వితంతువులు గానే జీవితాలను ముగించేవారు. ఆనాటి కుహనా విలువలను కళ్ళకు కట్టినట్లు చెబుతాడు అప్పారావు తన “పుత్తడి బొమ్మ పూర్ణమ్మ” లో. 

#గురజాడ రచించిన “కన్యా శుల్కం” హాస్య నాటకం గా ముద్రించినప్పటికీ అందులోని పాత్రలు హాస్య రసాన్ని కురిపించినప్పటికీ  అది ఓ గొప్ప విషాద నాటకం అంటాడు తరువాత కాలం లో వచ్చిన శ్రీ శ్రీ. ఆ నాటకం లో మగ వారి స్త్రీ లోలత్వం, వున్నత కులాల్లో చాటు మాటు గా సాగే దొంగాటలు, స్త్రీల పట్ల వివక్ష, దుర్భరమైన బాల వితంతువుల జీవితాలు   మనకు కన్పిస్తాయి. నాయికానాయకులంటే కులీన వర్గాలకు, పై కులాలకే చెంది ఉండాలనే సూత్రాలన్నిటినీ ధ్వంసం చేసి వేశ్యా కులంలోని మధురవాణి ద్వారా ఆచారపరాయణులమనేవారి బూటకత్వాన్ని ఎండగట్టారు. మరోవైపు ఉన్నత కులం నుంచే వచ్చిన గిరీశాన్ని అవలక్షణాల పుట్టగా, మోసపూరితమవుతున్న సామాజిక దృశ్యానికి సంకేతంగా ప్రాణ ప్రతిష్ట చేశాడు. ఆధునిక స్త్రీ కొత్త చరిత్ర సృష్టిస్తుంది అన్న గురజాడ అగ్నిహోత్రావధాన్ల భార్య వెంకమ్మ  వంటి సనాతన పాత్రలతో కూడా తిరుగుబాటు మాటలనిపించడం చూస్తాం. బాల వితంతువు బుచ్చమ్మ తన చెల్లెలి పెళ్ళి కోసమే గిరీశంతో వెళ్ళిపోవడానికి సిద్ధమవడంలోనూ సాహసం, త్యాగం చూస్తాం. పూటకూళ్ళమ్మ చీపురుతో బాదినా, మీనాక్షి శాపనార్థాలు పెట్టినా అన్నిటా స్త్రీ నిరసన తొలి సంకేతాలు అగుపిస్తాయి. “#తాంబూలాలిచ్చేశాను #తన్నుకు చావండి” , “డామిట్ కథ అడ్డం తిరిగింది“, “#పొగ తాగని వాడు దున్నపోతై పుట్టున్” లాంటి నూతన భాషా ప్రయోగాలు నేటికీ నిత్య నూతనమే. 
చింతాకు చెట్టూ చిలకలతోటి ఏ మన్పించింది, అరటికాయబజ్జి, మినపప్పు బజ్జి, ఏనుగెక్కేమనం ఏ ఊరెళదాం.. తదితర చిన్న, చిన్న గేయాలతో చిన్నారులకు ప్రియమైన తాతయ్యగా కూడా మారారు. వాడుక భాషను విస్తృత ప్రచారంలోకి తెచ్చి, ఆ భాషలోనే రచనలు చేస్తూ పండిత పామరులను కట్టిపడేసిన గురజాడ రచనా శైలి ఆయనను ‘నవయుగ వైతాళికుడి’గా నిలబెట్టింది.

#కన్యాశుల్కం నాటకంలోని మధురవాణి పాత్ర తెలుగు సాహిత్యంలోనే ఇంతవరకు సృష్టించ బడని గొప్ప పాత్ర. ఆడవారికైనా, మగవారికైనా నీతి ఒకటి ఉండాలని ఆ పాత్ర ద్వారా చెప్పిస్తారు గురజాడవారు.

#నేను చెడిపోయిన వారిని చేరదీస్తున్నానుగాని, ఎవరినీ చెడగొట్టటంలేదు. ఆ విషయాన్ని మా అమ్మ నాకు నేర్పింది.’ అంటూ మధురంగా #మధురవాణిపాత్ర ద్వారా గురజాడవారు #అద్భుతంగా చెప్పించారు.
ఈ నాటకం కన్నడం, ఫ్రెంచి, రష్యన్‌, ఇంగ్లీషు (2 సార్లు), తమిళం, హిందీ (2 సార్లు) భాషల్లోకి అనువాదమైంది.

#నవయుగ కవితా వైతాళికుడు గిడుగు రామ్మూర్తి పంతులుకు మెట్రిక్యులేషనలో క్లాస్‌మేట్‌ అయిన గురజాడ అప్పారావు కందుకూరి వీదేశలింగం పంతులు లోని సంఘ సంస్కరణ, గిడుగులోని భాషా సంస్కరణలు తీసుకుని రెండింటినీ మేళవించి ఒక సాంఘిక విప్లవం తీసుకువచ్చారు.

#ఉపాధ్యాయుడిగానూ, డిప్యుటీ కలెక్టర్ ఆఫీసులో హెడ్‌క్లర్కుగానూ, విజయనగరం రాజు ఆస్థానంలోనూ, అధ్యాపకుడిగానూ పనిచేసిన గురజాడ- తొలుత ఆంగ్లంలో రాసినప్పటికీ, తర్వాత తెలుగులోకీ, అందునా ఆ సారం చేరవలసిన జనభాషలోకీ మరలాడు. 
చిన్న వయస్సులోనే 1915, నవంబరు 30న కన్నుమూశారు. ఓ చిన్న జీవితం లో గురజాడ సాధించిన విజయాలు తన  స్వార్ధానికి కాదు కనుకనే చాల సంవత్సరాల తరువాత కూడా అయన ప్రజల గుండెల్లో నిలిచాడు. 


