Tuesday, January 3, 2023

🇮🇳నేటి యువతకు స్ఫూర్తి, చైతన్య దీప్తి, స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా🇮🇳💐

💐🇮🇳నేటి యువతకు స్ఫూర్తి, చైతన్య దీప్తి, స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా🇮🇳💐






(జాతీయ యువజన  దినోత్సవం)

##"ఇనుప కండరాలు,ఉక్కు నరాలు,వజ్ర సంకల్పం ఉన్న యువత ఈ దేశానికి అవసరం"-స్వామి వివేకానంద.##

#స్వామి వివేకానంద  జీవితములోని ప్రతిరోజూ లోకహితమే లక్ష్యంగా ఆర్తితో గడిపారు. స్వామీజీ ఉపన్యాస తరంగిణుల సందేశం ఖండాంతరాలలో మారుమ్రోగింది. ఆధునిక యువతరం వారి సందేశాలను అర్థం చేసుకొని ఆచరించితే భారతదేశంలో, ప్రపంచంలోకూడా స్వర్ణయుగం స్థాపించినవారవుతారు.

#నేటి యువతకు స్ఫూర్తి, చైతన్య దీప్తి, స్వామి వివేకానంద. శ్రీ రామకృష్ణ పరమహంస ప్రియశిష్యులు, వేదాంత, తత్త్వ శాస్త్రములతో సమాజముపై అత్యంత ప్రభావము కలిగించిన ఆధ్యాత్మిక నాయకుడు.

నీ #ధర్మం ఏదైనా కావచ్చు. కాని దాని పట్ల సత్యవర్తనతో మెలుగు’ అని బోధించినవాడు వివేకానంద. భారతీయ ఆధ్యాత్మికతను పునరుజ్జీవింప చేయడంలో ఆయన దాదాపు ఒక ప్రవక్త వలే కృషి చేశాడు. ముఖ్యంగా యువశక్తిని చైతన్యపరచాలని కోరుకున్నాడు. ప్రతి ఒక్కరికీ ఆలోచన అవసరమన్నాడు. సంకుచితాల సరిహద్దులను, క్రతువులను నిరసించాడు.

తన #ఉపన్యాసాల ద్వారా భారతదేశాన్ని జాగృతము చేయటమే కాకుండా, పాశ్చాత్య దేశాలలో కూడా హిందూ మత గొప్పతనాన్ని గురించి ఉపన్యాసాలు చేసారు. "హిందూత్వం అంటే మతం కాదని అది జీవన విధానం అని చెప్పిన జ్ఞాని శ్రీ వివేకానంద.

#బాల్యం-తొలి జీవితం:

స్వామివివేకానంద అసలు పేరు నరేంద్రనాథ్ దత్తా. పశ్చిమబెంగాల్‌లోని కలకత్తాలో 1863 జనవరి 12న విశ్వనాథ్ దత్తా, భువనేశ్వరి దంపతులకు జన్మించాడు. బాల్యం నుంచి ధైర్యసాహసాలు ఎక్కువ. ఒకసారి చెట్టుమీద దెయ్యముందని కిందకు దిగాలని, లేకపోతే దెయ్యం తినేస్తుందని చెబితే గట్టిగా నవ్వాడు. దెయ్యం ఉంటే ఎప్పుడు నన్ను తినేసేది కదా అని బదులిచ్చాడు. కాలేజీలో చదువుతుండగా తండ్రి మరణించారు. దీంతో ఆధ్యాత్మిక చింతన అధికం కావడంతో రామకృష్ణ పరమహంసను కలుసుకున్నాడు. అనతికాలంలోనే రామకృష్ణుడి ప్రియు శిష్యుడయ్యాడు. ఈ క్రమంలో 1886లో గురువు పరమహంస నిర్యాణం చెందారు. వివేకానందుడు గురువు ప్రభావంతో ప్రసంగాలిస్తూ ఎంతో మందికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు.

#చికాగో పర్యటన:

వివేకానందుడి జీవితంలో చికాగో పర్యటన ఓ చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోయింది. 1893 సెప్టెంబర్ 11న అమెరికా, చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనానికి భారత ప్రతినిధిగా స్వామి వివేకానంద హాజరయ్యారు. అంత పెద్ద కార్యక్రమంలో మాట్లాడేముందు ఒక్కసారి గురువుగారిని స్మరించుకుని ‘మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా’ అంటూ ఉపన్యాసం ప్రారంభించారు. ఆ పదాలు వినగానే అన్ని దేశాల ప్రతినిధులు దాదాపు మూడు నిమిషాలపాటు ఆపకుండా చప్పట్లు కొట్టారు.

#మరుసటి రోజు పత్రికలన్నీ వివేకానందుడి ప్రతిభను గొప్పగా కీర్తించాయి.హైందవ ధర్మాన్ని సనాతన భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను హిందు మతాన్ని ప్రపంచ మత మహాసభలలో అవిష్కరించాడు. దీనితో అంతర్జాతీయ స్థాయి లో వివేకానందుడికి గుర్తింపు లభించింది.

