A homepage subtitle here And an awesome description here!

Thursday, March 31, 2022

*ఎ.పి ఓపెన్ స్కూల్ 10th, ఇంటర్ పరీక్షలు - మే 2022 సవరించిన టైం టేబుల్స్ విడుదల.*

*ఎ.పి ఓపెన్ స్కూల్ 10th, ఇంటర్ పరీక్షలు - మే 2022 సవరించిన టైం టేబుల్స్ విడుదల.*


Tuesday, March 29, 2022

తాళ్ళపాక అన్నమాచార్యుల వర్ధంతి*

*నేడు తాళ్ళపాక అన్నమాచార్యుల వర్ధంతి*



*సంకీర్తనాచార్య! అన్నమాచార్య విచ్చేయవే!*

తాళ్ళపాక అన్నమయ్య! తెలుగు పద భారతికి తన అపూర్వమైన భావనా పటిమతో, నవ్య నవనీతమైన సుమధుర గీతికలతో వెలుగు హారతులద్ది, భాషా ప్రవర్ధమానానికి ఎనలేని కృషి సల్పిన వాగ్గేయ ధురీణుడు. తెలుగు పద కవితకు సొబగులద్ది, ఆ సొగసులకు అద్భుత పదసిరులనే విరుల పరిమళాన్ని అద్దిన పద కవితా పితామహుడు. తన సంకీర్తనా ప్రక్రియతో తేటతెలుగుపాటకు ప్రాణప్రతిష్ఠ చేసి, ఆ మధురిమలకు అద్బుత పదసిరులను విరుల పరిమళాన్ని గుబాళించిన పదకవితా పితామహుడు. వాడుక భాషలో గేయరచన చేసి సామాన్యజనులకు పాట పాడుకునే అవకాశాన్ని కలిగించిన స్తవనీయుడు! భాష యొక్క పరమార్థాన్నీ, నిజమైన ప్రయోజనాన్నీ గ్రహించి తాను రాసిన వాటిలో అత్యధిక సంకీర్తనలను సామాన్యులు, పల్లెపట్టుల్లో నివసించే గ్రామీణులు పాడుకునే జానపద బాణిలో సృజించి సరికొత్త వాజ్ఞయాన్ని సృష్టించిన మహనీయుడు.

అందరిలోనూ శ్రీనివాసుడే...
తాను దర్శించిన సకల దేవతా స్వరూపాలలోనూ శ్రీవేంకటేశ్వరుని దర్శించిన భక్తశిరోమణి అన్నమయ్య. పల్లవి, చరణాలతో కూడిన గేయ రచనకు ఆద్యుడై, శ్రీనివాసుని పదారవింద అనుభూతినీ, ఆ హరిపద మకరంద ఆసక్తినీ తన సంకీర్తనలలో సరళమైన భాషలో వెలయించిన ఘనుడు అన్నమయ్య. సకల వేదాల సారాన్నీ తన సంకీర్తనలుగా చేసి వేదాలలోని ఉత్తమ గుణాలను అమృత గుళికలుగా చేసి మనకు అందించాడు సంకీర్తనాచార్యుడు. అన్నమయ్య సంకీర్తనలు వెంకట పద ముద్రాంకితాలు.

రాముడైనా, కృష్ణుడైనా, నారసింహుడైనా, అన్నమయ్య పదాలలో వేంకటేశ్వరునిగా ఒదిగి వేంకట పద ముద్రాంకితులు కావలసిందే. వేంకటాచలవల్లభునిగా, భక్తజన సన్నిభునిగా వెలుగొందవలసిందే. బాలకృష్ణుడైనా, తిరుమలగిరిపై వేంకటాద్రి ఇంద్రనీలమణిలా ప్రకాశించవలసిందే. ఘోర విదారణ నృసింహుడైనా వేంకటగిరిపై వెలుగుతూ అందపు నవ్వులు చల్లవలసిందే. తాను రాసిన ప్రతి సంకీర్తన హరి వైభవాన్నీ, ఆ తిరువేంకట విభుని ప్రాభవాన్నీ చాటిన వాణీ వీణా నాదాలుగా నినదించేలా చేసి, అద్భుత భావ సౌందర్యం ప్రతిఫలించే గీతికలుగా తీర్చిదిద్దిన అక్షర శిల్పి అన్నమయ్య.

అంతేగాక హరి తనకే సొంతమనే భావనకు ప్రతిబింబంగా 'నేనొక్కడ లేకుండితే నీ కృపకు పాత్రమేది' అంటూ ఒకింత ఆడంబరం ఒలకబోస్తాడు. అయితే, అన్నమయ్యకు ఉన్నది ఆడంబరం కానే కాదని, అణువణువునా నిండిన శ్రీనివాస పదానుభూతి అని, తన్మయత్వంతో కూడిన అలౌకిక భావన మాత్రమేనని అవగతమవుతుంది. భక్తిస్ఫోరకమైన 'అణురేణు పరిపూర్ణమైన రూపము, అణిమాది సిరి అంజనాద్రి మీది రూపము' అంటూ ఆర్తితో కీర్తించిన సంకీర్తనలలో భక్తి గంగ ఉప్పొంగుతుంది.

అలతి పదాలతో అనంతమైన భావాన్ని వెలయించటం అన్నమయ్య సంకీర్తనల ప్రత్యేకత. భగవంతుని కీర్తించటంలో భక్తికి ప్రాధాన్యతనిస్తూ ధన్యత చెందిన భక్త కవులు మన విశాల సంస్కృతిలో కోకొల్లలుగా కనబడతారు. అన్నమయ్య సంకీర్తనల్లోని వైవిధ్యం భారతీయ వాగ్గేయకార రచనల్లోనే అగ్రగణ్యంగా విరాజిల్లుతోందంటే ఏమాత్రం అతిశయోక్తి లేదు.

అన్నమయ్య సంకీర్తనల్లో దేవభాషగా పిలువబడే సంస్కృత సంకీర్తనలు ఎన్నో ఉన్నాయి. మర్యాద పురుషోత్తముడై సకల సుగుణాలకు నెలవైన శ్రీరాముని 'దేవదేవం భజే దివ్యప్రభావం రావణాసుర వైరి రఘు పుంగవం రామం' అంటూ కీర్తిస్తాడు. హిరణ్యకశిపుని భంజించిన నారసింహుని "జయజయ నృసింహ సర్వేశ! భయహర వీర ప్రహ్లాద వరద'' అంటూ ప్రణతులర్పిస్తాడు.

తన్మయ హృదయంతో 'కేవల కృష్ణావతార కేశవా! దేవదేవ లోకనాధ దివ్యదేహ కేశవ' అంటూ గోపాలకృష్ణుని సన్నుతి చేస్తాడు. ఇక అన్నమయ్య ఘనవిశేషణాలతో ఆగణిత భవహరుడైన శ్రీహరిని కీర్తించాడు. "ఆగమ పుంజ పదార్థుని ఆపత్సఖ సంభూతుని నాగేంద్రాయత తల్పుని నానాకల్పుని కోరుదు నామది ననిశము'' అంటూ సాగుతుంది ఘనపద విభూషితమైన ఆయన పదం.

సంకీర్తనా మాణిక్యాలు
జానపదులకు ప్రాణప్రదుడై అద్భుత సంకీర్తనా మాణిక్యాలను సృజించిన ఘనత అన్నమయ్యకే చెందుతుంది. పల్లెపట్టుల్లో జనం పాడుకునే సువ్విపాటలు, గొబ్బిపాటలు, కోలాటం పాటలు అన్నమయ్య హృదయసాగరం నుంచి ఉత్తుంగ తరంగాల్లా ఎగసిపడ్డాయంటే అతిశయోక్తి లేదు. శ్రమజీవులు అలసట తొలగటం కోసం ఆలపించే దంపుళ్ళ పాటలు అన్నమయ్య రాసిన విధం పులకింపచేస్తుంది. కన్నెపిల్లలు వెన్నదొంగపై ముద్దుగా ఆలపించే 'కొలనిదోపరికి గొబ్బిళ్ళో యదుకుల స్వామికిని గొబ్బిళ్ళో' వంటి సంకీర్తనలకు ప్రాణం పోసింది అన్నమయ్యే.

ఇక అన్నమయ్య తత్వామృతాలు జగత్ప్రసిద్ధాలు. "తెలియ చీకటికి దీపమెత్తక పెద్ద వెలుగు లోపలికి వెలుగేలా..', 'ఎంత విభవము కలిగే నంతయును ఆపదని చింతించినది కదా చెడని జీవితము' వంటి అన్నమయ్య తత్వాలు మనకు జ్ఞానబోధ చేసి మనలోని అజ్ఞానపు చీకట్లను పారద్రోలతాయి.అన్నమయ్య సంకీర్తనలు సాహిత్య ప్రధానమైనవని కొందరూ, సంగీతం పాలు తక్కువని వాదించేవారు కొందరూ ఉన్నారు. ఈ అల్పమైన విషయాలను పక్కనపెడితే అనల్పమైన అన్నమయ్య సాహిత్య సేవ, భక్త పారవశ్యం తెలుగుజాతికి ఎన్నటికీ శిరోధార్యమే.

ఫాల్గుణ బహుళ ద్వాదశి నాడు  అన్నమయ్య వర్ధంతి. తన తండ్రికి తీర్థవిధిని నిర్వర్తిస్తూ అన్నమయ్య పుత్రుడు, వాగ్గేయకారుడు అయిన తాళ్ళపాక పెద తిరుమలాచార్యులు ఆర్తితో లిఖించిన "దినము ద్వాదశి నాడు..తీర్థ దివసము నేడు.. జనకుండ..! అన్నమాచార్యుండ..! విచ్చేయవే..'' అనే సంకీర్తనను స్మరిస్తూ తెలుగు నేలపై ఆ భాగవతుని తిరిగి అవతరించమని అర్థిస్తూ, అన్నమయ్యకు భక్తిభావాంజలితో ప్రాంజలి ఘటిద్దాం.



