Thursday, January 26, 2023

స్వాతంత్య్రోద్యమ కేసరి" లాలాలజపతిరాయ్ గారి జయంతి సందర్భంగా🌹

🌹"స్వాతంత్య్రోద్యమ కేసరి" లాలాలజపతిరాయ్ గారి జయంతి
 సందర్భంగా🌹




(భారతీయ పత్రికలని శాసించే అధికారమే నాకు ఉంటే, ఈ మూడు శీర్షికలు మొదటి పేజీలో ఉండాలని చెబుతాను. పసివాళ్లకి పాలు, తినడానికి పెద్దలకు తిండి, అందరికీ విద్య......
లాలాలజపతిరాయ్)

#లాలాలజపతిరాయ్ ,రాజకీయ నాయకుడు,గొప్ప దేశభక్తుడు, స్వాతంత్ర్య #సమరయోధుడు. లజపతిరాయ్ భారత స్వాతంత్ర్య సంగ్రామంలో బ్రిటిష్ వారిని ఎదిరించి అనేక పోరాటాలు చేశాడు.అతివాదులుగా పేరుపొందిన (లాల్ )లాలా లలా లజపతిరాయ్ ,(బాల్ ) బాలగంగాధర తిలక్ , (పాల్ ) బిపిన చంద్రపాల్ త్రయం అంటే ,ముగ్గురు.ఈ ముగ్గరిలో లాలా లజపతి రాయ్ ఒకరు. ఈయనకు పంజాబ్ #కేసరి అనే బిరుదుకూడావుంది.కేసరి అంటే  సింహం అని అర్థం.

#అమాయక పౌరుల మీద దాడులకు దిగే ప్రభుత్వానికి నాగరిక ప్రభుత్వమని చెప్పుకునే హక్కు లేదు. అలాంటి ప్రభుత్వాలు ఎక్కువ కాలం కొనసాగలేవు కూడా!’. స్వాతంత్య్ర పోరాట చరిత్రలో పంజాబ్‌ సింహమంటూ కీర్తి పొందిన లాలా లజపతిరాయ్‌ ఒక సందర్భంలో అన్నమాటలివి. ఆ మాటలు ఆయన కన్నుమూసిన రెండు దశాబ్దాలకు నిజమయ్యాయి.

*##లాలా లజపతిరాయ్ 'పంజాబ్ నేషనల్ బ్యాంకుని స్థాపించారు.ఈనాడు ప్రముఖ బ్యాంకుల్లో పంజాబ్ నేషనల్ బ్యాంకి ఒకటి.##*

#బాల్యం-తొలి జీవితం:

భారత స్వాతంత్ర్య ఉద్యమానికి ఉత్తేజాన్ని ఇచ్చిన లాలా లజపతిరాయ్ 1865 జనవరి 28 న పంజాబ్ రాష్ట్రంలో జాగ్రన్ పట్టణంలో జన్మించారు. అయన తండ్రి లాల్ రాధాకిషన్ ప్రభుత్వ పాఠశాలలో ఉర్దూ, పర్షియన్ భాషల పండితులుగా పనిచేశారు. ఈయన తన కుమారుడు లాలాలజపతిరాయ్ కి చిన్నప్పటి నుండి న్యాయవాద వృత్తిపై ఆసక్తి కలిగేలా చేశారు. తండ్రిలోని ధైర్య, స్టైర్య, వైజ్ఞానికాలు, తల్లిలోని సర్వ సమానత్వం, దీన జనోద్దరణ వంటి లక్షణాలు పుణికి పుచ్చుకుని ప్రజల హృదయాలను చూరగోనె లక్షణం అయన ఆదర్శ నాయకుడు అవడానికి ఎంతో దోహద పడ్డాయి. లాలాలజపతిరాయ్ జగ్రాన్, లూథియానా, అంబాలా, లాహోర్ లలో విద్యాభ్యాసం సాగింది. 1885లో లా పరీక్షలో విజయం సాధించి, న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 20 ఏళ్ల వయస్సులోనే న్యాయవాదిగా పేరు ప్రతిష్టలు సంపాదించారు.

#లోక్ సేవక్ సంఘ్.....

