Sunday, April 17, 2022

సర్వేపల్లి రాధాకృష్ణ గారి వర్థంతి



సర్వేపల్లి రాధాకృష్ణ గారి వర్థంతి 







ఈ చిత్రం 1947లో ప్రముఖ తెలుగు కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి కుమారుడు #బుజ్జాయి గీసింది. దీనిపై 1947 జనవరి 3వ తేదీన సర్వేపల్లి రాధాకృష్ణ #సంతకం చేస్తూ తన పేరును తెలుగులో 'సర్వేపల్లి రాధాకృష్ణయ్య' అని రాయటం చూడొచ్చు
తెలుగులో సంతకం చేయాల్సి వచ్చినపుడు ఆయన సర్వేపల్లి #రాధాకృష్ణయ్య అనే రాసేవారు. అదే ఆయన అసలు పేరు
***         ***    ***
ఉపాధ్యాయ వృత్తి నుంచి భారత ప్రథమ పౌరుడి స్థాయికి ఎదిగిన అరుదైన ఘనత ఆయన సొంతం.

అయితే, రాష్ట్రపతిగా కంటే #తత్వవేత్తగానే ఆయన ప్రపంచానికి ఎక్కువగా పరిచయం. భారతీయ తాత్విక దృక్పథాన్ని ప్రపంచ దేశాలకు అందించిన గొప్ప వ్యక్తుల్లో ఒకరిగా ఆయన నిలిచారు.

#ఉపాధ్యాయుడిగా, తత్వవేత్తగా, రచయితగా, రాజనీతిజ్ఞుడిగా సర్వేపల్లి ప్రయాణం బహుముఖాలుగా సాగింది.

##రాయబారిగా తనదైన ముద్ర
1949లో రష్యా రాయబారిగా వెళ్లినప్పుడు రాధాకృష్ణన్ అక్కడ తదైన ముద్రవేశారు. కశ్మీర్ విషయంలో రష్యా మద్దతు భారత్‌కు లభించేలా కృషిచేశారు.
తన వాక్చాతుర్యంతో ఒక సందర్భంలో స్టాలిన్‌ను సైతం మెప్పించారు.

** #సోవియట్ రష్యాకు నియమితులైన  భారత దేశపు మొట్ట మొదటి దౌత్యవేత్త డా. రాధాకృష్ణన్. "దేవుడిని నమ్మని  దేశానికి, దేవుడే సర్వస్వం అనే మీరు రాయభారిగా పోతున్నారు. ఇదెలా పొత్తు కుదురుతుంది" అన్న ప్రశ్నకు "Truth, Eternity and Beauty, (సత్యం, శివం, సుందరం) are the symbols of the God. Russians believe in them." అని విమర్శకుల నోరు మూపించారు.

రష్యా దేశపు నియంత #స్టాలిన్, తన అధికార నివాసం( క్రెమ్లిన్) లో, రాధాకృష్ణన్ కు స్వాగతం పలికేందుకు   లేచి వచ్చి స్వయంగా  వాకిలి తెరిచారు. రష్యానుంచి తిరిగొస్తున్నపుడు డా. రాధాకృష్ణన్ స్టాలిన్ దగ్గరవెళ్ళి, వీపు మీద చెయ్యేసి  క్షేమ సమాచారాలు  విచారించారు. అపుడు స్టాలిన్ చలించారు.  గద్గగ స్వరంతో, కన్నీళ్ళు కారుస్తూ: " రక్కసిగా కాక, మానవునిగా నన్ను చూచిన ప్రథమ వ్యక్తి మీరు. మా దేశమునించి వెళ్ళి పోవడం నాకెంతొ విచారం కలిగిస్తున్నది. మీరు చిరకాలం పాటు జీవించాలని నా కోర్కె. నేను మరెన్ని రోజులు బ్రతుకుతానో తెలియదు." అన్నారు.

