ఒక రోజు ఆ ఊరికి సమీపంలో ఉన్న నది ఒడ్డున కట్టెలు కొడుతున్న రామయ్య గొడ్డలి పట్టు తప్పి నదిలో పడిపోయింది . దీంతో దిగాలుగా తన జీవనాధారమైన గొడ్డలి నదిలో పడిపోయుందని భాదపడుతూ నది ఒడ్డున కూర్చుని విచారిస్తున్నాడు .
దీంతో రామయ్య భాదపడటం చూసిన నదీదేవత రామయ్య ఎదుట ప్రత్యక్షమయ్యు ఏంటి రామయ్య అలా దిగాలుగా ఉన్నావు అని ప్రశ్నించింది . తల్లీ నేనూ రోజూ కట్టెలు కొట్టి వాటిని అమ్మితే గానీ నాకు పూట గడవదు .
ఇప్పుడు నాకన్నం పెట్టే గొడ్డలి నీ నదిలో పడిపోయిందని దిగాలుగా సమాధానం చెప్పాడు . దీంతో నదీ దేవత నదిలో నుండి ఓ బంగారు గొడ్డలి
తీసి ఇదేనా రామయ్య నీ గొడ్డలి అని ప్రశ్నించింది . ఆ గొడ్డలి చూసిన రామయ్య నాది కాదని సమాధానం చెప్పాడు. మళ్ళీ నదీదేవత వెండి గొడ్డలని తీసి చూపగా అదీ నాది కాదని సమాధానం చెప్పగా మూడోసారి రామయ్య పోగొట్టుకున్న ఇనుప తీసి చూపించింది .
తన గొడ్డలిని చూసి సంతోషించిన రామయ్య ఇదే నా గొడ్డలి తల్లీ అని నదీ దేవతతో చెప్పాడు . బంగారు , వెండి గొడ్డల్లు ఇచ్చినా ఆశపడని నదీ దేవత మెచ్చి రామయ్యకు మూడు గొడలను ఇచ్చి మాయమయ్యింది.
0 comments:
Post a Comment