#జనం తండోప తండాలు వచ్చేవారు....

#వివేకానందుడి చేసిన కృషి వల్ల ఒక్క అమెరికాలోనే కాకుండా అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలోనూ భారతదేశం పట్ల గౌరవం ఏర్పడింది. ఆయన ఉపన్యాసం ఇవ్వడానికి ఎక్కడకు వెళ్ళినా అక్కడకు జనం తండోప తండాలు వచ్చేవారు. ఆయన కోసం ఎంతో ఓపికగా ఎదురుచూసేవారు. ఉపన్యాసం అయిపోయిన తరువాత ఆయన్ని తమ ఇళ్ళకు ఆహ్వానించి ఆదరించేవారు. ఇంగ్లాండు నుంచి కూడా ఆయనకు ఆహ్వానం లభించింది. ఆయనకు అక్కడ ఘనస్వాగతం లభించింది. ఎంతోమంది ఆయనకు శిష్యులయ్యారు. వారిలో ముఖ్యులు సిస్టర్ నివేదితగా మార్పు చెందిన మార్గరెట్ నోబుల్. తరువాత ఆమె భారతదేశానికి వచ్చి ఇక్కడే ఉండిపోవడం జరిగింది.

#ఎంతో మందికి ఆదర్శంగా....

##సుభాష్ చంద్రబోస్, అరబిందో, మహాత్మా గాంధీ, రాజగోపాల చారి, అరవింద ఘోష్ లాంటి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు స్వామి వివేకానంద.రవీంద్రనాథ్ టాగూర్ మాటల్లో చెప్పాలంటే భారతదేశం గురించి తెలుసుకోవాలంటే వివేకానందుని అధ్యయనం చేయాలి.##

#హైదరాబాద్‌తో విడదీయరాని బంధం:

దేశానికి యువతే పట్టుకొమ్మలని, వారు సంకల్ప బలంతో ఏదైనా సాధించగలరని స్వామి వివేకానంద ఎన్నో ప్రసంగాలు చేశారు. కానీ ఆయనకు అరుదైన అవకాశాన్ని ఇచ్చింది హైదరాబాద్ మహానగరం. వివేకానంద పేరు చెప్పగానే అందరికీ గుర్తుకొచ్చేది చికాగో సర్వమత సమ్మేళనంలో ఆయన చేసిన ప్రసంగం. కానీ అంతకుముందే సికింద్రాబాద్‌ మెహబూబియా కళాశాల వేదికగా 1893, ఫిబ్రవరి 13న ప్రసంగమే ఆయన తొలి ప్రసంగంగా చరిత్రలో నిలిచిపోయింది.

#రామకృష్ణ మిషన్‌ను ఏర్పాటు:

నాలుగు సంవత్సరాల పాటు విదేశీ పర్యటన తరువాత స్వామీజీ భారతదేశానికి తిరిగివచ్చారు. ఆయన తిరిగి వచ్చేసరికి ఆయన కీర్తి దశదిశలా వ్యాపించిపోయింది. జనవరి 15, 1897 ఆయన కొలంబోలో దిగగానే ఆయనకు చక్రవర్తికి లభించినంత స్వాగతం లభించింది. మద్రాసుకు చేరుకొనేటప్పటికి ఆయన అభిమానులు రథం మీద లాగుతూ ఊరేగించారు.1897లో మే 1న రామకృష్ణ మిషన్‌ను ఏర్పాటు చేసి బేళూరులో తొలి మఠాన్ని ప్రారంభించారు. దేశవిదేశాలలో ప్రస్తుతం 205 కేంద్రాలకు వాటి సంఖ్య పెరిగింది.అయితే విశ్రాంతి లేకుండా పనిచేయడం వల్ల అతిపిన్న వయసులో కేవలం 39 ఏళ్లకే (1902 జూలై 4న) వివేకానందుడు కాలం చేశారు. ఆయన భౌతికంగా లేకపోయినా ఎంతోమంది ఆయన సూక్తులు, ప్రభావితం చేసే వ్యాఖ్యలతో స్ఫూర్తి పొంది నేటికి తమ లక్ష్యాలను నేరవేర్చుకుంటున్నారు.

#జాతీయ యువజన దినోత్సవం:

భారత ప్రభుత్వం వివేకానందుడి సేవలకు గుర్తింపుగా ఆయన జన్మదినాన్ని ‘జాతీయ యువజన దినోత్సవం’ గా 1984లో ప్రకటించింది.
జాతీయ యువజన దినోత్సవం ప్రతి సంవత్సరం జనవరి 12న జరుపబడుతుంది. భారతదేశ ఔన్నత్నాన్ని ప్రపంచ దశదిశలా చాటిన స్వామీ వివేకానంద జన్మించిన జనవరి 12 న భారతీయులు ప్రతి సంవత్సరం జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటారు.



0 comments:

Post a Comment