🌷🙏భారత అమూల్య రత్న, స్వాతంత్ర్య సమర యోధుడు,సంఘ సంస్కర్త, శ్రీ బాబూ జగ్జీవన్ రాం గారి జయంతి.
✍️కొలిమి జ్వాల్లో వన్నెదేలిన బంగారంలా ఎదిగిన జగ్జీవన్రామ్ పట్ల నా ఆత్మ గౌరవాభిమానాతో ఉప్పొంగుతున్నది, జగ్జీవన్రామ్ #అమూల్యరత్నం’’ అని #గాంధీ ఒక సందర్భంలో రాశారు:-
✍️అణగారిన వర్గాల అభ్యున్నతికి ఎన్నో పోరాటాలు చేసిన యోధుడు డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్. ఆయన చేసిన పోరాటాలు ఇప్పటి తరానికి కూడా ఆదర్శప్రాయంగా నిలుస్తాయనడం అతిశయోక్తి కాదు. ఆనాటి సమాజంలో చదువుకు దూరమై దుర్భర జీవితాన్ని గడుపుతున్న.. పీడిత దళిత దీన జనుల కోసం జీవితాంతం శ్రమించిన సంస్కరణల యోధుడు జగ్జీవన్ రామ్. అందరితోనూ ఆప్యాయంగా బాబూజీ అని పిలిపించుకున్నారు.
✍️ఒకవైపు దేశ స్వాతంత్య్రం కోసం పోరాడుతూనే, మరోవైపు సామాజిక సమానత్వం కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం అలుపెరగని సమరం సాగించిన రాజ కీయ, #సామాజిక విప్లవ #యోధుడు బాబూ జగ్జీవన్ రామ్.
✍️అతి చిన్న వయస్సులో(27 ఏళ్లకే) శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యి అప్పట్లో రికార్డు సృష్టించిన స్వాతంత్ర్య సమరయోధుడు, ధీశాలి, బాబూ జగ్జీవన్ రాం. పోలిటికల్ కింగ్ మేకర్గా రాజకీయంలో రాణించి, అధికారం కోసం కాకుండా ప్రజా శ్రేయస్సు కోసమే ధైర్యంగా అడుగేసిన మహోన్నత వ్యక్తిత్వం ఆయన సొంతం.
ఓ వైపు నిమ్న వర్గాల ఉన్నతికి కృషి చేస్తూనే,అన్ని వర్గాల ప్రజలతో సత్సంబంధాలను కలిగి ఉండి,తన ప్రతిభాపాటవాల ద్వారా గొప్ప పరిపాలనదక్షులుగా పేరు తెచ్చుకున్నారు బాబు జగ్జీవన్ రామ్ గారు.
✍️బాల్యం-విద్యాభ్యాసం:
జగ్జీవన్ బిహార్లోని షాబాద్ జిల్లా చాంద్వా గ్రామంలో 1908 ఏప్రిల్ 5న శోభిరామ్, బసంతి దేవిలకు జన్మించారు.
✍️వివక్షత పై అంకుశం:
ఆయన చదువుకున్న పాఠశాలలోనే మొదటిసారిగా అంటరానితనాన్ని అనుభవిం చాడు. పాఠశాలలో విద్యార్థుల కోసం మంచినీటి సదుపాయాన్ని కల్పిస్తూ రెండు కడవలపై ‘హిందూ పానీ’, ‘ముస్లిం పానీ’ అని రాసి ఉంచేవారు. అయితే జగ్జీవన్ రామ్ హిందూ పానీలో మంచినీరు తాగారని హిందూ విద్యార్థులు ఆ కుండలోని నీరు త్రాగేవారు కాదు.ఈ ఉదంతంతో ఆగ్రహించిన బాబు ఒక రాయి విసిరి ఆ కుండను ముక్కముక్కలు చేశాడు. అప్పుడు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ‘హరిజన పానీ’ అనే మరో కుండను ఏర్పాటుచేశాడు. జగ్జీవన్ రామ్ ఆ కుండని కూడా పగులకొట్టాడు. ఇక చేసేదేమీలేక ఆ పాఠశాల వారు ఒకే కుండను ఏర్పాటుచేశారు. ఈ సంఘటనలో జగ్జీవన్ రామ్ గెలిచినా ఆయన గుండె ఆవేదనతోనూ, కోపంతోనూ నిండిపోయింది. ఆ అనుభవాలే ఆయన దళిత జనుల జాగృతివైపు ముందుకు సాగడానికి ప్రేరణనిచ్చాయి.