10 వ తరగతి ప్రీఫైనల్‌ పరీక్షలు time table





ప్రీఫైనల్‌ పరీక్షలు 4 నుంచి*

*🔶️పదో తరగతి ప్రీఫైనల్‌ పరీక్షలను ఏప్రిల్‌ 4 నుంచి 12వరకు నిర్వహించనున్నారు. పబ్లిక్‌ పరీక్షలు ఏప్రిల్‌ 27 నుంచి నిర్వహించనున్నందున నాలుగో తేదీ నుంచి ప్రీఫైనల్‌ పరీక్షల నిర్వహణకు టైంబుల్‌ విడుదల చేశారు. ఉదయం 9.15గంటల మధ్యాహ్నం 12.30గంటల వరకు నిర్వహించనున్నారు.*

🔷️🔶️🔷️🔶️🔷️


Sunday, March 27, 2022

అమ్మఒడి జూన్ లో అని ప్రభుత్వం ప్రకటన విడుదల




అమ్మఒడి జూన్ లో అని ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది కావున ఈ రోజు నుండి మన పాఠశాల లో చదివే పిల్లల వివరాలు child info డేటా(CHILD ADHAAR,MOTHER NAME,MOTHER ADHAAR, MOTHER/GUARDIAN BANK ACCOUNT,IFSC CODE,FATHER NAME AND FATHER ADHAAR) అప్డేట్(ఒకసారి సరిచూసుకోండి) చేసుకోండి. తరువాత అప్డేట్ చేయమని ఉత్తర్వులు వస్తే  అందరూ ఒకేసారి చేస్తే server సరిగా పనిచేయడానికి ఇబ్బంది అవుతుంది. కావున ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి login అయ్యి పిల్లల వివరాలు ఎడిట్ చేయవచ్చు.



Monday, March 21, 2022

ప్రపంచ కవితా దినోత్సవం (మార్చి 21) సందర్భంగా🖋️🌷

🌹✒️ప్రపంచ కవితా దినోత్సవం (మార్చి 21) సందర్భంగా🖋️🌷


【మనసులో మెదిలే భావాలను కళాత్మక రూపంలో వర్ణించేదే కవిత】

 తమ కవితా తేజస్సుతో ప్రకాశించి 
       ప్రపంచాన్ని  ప్రకాశింపజేస్తున్న  కవులకు.....
    🏵️ప్రపంచ కవితా దినోత్సవ శుభాకాంక్షలు🏵️
   

✍️కవిత్వము లేని భాష లేదు. కవిత్వము పుట్టని ప్రాంతం లేదు . కాబట్టి ప్రపంచములోని నలుమూలలా ఉన్న కవితా వైవిధ్యాన్ని అర్ధము చేసుకుని , కవితా మాధుర్యాన్ని చవిచూసే లక్ష్యము తో కవితా దినోత్సవం యేర్పాటు చేసారు.

"✍️రవి కాంచనిచో కవి గాంచునే " అన్నది లోకోక్తి . . అంటే సూర్యుడి కన్నా కవే గొప్ప అని . సూర్యుడు ప్రత్యక్షదైవము , ఆయన కిరణాలు అన్నివైపులకు వ్యాపిస్తాయి . అయినా ఆ శక్తి వంతమైన కిరణాలు ప్రసరించలేని ప్రదేశాలు వుంటాయి. వాటి గురించి రవి కి తెలీదు . అటువంటి ప్రదేశాల గురించి కూడా కవి వర్ణించగలడు . అతడి ఊహాశక్తి పరిధి అంత విసృతమైనది . అందుకే కవులన్నా , కవిత్వమన్నా ప్రపంచవ్యాప్తం గా ఎంతో గౌరము ఉన్నది . ఆ గౌరవాన్ని తెలియజేసేందుకు ప్రపంచమంతటా ప్రతిసంవత్సరము మార్చి 21 వ తేదీన " కవితా దినోత్సవం " జరుపుకుంటునారు .

✍️కవిత్వము ఎంతో పురాతనమైనది . కవులను గౌరవించే సాంప్రదాయము మన దేశములోనూ ఉంది . ప్రతి రాజూ ఒక ఆస్థానకవిని నియమించుకుని గౌరవించేవాడు.ఇక శ్రీకృష్ణదేవరాయలు కాలములో ఏకంగా అష్టదిగ్గజాలే ఉన్నారు . అనేకమంది భారతీయ రాజులు కవి పోషణ లక్షణము గా తీసునేవారు.

✍️మార్చి 21న....

అటువంటి విశిష్ట సాంప్రదాయం మనకు అనాధిగా ఉన్నా ఐరోపాలో మాత్రము 18 వ శతాబ్ధము వరకు లేదు . ఆ శతాబ్దములో రోమన్‌ కవి ' విర్రీన ' పేరున అక్టోబర్ లో కవితా దినోత్సవాన్ని తొనిసారిగా జరిపారు . నాడు ఆ ఉత్సవం అక్టోబర్ నెలలో జరిగింది . అప్పటినుండి ఐరోపా వారిని అనుకరిస్తూ ఇతర ప్రదేశాలలో కూడా కవితా దినోత్సవం జరపడం మొదలైనది . ఐక్యరాజ్యసమితి విభాగమైన యునెస్కో తన 30 వ సమావేశాన్ని 1999 లో పారిస్ లో జరిపింది . ఆ సందర్భములో మార్చి 21 తేదీని ' ప్రపంచ కవితా దినోత్సవం ' గా జరపాలనే తీర్మానము చేసారు . ఆ నాటి నుండి ప్రతి ఏటా ప్రపంచ కవితా దినోత్సవాన్ని జరపుతున్నారు.

✍️ప్రతి సంస్కృతిలోనూ...

చరిత్ర అంతటా, కవిత్వం ప్రపంచంలోని ప్రతి సంస్కృతిలోనూ ఉంది. సరళమైన మరియు సంక్లిష్టమైన రెండు రూపాల్లో, క్రియాశీలత మరియు మార్పును తీసుకురావడానికి లేదా ప్రేమ మరియు నష్టాన్ని వ్యక్తీకరించడానికి లేదా కథలు మరియు కథలను వివరించడానికి కవిత్వం అత్యంత శక్తివంతమైన సాధనాల్లో ఒకటిగా ఉపయోగించబడింది. కవిత్వం ప్రజలు ప్రపంచాన్ని చూసే విధానాన్ని మార్చగలదు, ఇతరులకు స్ఫూర్తినిస్తుంది మరియు ప్రజల మధ్య బంధాలను పునరుద్ధరించగలదు.

✍️ప్రపంచ భాషావైవిధ్యాన్ని కవిత్వము మాత్రమే వెలుగు లోకి తీసుకురాగలదు అని యునెస్కో భావించింది . భావవ్య్క్తీకరణకు కవిత్వమే తగిన సాధనము . అందువల్ల కవ్త్వానికి ప్రోత్సాహము ఇస్తే భాషలు బతికివుంటాయని యునెక్సో తన విశ్వాసాన్ని ప్రకటించింది.అన్ని ప్రాంతాలలో అన్ని భాషలవారూ కవిత్వాన్ని రాయడం , చదవడం మొదలు పెడితే భాషకు విసృత ప్రచారము లభిస్తుంది.

✍️కవిత్వము మీద శ్రద్ధ , ఆసక్తి పెంపొందింప జేసేందుకు....

కవిత్వము మీద శ్రద్ధ , ఆసక్తి పెంపొందింపజేసేందుకే ఐక్యరాజ్యసమితి పాఠశాల స్థాయినుండి విశ్వవిస్యాలయ స్థాయివరకు భాషాపాఠ్యాంశాలలో కవిత్వభాగాలను పెంచమని సూచించింది . పిల్లలలో ఆసక్తి పెంచేందు కు అన్ని స్థాయిలలో కవితా క్లబ్ లను ఏర్పాటు చేయమంటున్నది . భావయుక్తం గా కవిత చదివే పిల్లలను ప్రోత్సహించి తీర్చిదిద్దమని సూచనలు ఇస్తుంది.

*✍️భాషా భిన్నత్వాల్ని, కవితా ప్రచారం ద్వారా ఏకం చేసేందుకు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అంతరించిపోతున్న భాషలను తిరిగి కాపాడటం కూడా ఈ దినోత్సవ ఏర్పాటు యొక్క  ఉద్దేశ్యం.*

✍️ ప్రపంచ కవితా దినోత్సవ ముఖ్య ఉద్దేశ్యాలు:

• కవితా ప్రచారం ద్వారా భాషా భిన్నత్వానికి చేయూతనివ్వడం.
• అంతరించిపోతున్న భాషలకు తోడ్పాటు అందించి, తిరిగి కాపాడటం
• అశువుగా కవిత్వాన్ని చెప్పే కళా సంస్కృతిని ప్రోత్సహించి ప్రతిస్థాపన చేయడం
• రంగస్థలం, నృత్యం సంగీతం మరియు చిత్రకళలతో కవిత్వానికి గల సంవాదాన్ని పెంచడం మరియు
• చిన్న ప్రచురణకర్తలకు చేయూతనిచ్చి, ప్రసారమాధ్యమాల్లో కవిత్వానికి అత్యున్నత స్థాయిని కల్పించడం.

✍️అందమైన పదాల పలకరింపులు
తీరైన భావాల కలబోతలు
వెన్నెల వెలుగులు వేకువ కాంతులు
హృదయ నివేదనలను
అక్షరాల విరిమాలలుగా చేసి
అలరిస్తూ స్తూర్తినింపుతున్న
కవులందరికీ పేరు పేరునా
కవితాదినోత్సవ శుభాకాంక్షలు...




Sunday, March 20, 2022

సైన్సు పితామహుడు, భౌతిక, గణిత, ఖగోళ శాస్త్రవేత్త, తత్వవేత్త సర్ ఐజాక్ న్యూటన్ వర్థంతి.

💐💐సైన్సు పితామహుడు, భౌతిక, గణిత, ఖగోళ శాస్త్రవేత్త, తత్వవేత్త  సర్ ఐజాక్ న్యూటన్ వర్థంతి  సందర్భం




【వర్క్  ఫ్రమ్ హోం..గురుత్వాకర్షణ సిద్ధాంతానికి ఇదే మూలం!】

✍️విజ్ఞాన శాస్త్ర రంగం మీదకు ఐన్ స్టయిన్ వచ్చేదాకా మూడు దశాబ్దాల పాటు శాస్త్ర సామ్రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలినవాడు ఐసాక్ న్యూటన్. ఇప్పటికీ ఆయన చలన సూత్రాలు కొన్ని పరిమితులకు లోబడి సజావుగా పనిచేస్తోనే ఉన్నాయి.మూడు వందల ఏళ్ళపాటు భౌతిక శాస్త్రంలోనూ గణిత శాస్త్రంలోనూ అంతటి ప్రతిభాశాలి, అంతటి ప్రభావశీలి మరొకరు లేరు. ఆయన కాలంలో ఆయననూ ఆయనలాంటివారినీ ప్రకృతి తాత్వికులుగా పిలిచేవారు.

