A homepage subtitle here And an awesome description here!

Thursday, April 21, 2022

శకుంతలాదేవి గారి వర్థంతి

_*🌹హ్యూమన్ కంప్యూటర్ శకుంతలాదేవి గారి వర్థంతి సందర్భంగా 🌹*


✍️అత్యంత వేగంగా అంకెలను గణించి రికార్డు సృష్టించిన #భారత గణిత మేధావి స్వర్గీయ #శంకుతలా దేవీ పేరిట గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ క్రియేట్ చేసారు. నలభై ఏళ్ల క్రితం శకుంతలా దేవి ఈ రికార్డు నమోదు చేశారు. రెండు 13 అంకెల సంఖ్యలను గుణించి 28 సెకన్ల వ్యవధిలోనే సమాధానం చెప్పి సంచలనం సృష్టించారు.

✍️శకుంతలాదేవి 1929 నవంబర్ 4న సంప్రదాయ కన్నడ బ్రాహ్మణ కుటుంబంలో బెంగళూరులో జన్మించారు. ఆమె తండ్రి సర్కస్‌లో పని చేసేవారు. మూడేళ్ల వయసులోనే పేకలతో ట్రిక్కులు చేయడంలో శకుంతల ప్రతిభను ఆయన గుర్తించారు. ఎంత ప్రతిభ ఉన్నా.. పేదరికం కారణంగా ఆమె చదువుకోలేకపోయారు. తల్లిదండ్రులు ఆమెను ఒకటో తరగతిలో చేర్చినప్పటికీ.. నెలకు రూ.2 ఫీజు కట్టలేక మధ్యలోనే బడి మాన్పించేశారు.
అయితే, ఆమె ప్రతిభ గురించి అన్ని దిక్కులా వ్యాపించింది. ఆరేళ్లప్పుడు యూనివర్సిటీ ఆఫ్ మైసూర్‌లో, ఎనిమిదేళ్ల వయసులో అన్నామలై వర్సిటీలో.. గణితంలో తనకున్న ప్రావీణ్యాన్ని ఆమె బహిరంగంగా ప్రదర్శించారు. 1977లో 201 అంకెలున్న సంఖ్యకు 23వ వర్గాన్ని ఆమె తన మనసులోనే గుణించి 50 సెకన్లలో సమాధానం చెప్పి ప్రపంచం దృష్టిని ఆకర్షించారు.

ఆమె చెప్పిన సమాధానాన్ని... #ద్రువీకరించుకోవడానికి శాస్త్రజ్ఞులు ఆ అంకెను వేగవంతమైన యూనివాక్ 1108 కంప్యూటర్‌కు ఫీడ్ చేయగా.. ఇదే సమస్యను పరిష్కరించడానికి దానికి ఒక నిమిషంపైగానే సమయం పట్టింది. అలాగే, 1980 జూన్ 18న.. ఇంపీరియల్ కాలేజ్, లండన్ కంప్యూటర్ విభాగం వారు ఆమెకు ఒక పరీక్ష పెట్టారు. కంప్యూటర్ అప్పటికప్పుడు ఇచ్చిన రెండు పదమూడు అంకెల సంఖ్యలను గుణించి ఫలితం చెప్పమన్నారు.
ఆ ప్రశ్నకు ఆమె సరిగ్గా 28 సెకన్లలో సమాధానం చెప్పి వారిని ఆశ్చర్యానికి గురిచేశారు. గత శతాబ్దిలో ఏ ఏడాదిలో ఏ నెలలో ఏ తేదీన ఏ వారం వచ్చిందో.. నిద్రలో లేపి అడిగినా ఠక్కున చెప్పే మేధస్సు ఆమె సొంతం. అంతేకాదు, ఆమె రచయిత్రి కూడా. గణితం, జ్యోతిషాలను అంశాలుగా తీసుకుని.. ఫన్ విత్ నంబర్స్, ఆస్ట్రాలజీ ఫర్ యు, పజిల్స్ టు పజిల్ యు, మాథబ్లిట్, ఎవేకెన్ ద జీనియస్ ఇన్ యువర్ చైల్డ్, ఇన్ ద వండర్‌లాండ్ ఆఫ్ నంబర్స్ వంటి పుస్తకాలు రాశారు.

✍️ఆమె మేధస్సు🍁*_

1977లో అమెరికాలో ఓ కంప్యూటర్తో శకుంతలా దేవికి పోటీ పెట్టారు. 188132517 అనే సంఖ్యకు మూడో వర్గం కనుక్కోవడంలో ఈ పోటీ పెట్టగా, ఆమె కంప్యూటర్ను  ఓడించేశారు. ఇక 1980 జూన్ నెలలో 13 అంకెలున్న రెండు సంఖ్యలు తీసుకున్నారు. 76,86,36,97,74,870 అనే సంఖ్యతో 24,65,09,97,45,779 అనే సంఖ్యను హెచ్చవేస్తే ఎంత వస్తుందని లండన్ ఇంపీరియల్ కాలేజిలోని కంప్యూటర్ విభాగంలోని ఓ సూపర్ కంప్యూటర్  శకుంతలా దేవిని ప్రశ్నించింది. దానికి ఆమె కేవలం 28 సెకన్లలో సమాధానం ఇచ్చారు. ఆ సమాధానం.. 18,947,668,177,995,426,462,773,730. ఆ దెబ్బకు గిన్నిస్ రికార్డు ఆమె పాదాక్రాంతమైంది. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన మానసిక శాస్త్ర ప్రొఫెసర్ ఆర్థర్ జెన్సెన్ స్వయంగా శకుంతలా దేవి గణిత ప్రతిభను పరిశీలించి అవాక్కయ్యారు.

✍️ఆరేళ్ల వయసులో తొలిసారి శకుంతలా దేవి మైసూరు విశ్వవిద్యాలయంలో తన గణిత ప్రతిభను బహిరంగంగా ప్రదర్శించారు.

#ఎనిమిదేళ్ల వయసులో అన్నామలై విశ్వవిద్యాలయంలో ఆమె ప్రదర్శనతో శకుంతలాదేవిని బాలమేధావిగా గుర్తించారు.
గత శతాబ్ద కాలంలో ఏ తేదీ చెప్పినా అది ఏ వారం అవుతుందో చిటికెలో ఆమె చెప్పేవారు.

1977లో 201 అంకెలున్న సంఖ్యకు 23వ వర్గం ఎంతో కేవలం 50 సెకండ్లలో చెప్పేశారు.

ఆమె ప్రతిభను గుర్తించి, అక్టోబర్ 5, 1950 న లెస్లీ మిచెల్ నిర్వహించిన బిబిసి ఛానెల్‌లో ఆమె ప్రతిభను అంచనా వేసిన తర్వాత ఆమె '#హ్యూమన్ కంప్యూటర్' గా పేర్కొంది అయితే ఈ టైటిల్‌ను ఆమె ఎప్పుడూ ఇష్టపడలేదు. మానవ మనస్సు కంప్యూటర్ కంటే సాటిలేని సామర్ధ్యాలను కలిగి ఉందని, మానవ మనస్సును కంప్యూటర్లతో పోల్చడం సముచితం కాదని ఆమె అన్నారు.

అమె #విజయవంతమైన జ్యోతిష్కురాలు , వంటల పుస్తకాల రచయిత మరియు నవలా రచయిత కూడా.

#తన 83వ ఏట 2013 ఏప్రిల్ 21న  గుండె, మూత్రపిండాల  సమస్యలతో బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో కన్నుమూశారు.