Monday, November 28, 2022

మహాత్మ జ్యోతిరావు ఫూలే గారి వర్థంతి సందర్భంగా🙏🌷

🌷🙏"బహుజనతత్వకర్త తొలి మహాత్ముడు"మహాత్మ జ్యోతిరావు ఫూలే గారి వర్థంతి సందర్భంగా🙏🌷





"ఒక యువకుడు తన ప్రాణస్నేహితుని పెండ్లికి వెళ్ళాడు..పెండ్లిఇంటిలో వరుడితో చాలా సన్నిహితంగా వుంటూ హడావుడిగా తిరుగుతూ పనులు పర్యవేక్షిస్తున్నాడు.. అతని హడావుడి,చురుకుదనం చూసిన కొంతమంది అతనెవరని అడిగారు.. అతని కులం ఏమిటని అడిగారు..ఆ అబ్బాయి తన పేరు,కులం చెప్పాడు..అంతే అక్కడున్న కొందరు ఒక బ్రాహ్మణునిఇంట పెండ్లిలో ఒక శూద్రుడు తిరుగాడుటయా అంటూ మండిపడ్డారు..అతనిని అవమానకరంగా మాట్లాడారు. పెండ్లికొడుకు,తండ్రి ఎంత చెప్పినవినకుండా..అతను ఇంట్లో తిరిగితే మేము వెళ్ళిపోతామంటూ బెదిరించారు.విదిలేనిపరిస్థితులలో ఆ యువకుడు అవమానభారంతో తలదించుకొని ఇంటిదారి పట్టాడు. మానవుల మధ్య వివక్షత అతని మనసును గాయపరిచింది..ఇంట్లో బాగా ఆలోచించాడు.తనను అవమానపరిచినవారి గొప్పతనం ఏమిటో ఆలోచించాడు..అతనికి వెంటనే ఆలోచన తట్టింది... ఏ "అక్షరం"చూసి వారు మిడిసిపడుతున్నారో ఆ అక్షరమనే ఆయుధాన్ని ప్రజలందరికీ అందించాలని నిర్ణయించుకున్నాడు.ఫలితంగా ఒక మహోద్యమానికి తెరతీశాడు...అతడే నవయుగవైతాళికుడు జ్యోతీరావుపూలే....
***    ***  *** 

#మహాత్మ జ్యోతిరావు ఫూలే ఈ దేశ ఆధునిక యుగ వైతాళికుడు. నిజమైన #పునరుజ్జీవనోద్యమ #పితామహుడు. భారతదేశంలోని శూద్రులు… శూద్రాతిశూద్రులు (దళిత, బహుజన, ఆదివాస, గిరిజన, ముస్లీం, మైనార్టీలు)  అగ్ర కుల వ్యవస్థలో బానిసలుగా ఉన్నారు. అంతే కాకుండా అమెరికాలోని నల్లజాతి బానిసల్లాగా బానిస బతుకులు బతుకుతున్నారని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి జ్యోతిరావు ఫూలే.
కులం పేరుతో తరతరాలుగా అణచివేతకు గురౌతున్న బడుగు, బలహీనవర్గాల ప్రజలకు తాను అండగా నిలిచాడు. అందరికీ చదువు ఎంతో అవసరమని #పాఠశాలలను రూపొందించారు.

స్త్రీలకు #ఆత్మస్థైర్యం కల్పించి, వారి హక్కుల కోసం పోరాడి, సాధికారత కల్పనకు కృషి చేసిన మహనీయుడు. భారతదేశంలో కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడాడు.బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడటమే ప్రథమ కర్తవ్యంగా తను ప్రజలను చైతన్య పరిచి, పోరాటాన్ని నడిపినాడు.

#బాల్యం-తొలి జీవితం:

సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడైన జ్యోతీరావ్ గోవిందరావ్ ఫులే మహారాష్ట్ర లోని సతారా జిల్లాలోని వ్యవసాయ కుటుంబంలో 1827 ఏప్రిల్‌ 11న జన్మించాడు. ఈ‍యన ఏడాదిలోపే పూలే తల్లి మరణించింది.

#ఇంటి పేరు ఫూలే గా మారింది.....

ఆయన తండ్రి గోవిందరావు కూరగాయలు అమ్మి వారి కుటుంబాన్ని పోషించేవాడు. కాలక్రమేణా భారతదేశంలో పీష్వా పరిపాలన ప్రారంభం అయింది. దీంతో ఆ కాలంలో కూరగాయల వ్యాపారం మానేసి పూల వ్యాపారం మొదలు పెట్టాడు పూలే తండ్రి. అలా పూల వ్యాపారం చేస్తూ ఉండడం వలన వారి ఇంటి పేరు ఫూలే గా మారింది. 