**#కంగారు పడకండి మావో’

భారత ఉపరాష్ట్రపతిగా ఆయన 1957లో చైనాలో పర్యటించారు. అప్పుడు చైనా అధినేతగా ఉన్న మావో జెడాంగ్‌ను కలవాలనుకున్నారు. ఒక రోజు అర్ధరాత్రి 12 గంటలకు మావోను కలిసే అవకాశం ఆయనకు వచ్చింది.
మావోనే స్వయంగా ఆయనను ఆహ్వానించారు. ఆ సమయంలో రాధాకృషన్ మావోతో కరచాలనం చేయడంతో పాటు, ఆయన గడ్డాన్ని చేతితో తాకారు. ఊహించని ఈ పరిణామానికి మావో ఉలిక్కిపడ్డారు.
ఆయన తేరుకునేలోపు ’మిస్టర్ మావో, నేను మీతోనే కాదు స్టాలిన్, పోప్‌లతో కూడా ఇలానే చేశాను. మీ మీదున్న వాత్సల్యంతోనే అలా చేశాను. కంగారుపడకండి’ అని చెప్పారు.

**#రాధాకృష్ణన్
ఆయన విద్యాభ్యాసం అనేక ఒడిదొడుకుల మధ్య కొనసాగింది. కటిక పేదరికాన్ని అనుభవించిన సర్వేపల్లికి కనీసం చదువుకోవడానికి పుస్తకాలు కూడా ఉండేవి కావు. అలాంటి పరిస్థితుల్లో పుస్తకాలు కొనుక్కోగలిగిన స్థోమత ఉండి, కొనుక్కున్న వ్యక్తి ఇంటికి వెళ్లి ఆయనను ‘అయ్యా..ఒక్క కాగితం నలగకుండా నేను పుస్తకం చదువుకుంటాను. దయచేసి నాకు పుస్తకం ఇప్పించండి’ అని ప్రార్థన చేసి తెచ్చుకుని చదువుకునేవారు.
పుస్తకాలు ఉన్న వ్యక్తులు తనను ఎప్పుడు రమ్మంటే అప్పుడే వెళ్లి, వాటిని తెచ్చుకుని చదివి గొప్ప తత్వశాస్త్రవేత్త అయ్యారు.

**#పరీక్షకి రుసుం చెల్లించటానికి అదే చివరి రోజు. అలా వస్తున్న రాధాకృష్ణన్‌ ఒక దొంగ అడ్డగించి, దాడిచేసి చెవి పోగులు లాక్కున్నాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో హడలిపోయిన సర్వేపల్లికి ఒళ్ళునొప్పులు, జ్వరం వచ్చింది. దీంతో పరీక్ష ఫీజు విషయం మర్చిపోయి పాఠశాలకు కూడా వెళ్ళకుండా నిద్రపోయారు. ఇదే సమయంలో పరీక్ష ఫీజు చెల్లించని విద్యార్థులు ఎవరైనా ఉన్నారా? అని ప్రధానోపాధ్యాయుడు పరిశీలించారు.
అందులో రాధాకృష్ణన్ పేరు చూసి, "అయ్యో! చాలా బాగా చదువుకునే విద్యార్థి ఈరోజు రాకపోవడమేంటి? అని పరీక్ష రుసుం ఆయనే చెల్లించారు. ఆ తరువాత రాధాకృష్ణన్ పరీక్షల్లో తన ప్రతిభను నిరూపించుకున్నారు. ఉపాధ్యాయుడంటే ఎలా ఉండాలో చూసిన రాధాకృష్ణన్ ఈ సంఘటన తన జీవితంలో మర్చిపోలేదు. అందుకే ఒక ఉపాధ్యాయుడు ఒక వ్యక్తిని ఎంత ఎత్తుకు తీసుకెళ్లగలరో తెలుసుకుని, ఆచరించిన మహా పురుషుడు. అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన తత్వశాస్త్రవేత్త అయినా, రాష్ట్రపతి పదవిని అలంకరించినా, భారతరత్నను అందుకున్నా తన పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవం పరమ పవిత్రంగా చెయాలని కోరుకున్నారు.

**పలుమార్లు #నోబెల్ బహుమతికి నామినేట్
సర్వేపల్లి గొప్ప పండితుడు. ఆయన 16సార్లు నోబెల్ సాహిత్య బహుమతికి, 11సార్లు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. 

** ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో  ఉపన్యాసాలివ్వడానికి ఆహ్వానం పొందిన #ప్రథమ  భారతీయుడు సర్వెేపల్లి. అక్కడి సభాభవనం సరిపడక ప్రేక్షకులు బయట నిలుచుకొని సర్వేపల్లి ఉపన్యాసం విన్నారు. 
లండన్‌లో సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రసంగం విన్న అనంతరం హెచ్ఎన్ స్పాల్డింగ్ 1936లో ఆక్స్‌ఫర్డ్ ఫర్ ఈస్టర్న్ రిలీజియన్స్ అండ్ ఎథిక్స్‌లో స్థానం కల్పించారు.

