Thursday, January 13, 2022

ఆవు పులి నీతి కథ

 అనగనగా ఒక అడవిలో పెద్ద పులికి ఆకలి వేసి ఆహరం కోసం అడవి అంతా కలయ తిరుగుతుంది . ఇంతలో ఒక ఆవు పచ్చికలో మేత వెయ్యడం చూసి ఇక తనకు మంచి ఆహరం దొరికిందని ఆ ఆవును దగ్గర కి వచ్చి తినడానికి సిద్ధమవుతుంది .. అంతలో ఆ ఆవు తను చనిపోతే తన లేగ దూడకు ఎవరు పాలిస్తారు . ఉదయం సరిగ్గా పాలు కూడా ఇవ్వకుండా మేతకు వచ్చాను అని మనసులో భాదపడుతూ పులిని చూసి అయ్యా నేను ఈ మద్యనే ఈనాను నా పిల్ల ఇంకా నా పాలు తాగుతూనే ఉంది . అది పాలు తాగడానికి నాకై ఎదురు చూస్తూ ఉంటుంది . నాపై దయ ఉంచి నా బిడ్డకు పాలిచ్చిరావడానికి అనుమతి ఇవ్వండి తప్పకుండా తిరిగి వచ్చి మీకు నేను ఆహారం అవుతానని జాలిగా ప్రాదేయ పడింది . ఆవు మాటలు ఎందుకో పులికి నమ్మబుద్ది వేసి సరే నాకు బాగా ఆకలిగా ఉన్నా నీమీద జాలితో నీకు అవకాశం ఇస్తున్నాను . వెళ్ళి త్వరగా రా .. అని చెప్పింది . తనకు అవకాశమిచ్చిన పులికి ధన్యవాదాలు తెలిపి ఆవు తన దూడ వద్దకు వెళ్ళి దానికి కడుపునిండా పాలిచ్చి మంచి బుద్దులు చెప్పి దాని బాద్యతను తోటిపశువులకు అప్పగించి తిరిగి అడవిలో పులి ఉన్న ప్రదేశానికి వచ్చింది . ఆవు నిజాయుతీగా తన మాట మీద నిలబడి ప్రాణాలకు కూడా లెక్క చెయ్యకుండా తిరిగి రావడంతో సంతోషించిన పులి నేను బాగా ఆకలితో ఉన్నా నీ నిజాయుతీకి మెచ్చి నిన్ను తినకుండా వదిలి పెడుతున్నాను . వెళ్ళి నీ బిడ్డతో హాయుగా జీవించు అని దాన్ని విడిచిపెట్టింది . ' పులి దయాగుణానికి ఆవు కృతజ్ఞతలు తెలిపి తన పాకకు పోయు తన బిడతో హాయిగా జీవించసాగింది. 
నీతి : మన నిజాయుతీనే మనల్ని కాపాడుతుంది .

0 comments:

Post a Comment