✍️బయెపిక్:
మే 2019 లో శకుంతల దేవి జీవిత కథ ఆధారంగా ఒక చిత్రాన్ని ప్రకటించారు. శకుంతల దేవి పేరుతో ఉన్న ఈ చిత్రంలో విద్యాబాలన్ ప్రధాన పాత్రలో నటించారు మరియు సన్యా మల్హోత్రా , అమిత్ సాధ్ మరియు జిషు సేన్‌గుప్తా నటించారు. సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ప్రొడక్షన్స్ విక్రమ్ మల్హోత్రా ఈ చిత్రం హిందీ లో నిర్మించారు అను మీనన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదల తేదీని మొదట్లో 2020 మే 8 న ప్లాన్ చేశారు, కాని కోవిడ్ -19 మహమ్మారి కారణంగా, ఈ చిత్రం 31 జులై 2020 న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రపంచవ్యాప్తంగా విడుదల అయినది .

Sunday, April 17, 2022

సర్వేపల్లి రాధాకృష్ణ గారి వర్థంతి



సర్వేపల్లి రాధాకృష్ణ గారి వర్థంతి 







ఈ చిత్రం 1947లో ప్రముఖ తెలుగు కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి కుమారుడు #బుజ్జాయి గీసింది. దీనిపై 1947 జనవరి 3వ తేదీన సర్వేపల్లి రాధాకృష్ణ #సంతకం చేస్తూ తన పేరును తెలుగులో 'సర్వేపల్లి రాధాకృష్ణయ్య' అని రాయటం చూడొచ్చు
తెలుగులో సంతకం చేయాల్సి వచ్చినపుడు ఆయన సర్వేపల్లి #రాధాకృష్ణయ్య అనే రాసేవారు. అదే ఆయన అసలు పేరు
***         ***    ***
ఉపాధ్యాయ వృత్తి నుంచి భారత ప్రథమ పౌరుడి స్థాయికి ఎదిగిన అరుదైన ఘనత ఆయన సొంతం.

అయితే, రాష్ట్రపతిగా కంటే #తత్వవేత్తగానే ఆయన ప్రపంచానికి ఎక్కువగా పరిచయం. భారతీయ తాత్విక దృక్పథాన్ని ప్రపంచ దేశాలకు అందించిన గొప్ప వ్యక్తుల్లో ఒకరిగా ఆయన నిలిచారు.

#ఉపాధ్యాయుడిగా, తత్వవేత్తగా, రచయితగా, రాజనీతిజ్ఞుడిగా సర్వేపల్లి ప్రయాణం బహుముఖాలుగా సాగింది.

##రాయబారిగా తనదైన ముద్ర
1949లో రష్యా రాయబారిగా వెళ్లినప్పుడు రాధాకృష్ణన్ అక్కడ తదైన ముద్రవేశారు. కశ్మీర్ విషయంలో రష్యా మద్దతు భారత్‌కు లభించేలా కృషిచేశారు.
తన వాక్చాతుర్యంతో ఒక సందర్భంలో స్టాలిన్‌ను సైతం మెప్పించారు.

** #సోవియట్ రష్యాకు నియమితులైన  భారత దేశపు మొట్ట మొదటి దౌత్యవేత్త డా. రాధాకృష్ణన్. "దేవుడిని నమ్మని  దేశానికి, దేవుడే సర్వస్వం అనే మీరు రాయభారిగా పోతున్నారు. ఇదెలా పొత్తు కుదురుతుంది" అన్న ప్రశ్నకు "Truth, Eternity and Beauty, (సత్యం, శివం, సుందరం) are the symbols of the God. Russians believe in them." అని విమర్శకుల నోరు మూపించారు.

రష్యా దేశపు నియంత #స్టాలిన్, తన అధికార నివాసం( క్రెమ్లిన్) లో, రాధాకృష్ణన్ కు స్వాగతం పలికేందుకు   లేచి వచ్చి స్వయంగా  వాకిలి తెరిచారు. రష్యానుంచి తిరిగొస్తున్నపుడు డా. రాధాకృష్ణన్ స్టాలిన్ దగ్గరవెళ్ళి, వీపు మీద చెయ్యేసి  క్షేమ సమాచారాలు  విచారించారు. అపుడు స్టాలిన్ చలించారు.  గద్గగ స్వరంతో, కన్నీళ్ళు కారుస్తూ: " రక్కసిగా కాక, మానవునిగా నన్ను చూచిన ప్రథమ వ్యక్తి మీరు. మా దేశమునించి వెళ్ళి పోవడం నాకెంతొ విచారం కలిగిస్తున్నది. మీరు చిరకాలం పాటు జీవించాలని నా కోర్కె. నేను మరెన్ని రోజులు బ్రతుకుతానో తెలియదు." అన్నారు.

**#కంగారు పడకండి మావో’

భారత ఉపరాష్ట్రపతిగా ఆయన 1957లో చైనాలో పర్యటించారు. అప్పుడు చైనా అధినేతగా ఉన్న మావో జెడాంగ్‌ను కలవాలనుకున్నారు. ఒక రోజు అర్ధరాత్రి 12 గంటలకు మావోను కలిసే అవకాశం ఆయనకు వచ్చింది.
మావోనే స్వయంగా ఆయనను ఆహ్వానించారు. ఆ సమయంలో రాధాకృషన్ మావోతో కరచాలనం చేయడంతో పాటు, ఆయన గడ్డాన్ని చేతితో తాకారు. ఊహించని ఈ పరిణామానికి మావో ఉలిక్కిపడ్డారు.
ఆయన తేరుకునేలోపు ’మిస్టర్ మావో, నేను మీతోనే కాదు స్టాలిన్, పోప్‌లతో కూడా ఇలానే చేశాను. మీ మీదున్న వాత్సల్యంతోనే అలా చేశాను. కంగారుపడకండి’ అని చెప్పారు.

**#రాధాకృష్ణన్
ఆయన విద్యాభ్యాసం అనేక ఒడిదొడుకుల మధ్య కొనసాగింది. కటిక పేదరికాన్ని అనుభవించిన సర్వేపల్లికి కనీసం చదువుకోవడానికి పుస్తకాలు కూడా ఉండేవి కావు. అలాంటి పరిస్థితుల్లో పుస్తకాలు కొనుక్కోగలిగిన స్థోమత ఉండి, కొనుక్కున్న వ్యక్తి ఇంటికి వెళ్లి ఆయనను ‘అయ్యా..ఒక్క కాగితం నలగకుండా నేను పుస్తకం చదువుకుంటాను. దయచేసి నాకు పుస్తకం ఇప్పించండి’ అని ప్రార్థన చేసి తెచ్చుకుని చదువుకునేవారు.
పుస్తకాలు ఉన్న వ్యక్తులు తనను ఎప్పుడు రమ్మంటే అప్పుడే వెళ్లి, వాటిని తెచ్చుకుని చదివి గొప్ప తత్వశాస్త్రవేత్త అయ్యారు.