7 సంవత్సరాల వయస్సులో ఫూలే ఒక మరాఠీ పాఠశాలలో చేరి తన ప్రాథమిక విద్యనభ్యాసాన్ని ప్రారంభించాడు. కొన్ని రోజులకు చదువును మానేసి తన తండ్రికి వ్యవసాయంలో సాయం చూస్తూ ఉండేవాడు. పనులు ముగించుకుని రాత్రి పూట లాంతరు ముందు కూర్చుని చదువుకునేవారు పూలే. అది గమనించిన ఒక ముస్లిం టీచర్, మరో క్రైస్తవ పెద్వ మనిషి పూలే తండ్రితో మాట్లాడి తన చదువును తిరిగి కొనసాగించేలా ఒప్పించారు. 1841లో స్కాటిష్ మిషన్ పూణేలో నడుపుతున్న పాఠశాలలో చేర్పించాడు.

#శివాజీ అంటే అభిమానం...

జోతిరావ్‌కు చిన్నప్పటి నుంచే శివాజీ అంటే అభిమానం ఎక్కువ. శివాజి, జార్జ్‌ వాషింగ్టన్‌ల జీవితచరిత్రలు ప్రభావితం చేయడంవల్ల దేశభక్తి, నాయకత్వ గుణాలు అలవాటయ్యాయి. #థామస్‌ రచించిన ‘మానవ హక్కులు’ పుస్తకం అతని ఆలోచనలను ప్రభావితం చేసింది.

#వివాహం:

తన చదువును కొనసాగిస్తున్న సమయంలోనే అంటే పూలే 13వ ఏట 9ఏళ్ల సావిత్రి బాయితో వివాహం జరిపించారు. తన చదువులు పూర్తి చేసుకున్న అనంతరం పూల వ్యాపారం చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకునేవారు. 1848లో జరిగిన ఒక సంఘటన పూలేని గాయపర్చింది. దీంతో పూలే అప్పటి నుంచి వివక్షపై పోరాడాలని నిశ్చయించుకున్నాడు. దాంతోపాటు సమాజంలో స్త్రీలు విద్యావంతులు కావాలనే నిర్ణయానికొచ్చాడు. తన భార్య సావిత్రిబాయి పూలేని పాఠశాలకు పంపించాడు. మొట్టమొదటి బాలికల పాఠశాలను స్థాపించాడు. ఆయన స్థాపించిన పాఠశాలలో అన్ని కులాల వారికి ప్రవేశం కల్పించాడు. అతను తక్కువ కులానికి చెందినవారు కావడంతో ఆ పాఠశాలలో విద్యను బోధించడానికి ఎవరూ ముందుకు రాలేదు. దాంతో తన భార్య #సావిత్రి బాయి పూలేని ఆ పాఠశాలకు మొదటి మహిళా ఉపాధాయురాలిగా నియమించాడు.

 
కులం పేరుతో తరతరాలుగా అణచివేతకు గురౌతున్న బడుగు, బలహీనవర్గాల ప్రజలకు తాను అండగా నిలిచాడు. అందరికీ చదువు ఎంతో అవసరమని పాఠశాలలను రూపొందించారు.

#ప్రజల్లో చైతన్యం:

ఆనాడు సమాజంలో బాల్య వివాహాలు ఎక్కువగా జరిగేవి. చిన్న పిల్లలని ముసలివారికిచ్చి పెళ్ళి చేయడం వల్ల చిన్నతనంలోనే మహిళలు వితంతువులయ్యేవారు. దీంతో వితంతు వివాహాలను చేయాలని ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చాడు.1853లో వితంతు మహిళల అనాథ శిశువుల కోసం సేవాసదనం ప్రారంభించాడు. అంతేకాక వింతంతువుగా మారిన గర్భిణీ స్ర్తీల కోసం 1864లో "బాలహత్య ప్రధిబంధక్ గృహ" స్థాపించాడు. 1872లో ఈ కేంద్రంలో జన్మించిన ఒక బ్రాహ్మణ వితంతువు కుమారుణ్ణి ఫూలే దత్తత తీసుకున్నాడు. 1873 సెప్టెంబరు 24న సత్య శోధక సమాజాన్ని ఫూలే స్థాపించాడు.
ఫూలే కేవలం శూద్ర వర్ణాల్లో అణిచివేతకు గురౌతున్న కులాల ప్రజల పక్షాన పోరాడటమే కాకుండా, అగ్రవర్ణ వితంతువుల పునర్వివాహానికి గొప్ప కృషి చేశారు.

#దీనబంధు' వార పత్రిక...

 1873లో 'గులాంగిరి', 'సేద్యగాని చర్మకోల' అనే గ్రంథాల్ని రచించారు. 
1871 సత్యశోధక సమాజం తరపున 'దీనబంధు' వార పత్రిక ప్రారంభించాడు. 1880లో భారత ట్రేడ్‌ యూనియన్‌ ఉద్యమ పితామహుడు లోఖాండేతో కలసి రైతులను, కార్మికులను సంఘటితం చేసేందుకు ప్రయత్నించాడు.

#శివాజీ చరిత్రను గేయ రూపంలో....

1874 ఫిబ్రవరి 12న మహాత్మ జ్యోతిబా ఫూలే, రాయఘడ్‌లోని శివాజీ సమాధిని వెలికితీసి ఆయన చరిత్రను గేయ రూపంలో రాసి 1885 నుండి శివాజీ జయంతి ఉత్సవాలను ప్రారంభించాడు. 

#సామాజిక,ప్రజాస్వామ్యం సాధించటం  దేశానికి ముఖ్యం.....