**#ప్రాచీన కాలం నుంచి శ్రీకృష్ణుడిని గురువుగా, అర్జునుడిని శిష్యుడిగా పిలుస్తుంటాం. గురుశిష్యుల బంధానికి వారు కూడా ప్రతీకలు. సర్వేపల్లి తనకు కృష్ణుడితో సమానమని జాతిపిత మహాత్మా గాంధీ చెప్పారు.

**1928, నవంబర్, 17,18 న  నంద్యాలలో #ఆంధ్ర మహాసభ జరిగింది.దానికి అనిబిసెంట్ అధ్యక్షత వహించగా ప్రకాశం పంతులు, కట్టమంచి రామలింగా రెడ్డి, కొండా వెంకటప్పయ్య లతో పాటు ఆప్పటికే వేదాంతిగా ప్రపంచ ఖ్యాతి పొందిన సర్వేపల్లి రాధాకృష్ణన్ కూడా వచ్చారు. ఆయన తెలుగులోనే ప్రసంగించారు. చిలుకూరి నారాయణ రావు సూచన మేరకు "దత్త మండల జిల్లాలు" , ‘‘రాయలసిమ’’గా మారిందీ సభలోనే.

** #మైసూరు విశ్వవిద్యాలయము నుండి  రాధాకృష్ణన్   కలకత్తా విశ్వవిద్యాలయానికి ఉద్యోగ రీత్యా వెళ్తున్నప్పుడు, విద్యార్థులు, అధ్యాపక బృందమే గాక సమస్త ప్రజానికం ఆయనను బండిలో (పూలరధం) కూర్చొబెట్టి రైల్వే నిల్దాణం(స్టేషన్) వరకు లాగి  గౌరవం ప్రకటించారు. దివానులకు, మహారాజులకు కూడాఇలాంటి గౌరవం దక్కి ఉండదు.

** 1964 లొ #హిందీ వ్యతిరేక ఉద్యమం ఉధృతంగా, హింసాత్మకముగా మారినఫ్పుడు, వారు సందేశంలో  "భాషలన్ని సరస్వతి దేవి యొక్క వివిధ స్వరూపములు " అనే భావం గలిగిన " సర్వజ్ఞమ్ తత అహం వందే/ పరంజ్యోతి తపావహమ్/ యన్ ముఖద్ దేవి/ సర్వ భాషా సరస్వతి" శ్లోకాన్ని ఉదహరించారు. 

**#చాగ్లాగారు  ఇంగ్లాండ్ లో హైకమిషనర్ గా ఉన్నప్పుడు రాధాకృష్ణన్ అక్కడ పర్యటనకు వెళ్ళారు. ఒక రోజు కామన్ వెల్త్ సభ నుంచి వాపసు వస్తూ, వస్తూ, తన రచనల ప్రచురణ కర్త అల్లెన్ & ఉన్ విన్ (Allen & Unwin) అక్కడే ఉందని తెలిసుకున్నారు. సిబ్బంది, రక్షక భటులు ఎవ్వరు నచ్చజెప్పినా వినుపించుకొకుండా ఆ భవనానికి వెళ్ళి , మెట్లెక్కి మొదటి అంతస్తులో అల్లెన్ వాకిలు తట్టారు. అల్లెన్ బయటికి వచ్చినిశ్చేష్టుడయ్యాడు. ‘మీరు ఒక మాట ముందే చెప్పిఉంటె మీకు స్వాగతం పలకడానికి ఏర్పాటు చేసెవాడిని కదా,’ అన్నారు. "నేను భారత రాష్ట్రపతిగా మీదగ్గరకు రాలేదు. ఒక రచయితగా వచ్చాను. నా పుస్తకాలు ఎలా అమ్ముడు పోతున్నవి." అని నిరాడంబరంగా అడిగి తెలుసుకున్నారు.  

