A homepage subtitle here And an awesome description here!
Showing posts with label నీతి కథలు. Show all posts
Showing posts with label నీతి కథలు. Show all posts

Thursday, January 13, 2022

🧚🌴దేవత - బంగారు గొడ్డలి 🌴

 అనగనగా ఒక ఊరిలో రామయ్య , సోమయ్య అనే ఇద్దరు స్నేహితులు కట్టెలు కొట్టుకుంటూ జీవనం సాగిస్తుండే వారు . 

ఒక రోజు ఆ ఊరికి సమీపంలో ఉన్న నది ఒడ్డున కట్టెలు కొడుతున్న రామయ్య గొడ్డలి పట్టు తప్పి నదిలో పడిపోయింది . దీంతో దిగాలుగా తన జీవనాధారమైన గొడ్డలి నదిలో పడిపోయుందని భాదపడుతూ నది ఒడ్డున కూర్చుని విచారిస్తున్నాడు .
 
దీంతో రామయ్య భాదపడటం చూసిన నదీదేవత రామయ్య ఎదుట ప్రత్యక్షమయ్యు ఏంటి రామయ్య అలా దిగాలుగా ఉన్నావు అని ప్రశ్నించింది . తల్లీ నేనూ రోజూ కట్టెలు కొట్టి వాటిని అమ్మితే గానీ నాకు పూట గడవదు . 
ఇప్పుడు నాకన్నం పెట్టే గొడ్డలి నీ నదిలో పడిపోయిందని దిగాలుగా సమాధానం చెప్పాడు . దీంతో నదీ దేవత నదిలో నుండి ఓ బంగారు గొడ్డలి  
తీసి ఇదేనా రామయ్య నీ గొడ్డలి అని ప్రశ్నించింది . ఆ గొడ్డలి చూసిన రామయ్య నాది కాదని సమాధానం చెప్పాడు. మళ్ళీ నదీదేవత వెండి గొడ్డలని తీసి చూపగా అదీ నాది కాదని సమాధానం చెప్పగా మూడోసారి రామయ్య పోగొట్టుకున్న ఇనుప తీసి చూపించింది . 
తన గొడ్డలిని చూసి సంతోషించిన రామయ్య ఇదే నా గొడ్డలి తల్లీ అని నదీ దేవతతో చెప్పాడు . బంగారు , వెండి గొడ్డల్లు ఇచ్చినా ఆశపడని నదీ దేవత మెచ్చి రామయ్యకు మూడు గొడలను ఇచ్చి మాయమయ్యింది.