సామాజిక,ప్రజాస్వామ్యం సాధించటం ఈ దేశానికి అతి ముఖ్యమనే సందేశాన్ని అందించినారు
సామాజిక ప్రజాస్వామ్యం సాధించటం భారత దేశానికి ముఖ్యమనే మహత్తర సందేశాన్ని అందించిన మహాత్మ ఫూలే తన గురువు అని డా బి.ఆర్‌. అంబేడ్కర్‌ ప్రకటించారు. దక్షిణాఫ్రికా జాతీయోద్యమ నాయకుడు #నెల్సన్‌ మండేలా భారతదేశ పర్యటనకు వస్తున్న సందర్భంలో ఆ మహనీయునికి సమర్పించాలని నిర్ణయించుకొన్న గౌరవ కానుక మహాత్మ ఫూలే రచించిన మహత్తర గ్రంథం ‘#గులాంగిరి’.ఫూలే. సమాజంలో వెనుకబడిన వర్గాల, కులాల, మహిళల అభ్యున్నతికి చేసిన కృషికి ఆయనను ప్రజలు “#మహాత్మా” అనే బిరుదుతో పిలుచుకున్నారు.

#తెలుగు వారి సహకారం:

గాంధీజీ కంటే ముందే మహాత్మునిగా జన నీరాజనాలందుకున్న జోతీరావు ఫూలే దంపతులు నివసించిన భవనం నేటికీ పుణేలో నిలిచి ఉంది. ఆ భవనంలోని హాలులో ఫూలే, సావిత్రిబాయి ఫూలే, సాహు మహరాజ్‌ల సరసన మరో నిలువెత్తు చిత్రపటం కనబడుతుంది. ఆయన ఫూలే సామాజిక సంస్కరణోద్యమానికి తుదిశ్వాస వరకు చేదోడువాదోడై నిలిచిన జాయా కారాడీ లింగు తెలంగాణం కన్న తెలుగుబిడ్డ. నైజాం సంస్థానంలో న్యాయమూర్తి పదవిని కాదనుకొని తండ్రిలా భవన నిర్మాణవృత్తిని చేపట్టారు. పుణే, ముంబైలలో సామాజిక ఉద్యమకారునిగా సుప్రసిద్ధులైన ఆయన పుణే మునిసిపాలిటీకి ఎన్నికై, 12 ఏళ్ల ప్రజాప్రతినిధిగా పనిచేశారు. కారాడీ లింగువంటి సహచరుడు దొరకడం ఫూలే అదృష్టమని చరిత్రకారులు అంటారు. కారాడి లింగు తండ్రి జాయా ఎల్లప్పలింగు ముంబైలో భవన నిర్మాణ కాంట్రాక్టరు.ఫూలే కొంతకాలం భవన నిర్మాణ కాంట్రాక్టరుగా పనిచేశారు. అప్పుడే ఆయనకు ముంబై తెలుగు ప్రజల పితామహునిగా ప్రసిద్ధులైన కాంట్రాక్టరు రామయ్య వెంకయ్య అయ్యవారితో పరిచయమైంది. వెంకయ్య ఫూలేను ముంబైకి ఆహ్వానించి, తోటి కాంట్రాక్టర్లతో కలిసి సత్యశోధక సమాజాన్ని విస్తరింపజేయడానికి, పాఠశాలలను ఏర్పాటుచేసి నడపడానికి ఆర్థిక, హార్దిక సహాయాలను అందించారు. సత్యశోధక సమాజానికి తెలుగువారి విరాళాలే ప్రధాన ఆర్థిక వనరుగా ఉండేవి. వెంకయ్య ఇల్లే అనాథ బాలల ఆశ్రమంగా ఉండేది. ఫూలే ప్రసిద్ధ గ్రంథం ‘గులాంగిరి’ని ఆయనే ప్రచురించారు.

ఏ #ప్రాణస్నేహితుని పెండ్లిలో అవమానపడ్డాడో ..అదే ప్రాణస్నేహితుడు పూలేగారికి చివరి వరకు సహాయసహాకారాలు అందించి తోడ్పాటుగా నిలవడం #కొసమెరుపు.....

#దీర్ఘకాల వ్యాధితో బాధపడుతూ… తన జీవితాంతం అసమానతలు లేని సమసమాజ స్థాపన కోసం పరితపించి మహాత్మా జ్యోతిరావు ఫూలే 1890 నవంబర్ 28న కన్నుమూశారు. ఆ మహానీయుడు, సామాజిక తత్వవేత్త, సమన్యాయ సత్య శోధకుడు.

Sunday, November 27, 2022

💐💐ప్రముఖ హిందీ కవిపద్మ భూషణ్ హరివంశరాయ్‌ బచ్చన్‌ గారి జయంతి సందర్భంగా💐💐

💐💐ప్రముఖ హిందీ కవి
పద్మ భూషణ్  హరివంశరాయ్‌ బచ్చన్‌ గారి జయంతి సందర్భంగా💐💐
(హరివంశరాయ్‌ బచ్చన్‌
కుమారుడు అమితాబ్ బచ్చన్‌. బచ్చన్ 
 అనేది కలం పేరు)





"ఉరుకుల పరుగుల జీవితంలో ఎప్పుడైనా ఖాళీ సమయం దొరికితే.. ఎక్కడైనా కాసేపు కూర్చొని, నేనేం చేశాను? ఏం చెప్పాను? దేనిని నమ్ముతున్నాను? అందులో ఏది మంచి.. ఏది చెడు అని ఆలోచిస్తాను" హరివంశరాయ్‌ బచ్చన్‌