**#పరీక్షకి రుసుం చెల్లించటానికి అదే చివరి రోజు. అలా వస్తున్న రాధాకృష్ణన్‌ ఒక దొంగ అడ్డగించి, దాడిచేసి చెవి పోగులు లాక్కున్నాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో హడలిపోయిన సర్వేపల్లికి ఒళ్ళునొప్పులు, జ్వరం వచ్చింది. దీంతో పరీక్ష ఫీజు విషయం మర్చిపోయి పాఠశాలకు కూడా వెళ్ళకుండా నిద్రపోయారు. ఇదే సమయంలో పరీక్ష ఫీజు చెల్లించని విద్యార్థులు ఎవరైనా ఉన్నారా? అని ప్రధానోపాధ్యాయుడు పరిశీలించారు.
అందులో రాధాకృష్ణన్ పేరు చూసి, "అయ్యో! చాలా బాగా చదువుకునే విద్యార్థి ఈరోజు రాకపోవడమేంటి? అని పరీక్ష రుసుం ఆయనే చెల్లించారు. ఆ తరువాత రాధాకృష్ణన్ పరీక్షల్లో తన ప్రతిభను నిరూపించుకున్నారు. ఉపాధ్యాయుడంటే ఎలా ఉండాలో చూసిన రాధాకృష్ణన్ ఈ సంఘటన తన జీవితంలో మర్చిపోలేదు. అందుకే ఒక ఉపాధ్యాయుడు ఒక వ్యక్తిని ఎంత ఎత్తుకు తీసుకెళ్లగలరో తెలుసుకుని, ఆచరించిన మహా పురుషుడు. అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన తత్వశాస్త్రవేత్త అయినా, రాష్ట్రపతి పదవిని అలంకరించినా, భారతరత్నను అందుకున్నా తన పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవం పరమ పవిత్రంగా చెయాలని కోరుకున్నారు.

**పలుమార్లు #నోబెల్ బహుమతికి నామినేట్
సర్వేపల్లి గొప్ప పండితుడు. ఆయన 16సార్లు నోబెల్ సాహిత్య బహుమతికి, 11సార్లు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. 

** ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో  ఉపన్యాసాలివ్వడానికి ఆహ్వానం పొందిన #ప్రథమ  భారతీయుడు సర్వెేపల్లి. అక్కడి సభాభవనం సరిపడక ప్రేక్షకులు బయట నిలుచుకొని సర్వేపల్లి ఉపన్యాసం విన్నారు. 
లండన్‌లో సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రసంగం విన్న అనంతరం హెచ్ఎన్ స్పాల్డింగ్ 1936లో ఆక్స్‌ఫర్డ్ ఫర్ ఈస్టర్న్ రిలీజియన్స్ అండ్ ఎథిక్స్‌లో స్థానం కల్పించారు.

**#ప్రాచీన కాలం నుంచి శ్రీకృష్ణుడిని గురువుగా, అర్జునుడిని శిష్యుడిగా పిలుస్తుంటాం. గురుశిష్యుల బంధానికి వారు కూడా ప్రతీకలు. సర్వేపల్లి తనకు కృష్ణుడితో సమానమని జాతిపిత మహాత్మా గాంధీ చెప్పారు.

**1928, నవంబర్, 17,18 న  నంద్యాలలో #ఆంధ్ర మహాసభ జరిగింది.దానికి అనిబిసెంట్ అధ్యక్షత వహించగా ప్రకాశం పంతులు, కట్టమంచి రామలింగా రెడ్డి, కొండా వెంకటప్పయ్య లతో పాటు ఆప్పటికే వేదాంతిగా ప్రపంచ ఖ్యాతి పొందిన సర్వేపల్లి రాధాకృష్ణన్ కూడా వచ్చారు. ఆయన తెలుగులోనే ప్రసంగించారు. చిలుకూరి నారాయణ రావు సూచన మేరకు "దత్త మండల జిల్లాలు" , ‘‘రాయలసిమ’’గా మారిందీ సభలోనే.

** #మైసూరు విశ్వవిద్యాలయము నుండి  రాధాకృష్ణన్   కలకత్తా విశ్వవిద్యాలయానికి ఉద్యోగ రీత్యా వెళ్తున్నప్పుడు, విద్యార్థులు, అధ్యాపక బృందమే గాక సమస్త ప్రజానికం ఆయనను బండిలో (పూలరధం) కూర్చొబెట్టి రైల్వే నిల్దాణం(స్టేషన్) వరకు లాగి  గౌరవం ప్రకటించారు. దివానులకు, మహారాజులకు కూడాఇలాంటి గౌరవం దక్కి ఉండదు.

** 1964 లొ #హిందీ వ్యతిరేక ఉద్యమం ఉధృతంగా, హింసాత్మకముగా మారినఫ్పుడు, వారు సందేశంలో  "భాషలన్ని సరస్వతి దేవి యొక్క వివిధ స్వరూపములు " అనే భావం గలిగిన " సర్వజ్ఞమ్ తత అహం వందే/ పరంజ్యోతి తపావహమ్/ యన్ ముఖద్ దేవి/ సర్వ భాషా సరస్వతి" శ్లోకాన్ని ఉదహరించారు. 

**#చాగ్లాగారు  ఇంగ్లాండ్ లో హైకమిషనర్ గా ఉన్నప్పుడు రాధాకృష్ణన్ అక్కడ పర్యటనకు వెళ్ళారు. ఒక రోజు కామన్ వెల్త్ సభ నుంచి వాపసు వస్తూ, వస్తూ, తన రచనల ప్రచురణ కర్త అల్లెన్ & ఉన్ విన్ (Allen & Unwin) అక్కడే ఉందని తెలిసుకున్నారు. సిబ్బంది, రక్షక భటులు ఎవ్వరు నచ్చజెప్పినా వినుపించుకొకుండా ఆ భవనానికి వెళ్ళి , మెట్లెక్కి మొదటి అంతస్తులో అల్లెన్ వాకిలు తట్టారు. అల్లెన్ బయటికి వచ్చినిశ్చేష్టుడయ్యాడు. ‘మీరు ఒక మాట ముందే చెప్పిఉంటె మీకు స్వాగతం పలకడానికి ఏర్పాటు చేసెవాడిని కదా,’ అన్నారు. "నేను భారత రాష్ట్రపతిగా మీదగ్గరకు రాలేదు. ఒక రచయితగా వచ్చాను. నా పుస్తకాలు ఎలా అమ్ముడు పోతున్నవి." అని నిరాడంబరంగా అడిగి తెలుసుకున్నారు.  

** #ముగ్గురు ప్రధానులకు, నెహ్రూ , శాస్త్రి, ఇందిరా గాంధి లతో ప్రమాణం నిర్వహించిన ఏకైక రాష్ట్రపతి డాక్టర్ రాధాకృష్ణన్. 

**1931-36 మధ్యకాలములొ, సర్కేపల్లి రాధాకృష్ణన్  #ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా ఉన్నారు.  దాని పురోభివృద్ధికి అంచనాకు మించి కృషిచెేశారు. ఒక వేదాంతి అయినా  గొప్ప గొప్ప విజ్ఞానులను అహ్వానించి వైజ్నానిక విషయాలను భోదించే శాఖలను ప్రారంభించారు. వారివల్ల విశ్వవిద్యాలయానికి వచ్చిన వారిలో  డా.టి.ఆరె.  శేషాద్రి, డా.సూరి భగవంతం, ఆచార్య హిరేన్ ముఖర్జీ, ఆచార్య హుమాయూన్ కబీర్, ఆచార్య మామిడిపూడి వెంకట రంగయ్య, సి,వి.రామన్, తదితరులున్నారు.  