🛖🏕️పెద్దల మాట✍️

🏕️🏕️⛺🛖 అనగనగా రాజుపాలెం అనే ఒక చిన్న పల్లెటూరు ఉండేది . అది లోతట్టులో ఉన్న గ్రామం . గోదావరి సమీపంలో ఉండటంతో భారీ వర్షాలు వచ్చినప్పు డల్లా మునిగి పోతుండేది . ఒక సారి ఆ గ్రామానికి వరదలు వచ్చాయి . ఆ గ్రామ ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పరుగులు తీస్తున్నారు . అంతలో వారికి ఒక ముని ఎదురయ్యాడు . ఆయన గ్రామస్తులతో " మీరు వెళ్ళేటప్పుడు . ఆ మూలగా ఉన్న గులకరాళ్లలో ఎన్ని తీసుకెళ్లగలిగితే అన్ని తీసుకెళ్లండి . వాటి వలన మీకు భవిష్యత్లో చాలా ప్రయోజనం కలుగుతుంది " అని చెప్పాడు . కొంత మంది " మా బాధల్లో మేం ఉంటే ఈ గులకరాళ్ల గోలేంటి " స్వామీ ? " అని విసుక్కుంటూ ఏమీ తీసుకెళ్లకుండానే వెళ్లిపోయారు . ఇంకొందరు " స్వామి ఎందుకు చెప్తున్నాడో ఏమిటో " అనుకొని కొన్ని గులక రాళ్లను తీసుకుని వెళ్లారు . మరి కొంతమంది గ్రామస్తులు ముని తమ మేలు కోరే గులకరాళ్లను తీసుకెళ్లమంటున్నాడని భావించి వారి శక్తి మేరకు గులకరాళ్లను తీసుకుని వెళ్లారు . వరద నుంచి తప్పించుకుని వారందరూ కాస్త ఎత్తైన ప్రదేశంలో ఇళ్లను నిర్మించుకొని నివసించటం మొదలు పెట్టారు . కొంత కాలానికి ఒక ఇంట్లో పిల్లలు గులక రాళ్లతో ఆడుకుంటుండగా ఒక గులకరాయి మెరవటం ఆ ఇంటి యజమాని గమనించాడు . అను మానం వచ్చి ఆ రాయికి సాన పెట్టించాడు . అది వజ్రమని అర్థం కాగానే సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు . ఆ విషయం క్షణాల్లోనే ఊరంతా తెలి సిపోయింది . గ్రామస్తులు తాము తెచ్చుకున్న గులకరాళ్లకు సాన పెట్టిం చారు . వాటన్నింటినీ వజ్రాలుగా మార్చుకున్నారు . వాటిని అమ్మి ధనవం తులయ్యారు . గులకరాళ్లను ఒక్కటి కూడా తీసుకెళ్లని వారు చాలా దుఃఖిం చారు కొన్నింటిని మాత్రమే తీసుకెళ్లిన వారు మరి కొన్ని తెచ్చుకోనందుకు పశ్చాత్తాపపడ్డారు . ఎక్కువ రాళ్లను తీసుకెళ్లిన వారి ఆనందానికి అవధులు లేవు . ముని చెప్పిన మాటలు పూర్తిగా విశ్వసించిన వారు ఎక్కువుగా బాగు పడ్డారు . సగం నమ్మిన వారు ఆ మేరకు బాగుపడ్డారు . అసలు నమ్మని వారు బాధపడ్డారు . వారు ముని చెప్పినా పట్టించుకోనందుకు పశ్చాత్తాపం చెందారు.
 నీతిః పిల్లల భవిష్యత్ కోసం పెద్దలు తమ అనుభవంతో చెప్పే మంచి విషయాలు మామూలు మాటలుగా అనిపించినా చేయకుండా సరిగ్గా పాటిస్తే ప్రయోజనం ఉంటుంది.

గాడిద-గుర్రం 🐎 నీతి కథ

రామయ్య  అనే వ్యాపారి   సరుకులను గాడిద మీద పెట్టుకుని తన గుర్రం ఎక్కి పొరుగూరు వెళుతున్నాడు , కొంత సేపటికి బరువు మోస్తున్న గాడిదకు ఆయాసం వచ్చి ఓ పావు బరువును మోయమని గుర్రాన్ని అడిగింది , గుర్రం అది నా బాధ్యతకాదు , బరువులు మోయటానికి నువ్వు , సుఖంగా జీవించడానికి నేను అన్నది , బరువు మోయలేని గాడిద నడుము విరిగి క్రిందపడింది , వెంటనే వ్యాపారి గాడిదను అక్కడే వదలి , ఆ బరువు మొత్తాన్ని గుర్రం పై వేసి తనూ ఎక్కి ప్రయాణం సాగించాడు . ఆ కొంచం బరువును ముందే స్తే నాకు ఈ గాడిద బరువు తప్పేది కదా అని గుర్రం మనసులో బాధపడింది 
నీతి : బరువు పంచుకుంటే బతుకు భారం తగ్గుతుంది.