✍️బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఇంటర్, కలకత్తా విశ్వవిద్యాయం నుంచి డిస్టింక్షన్లో బిఎస్సీ డిగ్రీ పూర్తి చేసి పట్టభద్రుడయ్యారు. ఆయన తన పీజీ చదువు పూర్తి చేశారు.
✍️స్వాతంత్య్ర ఉద్యమంలో:
విద్యార్థి దశలోనే గాంధీజీ అహింసా మార్గానికి ఆకర్షితుడు అయి 1930లో సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని బ్రిటిష్ పోలీసులను ఎదిరించి లాఠీ దెబ్బలకు బెదరకుండా నిలబడ్డ నాటి స్వాతంత్య్ర సమరయోధుడు.
#బీహారులో 1934లో వచ్చిన భయంకరమైన భూకంపం సందర్భంగా జగ్జీవన్రామ్ ప్రజకు సహాయ, పునరావాస చర్యు చేపట్టాడు. తన బృందంతో ఆహోరాత్రు శ్రమించి ఆహారం, బట్టు, ఔషధాు, మంచినీరు, ఆశ్రయం మొదగు సౌకర్యాు బాధితుకు అందేవిధంగా సహాయ శిబిరాు జగ్జీవన్రామ్ నిర్వహించాడు. ఈ సందర్భంలోనే మొదటిసారిగా #గాంధీని జగ్జీవన్రామ్ కలుసుకోవడం తటస్థించింది.సత్యాగ్రహం శాసనోల్లంఘన ఉద్యమం, క్విట్ ఇండియా వంటి ఉద్యమాల్లో గాంధీజీ వెంట నడిచారు
✍️రాజకీయ రంగం:
కేవలం 27 ఏళ్ల వయస్సులోనే శాసన మండలి సభ్యునిగా ఎన్నిక కావడం ఆయనకే చెల్లింది. 52 ఏళ్లపాటు శాసనసభ, పార్లమెంటును ఏలిన మహా అనుభవ శీలి. వ్యవసాయ, రక్షణ, ఆరోగ్య, రైల్వేశాఖ మంత్రిగా, ఉప ప్రధానిగా ఆయన సేవలు అనిర్వచనీయం. #మంత్రి మండలిలో అతి చిన్న వయసుడైన జగ్జీవన్రామ్ను అందరూ ‘#బేబి మినిష్టర్’ అని పిలిచేవారు. ప్రజలంతా ప్రేమతో ‘#బాబుజీ’ అని పిలిచేవారు.
ఆయన జీవితకాలం 78 ఏళ్ళు అయితే అందులో 52 ఏళ్ళు రాజకీయ జీవితం గడిపారు.
✍️ప్రపంచ రికార్డు:
1936 నుంచి 1986 వరకు ఐదు దశాబ్దాలకుపైగా చట్ట సభ సభ్యుడిగా కొనసాగడం ప్రపంచ రికార్డు. స్వతంత్ర భారతదేశంలో తొలి ఎన్నికలు జరిగిన 1952 నుంచి ఆయన చనిపోయే 1986 వరకూ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు. దేశంలో ఎక్కువ కాలం పనిచేసిన కేబినెట్ మంత్రిగానూ ఆయన రికార్డు సృష్టించారు.
*1971 భారత-పాకిస్తాన్ యుద్ధంలో భారత రక్షణ మంత్రిగా పనిచేశారు.