**#ఉపరాష్ట్రపతి ముఖ్య విధి రాజ్యసభ అధ్యక్షత. దానిని సమర్థవంతంగా పది సంవత్సాల పాటు నిర్వహించారు. వారి హాయాంలో సభలో ఉన్న ప్రముఖుల్లో కొందరు: అల్లాడి కృష్ణ స్వామి అయ్యర్, సత్యేంద్రనాథ బోస్, ప్రథ్విరాజ కపూర్, రుక్మిణి దేవి అరుండేల్, జకీర్ హుస్సైన్, మైథిలి శరణ్ గుప్త, కాకాసాహెబ్ కాలెల్కర్, రాధాకుముద్ ముఖర్జీ, పి.వి.కాణె, మోటూరి సత్యనారాయణ, వాడియా, తారాచంద్,  భూపెష గుప్తా, ఫణిక్కర్, జైరామదాస్ దౌలత్ రామ్, తారాశంకర్ బంద్యోపాధ్యాయ, మొహన్లాల సక్షేనా, వి.టి.కృష్ణమాచారి. ఈ గంభీరోపన్యాసకులను ఆయన సంస్కృత శ్లోకాలు ఉదహరించి శాంతపరిచే వారు.

**1964 లో  కర్నూలునుండి కారులోె వెళ్లాలి. కాన్వాయిలో ఐదారు కార్లు మాత్రమే. కర్నూలులో ఒక అపశ్రుతి దొర్లింది.  ఒక చిన్న పిల్లవాడికి ఒక కాన్వాయ్ కారు తగిలింది. అదృష్టవశాత్తు ,అది పెద్దాస్పత్రికి ఎదురుగా జరిగింది. కాన్వాయి ఆగింది. రాష్ట్రపతి అగాడు. పిల్లవాడిని ఆస్పత్రికి తరలించారు.భారత రాష్ట్రపతి రాధాకృష్ణన్ నడుచుకొంటూ ఆస్పత్రి అత్యవసర చికిత్సగదికి వెళ్లారు. అక్కడ ఆదుర్దాగా  కూర్చొన్నారు. పిల్లవాడిని పరీక్షించిన వైద్యులు చిన్న చిన్న గాయాలేనని తీర్మానించి ప్రథమ చికిత్సచేసి పిల్లవాడిని వారి సంరక్షకులకు అప్పజెప్పారు. అపుడు గాని రాష్ట్రపతి తేరుకోలేదు. తరువాత రాధాకృష్ణన్ గారు బయటకు నడుచుకుంటూ వచ్చి కారు ఎక్కబోతున్నారు. అపుడు జిల్లా పోలీస్ అధికారి విక్టర్ సిబ్బందిని ప్రమాదం మీద నిలదీస్తున్నారు.అది రాష్ట్రపతి కంట పడింది. అంతే, ఆయన  పోలీసు అధికారి దగ్గరకు పోయి, వీపు మీద చెయ్యేసి: "Be calm, cool yourself. #They are also human beings," అన్నప్పుడు అధికారి తలవంచుకొన్నారు.

**#రాధాకృష్ణన్ చెవెనింగ్ స్కాలర్‌షిప్స్, రాధాకృష్ణన్ మెమోరియల్ అవార్డులు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఆయన జ్ఢాపకార్థం ఏర్పాటు చేశారు.

**#అమెరికా అద్యక్షుడు జాన్ ఎప్ కెనడీ రాధాకృష్టన్ ని  ఎంతోగానో అభిమానించే వాడు. ఇండియా- చైనా యుద్ద సమయంలో  ఇండియాకు సహాయ సహకారాలు అందించాడు
కెనడీ'రాధాకృష్టన్ ని International teacher అని సంభోదించేవాడు.


Tuesday, April 5, 2022

శ్రీ బాబూ జగ్జీవన్‌ రాం గారి జయంతి.

🌷🙏భారత అమూల్య రత్న, స్వాతంత్ర్య సమర యోధుడు,సంఘ సంస్కర్త, శ్రీ బాబూ జగ్జీవన్‌ రాం గారి జయంతి.





✍️కొలిమి జ్వాల్లో వన్నెదేలిన బంగారంలా ఎదిగిన జగ్జీవన్‌రామ్‌ పట్ల నా ఆత్మ గౌరవాభిమానాతో ఉప్పొంగుతున్నది, జగ్జీవన్‌రామ్‌ #అమూల్యరత్నం’’ అని #గాంధీ ఒక సందర్భంలో రాశారు:-

✍️అణగారిన వర్గాల అభ్యున్నతికి ఎన్నో పోరాటాలు చేసిన యోధుడు డాక్టర్​ బాబూ జగ్జీవన్ రామ్. ఆయన చేసిన పోరాటాలు ఇప్పటి తరానికి కూడా ఆదర్శప్రాయంగా నిలుస్తాయనడం అతిశయోక్తి కాదు. ఆనాటి సమాజంలో చదువుకు దూరమై దుర్భర జీవితాన్ని గడుపుతున్న.. పీడిత దళిత దీన జనుల కోసం జీవితాంతం శ్రమించిన సంస్కరణల యోధుడు జగ్జీవన్ రామ్. అందరితోనూ ఆప్యాయంగా బాబూజీ అని పిలిపించుకున్నారు.

✍️ఒకవైపు దేశ స్వాతంత్య్రం కోసం పోరాడుతూనే, మరోవైపు సామాజిక సమానత్వం కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం అలుపెరగని సమరం సాగించిన రాజ కీయ, #సామాజిక విప్లవ #యోధుడు బాబూ జగ్జీవన్‌ రామ్‌. 

✍️అతి చిన్న వయస్సులో(27 ఏళ్లకే) శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యి అప్పట్లో రికార్డు సృష్టించిన స్వాతంత్ర్య సమరయోధుడు, ధీశాలి, బాబూ జగ్జీవన్‌ రాం. పోలిటికల్ కింగ్ మేకర్‌గా రాజకీయంలో రాణించి, అధికారం కోసం కాకుండా ప్రజా శ్రేయస్సు కోసమే ధైర్యంగా అడుగేసిన మహోన్నత వ్యక్తిత్వం ఆయన సొంతం.
ఓ వైపు నిమ్న వర్గాల ఉన్నతికి కృషి చేస్తూనే,అన్ని వర్గాల ప్రజలతో సత్సంబంధాలను కలిగి ఉండి,తన ప్రతిభాపాటవాల ద్వారా గొప్ప పరిపాలనదక్షులుగా పేరు తెచ్చుకున్నారు బాబు జగ్జీవన్ రామ్ గారు.

✍️బాల్యం-విద్యాభ్యాసం:

జగ్జీవన్‌ బిహార్‌లోని షాబాద్‌ జిల్లా చాంద్వా గ్రామంలో 1908 ఏప్రిల్‌ 5న శోభిరామ్, బసంతి దేవిలకు జన్మించారు.

✍️వివక్షత పై అంకుశం:

ఆయన చదువుకున్న పాఠశాలలోనే మొదటిసారిగా అంటరానితనాన్ని అనుభవిం చాడు. పాఠశాలలో విద్యార్థుల కోసం మంచినీటి సదుపాయాన్ని కల్పిస్తూ రెండు కడవలపై ‘హిందూ పానీ’, ‘ముస్లిం పానీ’ అని రాసి ఉంచేవారు. అయితే జగ్జీవన్‌ రామ్‌ హిందూ పానీలో మంచినీరు తాగారని హిందూ విద్యార్థులు ఆ కుండలోని నీరు త్రాగేవారు కాదు.ఈ ఉదంతంతో ఆగ్రహించిన బాబు ఒక రాయి విసిరి ఆ కుండను ముక్కముక్కలు చేశాడు. అప్పుడు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ‘హరిజన పానీ’ అనే మరో కుండను ఏర్పాటుచేశాడు. జగ్జీవన్‌ రామ్‌ ఆ కుండని కూడా పగులకొట్టాడు. ఇక చేసేదేమీలేక ఆ పాఠశాల వారు ఒకే కుండను ఏర్పాటుచేశారు. ఈ సంఘటనలో జగ్జీవన్‌ రామ్‌ గెలిచినా ఆయన గుండె ఆవేదనతోనూ, కోపంతోనూ నిండిపోయింది. ఆ అనుభవాలే ఆయన దళిత జనుల జాగృతివైపు ముందుకు సాగడానికి ప్రేరణనిచ్చాయి.