నేడు విద్యార్ధులు నేర్చుకుంటున్న పలు మాధమేటిక్ , ఫిజిక్స్ విభాగాలకు #ఆద్యుడు న్యూటన్. ఆప్లిక్స్ కాలుక్యులస్ ఆయన సృష్టించినవే ఖగోళ లెక్కలు ఆయన కట్టినవే. ఆకాలంలో సాటి పరిశోధకులతో ఫలితాల విషయంలో పోటీపడడటమే కాదు, పోరాటాలు చేశాడు న్యూటన్. న్యూటన్ పేరు తెలియకుండా పాటశాల విద్య ముగియదు. సూర్యకాంతిలో ఏడు రంగులున్నాయన్న న్యూటన్ సూత్రం ఆకాశంలో ఇంద్రధనుస్సు చూసినపుడల్లా గుర్తుకు వచ్చి తీరుతుంది. న్యూటన్ ఒక అపూర్వ మేధావి. మాధమేటిక్స్ ఫిజిక్స్, ఖగోళ శాస్త్రం, మత శాస్త్రాలన్నింటిని అధ్యయనం చేసిన వాడు. 17వ శతాబ్దపు విజ్ఞాన విప్లవంలో కీలక పాత్ర పోషించారు సర్ ఐజాక్ న్యూటన్.

✍️మానవ ప్రపంచానికి విశ్వ రహస్యాలను విడమర్చి చెప్పిన "సర్ ఐజాక్ న్యూటన్" ఒక ఆంగ్ల భౌతిక, గణిత, ఖగోళ శాస్త్రవేత్త. ఈయన ఓ సిద్ధాంత కర్త మరియు తత్వవేత్త కూడా. 

✍️ప్రకృతిసిద్ధమైన తత్వశాస్త్రం సైన్సుగా ఎలా పరిణామం చెందిందన్న అంశంపై చేసిన ఎనలేని కృషికిగానూ ఆధునిక ప్రపంచం అంతా ఆయనను "సైన్సు పితామహుడు"గా కీర్తించింది. 

✍️బాల్యం:

జనవరి 4, 1643వ సంవత్సరంలో నెలలు నిండకుండానే జన్మించాడు ఓ చిన్నారి. ఆ చిన్నారే పెరిగి పెద్దయి ప్రపంచంలోనే మేటి శాస్త్రవేత్తల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. ఆ ముద్దులొలికే చిన్నారే సర్ ఐజాక్ న్యూటన్. ఈ రోజు అంతరిక్షంలోకి రాకెట్లలో రివ్వున దూసుకెళ్తున్నామంటే, అందుకే న్యూటన్ ప్రతిపాదించిన సిద్ధాంతాలే కారణం.
విశ్వ రహస్యాలను మానవాళికి విశ్లేషించి చెప్పిన న్యూటన్ ఇంగ్లండ్‌కు దగ్గర్లోగల ఉల్‌తోప్ అనే గ్రామంలో ఒక సామాన్య రైతు కుటుంబంలం జన్మించాడు. తను పుట్టడానికి మూడు నెలల ముందుగానే తండ్రి చనిపోగా, తనకు మూడేళ్ల వయసులో తల్లి వేరే పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. దీంతో న్యూటన్ చిన్నప్పటి నుంచి అమ్మమ్మ వద్దనే పెరిగి పెద్దయ్యాడు.

✍️న్యూటన్ చిన్నప్పుడు స్కూల్లో చదువుకంటే ఇతర సైన్సు పుస్తకాలు చదవటం, పెద్ద వస్తువుల్ని చూసి వాటినే చిన్న సైజులో తయారు చేయటం లాంటి పనులు చేస్తుండేవాడు. అలా చిన్న చిన్న మిషన్లు, నీటి గడియారం, ఎండలో పనిచేసే గడియారంలాంటివి కూడా ఆయన తయారు చేశాడు. ఆయన చేతిలో రూపుదిద్దుకున్న ఈ వస్తువులన్నీ ఇప్పటికీ లండన్ రాయల్ సొసైటీ మ్యూజియంలో ఉన్నాయి.

✍️ఉన్నత విద్య-గురుత్వాకర్షణ సిద్ధాంతం:

1661 లో ఉన్నత విద్య కోసం కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయంలో చేరిన న్యూటన్.. గణిత, భౌతిక, ఖగోళ శాస్త్ర పరిశోధనలపై మక్కువ పెంచుకున్నాడు. ఆ తరువాత అక్కడే ప్రొఫెసర్‌గా నియమితుడైన న్యూటన్‌, 1667లో పరావర్తన దూరదర్శినిని నిర్మించి సంచలనం సృష్టించాడు. చిన్నతనంలో చెట్టు నుంచి రాలిన యాపిల్‌ను గమనించిన న్యూటన్‌ అందుకు కారణాన్ని అన్వేషించే క్రమంలో గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.

భూమి, చంద్రుడు, గ్రహాలు, సూర్యుడు సహా విశ్వంలోని వస్తువులపై #గురుత్వ శక్తి ఎలా పని చేస్తుందో వివరిస్తూ విశ్వ గురుత్వ నియమాన్ని ప్రతిపాదిస్తూ, ఉన్నత విద్య నిర్వచించాడు. భౌతిక శాస్త్ర భావనలను వివరిస్తూ "ప్రిన్సిపియా మేథమేటికా" అనే గ్రంథాన్ని రచించాడు. కాంతిపై న్యూటన్‌ చేసిన పరిశోధనల ఫలితంగా "దృశాశాస్త్రం" పుట్టింది.

✍️మూడు గమన నియమాలు:

✍️ఐజాక్ న్యూటన్ వంటి మనిషిని మీరే కాదు, మరెవరూ చూచి ఎరుగరు. అతను చాలా చికాకు మనిషి. మనుషులంటే నచ్చని వాడు. ఎప్పుడు ఎలాగ ఉంటాడో తెలియదు. అందరూ తనకు శత్రువులు అనుకుంటాడు. ఎంతో రహస్యంగా ఉంటాడు. చివరికి అన్నం తినడం కూడా మరిచిపోతాడు. 
అతనిలో ఎవరికీ నచ్చని గుణాలు ఎన్నో ఉండేవి. కానీ అతను చాలా తెలివిగలవాడు. చాలా చాలా తెలివిగలవాడు. ఆ తెలివి కారణంగానే ప్రపంచం ఒక కొత్తబాటలో నడిచింది. అతను లెక్కలు చెప్పాడు. చిన్న, పెద్ద వస్తువుల మధ్యన ఉందే ఆకర్షణ గురించి చెప్పాడు. వస్తువుల కదలిక గురించి కూడా చెప్పాడు. ఐజక్ న్యూటన్ అన్న మనిషి ఆ కాలంలో ఆ సంగతులను ప్రపంచానికి వివరించకుంటే, సైన్స్ ఇవాళ ఇలా ఉండేది కాదు. ప్రపంచంలోని చాలా విషయాలు ఇవాళ ఇలా ఉండేవి కావు.

✍️మొదటి సూత్రము:

"బాహ్యబల ప్రయోగము లేనంత వరకు చలన స్థితిలో ఉన్న వస్తువు చలన స్థితిలోను, నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు నిశ్చల స్థితిలోనూ ఉంటుంది". ఈ వస్తు ధర్మాన్ని జడత్వము అంటారు.

✍️రెండవ సూత్రము: 

"ఒక వస్తువు ద్రవ్యవేగంలోని మార్పు ఆ వస్తువు పై ప్రయోగించిన బలానికి అనుపాతముగా ఉంటుంది. మరియు ఆ బలం ప్రయోగించిన దిశలో ఉంటుంది
ప్రచోదనం 
ఒక ప్రచోదనం j, ఒక బలం f, ఒక సమయం Δt లో ఒక వస్తువుపై పనిచేస్తే కలుగుతుంది

✍️న్యూటన్ మూడవ నియమం:

ఇది అసలైనది
న్యూటన్ సూత్రాన్ని దృష్టాంతం చేయడానికి ఇద్దరు స్కేటర్లు వ్యతిరేఖ దశలో ఒకరిని ఒకరు గెంటుకొనుచున్నారు.ఎడమవైపు మొదటి స్కేటర్ 12 కుడి వైపు దిక్కునకు, మరియు రెండవ స్కేటర్ N21 ఎడమ వైపు దిక్కునకు బలాన్ని ప్రయోగిస్తున్నారు.ఇద్దరి బలాలు సమానం కానీ న్యూటన్స్ మూడవ సూత్రం ప్రకారం వ్యతిరేఖ దశలో ప్రయోగించబడ్డాయి.
అన్ని శక్తులు రెండుగా ఉంటాయి.ఉదాహరణకు A, B అనే రెండు వస్తువులు ఉంటే A మీద B F (A) అనే శక్తిని ఉపయోగిస్తే, B మీద A F (B) ఏ‌ఎన్‌ఈ శక్తిని వ్యతిరేఖంగా కలిగిస్తుంది.
చర్యకు ప్రతి చర్య సమనంగా ఉండి వ్యతిరేక దిశలో పనిచేయును.
F (A) =-F (B)
(-గుర్తు వ్యతిరేకతను సూచిస్తుంది)
ఉదాహరణ: రాకెట్

✍️ఆయనకు 1672లో రాయల్‌ సొసైటీ ఫెలోషిప్‌ లభించింది. అప్పటి వరకూ ప్రకృతి శాస్త్రంలో ఒక భాగంగా ఉన్న భౌతిక శాస్త్రాన్ని న్యూటన్‌ ఆవిష్కరణలు, సిద్ధాంతాల వల్ల ప్రత్యేక శాస్త్రంగా గుర్తించారు. అందుకే న్యూటన్‌ను భౌతిక శాస్త్ర పితామహుడు అంటారు. 1705లో బ్రిటిష్‌ ప్రభుత్వం "సర్‌" అని బిరుదునిచ్చి సత్కరించింది. ఇక అప్పటినుంచి ఐజాక్ న్యూటన్ కాస్తా సర్ ఐజాక్ న్యూటన్‌గా మారిపోయారు.

