🌷💐అంధుల అక్షరశిల్పి...... లూయి బ్రెయిలీ జయంతి సందర్భంగా💐🌷
(ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం)
#అమావాస్య చీకట్లో అంధకార #జీవితాన్ని గడుపుతున్న అంధుల పాలిట పున్నమి #వెన్నెలల వెలుగు ప్రదాత........ అతను పట్టుదలకు మారుపేరు. కఠోర శ్రమకు, ఆదర్శ జీవితాలకు వన్నెలద్దినవాడు. వైకల్యాన్ని జయించి .. అనుకున్న పనిని సాధించిన మహనీయుడు... ఆయనే అంధుల అక్షర ప్రదాత లూయిస్ బ్రెయిలీ.
అంధులకు ఆపద్భాంధవుడు లూయీ బ్రెయిలీ అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
#బ్రెయిలీ దినోత్సం:
జనవరి 4 1809లో లూయీ బ్రెయిలీ జన్మించారు. ప్రపంచ అంధులకు జ్ఞాన కవాటాలను ప్రసాదించిన మహనీయుడు లూయీ బ్రెయిలీ పుట్టిన రోజునే ఆయన పేరునే ప్రపంచ బ్రెయిలీ దినోత్సంగా రూపొందింది. అంధుల కళ్లల్లోను..జీవితాల్లోను వెలుగులు నింపిన మహనీయుడు లూయీ బ్రెయిలీ. చీకటిని జయించిన తిమిర వీరుడు..లూయీ బ్రెయిలీ.
#బాల్యం-విద్య:
లూయీ బ్రెయిలీ పారిస్లోని క్రూవే గ్రామంలో 1809 జనవరి 4న తల్లిదండ్రులు మోనిక్ బ్రెయిలీ,సైమన్ రెనె బ్రెయిలీ లకు జన్మించారు.
మనిషికి ముఖ్యమైనవి కళ్ళు. అందుకే సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని పెద్దలన్నారు. జ్ఞానానికి నిజమైన వాకిళ్ళు కళ్ళు. లూయీ బ్రెయిలీ అందరిలాగే పుట్టాడు. మూడేళ్ళ వరకూ బాగానే ఉన్నాడు. తన తండ్రి గుర్రం జీన్లు తయారు చేస్తున్న దగ్గరకెళ్ళి ఆడు కుంటుండేవాడు.కత్తి మొన కన్నుకి తగిలింది. అలా ఒక కన్ను పోయింది. తర్వాత రెండవ కన్ను కూడా పోయింది.
బాల్యంలో ప్రమాదవశాత్తు రెండు కళ్ళను కోల్పోయి 4వ ఏట పూర్తిగా గుడ్డి వాడయ్యాడు. పారిస్లో 1784లో వాలెంటైన్ హ్యూ ప్రారంభించిన అంధుల పాఠశాలకు బ్రెయిల్ చదువు కోవడానికి వెళ్ళాడు. లూయీ కి మంచి ధారణ, గ్రహణశక్తి ఉండటం వల్ల పాఠశాల్లో ఉపాధ్యాయుల మన్ననల్ని పొందేవాడు. పదవ ఏట పారిస్లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ ది బ్లెండ్ లో స్కాలర్షిప్పుకి ఎంపికయ్యాడు.
#ప్రొఫెసర్ స్థాయికి ఎదిగారు....
బ్రెయిల్ అసాధారణ ప్రతిభ సామర్థ్యాలు గల వ్యక్తిగా రాణించారు. ఆనాడు అమలులో ఉన్న ”లైన్ టైపు” పద్ధతిలో చదువుకుని 17 సంవత్సరాల వయస్సులోనే అదే స్కూలులో ప్రొఫెసర్ స్థాయికి ఎదిగారు.
#అంధుల లిపిని రూపొందించడానికి అనేకమంది అంధులు కృషి.....
అంధులకు చదువు చెప్పాలంటే వారికి ప్రత్యేకమైన పుస్తకాలు కావాలి. వారికి ప్రింటింగు పద్ధతిని కాకుండా ఎత్తుగా, ఉబ్బినట్లుగా ఉండినట్లుగా ఉండే అక్షరాల అవసరం ఉంది. స్పెయిన్ దేశానికి చెందిన ఫ్రాన్సిస్కో లూకాస్ 16వ శతాబ్దంలో చెక్కమీద ఎత్తుగా ఉబ్బిగా వుండే అక్షరాలను చెక్కే పద్ధతి రూపొందించాడు.