*బాబు జగ్జీవన్ రామ్ తన పదవీకాలంలో హరిత విప్లవం విజయవంతంగా అమలు చేయడానికి కూడా కీలకపాత్ర పోషించారు. కేంద్ర ఆహార, వ్యవసాయ శాఖ మంత్రి 1967 నుండి 1970 సంవత్సరం వరకు. గతంలో, 1966 నుండి 1967 వరకు ఏర్పడిన కార్మిక, ఉపాధి మరియు పునరావాస మంత్రి విధులను కూడా ఆయన నెరవేర్చారు.
*బాబు జగ్జీవన్ రామ్ గౌరవార్థం, దేశీయంగా నిర్మించిన మొట్టమొదటి లోకోమోటివ్ అయిన WAM-1, అతని పేరు పెట్టబడింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ యొక్క శిక్షణా అకాడమీకి బాబు జగ్జీవన్ రామ్ పేరు పెట్టారు.
*2015 సంవత్సరంలో పూణే నగరంలోని యెరావాడ పరిసరాల్లో మహాత్మా గాంధీ నగర్లో బాబు జగ్జీవన్ రామ్ ఇంగ్లీష్ మీడియం సెకండరీ స్కూల్ స్థాపించబడింది.
*ఉజ్జయినిలోని విక్రమ విశ్వవిద్యాయం 1967లో జగ్జీవన్రామ్కి ‘డాక్టర్ ఆఫ్ సైన్స్’ గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. ఆయన సేవను మెచ్చిన కాన్పూర్ విశ్వవిద్యాయం 1968లో డాక్టరేట్తో సత్కరించింది.
✍️రచయితగా:
బాబుజీ గొప్ప రచయిత అన్న సంగతి చాలా మందికి తెలియదు. ఆయన హిందీలో, ఇంగ్లీషులో రచనలు చేశారు. “భారత దేశంలో కులం సవాళ్ళు”, “ జీవన సరళి వ్యక్తిత్వ వికాసం” అను రెండు విశిష్ట గ్రంథాలను రాశారు.
ఆయన గొప్ప అధ్యయనశీలి.
✍️కూతురు కూడా తండ్రి బాటలోనే:
ఆయన కుమార్తె మీరాకుమార్ తండ్రి ఆదర్శాలతోనే పెరిగి కేంద్రమంత్రిగా, లోక్సభ స్పీకర్గా దేశానికి సేవలందించారు..
✍️సమతా దివాస్:
అతి పిన్న వయసులో మంత్రిగా, అతి ఎక్కువ కాలం చట్టసభ సభ్యునిగా, అతి ఎక్కువ శాఖల బాధ్యతలు చేపట్టిన మంత్రిగా అరుదైన రికార్డులు ఆయన సొంతం. బాబూ జగ్జీవన్ రామ్ జయంతిని యావత్దేశం ‘#సమతా దివాస్’గా జరుపుకుంటోంది.
1986 జూలై 6వ తేదీన బాబూజీ తన తుదిశ్వాస విడవడంతో యావత్తు భారతజాతి కనీరుమున్నీరయ్యింది. ఆయన భౌతికంగా భారత దేశాన్ని విడిచినా ఆయన దేశానికి చేసిన సేవలు, సంఘ సంస్కరణలు, ఆయన ఆచరించిన సిద్దాంతాలు ఎప్పటికీ సంజీవంగానే ఉంటాయి..
హేతుబుద్ది, సానుకూ దృక్పథం, స్పష్టమైన దార్శనికత, విస్తృతమైన అధ్యయనం, గొప్ప #మేధాశక్తి, స్థిరమైన సంక్పబం, నిత్యకృషీవత్వం, ఓరిమి, కారుణ్యం, చర్చించే గుణం, ఒప్పించే గుణం, ఆత్మవిశ్వాసం, ధైర్యం, సేవానిరతి, #కార్యనిర్వహణాదక్షత మొదగు క్షణా నిండుదనంతో బమైన సుగుణశీ వ్యక్తిత్వం, తనకితాను నిర్మించుకున్న భారతదేశ ‘#అమ్యూరత్నం’ డాక్టర్ బాబూ జగ్జీవన్రామ్ గారు చిరస్మరణీయుడు.
0 comments:
Post a Comment