 పంజాబ్ లోని యువతలో దేశ స్వాతంత్రోద్యమం పట్ల పెద్దగా ఉత్సాహం, ఆసక్తి లేకపోవడాన్ని గమనించిన లాలాలజుపతిరాయ్ వారిలోని నిరాశను తొలగించి వారిని స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనేలా చేయడానికి కృషి చేశారు. అంతేకాక అటువంటి వారికి ఆర్థిక సహాయం అందజేయడం కొరకు లోక్ సేవక్ సంఘ్ అనే సంస్థను ప్రారంభించారు.

#స్వాతంత్ర్య ఉద్యమంలో...

మొదటి ప్రపంచ యుద్దం సమయంలో అమెరికాకు వెళ్లి 1919 సంవత్సరం వరకు అక్కడ ఉన్న లాలాజీ అక్కడి వారి నుండి కూడా ఆదరాభిమానాలు అందుకున్నారు. భారతదేశ ప్రజలు ఆయనను ఎంతగా గౌరవిస్తారో, అంతగా అక్కడి వారూ ఆయనను అభిమానించారు. సహాయ నిరాకరణోద్యమం, 1920లో కాంగ్రెస్ జాతీయ సమావేశానికి అధ్యక్షత వహించారు. సహాయ నిరాకరనొద్యమం సమయంలో 1921- 23 మధ్య రాయ్ జైలు జీవితం గడపవలసి వచ్చింది.  దయానంద సరస్వతి ఆర్య సమాజోద్యమం అనే దానిని ప్రారంభినప్పుడు అయన పిలుపును అందుకుని రాయ్ కూడా ఆ ఉద్యమంలో చేరి ఆ సిద్ధాంతాలను ప్రచారం చేసారు. 

1897 #ఉత్తరభారత దేశంలో భయంకరమైన కరువు వచ్చిన సమయంలో.....

1897 ఉత్తర భారత దేశంలో భయంకరమైన కరువు వచ్చింది. పంట చేలు, నూతులు, చెరువులు ఎండి పోయాయి. కరువు తాకిడికి వేలాది సంఖ్యలో పశువులు మరణించాయి. తిండిలేక ప్రజలు అల్లాడి పోయారు. కొందరు ప్రజలు రహదారుల వెంట వెళుతూ మరణించారు. ఆ సమయంలో లాలాలజుపతిరాయ్ మెడకు జోలే తగిలించుకుని కరువు బాధితులకు సహాయం చేయడం కోసం విరాళాలు సేకరించి వారికి సహయపడ్డారు. రాయ్ స్వాతంత్ర్య సమరంలో పాల్గొని అనేక ఉద్యమాలు నిర్వహించి ఆంగ్లేయులకు పక్కలో బల్లెంలా మారారు. ఆయన పంజాబ్ కేసరి అనే బిరుదును పొందారు.

#రచయితగా కూడా.....

లాలా లజుపతి రాయ్ కి రచయితగా కూడా మంచి పేరుంది. తన నవలలు ది స్టోరీ ఆఫ్ మై దిపోర్షన్ (1908 ), ఆర్య సమాజ్ (1915), ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఎ హిందూస్ ఇంప్రెషన్ (1916), అన్ హ్యాపీ ఆఫ్ ఇండియా వంటి అనేక రచనలు చక్కని భావజాలంయో సాహితీ విలులతో కూడినవై అందరి ప్రశంసలు అందుకున్నారు. 
తన అభిమాన హీరోలు జోసెఫ్‌ #మ్యాజినీ, #గారిబాల్డి, దయానంద సరస్వతిల జీవిత చరిత్రలు కూడా లజపతిరాయ్‌ రాశారు.*
ది పీపుల్ అనే పత్రిక నిర్వహించారు. 

#యంగ్ ఇండియా పత్రిక....
 
వీరు యంగ్ ఇండియా పత్రికను నిర్వహించి గ్రంథ రచన చేశారు. 1920లో కలకత్తా కాంగ్రెస్ మహాసభలకు అద్యక్షులు అయ్యారు.
జాతీయ ఉద్యమాన్ని ప్రభావితం చేసి అనేక మంది యువకులు భారత జాతీయ ఉద్యమంలో పాల్గొనేలా వారిని ఉత్తేజపరచారు.