 ఆ తరువాత కూడా ఎన్నో #మైలురాళ్లను అధిగమించిన న్యూటన్ తన 85 సంవత్సరాల వయస్సులో మార్చి 20, 1727లో తనకెంతో ఇష్టమైన విశ్వంలోకి ఆనందంగా పరుగులు పెడుతూ వెళ్లిపోయారు

 ✍️వర్క్  ఫ్రమ్ హోం..గురుత్వాకర్షణ సిద్ధాంతానికి ఇదే మూలం!!!

వాషింగ్టన్ పోస్ట్ అనే అంతర్జాతీయ పత్రిక ఇటీవల ప్రచురించిన కథనం
ఆ కథనం ప్రకారం.. గురుత్వాకర్షణ శక్తిని ప్రతిపాదించిన ఐజాక్ న్యూటన్ ఇరవయ్యో పడిలో ఉన్నప్పుడు లండన్‌ను గ్రేట్ ప్లేగ్ అనే వ్యాధి కుదిపేసిందట. అప్పుడు న్యూటన్ ట్రినిటీ కాలేజీలో చదువుకుంటున్నారు. కాగా.. వ్యాధి వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఇంగ్లండ్‌లో ప్రస్తుతం మనం చూస్తున్న జాగ్రత్తలే అమలు చేయాల్సి వచ్చింది. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. కాలేజీలు సెలవులు ప్రకటించాయి. న్యూటన్ చదువుకుంటున్న ట్రినిటీ కాలేజీ కూడా విద్యార్థులను ఇంటికి పంపించింది. అలా ఇంటికే పరిమితమైన న్యూటన్.. క్యాలిక్యులస్ వంటి కొత్త గణిత విధానాలకు రూపకల్పన చేశారట. అంతే కాదు... గురుత్వాకర్షణ సిద్ధాంతానికి కూడా అప్పుడే బీజం పడిందట. సో అదండీ.. వర్క్ ఫ్రమ్ హోంకు ఆసక్తికర నేపథ్యం.





Thursday, March 17, 2022

కల్పనా చావ్లా జయంతి 🌻

🌻TODAY KALPANA CHAWLA BIRTH ANNIVERSARY🌻

🌻కల్పనా చావ్లా జయంతి సందర్భంగా🌻



🌺కల్పనా చావ్లా (మార్చి 17 , 1962 – ఫిబ్రవరి 1 ,
2003 ), ఈమె ఒక ఇండియన్ -అమెరికన్ వ్యోమగామి మరియు వ్యొమనౌక యంత్ర నిపుణురాలు.

🌺నాసా శాస్త్రవేత్తగా ఎంపిక🌺

🌺1994 లో మొట్టమొదటి సారి కల్పనా చావ్లా పేరు ప్రపంచానికి తెలిసింది. ఎందుకంటే అప్పుడామెను "నాసా" వ్యోమగామిగా ఎంపిక చేసింది. నిజానికి కల్పనా చావ్లా "నాసా" కు దరఖాస్తు చేసేనాటికి ఆమెతో పాటు దాదాపు 2000 మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చెసుకున్నారు. అంతమందినీ పరిశీలించి... కేవలం 23 మందినే నాసా ఎంపిక చేసింది. 1995 లో మిగతా 22 మందితో కలసి నాసాకు చెందిన వ్యోమగామి శిక్షణ కార్యక్రమాన్ని ఈమె పూర్తి చేసుకున్నారు. టెక్సాస్ లోని హూస్టన్ లో గల జాన్సన్ స్పేస్ సెంఆట్ర్లో తన శిక్షణ చాలా ఆనందంగా గడిచిందంటారీమె... అక్కది శిక్షణ గురించి వ్యాఖ్యానిస్తూ "శిక్షణ చాలా ఉత్కంఠభరితంగా తమాషాగా ఉండేది. తమాషాగానూ ఉండేది లెండి." అనేవారు. తరువాత పైలట్ గా వివిధ రకాల విమానాలు నడిపేందుకు అర్హత సాధించారు.

🌺అంతరిక్ష యానం🌺

🌺1997 లో కల్పనా చావ్లా అంతరిక్ష యానం చేసిన మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు. అప్పుడీమె 376 గంటల పాటు అంతరిక్షంలో గడిపారు. భూమి చుట్టూ 252 సార్లు పరిభ్రమించి 6.5 మిలియన్ మైళ్ళు అంతరిక్ష యానం చేశారు. నాసా వ్యోమగామిగా కల్పనను ఎంపుక చేసేటప్పుడు ఒక తమాషా సంఘటన జరిగింది. అదేమిటంటే ఈమెకు వైద్య పరీక్షలు చేశారు. ఒక డాక్టరు ఈమె ఎక్స్రే పరిశోలిస్తూ "నువ్వు శాఖాహారివా?" అంటూ ప్రశ్నించారు. "అవును, నేనెప్పుడూ మాంసం ముట్టలేదు" అని కల్పన జవాబిచ్చారు. "అది ఎక్స్రే చూడగానే తెలిసిందిలే. ఎందుకంటే లోపలంతా చాలా స్వచ్ఛంగా, పరిశుభ్రంగా ఉంది" అంటూ డాక్టరు పెద్దగా నవ్వేశారు. కల్పన కూడా ఆయనతో గొంతు కలిపారు.

🌺2003, జనవరి 16 న రెండోసారి అంతరిక్షం లోకి వెళ్ళే ముందు కల్పనా చావ్లా విలేకరులతో మాట్లాడారు. "భారతదేశంలో మొట్టమొదటి విమానాన్ని నడిపిన జె.ఆర్.డి.టాటా యే నాకు స్ఫూర్తి, అందుకనే ఏరోనాటిక్స్ ఇంజనీరింగ్ ను కెరీర్ గా తీసుకున్నా" అని చెప్పారు. భారత మహిళలకు మీరిచ్చే సందేశమేమిటని అడిగితే..... "ఏదో ఒకటి చేయండి, కానీ దాన్ని మిరు మనస్ఫుర్తిగా చేయాలనుకోవాలి. ఎందుకంటె ఏదైనా పనిని కేవలం ఒక లక్ష్యం కోసం చేయడం కాక,... దానిలో లీనమై అనుభవించాలి" అనేవారు. అలా అనుభవించలేని వారు తమకు తాము వంచించుకున్నాట్లేయని చెప్పెవారు.

🌺పరిశోధనా రంగంలో🌺

🌺డాక్టర్ కల్పన 1988 లో నాసా అమెస్ రీసెర్చ్ సెంటర్ లో చేరారు. విమాన యానానికి సంబంధించిన అనేకాంశాలపై పరిశోధనలు చేశారు. 1993 లో కాలిఫోర్నియా లోని లాస్ అల్టోన్ లో గల ఓవర్ సెట్ మెథడ్స్ ఇన్కార్పోరేటెడ్ లో ఉపాధ్యక్షురాలు (రీసెర్చి సైంటిస్ట్) గా చేరారు. అక్కది శాస్త్రవేత్తలతో కలిసి అంతరిక్షం లో శరీర కదలికలు, సమస్యలపై అనేక పరిసోధనలు చేశారు.ఏరో డైనమిక్స్ ఆప్టిమైసేషన్ కు సంబంధించిఅనేక టెక్నిక్స్ ను అభివృద్ధి పర్చారు. ప్రపంచవ్యాప్తంగా అనేక సెమినార్లలో పరిశోధనా పత్రాలను సమర్పించారు.

🌺వ్యోమగామిగా🌺

🌺వ్యోమగామిగా ఎంపికైన తర్వాత శిక్షణలో భాగంగా ఆమె ఎంత కష్టమైన పనినైనా దీక్షతో చేశారు. వ్యోమగాములందరూ కొండ ఎక్కుతున్నారు. వెంట తెచ్చుకున్న బరువూ మోయలేక ఒక్కొక్కరు వాటిని వదిలివేస్తూ ఉంటే ఆ వెనకే వస్తున్న కల్పన వాటిని మోసుకొచ్చేవారు. సహచర వ్యోమగాములు వారించిన తర్వాతే వాటిని వదిలివేసేవారు. శారీరక శ్రమ విషయంలో పురుషుల కంటే తాను తక్కువ కాదని నిరూపించుకున్నారు. కల్పన ఒక శక్తిగా ఎదిగారు. కనుకే 1988 లో నాసా లోని రీసెర్చి సెంటర్ లో సైంటిస్ట్ గా చేరిన కల్పన అయిదేళ్ళకే ఎన్నో పరిశోధనలు చేసి కాలిఫోర్నియా ఓవర్ సెట్ మెథడ్స్ వైస్ ప్రెసిడెంత్ గా ఎన్నికైనారు. 1995 లో నాసా వ్యోమగామి అభ్యర్థిగా ప్రకటించింది. 15 మంది వ్యోమగాములు కలసి కల్పన అంతరిక్షంలోకి వెళ్ళేందుకు మూడేళ్ళపాటు శిక్షణ తీసుకున్నారు. 1997 లో ఎస్టిఎస్ - 87 లో అంతరిక్షం పైకి వెళ్ళారు. 1997, నవంబరు 19 న మిషన్ స్పెషలిస్టు గా ఆరుగురు సభ్యులు గల చోదక సిబ్బందిలో ఒకరుగా 4 వ యు.ఎస్.మైక్రో గ్రావిటీ పేలోడ్ ప్లైట్ లో కొలంబియా "ఎస్టిఎస్ -87" మీద అంతరిక్షయానం చేసి సూర్యుని వెలుపలి వాతావరణాన్ని అధ్యయనం చేశారు.

🌺రెండవసారి అంతరిక్ష యానాన్ని చేసే అవకాశం కూడ ఆమెకు లభించింది. 2003, జనవరి 16 న ఎస్టిఎస్-107 కొలంబియా స్పేస్ షటిల్ లో 16 రోజుల అంతరిక్ష పరిశోధనకు అంతరిక్షంలోకి వెళ్లడానికి నిర్ణయం జరిగింది.