✍️బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఇంటర్‌,  కలకత్తా విశ్వవిద్యాయం నుంచి డిస్టింక్షన్‌లో బిఎస్సీ డిగ్రీ పూర్తి చేసి పట్టభద్రుడయ్యారు. ఆయన తన పీజీ చదువు పూర్తి చేశారు.

✍️స్వాతంత్య్ర ఉద్యమంలో:

విద్యార్థి దశలోనే గాంధీజీ అహింసా మార్గానికి ఆకర్షితుడు అయి 1930లో సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని బ్రిటిష్‌ పోలీసులను ఎదిరించి లాఠీ దెబ్బలకు బెదరకుండా నిలబడ్డ నాటి స్వాతంత్య్ర సమరయోధుడు.
#బీహారులో 1934లో వచ్చిన భయంకరమైన భూకంపం సందర్భంగా జగ్జీవన్‌రామ్‌ ప్రజకు సహాయ, పునరావాస చర్యు చేపట్టాడు. తన బృందంతో ఆహోరాత్రు శ్రమించి ఆహారం, బట్టు, ఔషధాు, మంచినీరు, ఆశ్రయం మొదగు సౌకర్యాు బాధితుకు అందేవిధంగా సహాయ శిబిరాు జగ్జీవన్‌రామ్‌ నిర్వహించాడు. ఈ సందర్భంలోనే మొదటిసారిగా #గాంధీని జగ్జీవన్‌రామ్‌ కలుసుకోవడం తటస్థించింది.సత్యాగ్రహం శాసనోల్లంఘన ఉద్యమం, క్విట్ ఇండియా వంటి ఉద్యమాల్లో గాంధీజీ వెంట నడిచారు

✍️రాజకీయ రంగం:

కేవలం 27 ఏళ్ల వయస్సులోనే శాసన మండలి సభ్యునిగా ఎన్నిక కావడం ఆయనకే చెల్లింది.  52 ఏళ్లపాటు శాసనసభ, పార్లమెంటును ఏలిన మహా అనుభవ శీలి. వ్యవసాయ, రక్షణ, ఆరోగ్య, రైల్వేశాఖ మంత్రిగా, ఉప ప్రధానిగా ఆయన సేవలు అనిర్వచనీయం. #మంత్రి మండలిలో అతి చిన్న వయసుడైన జగ్జీవన్‌రామ్‌ను అందరూ ‘#బేబి మినిష్టర్‌’ అని పిలిచేవారు. ప్రజలంతా ప్రేమతో ‘#బాబుజీ’ అని పిలిచేవారు.
ఆయన జీవితకాలం 78 ఏళ్ళు అయితే అందులో 52 ఏళ్ళు రాజకీయ జీవితం గడిపారు.

✍️ప్రపంచ రికార్డు:

1936 నుంచి 1986 వరకు ఐదు దశాబ్దాలకుపైగా చట్ట సభ సభ్యుడిగా కొనసాగడం ప్రపంచ రికార్డు. స్వతంత్ర భారతదేశంలో తొలి ఎన్నికలు జరిగిన 1952 నుంచి ఆయన చనిపోయే 1986 వరకూ పార్లమెంట్​ సభ్యుడిగా ఉన్నారు. దేశంలో ఎక్కువ కాలం పనిచేసిన కేబినెట్ మంత్రిగానూ ఆయన రికార్డు సృష్టించారు. 

*1971 భారత-పాకిస్తాన్ యుద్ధంలో భారత రక్షణ మంత్రిగా పనిచేశారు. 

*బాబు జగ్జీవన్ రామ్ తన పదవీకాలంలో హరిత విప్లవం విజయవంతంగా అమలు చేయడానికి కూడా కీలకపాత్ర పోషించారు. కేంద్ర ఆహార, వ్యవసాయ శాఖ మంత్రి 1967 నుండి 1970 సంవత్సరం వరకు. గతంలో, 1966 నుండి 1967 వరకు ఏర్పడిన కార్మిక, ఉపాధి మరియు పునరావాస మంత్రి విధులను కూడా ఆయన నెరవేర్చారు.

*బాబు జగ్జీవన్ రామ్ గౌరవార్థం, దేశీయంగా నిర్మించిన మొట్టమొదటి లోకోమోటివ్ అయిన WAM-1, అతని పేరు పెట్టబడింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ యొక్క శిక్షణా అకాడమీకి బాబు జగ్జీవన్ రామ్ పేరు పెట్టారు.
*2015 సంవత్సరంలో పూణే నగరంలోని యెరావాడ పరిసరాల్లో మహాత్మా గాంధీ నగర్‌లో బాబు జగ్జీవన్ రామ్ ఇంగ్లీష్ మీడియం సెకండరీ స్కూల్ స్థాపించబడింది.

*ఉజ్జయినిలోని విక్రమ విశ్వవిద్యాయం 1967లో జగ్జీవన్‌రామ్‌కి ‘డాక్టర్‌ ఆఫ్‌ సైన్స్‌’ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. ఆయన సేవను మెచ్చిన కాన్పూర్‌ విశ్వవిద్యాయం 1968లో డాక్టరేట్‌తో సత్కరించింది.

✍️రచయితగా:

బాబుజీ గొప్ప రచయిత అన్న సంగతి చాలా మందికి తెలియదు. ఆయన హిందీలో, ఇంగ్లీషులో రచనలు చేశారు. “భారత దేశంలో కులం సవాళ్ళు”, “ జీవన సరళి వ్యక్తిత్వ వికాసం” అను రెండు విశిష్ట గ్రంథాలను రాశారు.
ఆయన గొప్ప అధ్యయనశీలి.

✍️కూతురు కూడా తండ్రి బాటలోనే:

ఆయన కుమార్తె మీరాకుమార్‌ తండ్రి ఆదర్శాలతోనే పెరిగి కేంద్రమంత్రిగా, లోక్‌సభ స్పీకర్‌గా దేశానికి సేవలందించారు..

✍️సమతా దివాస్:

అతి పిన్న వయసులో మంత్రిగా, అతి ఎక్కువ కాలం చట్టసభ సభ్యునిగా, అతి ఎక్కువ శాఖల బాధ్యతలు చేపట్టిన మంత్రిగా అరుదైన రికార్డులు ఆయన సొంతం. బాబూ జగ్జీవన్​ రామ్​ జయంతిని యావత్​దేశం ‘#సమతా దివాస్’గా జరుపుకుంటోంది.