#బెంగాల్‌ విభజనోద్యమం:

బెంగాల్‌ విభజనోద్యమం అంటే, గాంధీజీ రాక మునుపు కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో విజయవంతంగా జరిగిన పెద్ద ప్రజా ఉద్యమం. ఇందులో బెంగాల్‌ నుంచి అరవింద్‌ ఘోష్, బిపిన్‌చంద్ర పాల్, మహరాష్ట్ర నుంచి బాలగంగాధర్‌ తిలక్, పంజాబ్‌ నుంచి లాలాజీ కీలక నేతలుగా అవతరించారు. ఇంకా రవీంద్రనాథ్‌ టాగోర్, చిత్తరంజన్‌దాస్, సోదరి నివేదిత వంటివారు ఎందరో ఈ ఉద్యమంలో పనిచేశారు. ఈ ఉద్యమంలో స్వదేశీ ఉద్యమం చాలా కీలకమైనది. ఇందులో ఎక్కువ పాత్ర లజపతిరాయ్‌దే. స్వదేశీ ఉద్యమంలో భాగమే జాతీయ విద్య. జాతీయ కళాశాలల ఏర్పాటు కూడా అందులో భాగమే. అలా లజపతిరాయ్‌ లాహోర్‌లో జాతీయ కళాశాలను ఏర్పాటు చేశారు. అందులోనే భగత్‌సింగ్‌ చదువుకున్నారు. బెంగాల్‌ విభజన వ్యతిరేకోద్యమం లేదా వందేమాతరం ఉద్యమం సాగుతూ ఉండగానే పంజాబ్‌లో భూశాసన చట్టం అమలులోకి వచ్చింది. 1907లో ప్రభుత్వం రుద్దిన ఈ చట్టం ప్రకారం పంట పొలాలకు ఉపయోగించుకునే నీటికి చేయవలసిన చెల్లింపులు పెరిగాయి. ల్యాండ్‌ రెవెన్యూ పెంపు పేరుతో రైతులను వేధించడం మొదలైంది. ఈ భూశాసనానికి వ్యతిరేకంగా ఇండియన్‌ పేట్రియాట్స్‌ అసోసియేషన్‌ ఉద్యమాన్ని నిర్వహించింది. ఈ సంస్థ నాయకుడు అజిత్‌ సింగ్‌. ఈయన భగత్‌సింగ్‌ పినతండ్రి. ఈ ఉద్యమనేతగా అజిత్‌సింగ్‌ పేరు వినపడినప్పటికీ వెన్నెముక లజపతిరాయేనని అంటారు. ఆ సంస్థ సభ ఎక్కడ జరిగినా వక్త లజపతిరాయే.

#సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా....

 పరిచిన లాలా లజుపతి సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో కీలక పాత్ర వహించారు. దేశ వ్యాప్తంగా సైమన్ కమిషన్ కి వ్యతిరేకంగా పలు సంఘర్షణలు జరిగాయి. లాలా లజుపతి రాయ్ అధ్వర్యంలో సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా శాంతియుత ప్రదర్శన జరుగుతున్న సమయంలో పోలీసులు విచక్షణ రహితంగా లాఠీ ఛార్జ్ జరిపారు. ఆ సమయంలో లజుపతి రాయ్ పై కూడా తీవ్రంగా లాఠీ ఛార్జ్ చేశారు. రాయ్ తలపై, ఛాతిపై తీవ్రంగా గాయాలు కావడంతో లాలాజీ అనారోగ్యం పాలయ్యారు. ఆ లాఠీ ఛార్జ్ ల గాయాల తీవ్రత కారణంగానే 17 నవంబర్ 1928 న అయన తన తుది శ్వాస విడిచారు.

చనిపోతూ  లజపతి రాయ్
#ఇవాళ నా గుండెల మీద పడిన లాఠీ దెబ్బలు బ్రిటిష్‌ సామ్రాజ్య శవపేటికకి చివరిగా కొట్టిన మేకులవుతాయి.’

ఇందుకు చంద్రశేఖర్‌ ఆజాద్‌ నాయకత్వంలో భగత్‌సింగ్, రాజగురు, సుఖదేవ్‌ తదితరులు ప్రతీకారం తీసుకోవాలని కోరుకున్నారు. కానీ స్కాట్‌ని చంపాలని అనుకుని జాన్‌ పి. సాండర్స్‌ అనే మరొక అధికారిని కాల్చి చంపారు.
#లజపతిరాయ్‌  ప్రధానంగా గొప్ప మానవతావాది.   
🙏

0 comments:

Post a Comment