🌺అవార్డులు🌺

🌺మరణానంతర గౌరవాలు🌺

🌺కాంగ్రెషనల్ స్పేస్ మెడల్ అఫ్ ఆనర్

🌺NASA స్పేస్ ఫ్లైట్ మెడల్

🌺NASA విశిష్ట సేవా మెడల్

🌺డిఫెన్స్ విశిష్ట సేవా మెడల్

🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯

Wednesday, March 16, 2022

ఆంధ్రరాష్ట్ర అవరతణకు మూలపురుషుడు......అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి

🌷🙏ఆంధ్రరాష్ట్ర అవరతణకు మూలపురుషుడు......అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా వారికి అక్షర నివాళులు🌷 





 ✍️పొట్టి శ్రీరాములు గారు భారతదేశ మెర్కాటరా? ***భాషా ప్రయుక్త రాష్ట్రాలకు బీజం వేసింది శ్రీరాములేనా?*** ✍️ప్రముఖ రచయిత, చరిత్రకారుడు రామచంద్ర గుహ.. శ్రీరాములు గారి గురించి ఏమన్నాడు? 🌺🌺శ్రీరాములు గారి గురించి గాంధీజీ ఏమన్నాడు? ✍️ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు #అమరజీవి. మహా పురుషుడు, భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడు. మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాల కోసం జీవితాంతం కృషి చేసిన మహనీయులు పొట్టి శ్రీరాములు. ✍️బాల్యం-తొలి జీవితం: పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16న మద్రాసు, జార్జిటౌనులో గురవయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. వీరి పూర్వీకులది ప్రస్తుత శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పడమటిపాలెం గ్రామం. ఇరవై యేళ్ళ వరకు శ్రీరాములు విద్యాభ్యాసం మద్రాసులోనే జరిగింది. తరువాత బొంబాయిలో శానిటరీ ఇంజనీరింగు చదివాడు. తరువాత "గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వే"లో చేరి దాదాపు నాలుగేళ్ళు అక్కడ ఉద్యోగం చేసాడు. జీతం నెలకు 250 రూపాయలు. 1928లో వారికి కలిగిన బిడ్డ మరణించాడు. తరువాత కొద్ది రోజులకే అతని భార్య కూడా చనిపోయింది. శ్రీరాములు జీవిత సుఖాలపై విరక్తి చెంది ఉద్యోగానికి రాజీనామా చేసాడు. ఆస్తిపాస్తులను తల్లికి, అన్నదమ్ములకు పంచిపెట్టి, గాంధీజీ అనుయాయిగా సబర్మతి ఆశ్రమంచేరాడు. ✍️స్వాతంత్ర ఉద్యమంలో: పొట్టి శ్రీరాములు 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించాడు. తర్వాత మళ్ళీ 1941-42 సంవత్సరాల్లో సత్యాగ్రహాలు, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొనడం వల్ల మూడుసార్లు జైలుశిక్ష అనుభవించాడు. 1985లో ప్రచురింప బడిన ఆంధ్ర ఉద్యమం కమిటీ అధ్యయనంలో పొట్టి శ్రీరాములు - మహాత్మా గాంధీల మధ్య అనుబంధం గురించి చెప్పబడింది. - "సబర్మతి ఆశ్రమంలో శ్రీరాములు సేవ చరిత్రాత్మకమైనది. ప్రేమ, వినయం, సేవ, నిస్వార్ధతలు మూర్తీభవించిన స్వరూపమే శ్రీరాములు. సత్యాన్ని అహింసను ఆరాధించే ప్రేమమూర్తి. దరిద్ర నారాయణుల ఉద్ధతికి అంకితమైన మహానుభావుడు..... శ్రీరాములు తన కర్తవ్య దీక్షలను ఉత్సాహంగా నిర్వహిస్తూ ఆశ్రమంలో అందరి మన్ననలనూ గాంధీ ఆదరాన్నీ చూరగొన్నాడు. గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్‌లోను, ఆంధ్రలో కృష్ణా జిల్లాలోని కొమరవోలులోను గ్రామ పునర్నిర్మాణ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. కొమరవోలులోయెర్నేని సుబ్రహ్మణ్యం నెలకొల్పిన గాంధీ ఆశ్రమంలో చేరాడు. 1943-44ల్లో నెల్లూరు జిల్లాలో చరఖా వ్యాప్తికి కృషిచేసాడు. కులమతాల పట్టింపులు లేకుండా ఎవరి ఇంట్లోనైనా భోజనం చేసేవాడు. ✍️ఆలయంలో హరిజనుల ప్రవేశంకోసం నిరాహారదీక్ష: 1946లో నెల్లూరు మూలపేటలోని వేణుగోపాలస్వామి ఆలయంలో హరిజనుల ప్రవేశంకోసం నిరాహారదీక్ష బూని, సాధించాడు. మరోసారి నిరాహారదీక్ష చేసి, మద్రాసు ప్రభుత్వం చేత హరిజనోద్ధరణ శాసనాలను ఆమోదింపజేసాడు. దీని ఫలితంగా వారంలో కనీసం ఒకరోజు హరిజనోద్ధరణకు కృషి చెయ్యవలసిందిగా ప్రభుత్వం కలెక్టర్లకు ఉత్తరువులు ఇచ్చింది. *✍️గాంధీజీకి శ్రీరాములు అంటే ప్రత్యేకమైన అభిమానంతో పాటు అతని మంకుతనం మీద కాస్త చిరాకు కూడా ఉండేవి. 🌺🌺శ్రీరాములు వంటి కార్యదీక్షాపరులు పదిమంది ఉంటే ఒక్క సంవత్సరంలోనే స్వతంత్రం సాధించవచ్చునని గాంధీజీ అనేవాడు.🌺🌺 1946 నవంబరు 25న ఈ గాంధీ శిష్యుడు మద్రాసు ప్రొవిన్సులోని అన్ని దేవాలయాలలోనూ హరిజనులకు ప్రవేశం కల్పించాలని ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించాడు. కొద్ది రోజుల్లోనే స్వాతంత్ర్యం రావచ్చునన్న ఆశాభావంతో కాంగ్రెసు నాయకులు, సభ్యులందరి దృష్టీ ఆ స్వాతంత్ర్యోద్యమంపైనే ఉంది. కనుక శ్రీరాములు దీక్షను మానుకోవాలని వారు సూచించినా అతను వినకపోయేసరికి ఇక వారు గాంధీని ఆశ్రయించారు. ఎలాగో గాంధీ శ్రీరాములుకు నచ్చజెప్పి దీక్ష విరమింపజేశాడు. ✍️జీవితం చివరిదశలో..... జీవితం చివరిదశలో నెల్లూరులో ఉంటూ, హరిజనోద్ధరణకు కృషిచేసాడు. దీనిగురించిన నినాదాలను అట్టలకు రాసి, మెడలో వేలాడేసుకుని ప్రచారం చేసేవాడు. కాళ్ళకు చెప్పులు, తలకు గొడుగు లేకుండా మండుటెండల్లో తిరుగుతూ ప్రచారం చేసే ఆయన్ను పిచ్చివాడనేవారు. ఆ పిచ్చివాడే ఆంధ్రుల చిరకాల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేందుకు ప్రాణత్యాగానికి పూనుకుని, అమరజీవి అయ్యాడు. ✍️ప్రత్యేక రాష్ట్ర సాధన కొరకు #నిరాహారదీక్ష: భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఆంధ్రదేశానికి కూడా మద్రాసు రాజధానిగా వుండేది. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు మద్రాసులో 1952 అక్టోబర్ 19న బులుసు సాంబమూర్తి ఇంట్లో నిరాహారదీక్ష ప్రారంభించాడు పొట్టి శ్రీరాములు. చాలా మామూలుగా ప్రారంభమైన దీక్ష, క్రమంగా ప్రజల్లో అలజడి రేపింది. ఆంధ్ర కాంగ్రెసు కమిటీ మాత్రం దీక్షను సమర్ధించలేదు. ✍️ప్రజలు మాత్రం శ్రీరాములుకు మద్దతుగా సమ్మెలు, ప్రదర్శనలు జరిపారు. ప్రభుత్వం మాత్రం రాష్ట్రం ఏర్పాటు దిశగా ప్రకటన చెయ్యలేదు. చివరికి 1952 డిసెంబర్ 15 అర్ధరాత్రి పొట్టి శ్రీరాములు, తన ఆశయసాధనలో ప్రాణాలర్పించి అమరజీవి అయ్యాడు. ఆగ్రహావేశులైన ప్రజలు హింసాత్మకచర్యలకు పాల్పడ్డారు. మద్రాసులో జరిగిన ఆయన శవయాత్రలో నినాదాలతో ప్రజలు ఆయన త్యాగనిరతిని కొనియాడారు. తదుపరి జరిగిన పరిణామాలలో మద్రాసు నుండి విశాఖపట్నం వరకు ఆందోళనలు, హింస చెలరేగాయి. పోలీసు కాల్పుల్లో ప్రజలు మరణించారు. చివరికి డిసెంబర్ 19న ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుచేస్తూ ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ప్రకటన చేసాడు. కర్నూలు రాజధానిగా 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రంఏర్పరచారు. తర్వాత 1956 నవంబర్ 1 న తెలంగాణ తో కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. *🌺ప్రముఖ రచయిత, చరిత్రకారుడు 🌺రామచంద్ర గుహ.. శ్రీరాములు గురించి ‘ది హిందూ’ పత్రికలో రాసిన వ్యాసంలో ఇలా పేర్కొన్నారు.. * *✍️దురదృష్టవశాత్తూ ఆంధ్రా బయట ఆయనొక మర్చిపోయిన వ్యక్తి. భారతదేశ చరిత్ర, భౌగోళిక స్వరూపంపై శ్రీరాములు గణనీయమైన ప్రభావం చూపారు. ఆయన దీక్ష, దాని తదనంతర పరిణామాలు.. భారతదేశ చిత్రపటాన్ని భాషాప్రయుక్త రేఖల్లో పునఃచిత్రీకరించాయి. పొట్టి శ్రీరాములు భారతదేశ 🌺మెర్కాటర్ (1569లో ప్రపంచ పటాన్ని తయారు చేసిన జర్మన్-ఫ్లెమిష్ భౌగోళిక శాస్త్రవేత్త)గా అభివర్ణించవచ్చు.‘‘** ***🌺భాషా ప్రయుక్త రాష్ట్రాలకు బీజం వేసింది శ్రీరాములేనా?*** భాషాప్రయుక్త రాష్ర్టాలకు బీజం వేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములే అని మేధావుల అభిప్రాయం. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాతే భారతదేశంలో అనేక భాషాప్రయుక్త రాష్ర్టాలు ఏర్పడినాయి. ✍️శ్రీరాములు మరణానికి కారకులెవరు?.. పొట్టి శ్రీరాములు 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి.. ప్రాణత్యాగం చేస్తే ఆయన్ను కనీసం పట్టించుకోలేదని మదరాసు ముఖ్యమంత్రి రాజగోపాలాచారి, ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూలపై చాలామంది అప్పట్లో మండిపడ్డారు. శ్రీరాములు అంత్యక్రియల సందర్భంగా ప్రకాశం పంతులు మాట్లాడుతూ.. ‘‘నెహ్రూ తలచుకుంటే శ్రీరాములు ఆదర్శం అతను బతికి ఉండగానే అమలు జరిగేది. ధార్ కమిటీ వ్యవహారమంతా సౌకల్యంగా పరిశీలించి.. మద్రాసును ప్రత్యేక రాష్ట్రం చెయ్యమన్నది. అదే శ్రీరాములు కోరాడు. అన్యాయమైనదేమీ అతడు కోరలేదు.(ఆంధ్రపత్రిక) ✍️మరణించాక మరీ దారుణం ఎదురైంది: ఇక మరణించాక మరీ దారుణం ఎదురైంది. తెలుగువారి హీన దీన హైన్య చాతకానితనం ఎటువంటిదంటే ఆయన శవాన్ని ముట్టుకోవడానికి కూడా నలుగురు తెలుగువాళ్ళు రాలేదు. ఆయన మన తెలుగువారి కోసమే చనిపోయారని తెలిసినా కూడా స్పందించలేదు. చివరి వరకు దీక్షలో తోడుగా ఉన్న సాధు సుబ్రహ్మణ్యం కనీసం మన గుడివాడ వాళ్ళవైనా సహాయం అడిగి శవదహనం చేద్దామని ఆశయాన్ని చంపుకునిి వ్యక్తిగత భిక్షగాడిగా గుడివాడకు చెందిన సినీగాయకుడు ఘంటసాల దగ్గరకు వెళ్ళి విషయం చెప్పి మన గుడివాడ నుండి వచ్చాడు గనుక మనమైనా సాగనంపుదాం అని ఒప్పించి తెచ్చారు. ఘంటసాల వెంట మోపర్రు దాసు అనే కళాకారుడు నేను గుడివాడ వాడినే కదా నేనూ వస్తానని వచ్చారు. తెలుగుజాతి కోసం తన ప్రాణాలు దానం చేసిన ఆ మహనీయుడి శవాన్ని ఎవరికీ తెలియకుండా తీసుకువెళ్ళటం సబబుకాదు అని తెలుగువాళ్ళ కళ్లు తెరిపించడానికి ఈ శవమే దిక్కు కావాలని ఒక ఎద్దులబండి మాట్లాడి శవాన్ని అందులోకి ఎక్కించారు. అప్పటికప్పుడే ఆశువుగా ఘంటసాల తన వీరకంఠాన్ని ఎలుగెత్తి తెలుగుజాతి పౌరుషం చచ్చిందని, చీము నెత్తురు లేని తెలుగుజాతి కోసం అసువుల బాసిన శ్రీరాములు నువ్వు అంటూ గొంతెత్తి పాడతూ శవయాత్ర ప్రారంభించారు. యేర్నేని సాధు సుబ్రహ్మణ్యం గారే అమరజీవి శ్రీరాములకు దహనక్రియలు కర్మకాండ జరిపారు. శ్రీరాములు అంత్యక్రియల సందర్భంగా ప్రకాశం పంతులు మాట్లాడుతూ.. ‘‘మనలో మనం తగువులాడుకుంటున్న సమయంలో ఆంధ్రరాష్ట్రం కోసం తన ప్రాణాలను బలిదానం చేసి, మనందరికీ ఒక గుణపాఠం నేర్పాడు శ్రీరాములు. స్వార్థంతో మనమంతా శ్రీరాములును దీక్ష విరమించవలసిందిగా కోరాం. అయితే, శ్రీరాములు ఒక ఆదర్శం కోసం చివరిదాకా దీక్షను కొనసాగించి, నిస్సంకోచంగా తన నిండు ప్రాణాలను అర్పించాడు. ✍️పొట్టి శ్రీరాములు ✍️ప్రశంస: *తపాలాశాఖ 2000లోపొట్టి శ్రీరాములు గుర్తుగా తపాలాబిళ్ళనువిడుదల చేసింది. *మద్రాసు మైలాపూరు, రాయపేట హైరోడ్డులో శ్రీరాములు అమరజీవియైన 126 నంబరు ఇంటిని ఆయన స్మృతి చిహ్నంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కాపాడుతున్నది. *ఈ మహనీయుని జ్ఞాపకార్థం రాష్ట్రప్రభుత్వం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం స్థాపించింది. * *నెల్లూరు జిల్లా పేరును 2008లో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మార్చారు. ✍️ఆంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకై అహింసాయుత సత్యాగ్రహం ద్వార ఆత్మబలిదానం చేసిన ఆ అమరజీవి కథ నేటి యువతరానికి మార్గదర్శకం అయి, భవ్య భావోన్నత భవిష్య నిర్మానానికి ప్రేరకం కాగలదు.

