🎠🙏భారత వీరత్వానికి ప్రతీక.. భారత జాతి సగర్వంగా చెప్పుకునే ధీరుడు.. గెరిల్లా యుద్ధాన్ని తొలిసారిగా ప్రపంచానికి పరిచయం చేశిన వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి వర్థంతి సందర్భంగా🙏🎠
#మొఘల్ సామ్రాజ్యానికి పతనాన్ని శాసించి.. మరాఠా సామ్రాజ్యపు వెలుగుల్ని విస్తరింప చేసిన యోధుడు.. యువతరానికి ఎప్పటికీ పౌరషాగ్నిని రగిలించే దిక్సూచి.. చీకట్లో నుండి నిప్పుకణికలా దూసుకొచ్చాడు ఛత్రపతి శివాజీ మహారాజ్. మొఘలుల దాడి నుండి సమర్థవంతగా ఎదుర్కొన్నాడు. ఆ రాజులతో ఎంతో వీరోచితంగా పోరాడాడు.#గెరిల్లా యుద్ధాన్ని తొలిసారిగా ప్రపంచానికి పరిచయం చేశాడు.
#శివుని ఆశీస్సుల చిన్నారి..
శివాజీ క్రీ.శ. 1630 ఫిబ్రవరి 19వ సంవత్సరం వైశాఖమాసపు శుక్లపక్ష తదియనాడు పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర గల శివనేరి కోటలో షాహాజీ, జిజియాబాయి పుణ్యదంపతులకు జన్మించాడు. వీరు మహారాష్ట్రలోని వ్యవసాయ బొస్లే కులానికి చందినవారు. శివాజీ తల్లి జీజియ బాయ్ యాదవ్ క్షత్రియ వంశమునకు చెందిన ఆడ పడుచు. శివాజీ పుట్టడానికి ముందు పుట్టిన వారందరూ మృతి చెందగా ఆమె పూజించే దేవత అయిన శివై పార్వతికి పూజించగా శివాజీ పుట్టి క్షేమంగా ఆన్నాడు. దీంతో ఆయననకు ఆ పేరు పెట్టారు.
#తల్లి సంరక్షణ, దాదాజీ ఖాండ్దేవ్ శిక్షణతో శివాజీ వీరుడిగా అవతరించారు. భారతరామాయణాల విశిష్టత, హిందూ మతం గొప్పదనం తల్లిద్వారా నేర్చుకున్నాడు. పరమత సహనం, స్త్రీల పట్ల గౌరవం కూడా ఆమె ద్వారా పెంపొందించుకున్నాడు. తండ్రి పరాజయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అనతి కాలంలో యుద్ధ తంత్రంలో నిష్ణాతుడయ్యాడు. సకల విద్యా పారంగతుడైన శివాజీ, మరాఠా సామ్రాజ్య స్థాపనే లక్ష్యంగా వ్యూహారచన చేశాడు. 17వ ఏటనే తొలిసారిగా యుద్ధంలో పాల్గొన్న శివాజీ, బిజపూర్ సుల్తానులకు చెందిన తోర్నా కోటను ఆక్రమించుకున్నాడు. మరో మూడేళ్లలో కొండన, రాజ్ఘడ్ కోటలతో సహా పుణే ప్రాంతాన్నంతా తన అధీనంలోకి తెచ్చుకున్నాడు.
#నలుగురు గురువుల సాంగత్యంలో ...
మొదటి గురువు జిజియా బాయి. బాల్యంలో ఆమె చెప్పిన కథలు శివాజీని పరాక్రమ వంతుడిగా తీర్చిదిద్దాయి. రెండవ గురువు దాదాజీ కొండదేవ్. దగ్గర రాజకీయం, యుద్ద తంత్రం నేర్చుకున్నాడు. మూడవ గురువు తుకారామ్. వీరి దగ్గర సామాజిక సమరసత నేర్చుకున్నాడు శివాజీ. నాల్గవ గురువు సమర్థ రామదాసు. వీరి దగ్గర ఆధ్యాత్మికత, హైందవ పరిరక్షణనే జీవిత పరమార్థమనే విషయాన్ని నేర్చుకున్నాడు. ఈ విధంగా శివాజీ వ్యక్తిత్వం అన్ని రకాలుగా అత్యంత శ్రేష్ఠమైనదిగా తీర్చి దిద్ద బడింది.
#శివాజీ మెరుపుదాడులు..
గెరిల్లా యుద్ధ రీతులు తెలుసుకొన్న అఫ్జల్ఖాన్ అతడిని ఓడించడానికి యుద్ధభూమి మాత్రమే ఏకైక మార్గమని భావించాడు. శివాజీని రెచ్చగొట్టడానికి ఆయన ఇష్ట దైవమైన భవానీ దేవి దేవాలయాలను కూల్చాడు. ఇది తెలిసిన శివాజీ తాను యుద్ధానికి సిద్దంగా లేనని చర్చలకు ఆహ్వానించాడు. ప్రతాప్ఘడ్ కోట దగ్గర సమావేశమవడానికి ఇద్దరూ అంగీకరించారు. అఫ్జల్ఖాన్ దుర్బుద్ధి తెలిసిన శివాజీ ఉక్కు కవచాన్ని ధరించి వెళ్లాడు. ఇద్దరూ తమ అంగరక్షకుల సమక్షంలో చర్చలు జరుపుతుండగా అఫ్జల్ ఖాన్ కత్తితో శివాజీపై దాడి చేశాడు. ఉక్కుకవచం వల్ల శివాజీ తప్పించుకున్నాడు. అడ్డువచ్చిన అఫ్జల్ఖాన్ అనుచరులను శివాజీ సైనికులు అడ్డుకున్నారు. దీంతో శివాజీ తన దగ్గరన్న పులి గోర్లతో అఫ్జల్ఖాన్ పొట్టను చీల్చి హతమార్చాడు.