1986 జూలై 6వ తేదీన బాబూజీ తన తుదిశ్వాస విడవడంతో యావత్తు భారతజాతి కనీరుమున్నీరయ్యింది. ఆయన భౌతికంగా భారత దేశాన్ని విడిచినా ఆయన దేశానికి చేసిన సేవలు, సంఘ సంస్కరణలు, ఆయన ఆచరించిన సిద్దాంతాలు ఎప్పటికీ సంజీవంగానే ఉంటాయి..
హేతుబుద్ది, సానుకూ దృక్పథం, స్పష్టమైన దార్శనికత, విస్తృతమైన అధ్యయనం, గొప్ప #మేధాశక్తి, స్థిరమైన సంక్పబం, నిత్యకృషీవత్వం, ఓరిమి, కారుణ్యం, చర్చించే గుణం, ఒప్పించే గుణం, ఆత్మవిశ్వాసం, ధైర్యం, సేవానిరతి, #కార్యనిర్వహణాదక్షత మొదగు క్షణా నిండుదనంతో బమైన సుగుణశీ వ్యక్తిత్వం, తనకితాను నిర్మించుకున్న భారతదేశ ‘#అమ్యూరత్నం’ డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌రామ్‌ గారు చిరస్మరణీయుడు.


Sunday, April 3, 2022

ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి వర్థంతి

🎠🙏భారత వీరత్వానికి ప్రతీక.. భారత జాతి సగర్వంగా చెప్పుకునే ధీరుడు.. గెరిల్లా యుద్ధాన్ని తొలిసారిగా ప్రపంచానికి పరిచయం చేశిన వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి వర్థంతి  సందర్భంగా🙏🎠




#మొఘల్ సామ్రాజ్యానికి పతనాన్ని శాసించి.. మరాఠా సామ్రాజ్యపు వెలుగుల్ని విస్తరింప చేసిన యోధుడు.. యువతరానికి ఎప్పటికీ పౌరషాగ్నిని రగిలించే దిక్సూచి.. చీకట్లో నుండి నిప్పుకణికలా దూసుకొచ్చాడు ఛత్రపతి శివాజీ మహారాజ్. మొఘలుల దాడి నుండి సమర్థవంతగా ఎదుర్కొన్నాడు. ఆ రాజులతో ఎంతో వీరోచితంగా పోరాడాడు.#గెరిల్లా యుద్ధాన్ని తొలిసారిగా ప్రపంచానికి పరిచయం చేశాడు.

#శివుని ఆశీస్సుల చిన్నారి..

శివాజీ క్రీ.శ. 1630 ఫిబ్రవరి 19వ సంవత్సరం వైశాఖమాసపు శుక్లపక్ష తదియనాడు పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర గల శివనేరి కోటలో షాహాజీ, జిజియాబాయి పుణ్యదంపతులకు జన్మించాడు. వీరు మహారాష్ట్రలోని వ్యవసాయ బొస్లే కులానికి చందినవారు. శివాజీ తల్లి జీజియ బాయ్ యాదవ్ క్షత్రియ వంశమునకు చెందిన ఆడ పడుచు. శివాజీ పుట్టడానికి ముందు పుట్టిన వారందరూ మృతి చెందగా ఆమె పూజించే దేవత అయిన శివై పార్వతికి పూజించగా శివాజీ పుట్టి క్షేమంగా ఆన్నాడు. దీంతో ఆయననకు ఆ పేరు పెట్టారు.

#తల్లి సంరక్షణ, దాదాజీ ఖాండ్‌దేవ్ శిక్షణతో శివాజీ వీరుడిగా అవతరించారు. భారతరామాయణాల విశిష్టత, హిందూ మతం గొప్పదనం తల్లిద్వారా నేర్చుకున్నాడు. పరమత సహనం, స్త్రీల పట్ల గౌరవం కూడా ఆమె ద్వారా పెంపొందించుకున్నాడు. తండ్రి పరాజయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అనతి కాలంలో యుద్ధ తంత్రంలో నిష్ణాతుడయ్యాడు. సకల విద్యా పారంగతుడైన శివాజీ, మరాఠా సామ్రాజ్య స్థాపనే లక్ష్యంగా వ్యూహారచన చేశాడు. 17వ ఏటనే తొలిసారిగా యుద్ధంలో పాల్గొన్న శివాజీ, బిజపూర్ సుల్తానులకు చెందిన తోర్నా కోటను ఆక్రమించుకున్నాడు. మరో మూడేళ్లలో కొండన, రాజ్‌ఘడ్ కోటలతో సహా పుణే ప్రాంతాన్నంతా తన అధీనంలోకి తెచ్చుకున్నాడు.

#నలుగురు గురువుల సాంగత్యంలో ...

మొదటి గురువు జిజియా బాయి. బాల్యంలో ఆమె చెప్పిన కథలు శివాజీని పరాక్రమ వంతుడిగా తీర్చిదిద్దాయి. రెండవ గురువు దాదాజీ కొండదేవ్. దగ్గర రాజకీయం, యుద్ద తంత్రం నేర్చుకున్నాడు. మూడవ గురువు తుకారామ్. వీరి దగ్గర సామాజిక సమరసత నేర్చుకున్నాడు శివాజీ. నాల్గవ గురువు సమర్థ రామదాసు. వీరి దగ్గర ఆధ్యాత్మికత, హైందవ పరిరక్షణనే జీవిత పరమార్థమనే విషయాన్ని నేర్చుకున్నాడు. ఈ విధంగా శివాజీ వ్యక్తిత్వం అన్ని రకాలుగా అత్యంత శ్రేష్ఠమైనదిగా తీర్చి దిద్ద బడింది.

#శివాజీ మెరుపుదాడులు..

 గెరిల్లా యుద్ధ రీతులు తెలుసుకొన్న అఫ్జల్‌ఖాన్ అతడిని ఓడించడానికి యుద్ధభూమి మాత్రమే ఏకైక మార్గమని భావించాడు. శివాజీని రెచ్చగొట్టడానికి ఆయన ఇష్ట దైవమైన భవానీ దేవి దేవాలయాలను కూల్చాడు. ఇది తెలిసిన శివాజీ తాను యుద్ధానికి సిద్దంగా లేనని చర్చలకు ఆహ్వానించాడు. ప్రతాప్‌ఘడ్ కోట దగ్గర సమావేశమవడానికి ఇద్దరూ అంగీకరించారు. అఫ్జల్‌ఖాన్ దుర్బుద్ధి తెలిసిన శివాజీ ఉక్కు కవచాన్ని ధరించి వెళ్లాడు. ఇద్దరూ తమ అంగరక్షకుల సమక్షంలో చర్చలు జరుపుతుండగా అఫ్జల్ ఖాన్ కత్తితో శివాజీపై దాడి చేశాడు. ఉక్కుకవచం వల్ల శివాజీ తప్పించుకున్నాడు. అడ్డువచ్చిన అఫ్జల్‌ఖాన్ అనుచరులను శివాజీ సైనికులు అడ్డుకున్నారు. దీంతో శివాజీ తన దగ్గరన్న పులి గోర్లతో అఫ్జల్‌ఖాన్ పొట్టను చీల్చి హతమార్చాడు.

#లౌకిక వాదం పాటించిన రాజు....

శివాజీ మహారాజు ముస్లింల దురాక్రమణను వ్యతరిేకించిన్పటికీ, తన రాజ్యంలో మాత్రం లౌకికవాదాన్ని పాటించారు. అన్ని మతాల వారినీ సమానంగా ఆదరించారు. ఇతర మతాల వారిని కూడా హిందువుల మాదిరిగానే గౌరవించేవాడు. అంతేకాదు హిందువుగా మారిన ఓ వ్యక్తికి తన కుమార్తెను ఇచ్చి మరీ వివాహం జరిపించాడట.

#అన్ని మతాలను గౌరవించిన రాజుల్లో శివాజీ ఒకరు. తన హయాంలోని సైన్యం, పరిపాలన, వివిధ శాఖల్లోని ఉద్యోగుల కూర్పు చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది.