Monday, March 7, 2022

గ్రంథాలయ గాంధీ" అయ్యంకి వెంకట రమణయ్య గారి వర్థంతి

🌹🙏 గ్రంథాలయోద్యమకారుడు, ఆయుర్వేదం,ప్రకృతి వైద్యంలో సిద్ధహస్తులు,పత్రికా సంపాదకుడు, గ్రంథాలయ పితామహుడు,"గ్రంథాలయ గాంధీ" అయ్యంకి వెంకట రమణయ్య గారి వర్థంతి సందర్భంగా🙏🌹





#ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు విస్తరించిన కారణంగా పుస్తకాలు చదివేవారు తక్కువయ్యారు. పెద్ద గ్రంథాలయాలు కొన్ని బాగా నడుస్తున్నప్పటికీ, మరికొన్ని గ్రంథాలయాలు సరైన సంరక్షణ, పర్యవేక్షణ లేక మూతపడుతున్నాయి.
కొన్ని దశాబ్దాలకి పూర్వం ఈ గ్రంథాలయాల అభివృద్ధికి ప్రముఖ గ్రంథాలయోద్యమకారుడు, పత్రికా సంపాదకులు అయ్యంకి వెంకట రమణయ్య ఎంత కృషిచేశారు.

#అయ్యంకి వెంకట రమణయ్య  గ్రంథాలయోద్యమకారుడు, ఆయుర్వేదం, ప్రకృతి వైద్యంలో సిద్దహస్తులు, పత్రికా సంపాదకుడు. గ్రంథాలయ సర్వస్వము అనే పత్రికను నిర్వహించాడు. ఈయన గ్రంథాలయ ఉద్యమంలో జీవితాంతం విశేష కృషి సల్పి గ్రంథాలయ పితామహుడుగా పేరుగాంచాడు.

#ఆయన తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం తాలూకా అనపర్తి నియోజక వర్గంలోని బిక్కవోలు మండంలో ఉన్న కొంకుదురు గ్రామంలో 1890 జూలై 24న జన్మించాడు. వీరి తల్లిదండ్రులు వెంకటరత్నం, మంగమాంబ.వీరి తండ్రి శ్రీ వెంకతరత్నం గారు నీటిపారుదల శాఖలో ఉద్యోగి. ఈయన అయ్యంకిలో శ్రీ గంగా పర్వతవర్ధనీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయం నిర్మించారు. 

#గ్రంథాలయోద్యమం:

1911లో విజయవాడలో రామమోహన గ్రంథాలయ స్థాపనకు తోడ్పడ్డాడు. 1914లో విజయవాడలో ఆంధ్రదేశ గ్రంథ భాండాగార, ప్రతినిధుల గ్రంథాలయ మహాసభలు జరిపి భారతదేశంలో తొలిసారిగా గ్రంథాలయ సంఘాన్ని, 1915లో సంఘ పక్షాన గ్రంథాలయ సర్వస్వం పత్రికను స్థాపించడానికి తోడ్పడ్డారు. 1919లో అఖిల భారత పౌర గ్రంథాలయ సంఘాన్ని స్థాపించి, 1924లో ఆ సంఘ పక్షాన ఇండియన్ లైబ్రరీ జర్నల్ అనే ఆంగ్ల పత్రికను ప్రారంభించాడు. వీరు ఈ సంఘాన్ని స్థాపించిన రోజును నేషనల్ లైబ్రరీ డేగా భారత గ్రంథాలయ సంస్థ గుర్తించి దేశమంతటా 1968 నుంచి ప్రతి సంవత్సరం జాతీయ గ్రంథాలయ వారోత్సవము (నేషనల్ లైబ్రరీ వీక్) ను నిర్వహిస్తుంది.

#గ్రంథాలయోద్యమంలో 70ఏళ్ళు నిర్విరామకృషిచేసిన నిస్వార్ధపరుడు.
చదువు కూడా ఆటలో భాగమేననీ, అన్నిటికంటే చదువే ఓ గొప్ప ఆట అనీ పిల్లలకు తెలియజెప్పేందుకు ఆయన  పుస్తకం రాసారు.

1907లోప్రముఖ #జాతీయ నాయకుడు,స్వాతంత్య్ర సమర యోధుడు బిపిన్ చంద్రపాల్  రాజమండ్రి లో భారతస్వాతంత్య్ర సమరంలో యువకులు పాల్గొనాలని ఇచ్చిన ఉత్తేజపూరితమైన ఉపన్యాసాలు విని, చదువుకు స్వస్తి చెప్పి దేశ సేవకు జీవితాన్ని అంకితం చెయ్యటానికి 'రక్షాబంధనం ' కట్టుకొన్నారు.