** #ముగ్గురు ప్రధానులకు, నెహ్రూ , శాస్త్రి, ఇందిరా గాంధి లతో ప్రమాణం నిర్వహించిన ఏకైక రాష్ట్రపతి డాక్టర్ రాధాకృష్ణన్. 

**1931-36 మధ్యకాలములొ, సర్కేపల్లి రాధాకృష్ణన్  #ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా ఉన్నారు.  దాని పురోభివృద్ధికి అంచనాకు మించి కృషిచెేశారు. ఒక వేదాంతి అయినా  గొప్ప గొప్ప విజ్ఞానులను అహ్వానించి వైజ్నానిక విషయాలను భోదించే శాఖలను ప్రారంభించారు. వారివల్ల విశ్వవిద్యాలయానికి వచ్చిన వారిలో  డా.టి.ఆరె.  శేషాద్రి, డా.సూరి భగవంతం, ఆచార్య హిరేన్ ముఖర్జీ, ఆచార్య హుమాయూన్ కబీర్, ఆచార్య మామిడిపూడి వెంకట రంగయ్య, సి,వి.రామన్, తదితరులున్నారు.  

**#ఉపరాష్ట్రపతి ముఖ్య విధి రాజ్యసభ అధ్యక్షత. దానిని సమర్థవంతంగా పది సంవత్సాల పాటు నిర్వహించారు. వారి హాయాంలో సభలో ఉన్న ప్రముఖుల్లో కొందరు: అల్లాడి కృష్ణ స్వామి అయ్యర్, సత్యేంద్రనాథ బోస్, ప్రథ్విరాజ కపూర్, రుక్మిణి దేవి అరుండేల్, జకీర్ హుస్సైన్, మైథిలి శరణ్ గుప్త, కాకాసాహెబ్ కాలెల్కర్, రాధాకుముద్ ముఖర్జీ, పి.వి.కాణె, మోటూరి సత్యనారాయణ, వాడియా, తారాచంద్,  భూపెష గుప్తా, ఫణిక్కర్, జైరామదాస్ దౌలత్ రామ్, తారాశంకర్ బంద్యోపాధ్యాయ, మొహన్లాల సక్షేనా, వి.టి.కృష్ణమాచారి. ఈ గంభీరోపన్యాసకులను ఆయన సంస్కృత శ్లోకాలు ఉదహరించి శాంతపరిచే వారు.

**1964 లో  కర్నూలునుండి కారులోె వెళ్లాలి. కాన్వాయిలో ఐదారు కార్లు మాత్రమే. కర్నూలులో ఒక అపశ్రుతి దొర్లింది.  ఒక చిన్న పిల్లవాడికి ఒక కాన్వాయ్ కారు తగిలింది. అదృష్టవశాత్తు ,అది పెద్దాస్పత్రికి ఎదురుగా జరిగింది. కాన్వాయి ఆగింది. రాష్ట్రపతి అగాడు. పిల్లవాడిని ఆస్పత్రికి తరలించారు.భారత రాష్ట్రపతి రాధాకృష్ణన్ నడుచుకొంటూ ఆస్పత్రి అత్యవసర చికిత్సగదికి వెళ్లారు. అక్కడ ఆదుర్దాగా  కూర్చొన్నారు. పిల్లవాడిని పరీక్షించిన వైద్యులు చిన్న చిన్న గాయాలేనని తీర్మానించి ప్రథమ చికిత్సచేసి పిల్లవాడిని వారి సంరక్షకులకు అప్పజెప్పారు. అపుడు గాని రాష్ట్రపతి తేరుకోలేదు. తరువాత రాధాకృష్ణన్ గారు బయటకు నడుచుకుంటూ వచ్చి కారు ఎక్కబోతున్నారు. అపుడు జిల్లా పోలీస్ అధికారి విక్టర్ సిబ్బందిని ప్రమాదం మీద నిలదీస్తున్నారు.అది రాష్ట్రపతి కంట పడింది. అంతే, ఆయన  పోలీసు అధికారి దగ్గరకు పోయి, వీపు మీద చెయ్యేసి: "Be calm, cool yourself. #They are also human beings," అన్నప్పుడు అధికారి తలవంచుకొన్నారు.

**#రాధాకృష్ణన్ చెవెనింగ్ స్కాలర్‌షిప్స్, రాధాకృష్ణన్ మెమోరియల్ అవార్డులు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఆయన జ్ఢాపకార్థం ఏర్పాటు చేశారు.

**#అమెరికా అద్యక్షుడు జాన్ ఎప్ కెనడీ రాధాకృష్టన్ ని  ఎంతోగానో అభిమానించే వాడు. ఇండియా- చైనా యుద్ద సమయంలో  ఇండియాకు సహాయ సహకారాలు అందించాడు
కెనడీ'రాధాకృష్టన్ ని International teacher అని సంభోదించేవాడు.


0 comments:

Post a Comment