#మతం ప్రతిపాదికన కాకుండా మానవీయ విధానాలతో శివాజీ పరిపాలన సాగించాడు. సైన్యం, అధికారుల నియామకాల్లో మతాన్ని ప్రతిపాదికగా తీసుకోలేదు. అతని సైన్యంలోని మూడో వంతు మంది ముస్లింలే.
శివాజీ నావికా దళ అధిపతి సిద్ధీ సంబాల్. అందులో ఎక్కువ మంది సైనికులు కూడా ముస్లింలే.

#శివాజీ స్నేహితుల్లో మహమ్మదీయులు..

ఛత్రపతి శివాజీ స్నేహితుల్లో చాలా మంది మహమ్మదీయులు ఉన్నారట. అంతేకాదు తన సైనిక వ్యవస్థలో ఎంతో మంది ముస్లింలకు సముచిత స్థానం కల్పించారట.

#పంచ కళ్యాణి గుర్రాలు...

యుద్ధాల్లో ఓటమి ఎరుగని ధీరుడు భరతమాత ముద్దు బిడ్డ ఛత్రపతి శివాజీ..   విశ్వాస్ ,కృష్ణుడు ఇలా ఏడు మేలిమిజాతి జాతి గుర్రాలను వాడేవారని.. అవి  పంచ కళ్యాణి జాతికి చెందిన గుర్రాలని చాలా మందికి తెలుసు.

#అంతుబట్టని యుద్ధతంత్రాలు...

శివాజీ మహారాజ్ యుద్ధ తంత్రాలు శత్రువులకు అంతుబట్టని విధంగా ఉండేవట. తిరుగులేని యుద్ధ వ్యూహాలను అనుసరించడమే శివాజీ అసమాన ప్రతిభకు నిదర్శనం. పటిష్టమైన సైన్యంతో పాటు నిఘా వ్యవస్థను కూడా కలిగి ఉండటమే కాకుండా, ఆధునిక యుద్ధ తంత్రాలను ఉపయోగించాడట.

#సైన్యం పట్ల శ్రద్ధ...

శివాజీ మహారాజ్ తన సైన్యం పట్ల అత్యంత శ్రద్ధ తీసుకునేవారట. దీంతో వారంతా వారి ప్రాణాలను పణంగా పెట్టి యుద్ధం చేసేందుకు సిద్ధపడేవారు. అయితే సైనికులకు ప్రమాదం ఏర్పడే సందర్భంలో ఆయన వారిని అనూహ్యంగా అక్కడి నుండి తప్పించేవారట.

#నావికా దళం..

పటిష్టమైన నావికా దళం మరాఠాలకు మరింత బలాన్ని చేకూర్చింది. దీనికి శివాజీ వేసిన బలమైన పునాదులే కారణం. విదేశీ దండయాత్రల నుండి కాపాడటానికి ఇది ఎంతగానో ఉపయోగపడింది. ఆ కాలంలో ఇలాంటి ఆలోచనలు ఏ రాజులకు రాకపోవడం గమనార్హం.

#కోటలు...

మరణించేనాటికి 300 కోటలు శివాజీ ఆధీనంలో ఉండేవి. కొండలపైన ఉన్నత సాంకేతిక విలువలతో దుర్భేధ్యమయిన కోటలను నిర్మింపచేయడంలో శివాజీ ప్రపంచ ఖ్యాతి పొందాడు. నాసిక్ నుండి మద్రాసు దగ్గర ఉన్న జింగీ వరకు 1200 కిలోమీటర్ల మధ్య ఈ 300 కోటలు నిర్మించబడ్డాయి.

27 ఏళ్ళపాటు యుద్ధాలలో గడిపి హిందూ రాజులకు ఆదర్శంగా నిలిచి సువిశాల మరాఠా #సామ్రాజ్యాన్ని నెలకొల్పిన ఛత్రపతి శివాజీ మూడు వారాలు తీవ్ర జ్వరంతో బాధపడి ఏప్రిల్ 3, 1680 న మధ్యాహ్నం  రాయఘడ్ కోటలో మరణించాడు.

#శివాజీ... భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన పేరు. ఈ పేరు భారతావని పులకించిపోతుంది.
ముంబయిలోని విమానాశ్రయానికే కాదు, రైల్వే స్టేషన్‌కు కూడా ఆయన పేరే ఉంటుంది.
అరేబియా సముద్రంలో శివాజీ అతిపెద్ద విగ్రహాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు కూడా రూపొందుతున్నాయి.


Thursday, March 31, 2022

*ఎ.పి ఓపెన్ స్కూల్ 10th, ఇంటర్ పరీక్షలు - మే 2022 సవరించిన టైం టేబుల్స్ విడుదల.*

*ఎ.పి ఓపెన్ స్కూల్ 10th, ఇంటర్ పరీక్షలు - మే 2022 సవరించిన టైం టేబుల్స్ విడుదల.*


Tuesday, March 29, 2022

తాళ్ళపాక అన్నమాచార్యుల వర్ధంతి*

*నేడు తాళ్ళపాక అన్నమాచార్యుల వర్ధంతి*



*సంకీర్తనాచార్య! అన్నమాచార్య విచ్చేయవే!*

తాళ్ళపాక అన్నమయ్య! తెలుగు పద భారతికి తన అపూర్వమైన భావనా పటిమతో, నవ్య నవనీతమైన సుమధుర గీతికలతో వెలుగు హారతులద్ది, భాషా ప్రవర్ధమానానికి ఎనలేని కృషి సల్పిన వాగ్గేయ ధురీణుడు. తెలుగు పద కవితకు సొబగులద్ది, ఆ సొగసులకు అద్భుత పదసిరులనే విరుల పరిమళాన్ని అద్దిన పద కవితా పితామహుడు. తన సంకీర్తనా ప్రక్రియతో తేటతెలుగుపాటకు ప్రాణప్రతిష్ఠ చేసి, ఆ మధురిమలకు అద్బుత పదసిరులను విరుల పరిమళాన్ని గుబాళించిన పదకవితా పితామహుడు. వాడుక భాషలో గేయరచన చేసి సామాన్యజనులకు పాట పాడుకునే అవకాశాన్ని కలిగించిన స్తవనీయుడు! భాష యొక్క పరమార్థాన్నీ, నిజమైన ప్రయోజనాన్నీ గ్రహించి తాను రాసిన వాటిలో అత్యధిక సంకీర్తనలను సామాన్యులు, పల్లెపట్టుల్లో నివసించే గ్రామీణులు పాడుకునే జానపద బాణిలో సృజించి సరికొత్త వాజ్ఞయాన్ని సృష్టించిన మహనీయుడు.

అందరిలోనూ శ్రీనివాసుడే...
తాను దర్శించిన సకల దేవతా స్వరూపాలలోనూ శ్రీవేంకటేశ్వరుని దర్శించిన భక్తశిరోమణి అన్నమయ్య. పల్లవి, చరణాలతో కూడిన గేయ రచనకు ఆద్యుడై, శ్రీనివాసుని పదారవింద అనుభూతినీ, ఆ హరిపద మకరంద ఆసక్తినీ తన సంకీర్తనలలో సరళమైన భాషలో వెలయించిన ఘనుడు అన్నమయ్య. సకల వేదాల సారాన్నీ తన సంకీర్తనలుగా చేసి వేదాలలోని ఉత్తమ గుణాలను అమృత గుళికలుగా చేసి మనకు అందించాడు సంకీర్తనాచార్యుడు. అన్నమయ్య సంకీర్తనలు వెంకట పద ముద్రాంకితాలు.