#హరివంశ్ రాయ్ బచ్చన్ ( 1907 నవంబరు 27 - 2003 జనవరి 18) 20 వ శతాబ్దం ప్రారంభంలో హిందీ సాహిత్యంలోని నయీ కవితా సాహిత్య ఉద్యమంలోని భారతీయ కవి. అతను బ్రిటిష్ ఇండియా లోని యునైటెడ్ ప్రావిన్సెస్ ఆఫ్ ఆగ్రా లోని ప్రతాప్‌గఢ్ జిల్లాకు చెందిన బాబుపట్టి గ్రామంలో కాయస్థ కులంలోని శ్రీవాస్తవ వంశానికి చెందిన అవధి భారతీయ హిందూ కుటుంబంలో జన్మించాడు. అతను హిందీ కవి సమ్మేళన్‌కు చెందిన కవి. . అతను తన ప్రారంభ రచన మధుశాల (मधुशाला) ద్వారా గుర్తింపు పొందాడు.అతని భార్య తేజీ బచ్చన్ సామాజిక కార్యకర్త. అతని కుమారుడు అమితాబ్ బచ్చన్. అతని మనుమడు అభిషేక్ బచ్చన్. 1976 లో హిందీ సాహిత్యానికి చేసిన సేవకు గాను పద్మ భూషణ్ పురస్కారాన్ని అందుకున్నాడు.

#పద్మభూషణ్ డాక్టర్ హరివంశ్ రాయ్ బచ్చన్ ప్రముఖ రచయిత మరియు ఆధునిక హిందీ కవిత్వానికి మార్గదర్శకులలో ఒకరు. అతను  విభిన్నమైన రచనా శైలిని కలిగి ఉన్నాడు. అతని సహచరులలో మహాదేవి వర్మ, సుమిత్రానన్ పంత్ మరియు రాంధారి సింగ్ దినకర్ వంటి ప్రసిద్ధ రచయితలు ఉన్నారు.

*"#బచ్చన్"  అనేది కలం పేరు*

1941 నుండి 1957 వరకు, అలహాబాద్ విశ్వవిద్యాలయంలో ఆంగ్ల విభాగంలో అధ్యాపకునిగా బోధించాడు. ఆ తరువాత రెండు సంవత్సరాలు అతను కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన సెయింట్ కాథరీన్ కళాశాలలో ఐరిష్ రచయిత డబ్ల్యూ.బి.యీట్స్ రచనలపై పి.హెచ్.డి చేసాడు. అతను హిందీ కవిత్వం రాసేటప్పుడు వాడే శ్రీవాస్తవకు బదులుగా "బచ్చన్" (బాలుడు అని అర్థం) అనే కలం పేరును ఉపయోగించడం ప్రారంభించాడు. భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత, అలహాబాద్ విశ్వవిద్యాలయంలో ఆంగ్ల సాహిత్యం బోధించాడు. అలహాబాద్‌లోని ఆల్ ఇండియా రేడియోలో కూడా పనిచేశాడు

#రచనా వృత్తి:

బచ్చన్ అనేక హిందీ భాషలలో ( హిందూస్థానీ, అవధి ) నిష్ణాతుడు. అతను దేవనాగరి లిపిలో వ్రాసిన విస్తృత హిందూస్థానీ పదజాలం  చేర్చాడు. అతను పెర్షియన్ లిపిని చదవలేకపోయినపుడు, అతను పెర్షియన్, ఉర్దూ కవిత్వం పట్ల ఒమర్ ఖయ్యామ్ చేత ప్రభావితమయ్యాడు.

బచ్చన్ రచనలు సినిమాలు, సంగీతంలో ఉపయోగించబడ్డాయి. ఉదాహరణకు, అమితాబ్ బచ్చన్ నటించిన 1990 చిత్రం అగ్నీపాత్లో అతని రచన "అగ్నిపత్" లోని ద్విపదలు ఉపయోగించారు. తరువాత 2012లో హృతిక్ రోషన్ నటించిన రీమేక్ చేయబడిన అగ్నీపథ్ లో కూడా ఆ ద్విపదలు ఉపయోగించబడ్డాయి.

1968: సాహిత్య అకాడమీ అవార్డు లభించింది • 1976: పద్మభూషణ్‌తో సత్కరించబడింది • 1991: తన నాలుగు-వాల్యూమ్‌ల ఆత్మకథ, క్యా భూలూన్ క్యా యాద్ కరూన్, నీదా కా నిర్మాణ్ ఫిర్, బసేరే సే దూర్ మరియు దశద్వార్ సే సోపన్ తక్ కోసం సరస్వతి సమ్మాన్‌తో సత్కరించారు.

కొంతకాలం క్రితం పోలండ్ లోని వ్రోక్లా పట్టణంలో ఒక చతురస్రానికి హరివంశ్ రాయ్ బచ్చన్ పేరు పెట్టారు. ఆ తర్వాత ఇప్పుడు ఈ చిత్రం అక్కడి నుంచి బయటకు వచ్చింది. హరివంశరాయ్ బచ్చన్ దగ్గర ఒక దీపం వెలిగించబడుతుంది, పుస్తకాలతో కుర్చీపై కూర్చొని. ఈ చిత్రాన్ని పంచుకున్న అబితబ్ బచ్చన్ ఇలా రాశాడు- 'పోలండ్ లోని వోక్లాలోని తన విగ్రహం వద్ద దీపావళికి 'దియా' ఉంచడం ద్వారా వారు బాబూజీని గౌరవిస్తారు. ఒక గౌరవప్రదం."

#రాజ్యసభ సభ్యునిగా
3 ఏప్రిల్ 1966 - 2 ఏప్రిల్ 1972 వరకు పనిచేశారు.