#దేశంలోని పలు సమస్యలకు ముఖ్యకారణం అవిద్య, అజ్ఞానం అని గ్రహించి, అందరినీ విద్యావంతులుగా,
జ్ఞాన వంతులుగా చెయ్యాలని అందుకు గ్రంథాలయాల వ్యాప్తి అవసరమని భావించి ఆ ఉద్యమ వ్యాప్తికి కంకణం
కట్టుకొన్నారు. 1910 లో బందరులో 'ఆంధ్రభారతి' సచిత్ర మాసపత్రిక ప్రారంభించారు. అలాగే 'గ్రంథాలయసర్వస్వం'(త్రైమాసిక),
'ఇండియన్ లైబ్రరీ జర్నల్', 'కొరడా', 'ప్రకృతి', 'ది ఇండియన్ నేచురోపతి','సహకారం', 'దివ్యజ్ఞాన దీపిక' వంటి పత్రికలను కూడా నడిపారు.

#వేటపాలెం, సి.పి.బ్రౌన్, శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషానిలయం లాంటి ప్రసిద్ధ పొత్తపుగుడుల అభివృద్ధిలోనూ పాలుపంచుకున్నారు. #ఏటా తన రెండు నెలల పెన్షనుతో రెండు పౌర గ్రంథాలయాలకు, సంక్షేమ కార్యక్రమాలకు సాయపడేవారు. అందుకే ఆయన ‘గ్రంథాలయ గాంధీ’ అయ్యారు.#

#ఆంధ్రభాషాభివర్థినీ మండలి, ఆంధ్రపరిషత్తు,కళాపీఠము, దివ్యజ్ఞాన చంద్రికామండలి అనే గ్రంథమాలలను
స్థాపించి అనేక ఉత్తమ రచనలను తెలుగు పాఠకులకు అందించారు. గ్రంథాలయోద్యమంలో వీరి సేవలను
గుర్తించి, వారి సప్తతి మహోత్సవ సందర్భంగా ,గుడివాడలో 'సరస్వతీ సామ్రాజ్య ప్రతిష్ఠాపనాచార్య' బిరుదుతో
సత్కరించారు.1977లో ప్రొఫెసర్ కౌలా అంతర్జాతీయ స్వర్ణపతకం అందుకున్నారు. భారత ప్రభుత్వం వీరి గ్రంథాలయ సేవలకు స్పందించి 1972 లో
'పద్మశ్రీ' తో గౌరవించింది.

#ఆంధ్రదేశంలో గ్రంథాలయోద్యమ పితామహుడుగా,గ్రంథాలయ వైతాళికుడుగా, 'గ్రంథాలయ శాస్త్ర విశా‌ద'గా ,వెలుగొందాడు అయ్యంకి వెంకటరమణయ్య.

#వెంకటరమణయ్యగారు 1979, మార్చి 7న దివంగతులైనారు. ఏటా ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన మనుమడు ఆచార్య డా.వెంకట మురళీకృష్ణ విద్యార్థులకు నోటు పుస్తకాలు అందిస్తున్నారు. తమ పూర్వీకులు కట్టించిన ఆలయానికి ధర్మకర్తగా ఉంటూ, లక్షలాది రూపాయలతో అభివృద్ధి చేస్తున్నారు. ఆయన స్వగ్రామంలో ‘అయ్యంకి’ పేరిట ఒక గ్రంథాలయం నెలకొల్పాలని స్థానికుల అభిలాష.


Sunday, March 6, 2022

అంతర్జాతీయ మహిళా దినోత్సవం

🙏💐 *స్త్రీ లేకపోతే జననం లేదు*
*స్త్రీ లేకపోతే గమనం లేదు*
*స్త్రీ లేకపోతే సృష్టిలోజీవం లేదు*
*స్త్రీ లేకపోతే అసలు సృష్టి లేదు*
*కంటికి రెప్పలా కాపాడే స్త్రీ మూర్తులందరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు*💐



వినాస్త్రీయ జననం నాస్తి, వినాస్త్రీయ గమనం నాస్తి వినాస్త్రీయ జీవం నాస్తి, వినాస్త్రీయ సృష్టి ఏవన్నాస్తి’.. 

అమ్మగా లాలిస్తుంది. అక్కా, చెల్లిగా అనుబంధాన్ని పంచుతుంది. భార్యగా బాధ్యతలు నిర్వర్తిస్తుంది. పాత్ర ఏదైనా పరిపూర్ణ బాధ్యత నిర్వర్తించే అపూర్వ వ్యక్తి మహిళ. మగువలను గౌరవించాలనే భావన భారతీయుల రక్తంలోనే ఉంది. యత్ర నార్యంతు పూజ్యతే, రమంతే తత్ర దేవత..’ అంటే ఎక్కడ నారీమణులు పూజింపబడుతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని భారతీయుల నమ్మకం.. అందుకనే ప్రతిరోజూ పూజిస్తాం, ఆరాధిస్తాం.
    
ఈ లోకంలో స్త్రీ లేకపోతే జననం లేదు. స్త్రీ లేకపోతే గమనం లేదు. స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు. స్త్రీలేకపోతే అసలు సృష్టే లేదు. మరి.. మనల్ని కంటిపాపలా కాపాడే ‘స్త్రీమూర్తి’ని స్మరించుకోవడం మన అందరి బాధ్యత. తల్లిగా లాలిస్తూ.. చెల్లిగా తోడుంటూ.. భార్యగా బాగోగులు చూస్తూ.. దాసిలా పనిచేస్తూ.. కుటుంబ భారాన్ని మోస్తూ... సర్వం త్యాగం చేస్తుంది మహిళ. అంతటి గొప్ప మహిళకు మనసారా ధన్యవాదాలు చెప్పుకునే సమయం ఇదే.

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా మార్చి 8 న జరుపుకుంటారు. ఆర్థిక, రాజకీయ, సామాజిక సహా వివిధ రంగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడంతో పాటు, హక్కుల గురించి వారికి అవగాహన కల్పించడానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు. దీనితో పాటు, ఈ రోజును జరుపుకోవడం వెనుక ఒక కారణం ఉంది.




అంతర్జాతీయ మహిళా దినోత్సవ చరిత్ర:

1908 సంవత్సరంలో తక్కువ పనిగంటలు, మెరుగైన జీతం, ఓటు వేసే హక్కు కోసం న్యూయార్క్ సిటీలో 15 వేల మంది మహిళలు ప్రదర్శన చేశారు. ఈ మహిళల డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని అమెరికాలోని సోషలిస్టు పార్టీ 1909వ సంవత్సరంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది. తరువాత 1910 లో, సోషలిస్ట్ ఇంటర్నేషనల్ యొక్క కోపెన్‌హాగన్ సమావేశంలో దీనికి అంతర్జాతీయ హోదా ఇవ్వబడింది. ఆ సమయంలో మహిళలకు ఓటు హక్కు కల్పించడం దీని ముఖ్య ఉద్దేశ్యం. ఎందుకంటే అప్పుడు చాలా దేశాలలో మహిళలకు ఓటు హక్కు లేదు. అంతేకాదు..1917 యుద్ధ సమయంలో రష్యా మహిళలు ఆహారం - శాంతి డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగారు. నాలుగు రోజుల తర్వాత అప్పటి రష్యా రాజు నికోలస్ జార్ సింహాసనాన్ని వదులుకోవాల్సి వచ్చింది. అప్పుడు తాత్కాలికంగా ఏర్పాటైన ప్రభుత్వం మహిళలకు ఓటు వేసే హక్కును మంజూరు చేసింది.

ఐక్యరాజ్య సమితి గుర్తించి ప్రతి ఏటా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. నిజానికి రష్యాలో మహిళలకు ఓటు హక్కు లభించిన సమయంలో, రష్యాలో జూలియన్ క్యాలెండర్, మిగితా ప్రపంచంలోని గ్రెగోరియన్ క్యాలెండర్లో చెలామణిలో ఉంది. మహిళలు ఈ సమ్మెకు దిగిన రోజు జూలియన్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 23 ఆదివారం. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం చూస్తే అది మార్చి 8వ తేదీ. అందుకే మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు ఐక్యరాజ్యసమితి 1996 నుండి ప్రత్యేక థీమ్ తో ఈ రోజును జరుపుకోవడం ప్రారంభించింది. దీని తరువాత, అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం కొత్త థీమ్ తో జరుపుకుంటారు. 



సామాజికంగాను, రాజకీయాల్లోనూ, ఆర్థిక రంగంలోనూ మహిళలు ఎంత మేరకు ఎదిగారో తెలుసుకుని, వేడుక చేసుకునే రోజుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం మారిపోయింది. వాస్తవంగా.. కొనసాగుతున్న అసమానతలపై అవగాహన పెంచేందుకు ధర్నాలు, నిరసనలు నిర్వహించటం ఈ దినోత్సవం వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం.

*ఈ సంవత్సరం థీమ్ విషయానికి వస్తే "Women in Leadership: Achieving an Equal Future in a Covid-19 World" గా ఎంపిక చేసుకున్నారు.*

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం యొక్క ముఖ్య లక్ష్యం మహిళల హక్కులను ప్రోత్సహించడం మరియు ప్రపంచ శాంతిని కాపాడటం.వాస్తవానికి, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఉన్నాయి, ఇక్కడ మహిళలు తమ హక్కుల కోసం ఆందోళన చేయాల్సి ఉంటుంది. ఏదేమైనా, చాలా దేశాలలో, కాలక్రమేణా, మహిళలు తమ కదలికలలో గెలిచారు మరియు మహిళల పట్ల పరిస్థితి కూడా మారిపోయింది. కానీ ఇప్పుడు మహిళల పట్ల ప్రజల వైఖరి ప్రపంచవ్యాప్తంగా మారడం ప్రారంభించింది. అటువంటి పరిస్థితిలో, రాజకీయాలు, విద్య, కళలు మరియు ఇతర రంగాలలో మహిళల భాగస్వామ్యం పెరగడం ప్రారంభమైంది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క ఉద్దేశ్యం రాబోయే సంవత్సరాల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతుంది.

స్త్రీ లేకపోతే అసలు జననమే లేదు, స్త్రీ లేకపోతె మనకు గమనమే లేదు.. స్త్రీ లేకపోతె జీవం లేదు, స్త్రీ లేకపోతె అసలు సృష్టే లేదు.. ఆమె పుట్టినప్పటి నుంచి ఓ కూతురిగా, ఓ సోదరిగా, స్నేహితురాలిగా, ఆపై భార్యగా, తల్లిగా, చిన్నమ్మ, పెద్దమ్మ, అత్త, నానమ్మ, అమ్మమ్మ.. ఇలా ప్రతిదశలోనూ మనకు ప్రేమను పంచుతుంది స్త్రీమూర్తి. మేము సైతం అంటూ అన్ని రంగాల్లోనూ దూసుకెళ్తున్న మహిళా మహారాణులకు  అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు..