#లౌకిక వాదం పాటించిన రాజు....
శివాజీ మహారాజు ముస్లింల దురాక్రమణను వ్యతరిేకించిన్పటికీ, తన రాజ్యంలో మాత్రం లౌకికవాదాన్ని పాటించారు. అన్ని మతాల వారినీ సమానంగా ఆదరించారు. ఇతర మతాల వారిని కూడా హిందువుల మాదిరిగానే గౌరవించేవాడు. అంతేకాదు హిందువుగా మారిన ఓ వ్యక్తికి తన కుమార్తెను ఇచ్చి మరీ వివాహం జరిపించాడట.
#అన్ని మతాలను గౌరవించిన రాజుల్లో శివాజీ ఒకరు. తన హయాంలోని సైన్యం, పరిపాలన, వివిధ శాఖల్లోని ఉద్యోగుల కూర్పు చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది.
#మతం ప్రతిపాదికన కాకుండా మానవీయ విధానాలతో శివాజీ పరిపాలన సాగించాడు. సైన్యం, అధికారుల నియామకాల్లో మతాన్ని ప్రతిపాదికగా తీసుకోలేదు. అతని సైన్యంలోని మూడో వంతు మంది ముస్లింలే.
శివాజీ నావికా దళ అధిపతి సిద్ధీ సంబాల్. అందులో ఎక్కువ మంది సైనికులు కూడా ముస్లింలే.
#శివాజీ స్నేహితుల్లో మహమ్మదీయులు..
ఛత్రపతి శివాజీ స్నేహితుల్లో చాలా మంది మహమ్మదీయులు ఉన్నారట. అంతేకాదు తన సైనిక వ్యవస్థలో ఎంతో మంది ముస్లింలకు సముచిత స్థానం కల్పించారట.
#పంచ కళ్యాణి గుర్రాలు...
యుద్ధాల్లో ఓటమి ఎరుగని ధీరుడు భరతమాత ముద్దు బిడ్డ ఛత్రపతి శివాజీ.. విశ్వాస్ ,కృష్ణుడు ఇలా ఏడు మేలిమిజాతి జాతి గుర్రాలను వాడేవారని.. అవి పంచ కళ్యాణి జాతికి చెందిన గుర్రాలని చాలా మందికి తెలుసు.
#అంతుబట్టని యుద్ధతంత్రాలు...
శివాజీ మహారాజ్ యుద్ధ తంత్రాలు శత్రువులకు అంతుబట్టని విధంగా ఉండేవట. తిరుగులేని యుద్ధ వ్యూహాలను అనుసరించడమే శివాజీ అసమాన ప్రతిభకు నిదర్శనం. పటిష్టమైన సైన్యంతో పాటు నిఘా వ్యవస్థను కూడా కలిగి ఉండటమే కాకుండా, ఆధునిక యుద్ధ తంత్రాలను ఉపయోగించాడట.
#సైన్యం పట్ల శ్రద్ధ...
శివాజీ మహారాజ్ తన సైన్యం పట్ల అత్యంత శ్రద్ధ తీసుకునేవారట. దీంతో వారంతా వారి ప్రాణాలను పణంగా పెట్టి యుద్ధం చేసేందుకు సిద్ధపడేవారు. అయితే సైనికులకు ప్రమాదం ఏర్పడే సందర్భంలో ఆయన వారిని అనూహ్యంగా అక్కడి నుండి తప్పించేవారట.
#నావికా దళం..
పటిష్టమైన నావికా దళం మరాఠాలకు మరింత బలాన్ని చేకూర్చింది. దీనికి శివాజీ వేసిన బలమైన పునాదులే కారణం. విదేశీ దండయాత్రల నుండి కాపాడటానికి ఇది ఎంతగానో ఉపయోగపడింది. ఆ కాలంలో ఇలాంటి ఆలోచనలు ఏ రాజులకు రాకపోవడం గమనార్హం.
#కోటలు...
మరణించేనాటికి 300 కోటలు శివాజీ ఆధీనంలో ఉండేవి. కొండలపైన ఉన్నత సాంకేతిక విలువలతో దుర్భేధ్యమయిన కోటలను నిర్మింపచేయడంలో శివాజీ ప్రపంచ ఖ్యాతి పొందాడు. నాసిక్ నుండి మద్రాసు దగ్గర ఉన్న జింగీ వరకు 1200 కిలోమీటర్ల మధ్య ఈ 300 కోటలు నిర్మించబడ్డాయి.
27 ఏళ్ళపాటు యుద్ధాలలో గడిపి హిందూ రాజులకు ఆదర్శంగా నిలిచి సువిశాల మరాఠా #సామ్రాజ్యాన్ని నెలకొల్పిన ఛత్రపతి శివాజీ మూడు వారాలు తీవ్ర జ్వరంతో బాధపడి ఏప్రిల్ 3, 1680 న మధ్యాహ్నం రాయఘడ్ కోటలో మరణించాడు.
#శివాజీ... భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన పేరు. ఈ పేరు భారతావని పులకించిపోతుంది.
ముంబయిలోని విమానాశ్రయానికే కాదు, రైల్వే స్టేషన్కు కూడా ఆయన పేరే ఉంటుంది.
అరేబియా సముద్రంలో శివాజీ అతిపెద్ద విగ్రహాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు కూడా రూపొందుతున్నాయి.
0 comments:
Post a Comment