అంధులకు చదువుకోవాలంటే పుస్తకాలు ఎలా ప్రింటు చేయాలన్న విషయంలో ఎక్కువగా కృషి చేసింది అంధులే. ఎందుకంటే అంధుల కష్టం అంధులకే తెలుస్తుంది. ఎన్నో ప్రయోగాలు అనంతరం చాలాకాలానికి అంధుల లిపిని రూపొందించడానికి అనేకమంది అంధులు కృషి చేశారు. వారు చెక్కబోర్డు మీద పుస్తకాలు తయారు చేయాలని ప్రయత్నించారు. అయితే మొట్టమొదటి సారిగా పారదస్ అనే అంధుడు..అతని స్నేహితుడు హెయిలీ కలిసి పేపరు మీద ఎత్తుగా ప్రింటు చేసే విధానం రూపొందించారు.
#అంధులు చదువుకొనే, రాయగలిగే లిపిని లూయీ బ్రెయిలీ కనిపెట్టాడు.......
1784లో ఇది కనుగొన్న ఘనత లూయి బ్రెయిలీకి దక్కింది. తరువాత ఎంతోమంది దీన్ని పరిశోధన చేశారు. అయితే అవి అంధులు చదువు నేర్చుకొనడానికి అంత సులభంగా వుండేవికావు.
తేలికైన పద్ధతిలో ఆరు అక్షరాల్లో అంధులు చదువుకొనే, రాయగలిగే లిపిని లూయీ బ్రెయిలీ కనిపెట్టాడు.ఆధునిక యుగంలో అంధుల పుస్తకాలన్నీ బ్రెయిల్ పద్ధతిలో ఉండటం ఎంతో గర్వకారణం. దీనిని కనుగొన్న వ్యక్తి లూయీ బ్రెయిలీ. తన పరిశోధన ద్వారా విప్లవాత్మకమైన మార్పులను సాధించి అంధుల పాలిట అక్షర శిల్పి అయ్యారు.
#ఉబ్బెత్తు అక్షర లిపిని రూపొందించడం....
అంధులు సులువుగా చదువుకోవడం కోసం ఏదైనా చేయాలని పరితపించారు బ్రెయిలీ. పగలు ప్రెఫెసర్ గా పనిచేస్తూ..రాత్రిళ్లు అంధులు తేలికగా చదవగలిగే, రాయగలిగే లిపి తయారీకి కృషిచేశాడు. అక్షరాలు నున్నగా కాకుండా చుక్కలు చుక్కులుగా ఉండాలని లూయీ భావించాడు. 1821లో చార్లెస్ బార్బియర్ అనే సైనిక అధికారి చీకట్లోనూ తన సైనికులు తాను పంపిన సమాచారం గుర్తించేందుకు 12 చుక్కల సంకేత లిపిని తయారుచేసాడని తెలుసుకున్న లూయిస్ 12 చుక్కలను ఆరు చుక్కలకు కుదించి అవసరమైన రీతిలో అక్షరాలను, పదాలను, సంగీత గుర్తులను చదివేలా ఉబ్బెత్తు అక్షర లిపిని రూపొందించాడు.
#పుస్తకాలు ప్రచురణ:
ఈయన కృషిలో భాగంగా లెక్కల్ని అభ్యసించడానికి, సంగీతాన్ని నేర్చుకోవడానికీ ఈ లిపి ఉపయోగపడేలా తీర్చిదిద్దాడు. 1829 లో ‘మెథడ్ ఆఫ్ రైటింగ్, మ్యూజిక్ అండ్ ప్లైన్ సాంగ్స్ బై మీన్స్ ఆఫ్ డాట్స్ ఫర్ యూస్బె ది బ్లెండ్ అండ్ ఎరేంజ్డ్ ఫర్ దెమ్’ అనే పుస్తకాన్ని లూయీ బ్రెయిలీ ప్రచురించాడు. 1839లో డాట్స్తో ముద్రణ చేసే విధానం గురించి కూడా పుస్తకాల్ని ప్రచురించాడు.
ఇలా ఈ నిరంతరంగా శ్రమించారు. దీంతో క్షయవ్యాధికి గురై 1852 జనవరి 6న మరణించాడు.
#అంధులంతా ఆయనకు స్మరించుకుంటున్నారంటే అందుకు కారణం ఆయన అంధులందరీకీ వెలుగు ప్రదాత కావడమే.లూయీ బ్రెయిలీ మరణించినా..అంధుల అక్షరాలలో జీవించే ఉన్నారు. వారి ప్రతిభా పాటవాలలో లూయీ బ్రెయిలీ #చిరంజీవిగా నిలిచే ఉన్నారు. ఎప్పటికీ ఉంటారు. భాష ఏదైనా..దేశం ఏదైనా ప్రపంచంలోని అంధులకు ఆయనే
‘#అక్షర శిల్పి.
🙏💐🌷🌺🌹💐🙏
0 comments:
Post a Comment