2003 జనవరి 18 (వయస్సు 95) మరణించారు.
🙏🙏🌷🌺🌹🙏🙏


1) EWS అంటే ఏమిటి ? Economically Weaker Section. OC లలో అగ్రవర్ణాలలో ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలు

1) EWS అంటే ఏమిటి ?
జ) Economically Weaker Section.







కేంద్ర ప్రభుత్వం OC లలో అగ్రవర్ణాలలో ఆర్ధికంగా వెనుకబడిన వర్గాల వారికి విద్యా, ఉద్యోగాలలో 10% రిజర్వేషన్లు కల్పించింది.

2) EWS వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి ?
జ) కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే అన్ని కళాశాలల్లో 10% సీట్లు,కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో  ఉండే అన్ని ఉద్యోగాలలో 10% కేటాయిస్తారు.
రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యలో,ఉద్యోగాలలో 10% రిజర్వేషన్లు కేటాయించడం జరిగింది.

3) EWS రిజర్వేషన్ పొందడానికి కావలసిన అర్హతలు ఏమిటి ?
జ) 1) కుటుంబ ఆదాయం 8 లక్షలు,ఆ లోపు మాత్రమే ఉండాలి.

2)వ్యవసాయ భూమి 5 ఎకరాలు,ఆ లోపు మాత్రమే ఉండాలి.

3)ఇల్లు 1000 చదరపు అడుగులలో మాత్రమే ఉండాలి.

4)నోటిఫై చేసిన మున్సిపల్ ఏరియాలో స్థలం 100 చదరపు గజాలు మాత్రమే ఉండాలి.

5)  రూరల్ ఏరియాలో  స్ధలం ఉంటే అది 200 చదరపు గజాలు మాత్రమే ఉండాలి.

4) EWS కి ఎలా అప్లై చేయాలి ?
జ) మీ ఆధార్ కార్డును అడ్వకేట్ గారి దగ్గరకు తీసుకువెళ్ళి EWS అప్లై చేయడానికి నోటరీ కావాలని అడగండి.వెంటనే నోటరీ సర్టిఫికేట్ ఇస్తారు.
ఆ ఒరిజనల్ నోటరీతో పాటు,అభ్యర్ధి ఆధార్ జెరాక్స్ ,ఓ పాస్ పోర్ట్ సైజ్ ఫోటో తీసుకుని మీ సేవ ఆఫీసు/సచివాలయం కు వెళ్ళండి.అక్కడ వారు ఓ అప్లికేషన్ ఇస్తారు.దానిపై సంతకం చేసేసి మీ దగ్గర ఉన్న  పేపర్లు అన్ని ఇస్తే సరిపోతుంది.

5) EWS సర్టిఫికేట్ కాల పరిమితి ఎంత  ?
జ) EWS సర్టిఫికేట్ కాల పరిమితి ఒక  సంవత్సరం (ఏప్రియల్ నుండి మార్చి వరకు)మాత్రమే.టైమ్ అయిపోతే మరల నోటరి దగ్గర నుంచి ప్రాసెస్ మొదలు పెట్టాలి.
2021-22ఫైనాన్షియర్ ఇయర్ లో వచ్చిన ఆదాయం బట్టి ఇచ్చిన సర్టిఫికేట్ కాల పరిమితి 2022 ఏప్రియల్ నుండి 2023మార్చి వరకు మాత్రమే.

6) కుటుంబం అంతటికి ఒక EWS సర్టిఫికేట్ సరిపోతుందా ?
జ) సరిపోదు.విద్య,ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న కుటుంబం లో వారందరూ విడివిడిగా చేయించుకోవాలి.
🤝🙏

🌺📚జాతీయ గణిత దినోత్సవం డిసెంబరు 22📚🌺


డిసెంబరు 22.. జాతీయ గణిత దినోత్సవం.. రామానుజన్ నంబరు గురించి మీకు తెలుసా..?






శ్రీనివాస రామనుజన్ పుట్టినరోజుని భారత జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటున్నాం. 1887 డిసెంబరు 22వ తేదిన తమిళనాడులో జన్మించిన రామానుజన్, గణితంలో ఎన్నో కొత్త కొత్త ఆవిష్కరణలు కనుగొన్నాడు. ఐతే రామానుజన్ గురించి తెలిసిన వాళ్లకి రామానుజన్ నంబర్ గురించి కూడా తెలిసే ఉంటుంది. 1729.. రామానుజన్ నంబరు.. అసలు ఈ నంబరుని రామానుజన్ నంబర్ అని ఎందుకంటారు. దానికి ఉన్న విశిష్టత ఏమిటో ఇప్పుడు చూద్దాం.

గణితంలో మరిన్ని పరిశోధనల కోసం రామానుజన్ గారు కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి వెళ్ళారు. అక్కడ ప్రొఫెసర్ హార్డీతో రామానుజన్ గారికి మంచి పరిచయం ఏర్పడింది. హార్డీగారు రామానుజన్ తో కలిసి అనేక గణిత శాస్త్ర ఫార్మూలాలు కనుక్కున్నారు.


ఐతే రామానుజన్ గారు అనారోగ్యానికి గురై మంచం పట్టినపుడు ప్రొఫెసర్ హార్డీ చూడడానికి వచ్చారు. అప్పుడు వాళ్ల మాటల మధ్యలో రామానుజన్ గారు, హార్డీ.. నువ్వు ఎలా వచ్చావని అడగ్గా, కారులో వచ్చానని బదులిచ్చారు.

