Wednesday, November 30, 2022

శ్రీ గురజాడ అప్పారావు గారి వర్థంతి

🌹🙏వెలుగుజాడ...గురజాడ....
నవయుగ వైతాళికుడు, "కవి శేఖర"
శ్రీ గురజాడ అప్పారావు  గారి వర్థంతి
 సందర్భంగా🙏🌷





#తెలుగు సాహిత్యంలో నూతన యుగావిర్భావాన్ని సూచించే ‘#వేగుచుక్క’ గురజాడ అప్పారావు.
తెలుగు భాష మహా కవి, తన రచన ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించినవారు. గురజాడ అప్పారావు తెలుగు సాహిత్యాన్ని #సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో ఒకడు.
తెలుగు సాహిత్యానికి వెలుగు జాడ - గురజాడ. 
#అభ్యుదయమే నిబద్ధతగా సాగిన ఆయన జీవితం- చైతన్య గీతం. మూఢ విశ్వాసాలు, దురాచారాలు సమాజాన్ని పట్టి పీడిస్తున్నపుడు తన కలంతో ప్రజలను చైతన్య పరిచేందుకు ఉద్యమించిన నవయుగ వైతాళికుడు- గురజాడ అప్పారావు.హేతువాది 19 వ శతాబ్దంలోను, 20 వ శతబ్ది మొదటి దశకంలోను ఆయన చేసిన రచనలు ఈనాటికీ ప్రజల మన్ననలను పొందుతున్నాయి. రాశిలో తక్కువైనా, ఆయనవి వాసికెక్కిన రచనలు.

#వ్యావహారిక భాషలో రచనలు చేయడం తప్పుగానూ, చేతకానితనం గాను భావించే ఆ రోజుల్లో ఆయన ప్రజలందరికీ అర్ధమయ్యే జీవ భాషలో రచనలు చేసాడు వీరి "కన్యాశుల్కం" తెలుగు అన్నిటికన్నా గొప్ప నాటకం అని చెప్పవచ్చు. అభ్యుదయ కవితా పితామహుడు అని బిరుదు పొందిన వీరు, తెలుగు సాహిత్యంలో వాడుక భాష ఒరవడికి కృషి చేసిన వారిలో ముఖ్యులు. వీరికి "కవి శేఖర" అనే బిరుదు కూడా కలదు.హేతువాది అయిన అప్పారావు రచనలు 19వ శతాబ్ది ఆఖర్లోనూ మరియు 20 వ శతాబ్ది మొదట్లో వ్రాసినవి అయినప్పటకీ ఈనాటికీ ప్రజల మన్ననలను పొందుతున్నాయి.

 #విజయనగరం జిల్లా రాయవరంలో 1862, సెప్టెంబరు 21న గురజాడ వెంకట రామదాసు, కౌసల్యమ్మల సంతానంగా పుట్టిన ఈ పంధొమ్మిదో శతాబ్దపు వ్యక్తి ఇరవై ఒకటో శతాబ్దంలోనూ సజీవ స్ఫూర్తిగా ప్రకాశిస్తున్నాడంటే ఆయన పురోగామి దృక్పథం ప్రజాస్వామిక లక్షణాలు కారణం. సనాతన కుటుంబంలో పుట్టినా మానవతా చైతన్యాన్ని ప్రబోధించాడు గురజాడ. ఆధునిక మహిళ భారత చరిత్రను పునర్లిఖిస్తుందని గురజాడ అప్పారావు ఓ వంద సంవత్సరాలకు పూర్వమే విశ్వసించాడు. ఆయన భావాలు, అభ్యుదయం, స్త్రీ జన ఉద్దరణ ఆనాటి కాలానికే కాదు, ఈ నాటి విశ్వాసాలకంటే కూడా ముందు వున్నాయి అంటే అతి శయోక్తి   కాదు. రాశిలో తక్కువైనా, ఆయనవి వాసికెక్కిన రచనలు.

#వ్యావహారిక భాషలో రచనలు చేయడం తప్పుగానూ, చేతకానితనం గాను భావించే ఆ రోజుల్లో ఆయన ప్రజలందరికీ అర్ధమయ్యే జీవ భాషలో రచనలు చేసాడు. అటు గ్రాంధికం లోను, ఇటు ఆంగ్లం లోనూ గొప్ప పట్టు ఉన్నప్పటికీ ఆయన రచనలు “జనం భాష” లోనే చేసాడు. సామాన్య జనానికి అందని సాహిత్యం సముద్రం లోని ధన రాశి  గానే అయన భావించాడు. బ్రతుకు తెరువుకై రాజు కొలువు చేసినప్పటికీ రాజ్యం కంటే దేశమే గొప్పదని భావించిన అప్పారావు “దేశమును ప్రేమించు మన్నా … మంచి యన్నది పెంచు మన్నా“, “దేశమంటే మట్టి కాదోయ్…దేశమంటే మనుషులోయ్“ అని గొంతెత్తి అరిచాడు. దేశభక్తిని పెంపొందించిన ప్రజాకవి గురజాడ.

#ఈనాటి వర కట్నం, ఆ నాటి కన్యా శుల్కం రెండూ అనాచారాలే, స్త్రీ ల పట్ల వివక్షే ! రెండూ సమాజపు విలువలను కలుషితం చేసే కాల కూట విషాలే! కన్యా శుల్కం పేరిట ముక్కు పచ్చలారని బాలికలను డబ్బు ఆశతో, తల్లి దండ్రులు జబ్బు ముదిరి  కాటికి కాళ్ళు జాచిన వృద్దులకిచ్చి బెడితే, భర్త ఆనతి కాలం లోనే కాలం చేస్తే బాలికలు వితంతువులు గానే జీవితాలను ముగించేవారు. ఆనాటి కుహనా విలువలను కళ్ళకు కట్టినట్లు చెబుతాడు అప్పారావు తన “పుత్తడి బొమ్మ పూర్ణమ్మ” లో. 