కాకి - పాము

 అనగనగా పూర్వం నర్మదా నది తీరంలో రాజ మందిరం ఉండేది . దానికి కొంచెం చెట్టుపైన కాకి గూడు నిర్మించుకుని ఉంటుండగా ఆ చెట్టు కిందనే ఉన్న పుట్టలో పాము ఉండేది . కాకి తన పిల్లలకు ఆహరం తేవడానికి బయటకు వెళ్తున్న సమయం చూసి పాము మెల్లిగా చెట్టు పైకి ఎక్కి కాకి పిల్లలను తినేస్తూ ఉండేది . దీంతో కాకి ఏమి చెయ్యాలో తెలియక తెగ బాధపడుతుండేది . ఆహారం కోసం గాలిలో ఎగురుతున్న సమయంలో కాకికి మంచి ఉపాయం తోచింది . ఉపాయం వచ్చిందే తడువుగా ఒడ్డునే ఉన్న రాజమందిరంలోకి ప్రవేశించి అక్కడ ఉన్న భటులు చూస్తుండగానే రాణీ గారి నగను తన నోట కరుచుకుని పైకి ఎగిరి తన గూడు వైపు వెళ్ళ సాగింది . రాజ భటులు ఆ కాకి వెంట పడ్డారు . తన గూడు ఉన్న చెట్టు కొమ్మపై వాలిన కాకి తనను వెంబడిస్తున్న భటులు చూస్తుండగానే నోటిలో ఉన్న నగ చెట్టు కింద ఉన్న పాము పుట్టలోనికి జార విడిచింది.
 దీంతో రాజభటుటు గునపములు , పారలు తెచ్చి ఆ నగ కోసం పుట్టను పెకలించగా దానిలో ఉన్న పాము రాజ భటులపై కోపంతో బుస కొట్టింది . దీంతో రాజభటులు తమ దగ్గర ఉన్న ఆయుధాలతో ఆ పామును చంపి వేసి ఆ నగను తమతో తీసుకు వెళ్ళి రాణి గారికి అప్పగించారు . ఇక తన బిడ్డలకు పాము పీడ విరగడయ్యుందని సంతోషించిన కాకి తన పిల్లలతో సంతోషంగా జీవించసాగింది . 
నీతి - ఉపాయముతో ఎంతటి అపాయమునుండైనా బయట పడవచ్చు.

ఆవు పులి నీతి కథ

 అనగనగా ఒక అడవిలో పెద్ద పులికి ఆకలి వేసి ఆహరం కోసం అడవి అంతా కలయ తిరుగుతుంది . ఇంతలో ఒక ఆవు పచ్చికలో మేత వెయ్యడం చూసి ఇక తనకు మంచి ఆహరం దొరికిందని ఆ ఆవును దగ్గర కి వచ్చి తినడానికి సిద్ధమవుతుంది .. అంతలో ఆ ఆవు తను చనిపోతే తన లేగ దూడకు ఎవరు పాలిస్తారు . ఉదయం సరిగ్గా పాలు కూడా ఇవ్వకుండా మేతకు వచ్చాను అని మనసులో భాదపడుతూ పులిని చూసి అయ్యా నేను ఈ మద్యనే ఈనాను నా పిల్ల ఇంకా నా పాలు తాగుతూనే ఉంది . అది పాలు తాగడానికి నాకై ఎదురు చూస్తూ ఉంటుంది . నాపై దయ ఉంచి నా బిడ్డకు పాలిచ్చిరావడానికి అనుమతి ఇవ్వండి తప్పకుండా తిరిగి వచ్చి మీకు నేను ఆహారం అవుతానని జాలిగా ప్రాదేయ పడింది . ఆవు మాటలు ఎందుకో పులికి నమ్మబుద్ది వేసి సరే నాకు బాగా ఆకలిగా ఉన్నా నీమీద జాలితో నీకు అవకాశం ఇస్తున్నాను . వెళ్ళి త్వరగా రా .. అని చెప్పింది . తనకు అవకాశమిచ్చిన పులికి ధన్యవాదాలు తెలిపి ఆవు తన దూడ వద్దకు వెళ్ళి దానికి కడుపునిండా పాలిచ్చి మంచి బుద్దులు చెప్పి దాని బాద్యతను తోటిపశువులకు అప్పగించి తిరిగి అడవిలో పులి ఉన్న ప్రదేశానికి వచ్చింది . ఆవు నిజాయుతీగా తన మాట మీద నిలబడి ప్రాణాలకు కూడా లెక్క చెయ్యకుండా తిరిగి రావడంతో సంతోషించిన పులి నేను బాగా ఆకలితో ఉన్నా నీ నిజాయుతీకి మెచ్చి నిన్ను తినకుండా వదిలి పెడుతున్నాను . వెళ్ళి నీ బిడ్డతో హాయుగా జీవించు అని దాన్ని విడిచిపెట్టింది . ' పులి దయాగుణానికి ఆవు కృతజ్ఞతలు తెలిపి తన పాకకు పోయు తన బిడతో హాయిగా జీవించసాగింది. 
నీతి : మన నిజాయుతీనే మనల్ని కాపాడుతుంది .