ఆ కారు నెంబరు ఎంత అని అడగ్గానే, కారు నెంబరుకి పెద్ద ప్రత్యేకతేం లేదు అని 1729 అని చెప్పాడు. అప్పుడు వెంటనే రామానుజన్ గారు ఆ నంబరుకి ప్రత్యేకత లేదని ఎవరు చెప్పారు. ఆ సంఖ్యని రెండు ఘనాల మొత్తంగా రెండు రకాలుగా రాయవచ్చు. అలా రాయగలిగిన ఒకే ఒక్క నంబరు అది అని చెప్పడంతో హార్డీ షాకయ్యారు. క్షణం కూడా ఆలోచించకుండా నంబరుకి ఉన్న ప్రత్యేకత చెప్పడంతో, హార్డీ ఆశ్చర్యానికి గురయ్యారు.

1729..
ఈ సంఖ్యని 9, 10 ఘనాల మొత్తాన్ని(9*9*9*)+(10*10*10) కలిపితే 1729వస్తుంది.
అలాగే 12, 1 ఘనాల మొత్తాన్ని (12*12*12) + (1*1*1) కలిపినా 1729 వస్తుంది.















































































Saturday, November 26, 2022

💐భారత రాజ్యాంగ ప్రవేశిక💐

భారత రాజ్యాంగ ప్రవేశిక: భారత రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగం యొక్క సూత్రాలను సూచిస్తుంది మరియు దాని అధికారం యొక్క మూలాలను సూచిస్తుంది. భారత రాజ్యాంగ ప్రవేశిక 26 నవంబర్ 1949న రాజ్యాంగ సభ చే ఆమోదించబడింది మరియు 26 జనవరి 1950న అమల్లోకి వచ్చింది. మేము భారత రాజ్యాంగ ప్రవేశిక గురించి వివరణాత్మక సమాచారాన్ని అందిస్తున్నాము.






1946లో, రాజ్యాంగ నిర్మాణాన్ని వివరిస్తూ జవహర్‌లాల్ నెహ్రూ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్‌ను ప్రవేశపెట్టారు. 1947లో (జనవరి 22) ఇది ఆమోదించబడింది. ఇది భారత రాజ్యాంగాన్ని ఆకృతి చేసింది మరియు దాని సవరించిన సంస్కరణ భారత రాజ్యాంగ ప్రవేశికలో ప్రతిబింబిస్తుంది. ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ యొక్క ప్రాథమిక సిద్ధాంతాలు:

భారతదేశాన్ని స్వతంత్ర, సార్వభౌమాధికారం మరియు గణతంత్ర దేశంగా చూడాలనే రాజ్యాంగ సభ సంకల్పం
భారతదేశానికి రాజ్యాంగాన్ని రూపొందించడానికి
స్వాతంత్య్రానికి పూర్వం ఉన్న భారతదేశంలోని అన్ని భూభాగాలను స్వతంత్రానంతర భారతదేశం యొక్క యునైటెడ్ స్టేట్స్‌గా మార్చడం
అవశేష అధికారాలను గ్రహించడానికి, భారత రాజ్యాంగం వంటి రాష్ట్రాలపై స్వయంప్రతిపత్తి ప్రతిబింబిస్తుంది
అటువంటి రాష్ట్రాలకు ఇచ్చిన వాటి కంటే భిన్నంగా ఉండే శక్తితో ఐక్యతను గ్రహించడం
భారతదేశ ప్రజలు సార్వభౌమాధికారం మరియు స్వాతంత్ర్యం యొక్క శక్తి మరియు అధికారం యొక్క మూలాన్ని గ్రహించడం
న్యాయం, సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ సమానత్వం యొక్క హోదా మరియు ఆలోచన, వ్యక్తీకరణ, నమ్మకం, విశ్వాసం, ఆరాధన, వృత్తి, సంఘం మరియు చర్య, చట్టం మరియు ప్రజలకు లోబడి స్వేచ్ఛను అందించడం
మైనారిటీలు, గిరిజన మరియు వెనుకబడిన ప్రాంతాలు మరియు ఇతర అణగారిన మరియు వెనుకబడిన తరగతులకు తగిన రక్షణ కల్పించడం
భారత రిపబ్లిక్ భూభాగం యొక్క సమగ్రతను మరియు నాగరిక దేశం యొక్క న్యాయం మరియు చట్టం ప్రకారం భూమి, సముద్రం, గాలిపై దాని ప్రాదేశిక హక్కులను కొనసాగించడం
ప్రపంచ దేశాల మధ్య శాంతి మరియు సంక్షేమాన్ని ప్రోత్సహించడం.

 (భారత రాజ్యాంగ ప్రవేశిక గురించి వాస్తవాలు)
ఇది మొత్తం భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత రూపొందించబడింది
1976 నాటి 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ‘సెక్యులర్’ అనే పదాన్ని భారత రాజ్యాంగ ప్రవేశికలో చేర్చారు.
పీఠిక భారతదేశంలోని పౌరులందరికీ విశ్వాసం, విశ్వాసం మరియు ఆరాధన స్వేచ్ఛను అందిస్తుంది
పీఠికలోని న్యాయం (సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ) ఆదర్శాలు సోవియట్ యూనియన్ (రష్యా) రాజ్యాంగం నుండి తీసుకోబడ్డాయి
రిపబ్లిక్ మరియు స్వేచ్ఛ, సమానత్వం మరియు సౌభ్రాతృత్వం యొక్క ఆదర్శాలు ఫ్రెంచ్ రాజ్యాంగం నుండి తీసుకోబడ్డాయి
రాజ్యాంగ ప్రవేశిక, మొదటగా అమెరికన్ రాజ్యాంగం ద్వారా ప్రవేశపెట్టబడింది