గడియారం రామకృష్ణ శర్మ గారి జయంతి

💐🖋️పరిణత ప్రజ్ఞామూర్తి, శతపత్ర’ యోధుడు,రంగస్థల నటుడు పండిత గడియారం రామకృష్ణ శర్మ గారి జయంతి సందర్భంగా

 【  *చదివింది ఆరో తరగతి వరకే కావచ్చు, కాని ఆరు భాషల్లో అరుదైన పాండిత్యాన్ని సాధించిన° అఖండుడు గడియారం వారు. విశ్వవిద్యాలయాల్లో చదవకున్నా విశ్వవిద్యాలయాలు ఆయన ప్రతిభకు మెచ్చి గౌరవ డాక్టరేట్‌ పట్టా ఇచ్చాయి. తెలుగు విశ్వవిద్యాలయం పక్షాన నాటి గవర్నర్‌ సూర్జిత్‌ సింగ్‌ బర్నాలా చేతుల మీదుగా డాక్టరేట్‌ పట్టానందుకున్న శర్మ అదే విశ్వవిద్యాలయంలో లిపి శాస్త్రం మీద పరిశోధన చేసిన పరిశోధకులకు పర్యవేక్షకులుగా ఉండటం ఎంతో అరుదైన విషయం* 】

✍️తెలుగు సాహితీ రంగంలో అగ్రగణ్యులు.. చరిత్ర, పురావస్తు పరిశోధకుడు.. బహుముఖ ప్రజ్ఞాశాలి గడియారం రామకృష్ణ శర్మ .

గన్నమరాజు గిరిజా మనోహర బాబు

శ్రీచాళుక్య నృపాది పాలితము, రాశీభూత విద్యాకళా

ప్రాచుర్యం బల దక్షిణా పథ పవిత్ర క్షేత్ర రాజంబు నా

ప్రాచీనాంధ్ర విభూతి చిహ్నమగు నాలంపూరు నందాంధ్ర వా

ణీ చాంపేయ సుమార్చనల్‌ జరుగుచుండెన్‌ నేత్రపర్వంబుగన్‌

✍️ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ సమక్షంలో తమ గంభీరమైన కంచుకంఠంతో కీ.శే. గడియారం రామకృష్ణ శర్మ గానం చేసిన స్వాగత కవితలోని తొలి పద్యం ఇది. ఈనాటికీ ఇంతటి మహాసభలు జరుగ లేదేమోనన్నంత వైభవంగా విశ్వనాథ, శ్రీశ్రీ దాశరథీ, కప్పగంతుల, కేశవ పంతుల వంటి సాహితీ దిగ్గజాలెందరో పాల్గొన్న నాటి సభకు ఆనాటి భారత ఉపరాష్ట్రపతి సర్వేపల్లి ముఖ్యఅతిథిగా విచ్చేసి సభలు ప్రారంభించారు. హైదరాబాద్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల, మంత్రులు డా. మర్రి చెన్నారెడ్డి, వి.బి.రాజు వంటి రాజకీయ ప్రముఖులందరూ పాల్గొన్న ఆ సభలో కాళోజీ నా గొడవ ఆవిష్కరణ వంటి కార్యక్రమాలే గాక, కవిసమ్మేళనాలు, పుస్తక ప్రదర్శనలు అనేకం జరిగాయి. నేటికీ పచ్చని జ్ఞాపకంగా నిలిచిపోయిన ఆ సభలకు కర్త, కర్మ క్రియ అన్నీ బహుముఖ ప్రజ్ఞాశాలియైన గడియారం రామకృష్ణ శర్మ కావడం ఒక విశేషం.

✍️గడియారం రామకృష్ణ శర్మ 1919 మార్చి 6న అనంతపురం జిల్లా కదిరిలో కీ.శే. జ్వాలాపతి శాస్త్రి, సుబ్బమ్మ దంపతులకు జన్మించారు


 కొంతకాలం తాము జన్మించిన కదిరిలోనే ఉండి ప్రాథమిక విద్యాభ్యాసం చేస్తూ తమ పితృవ్యులవద్ద అమరకోశం, కొంత సంస్కృతము చదివారు. ప్రాథమిక పాఠశాలలో 6వ తరగతి వరకు మాత్రమే చదివారు. అక్కడితో వారి పాఠశాల విద్య దాదాపు ముగిసిపోయినట్లే.

 ✍️కారణాంతరాల వల్ల వారు చిన్నతనాననే తమ స్వగ్రామాన్ని వదిలి అలంపురం రావలసివచ్చింది. నాటి నుండి తమ ఆజీవన పర్యంతము దక్షిణకాశిగా వాసికెక్కిన పరశురామక్షేత్రమైన అలంపురమే వారి స్థిర నివాసంగా మారింది.

✍️వారు రచించిన మన వాస్తు సంపద, భారతీయ వాస్తు విజ్ఞానము తెలుగు సిరి వంటి రచనలు వారికి ఈ విషయాల్లో ఉన్న విశేష జ్ఞానానికి చిహ్నాలు. భారతదేశ చరిత్ర వంటి రచనలు వారికి చరిత్ర పైనున్న అధికారాన్ని, ఆసక్తిని తెలియజేస్తున్నాయి. అలంపూరు శిథిలములు, దక్షిణ వారణాసి, అలంపూరు క్షేత్రము మొదలైన గ్రంథములు వారి పరిశోధనా పాటవానికి వారి నిర్దుష్ట సాహితీ మూర్తిమత్వానికి నిదర్శనాలు. మాధవ విద్యారణ్య స్వామి చరిత్రము పేర వారు రచించిన ప్రామాణిక చారిత్రక గ్రంథము లోతైన వారి అధ్యయన శక్తిని బహిర్గతం చేస్తున్నది.

 ✍️కేవలం చరిత్ర, శిల్పం, వాస్తు విజ్ఞానం వంటి గ్రంథాలకే పరిమితం గాక వారి ప్రతిభను ఇతర సాహిత్య రంగాల్లోనూ మనం దర్శించవచ్చును.
✍️సాహిత్య రంగంలో ఉన్న సృజనాత్మక, విమర్శనాత్మక రంగాల్లోనూ శర్మ ప్రతిభ రాణించింది. చిన్నతనాన్నే రాసిన ”చంద్రహాస” పద్యకావ్య రచనతో ప్రారంభమైన రచనా వ్యాసంగం చివరి వరకూ కొనసాగుతూనే వచ్చింది. తెలుగులో మాత్రమేగాక కన్నడ భాషలోనూ విస్తృత పాండిత్యం ఉన్న గడియారం వారు గదాయుద్ధ నాటకము, కన్నడ చిన్న కథలు అనే రెండు అనువాద గ్రంథాలను అందించారు. గదాయుద్ధ నాటకము కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద పురస్కారాన్ని అందుకున్న రచన. రెండు గ్రంథాలు అకాడెమీ వారే ముద్రించారు.

✍️కువలయానందసారము, పాంచజన్యము, దశరూపక సారము మొదలైన శర్మ రచనలు బహుళ ప్రచారము పొందినవి. తిక్కన, పాల్కురికి సోమనాధులను గురించి నెల్లూరు, హైదరాబాదులలో ప్రసంగించిన వారి ప్రసంగ వ్యాసాలు ఆయాకవులపై వారికున్న ప్రత్యయానికి సాక్ష్యాలుగా నిలుస్తాయి.

✍️గడియారం అనేక సంస్థలలో పలుబాధ్యతలను నిర్వహించి కృతకృత్యులయ్యారు. ఆంధ్ర సారస్వత పరిషత్తులో వ్యవస్థాపక సభ్యులుగా, పరీక్షా కార్యదర్శిగా, కార్యదర్శిగా, ఉపాధ్యక్షులుగా తెలంగాణ ఆంధ్రోద్యమం (1940-41) తాలూకా సంఘ బాధ్యులుగా అలంపురంలోని శ్రీ బాల బ్రహ్మేశ్వర దేవస్థానం ట్రస్ట్‌ బోర్డు అధ్యక్షులుగా, అలంపురం తాలూకా రైతుసంఘం అధ్యక్షులుగా, రీజనల్‌ హిస్టారికల్‌ సర్వే కమిటీలో సభ్యులుగా,
ఉస్మానియా విశ్వవిద్యాలయం అకడెమిక్‌ కౌన్సిల్‌ సభ్యులుగా, ఢిల్లీ కేంద్ర సాహిత్య అకాడెమీ అడ్వైజరీ కమిటీ సభ్యులుగా కూడా ఇతోధిక సేవలందించిన సేవా ధురంధరులు గడియారం రామకృష్ణ శర్మ. ఆం.ప్ర. సాహిత్య అకాడెమీ వారి విశిష్ట పురస్కారం మొదలుకొని వారి జీవితకాలంలో వారందుకున్న సన్మానాలు, సత్కారాలు లెక్కకు మిక్కిలి. 

✍️వారి నాటకరంగాభిరుచి వారినొక మహా నటునిగా, వారి వ్యక్తిత్వము వారి నొక ఆదర్శ మూర్తిగా, వారి సంభాషణా చతురత వారినొక మహావక్తగా, వారి సామాజిక నిష్ఠ వారి నొక ఆరితేరిన యోద్ధగా రూపొందించినవి. వారి సమగ్ర మూర్తిమత్వ దర్శనం వారి చివరి రచనయైన వారి స్వీయచరిత్ర ”శతపత్రము” చదివితే కలుగుతుంది.
కాలంతో పోటీపడి అవిరళ కృషి చేసిన గడియారం రామకృష్ణ శర్మ 25 జూలై 2006న కన్నుమూశారు.

✍️సాహితీవేత్తగానే కాకుండా స్వాతంత్ర్య సమరయోధుడుగానూ పేరొందాడు. స్వాతంత్ర్య సమరంలో చురుగ్గా పాల్గొన్నాడు. రామకృష్ణ శర్మ సంఘ సంస్కరణ అభిలాషి, రంగస్థల నటుడు కూడా.