#గురజాడ రచించిన “కన్యా శుల్కం” హాస్య నాటకం గా ముద్రించినప్పటికీ అందులోని పాత్రలు హాస్య రసాన్ని కురిపించినప్పటికీ  అది ఓ గొప్ప విషాద నాటకం అంటాడు తరువాత కాలం లో వచ్చిన శ్రీ శ్రీ. ఆ నాటకం లో మగ వారి స్త్రీ లోలత్వం, వున్నత కులాల్లో చాటు మాటు గా సాగే దొంగాటలు, స్త్రీల పట్ల వివక్ష, దుర్భరమైన బాల వితంతువుల జీవితాలు   మనకు కన్పిస్తాయి. నాయికానాయకులంటే కులీన వర్గాలకు, పై కులాలకే చెంది ఉండాలనే సూత్రాలన్నిటినీ ధ్వంసం చేసి వేశ్యా కులంలోని మధురవాణి ద్వారా ఆచారపరాయణులమనేవారి బూటకత్వాన్ని ఎండగట్టారు. మరోవైపు ఉన్నత కులం నుంచే వచ్చిన గిరీశాన్ని అవలక్షణాల పుట్టగా, మోసపూరితమవుతున్న సామాజిక దృశ్యానికి సంకేతంగా ప్రాణ ప్రతిష్ట చేశాడు. ఆధునిక స్త్రీ కొత్త చరిత్ర సృష్టిస్తుంది అన్న గురజాడ అగ్నిహోత్రావధాన్ల భార్య వెంకమ్మ  వంటి సనాతన పాత్రలతో కూడా తిరుగుబాటు మాటలనిపించడం చూస్తాం. బాల వితంతువు బుచ్చమ్మ తన చెల్లెలి పెళ్ళి కోసమే గిరీశంతో వెళ్ళిపోవడానికి సిద్ధమవడంలోనూ సాహసం, త్యాగం చూస్తాం. పూటకూళ్ళమ్మ చీపురుతో బాదినా, మీనాక్షి శాపనార్థాలు పెట్టినా అన్నిటా స్త్రీ నిరసన తొలి సంకేతాలు అగుపిస్తాయి. “#తాంబూలాలిచ్చేశాను #తన్నుకు చావండి” , “డామిట్ కథ అడ్డం తిరిగింది“, “#పొగ తాగని వాడు దున్నపోతై పుట్టున్” లాంటి నూతన భాషా ప్రయోగాలు నేటికీ నిత్య నూతనమే. 
చింతాకు చెట్టూ చిలకలతోటి ఏ మన్పించింది, అరటికాయబజ్జి, మినపప్పు బజ్జి, ఏనుగెక్కేమనం ఏ ఊరెళదాం.. తదితర చిన్న, చిన్న గేయాలతో చిన్నారులకు ప్రియమైన తాతయ్యగా కూడా మారారు. వాడుక భాషను విస్తృత ప్రచారంలోకి తెచ్చి, ఆ భాషలోనే రచనలు చేస్తూ పండిత పామరులను కట్టిపడేసిన గురజాడ రచనా శైలి ఆయనను ‘నవయుగ వైతాళికుడి’గా నిలబెట్టింది.

#కన్యాశుల్కం నాటకంలోని మధురవాణి పాత్ర తెలుగు సాహిత్యంలోనే ఇంతవరకు సృష్టించ బడని గొప్ప పాత్ర. ఆడవారికైనా, మగవారికైనా నీతి ఒకటి ఉండాలని ఆ పాత్ర ద్వారా చెప్పిస్తారు గురజాడవారు.

#నేను చెడిపోయిన వారిని చేరదీస్తున్నానుగాని, ఎవరినీ చెడగొట్టటంలేదు. ఆ విషయాన్ని మా అమ్మ నాకు నేర్పింది.’ అంటూ మధురంగా #మధురవాణిపాత్ర ద్వారా గురజాడవారు #అద్భుతంగా చెప్పించారు.
ఈ నాటకం కన్నడం, ఫ్రెంచి, రష్యన్‌, ఇంగ్లీషు (2 సార్లు), తమిళం, హిందీ (2 సార్లు) భాషల్లోకి అనువాదమైంది.

#నవయుగ కవితా వైతాళికుడు గిడుగు రామ్మూర్తి పంతులుకు మెట్రిక్యులేషనలో క్లాస్‌మేట్‌ అయిన గురజాడ అప్పారావు కందుకూరి వీదేశలింగం పంతులు లోని సంఘ సంస్కరణ, గిడుగులోని భాషా సంస్కరణలు తీసుకుని రెండింటినీ మేళవించి ఒక సాంఘిక విప్లవం తీసుకువచ్చారు.

#ఉపాధ్యాయుడిగానూ, డిప్యుటీ కలెక్టర్ ఆఫీసులో హెడ్‌క్లర్కుగానూ, విజయనగరం రాజు ఆస్థానంలోనూ, అధ్యాపకుడిగానూ పనిచేసిన గురజాడ- తొలుత ఆంగ్లంలో రాసినప్పటికీ, తర్వాత తెలుగులోకీ, అందునా ఆ సారం చేరవలసిన జనభాషలోకీ మరలాడు. 
చిన్న వయస్సులోనే 1915, నవంబరు 30న కన్నుమూశారు. ఓ చిన్న జీవితం లో గురజాడ సాధించిన విజయాలు తన  స్వార్ధానికి కాదు కనుకనే చాల సంవత్సరాల తరువాత కూడా అయన ప్రజల గుండెల్లో నిలిచాడు. 


0 comments:

Post a Comment