భారత ప్రవేశిక యొక్క నాలుగు ప్రధాన అంశాలు

భారత రాజ్యాంగ ప్రవేశికలోని కీలక పదాలు)
భారతదేశ ప్రవేశికలో కొన్ని ముఖ్యమైన కీలకపదాలు ఉన్నాయి:

సార్వభౌమ
సోషలిస్టు
సెక్యులర్
డెమోక్రటిక్
రిపబ్లిక్
న్యాయం
స్వేచ్ఛ
సమానత్వం
సోదరభావం

Sovereign (సార్వభౌమ)
ప్రవేశిక ద్వారా ప్రకటించబడిన ‘సార్వభౌమాధికారం’ అంటే భారతదేశానికి దాని స్వంత స్వతంత్ర అధికారం ఉంది మరియు అది మరే ఇతర బాహ్య శక్తి యొక్క ఆధిపత్యం కాదు. దేశంలో చట్టసభలకు కొన్ని పరిమితులకు లోబడి చట్టాలను రూపొందించే అధికారం ఉంది.

Socialist (సోషలిస్టు)
‘సోషలిస్ట్’ అనే పదాన్ని 42వ సవరణ, 1976 ద్వారా ప్రవేశికలో చేర్చారు, అంటే ప్రజాస్వామ్య మార్గాల ద్వారా సోషలిస్టు లక్ష్యాలను సాధించడం. ఇది ప్రాథమికంగా ‘ప్రజాస్వామ్య సోషలిజం’, ఇది మిశ్రమ ఆర్థిక వ్యవస్థపై విశ్వాసాన్ని కలిగి ఉంది, ఇక్కడ ప్రైవేట్ మరియు ప్రభుత్వ రంగాలు రెండూ పక్కపక్కనే ఉన్నాయి.

Secular (సెక్యులర్)
‘సెక్యులర్’ అనే పదాన్ని 42వ రాజ్యాంగ సవరణ, 1976 ద్వారా పీఠికలో పొందుపరిచారు అంటే భారతదేశంలోని అన్ని మతాలకు రాష్ట్రం నుండి సమాన గౌరవం, రక్షణ మరియు మద్దతు లభిస్తాయి.

Democratic (డెమోక్రటిక్)
‘డెమోక్రటిక్’ అనే పదం, భారత రాజ్యాంగం రాజ్యాంగం యొక్క స్థిర రూపాన్ని కలిగి ఉందని సూచిస్తుంది, ఇది ఎన్నికలలో వ్యక్తీకరించబడిన ప్రజల అభీష్టం నుండి దాని అధికారాన్ని పొందుతుంది.

Republic (రిపబ్లిక్)
‘రిపబ్లిక్’ అనే పదం రాష్ట్ర అధినేతను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రజలు ఎన్నుకున్నారని సూచిస్తుంది. భారతదేశంలో, రాష్ట్రపతి రాష్ట్రానికి అధిపతి మరియు అతను ప్రజలచే పరోక్షంగా ఎన్నుకోబడతాడు.

Justice (న్యాయం)
న్యాయం అంటే చట్టం యొక్క పాలన, ఏకపక్షం లేకపోవడం మరియు సమాజంలో అందరికీ సమాన హక్కులు, స్వేచ్ఛ మరియు అవకాశాల వ్యవస్థ.
భారతదేశం తన పౌరులకు సమానత్వాన్ని నిర్ధారించడానికి సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ న్యాయాన్ని కోరుకుంటుంది.

Liberty (స్వేచ్ఛ)
లిబర్టీ ఆలోచన భారతీయ పౌరుల కార్యకలాపాలపై స్వేచ్ఛను సూచిస్తుంది. భారతీయ పౌరులపై వారు ఏమనుకుంటున్నారో, వారి వ్యక్తీకరణల విధానం మరియు వారి ఆలోచనలను చర్యలో అనుసరించాలనుకునే విధానంలో ఎటువంటి అసమంజసమైన ఆంక్షలు లేవని ఇది నిర్ధారిస్తుంది. ఏది ఏమైనప్పటికీ, స్వేచ్ఛ అంటే ఏదైనా చేసే స్వేచ్ఛ కాదు మరియు అది రాజ్యాంగ పరిమితులలో ఉపయోగించబడాలి.

Equality (సమానత్వం)
‘సమానత్వం’ అనే పదానికి సమాజంలోని ఏ వర్గానికైనా ప్రత్యేక హక్కు లేకపోవడం మరియు ఎలాంటి వివక్ష లేకుండా వ్యక్తులందరికీ తగిన అవకాశాలను కల్పించడం.

Fraternity (సోదరభావం)
ఇది సోదరభావం మరియు సోదరి భావాన్ని మరియు దేశంతో దాని ప్రజలలో ఉన్న భావాన్ని సూచిస్తుంది.
సోదరభావం రెండు విషయాలకు హామీ ఇవ్వాలని పీఠిక ప్రకటించింది-వ్యక్తి గౌరవం మరియు దేశం యొక్క ఐక్యత మరియు సమగ్రత. 42వ రాజ్యాంగ సవరణ (1976) ద్వారా ‘సమగ్రత’ అనే పదాన్ని పీఠికలో చేర్చారు