రాముడైనా, కృష్ణుడైనా, నారసింహుడైనా, అన్నమయ్య పదాలలో వేంకటేశ్వరునిగా ఒదిగి వేంకట పద ముద్రాంకితులు కావలసిందే. వేంకటాచలవల్లభునిగా, భక్తజన సన్నిభునిగా వెలుగొందవలసిందే. బాలకృష్ణుడైనా, తిరుమలగిరిపై వేంకటాద్రి ఇంద్రనీలమణిలా ప్రకాశించవలసిందే. ఘోర విదారణ నృసింహుడైనా వేంకటగిరిపై వెలుగుతూ అందపు నవ్వులు చల్లవలసిందే. తాను రాసిన ప్రతి సంకీర్తన హరి వైభవాన్నీ, ఆ తిరువేంకట విభుని ప్రాభవాన్నీ చాటిన వాణీ వీణా నాదాలుగా నినదించేలా చేసి, అద్భుత భావ సౌందర్యం ప్రతిఫలించే గీతికలుగా తీర్చిదిద్దిన అక్షర శిల్పి అన్నమయ్య.

అంతేగాక హరి తనకే సొంతమనే భావనకు ప్రతిబింబంగా 'నేనొక్కడ లేకుండితే నీ కృపకు పాత్రమేది' అంటూ ఒకింత ఆడంబరం ఒలకబోస్తాడు. అయితే, అన్నమయ్యకు ఉన్నది ఆడంబరం కానే కాదని, అణువణువునా నిండిన శ్రీనివాస పదానుభూతి అని, తన్మయత్వంతో కూడిన అలౌకిక భావన మాత్రమేనని అవగతమవుతుంది. భక్తిస్ఫోరకమైన 'అణురేణు పరిపూర్ణమైన రూపము, అణిమాది సిరి అంజనాద్రి మీది రూపము' అంటూ ఆర్తితో కీర్తించిన సంకీర్తనలలో భక్తి గంగ ఉప్పొంగుతుంది.

అలతి పదాలతో అనంతమైన భావాన్ని వెలయించటం అన్నమయ్య సంకీర్తనల ప్రత్యేకత. భగవంతుని కీర్తించటంలో భక్తికి ప్రాధాన్యతనిస్తూ ధన్యత చెందిన భక్త కవులు మన విశాల సంస్కృతిలో కోకొల్లలుగా కనబడతారు. అన్నమయ్య సంకీర్తనల్లోని వైవిధ్యం భారతీయ వాగ్గేయకార రచనల్లోనే అగ్రగణ్యంగా విరాజిల్లుతోందంటే ఏమాత్రం అతిశయోక్తి లేదు.

అన్నమయ్య సంకీర్తనల్లో దేవభాషగా పిలువబడే సంస్కృత సంకీర్తనలు ఎన్నో ఉన్నాయి. మర్యాద పురుషోత్తముడై సకల సుగుణాలకు నెలవైన శ్రీరాముని 'దేవదేవం భజే దివ్యప్రభావం రావణాసుర వైరి రఘు పుంగవం రామం' అంటూ కీర్తిస్తాడు. హిరణ్యకశిపుని భంజించిన నారసింహుని "జయజయ నృసింహ సర్వేశ! భయహర వీర ప్రహ్లాద వరద'' అంటూ ప్రణతులర్పిస్తాడు.

తన్మయ హృదయంతో 'కేవల కృష్ణావతార కేశవా! దేవదేవ లోకనాధ దివ్యదేహ కేశవ' అంటూ గోపాలకృష్ణుని సన్నుతి చేస్తాడు. ఇక అన్నమయ్య ఘనవిశేషణాలతో ఆగణిత భవహరుడైన శ్రీహరిని కీర్తించాడు. "ఆగమ పుంజ పదార్థుని ఆపత్సఖ సంభూతుని నాగేంద్రాయత తల్పుని నానాకల్పుని కోరుదు నామది ననిశము'' అంటూ సాగుతుంది ఘనపద విభూషితమైన ఆయన పదం.

సంకీర్తనా మాణిక్యాలు
జానపదులకు ప్రాణప్రదుడై అద్భుత సంకీర్తనా మాణిక్యాలను సృజించిన ఘనత అన్నమయ్యకే చెందుతుంది. పల్లెపట్టుల్లో జనం పాడుకునే సువ్విపాటలు, గొబ్బిపాటలు, కోలాటం పాటలు అన్నమయ్య హృదయసాగరం నుంచి ఉత్తుంగ తరంగాల్లా ఎగసిపడ్డాయంటే అతిశయోక్తి లేదు. శ్రమజీవులు అలసట తొలగటం కోసం ఆలపించే దంపుళ్ళ పాటలు అన్నమయ్య రాసిన విధం పులకింపచేస్తుంది. కన్నెపిల్లలు వెన్నదొంగపై ముద్దుగా ఆలపించే 'కొలనిదోపరికి గొబ్బిళ్ళో యదుకుల స్వామికిని గొబ్బిళ్ళో' వంటి సంకీర్తనలకు ప్రాణం పోసింది అన్నమయ్యే.

ఇక అన్నమయ్య తత్వామృతాలు జగత్ప్రసిద్ధాలు. "తెలియ చీకటికి దీపమెత్తక పెద్ద వెలుగు లోపలికి వెలుగేలా..', 'ఎంత విభవము కలిగే నంతయును ఆపదని చింతించినది కదా చెడని జీవితము' వంటి అన్నమయ్య తత్వాలు మనకు జ్ఞానబోధ చేసి మనలోని అజ్ఞానపు చీకట్లను పారద్రోలతాయి.అన్నమయ్య సంకీర్తనలు సాహిత్య ప్రధానమైనవని కొందరూ, సంగీతం పాలు తక్కువని వాదించేవారు కొందరూ ఉన్నారు. ఈ అల్పమైన విషయాలను పక్కనపెడితే అనల్పమైన అన్నమయ్య సాహిత్య సేవ, భక్త పారవశ్యం తెలుగుజాతికి ఎన్నటికీ శిరోధార్యమే.

ఫాల్గుణ బహుళ ద్వాదశి నాడు  అన్నమయ్య వర్ధంతి. తన తండ్రికి తీర్థవిధిని నిర్వర్తిస్తూ అన్నమయ్య పుత్రుడు, వాగ్గేయకారుడు అయిన తాళ్ళపాక పెద తిరుమలాచార్యులు ఆర్తితో లిఖించిన "దినము ద్వాదశి నాడు..తీర్థ దివసము నేడు.. జనకుండ..! అన్నమాచార్యుండ..! విచ్చేయవే..'' అనే సంకీర్తనను స్మరిస్తూ తెలుగు నేలపై ఆ భాగవతుని తిరిగి అవతరించమని అర్థిస్తూ, అన్నమయ్యకు భక్తిభావాంజలితో ప్రాంజలి ఘటిద్దాం.



10 వ తరగతి ప్రీఫైనల్‌ పరీక్షలు time table





ప్రీఫైనల్‌ పరీక్షలు 4 నుంచి*

*🔶️పదో తరగతి ప్రీఫైనల్‌ పరీక్షలను ఏప్రిల్‌ 4 నుంచి 12వరకు నిర్వహించనున్నారు. పబ్లిక్‌ పరీక్షలు ఏప్రిల్‌ 27 నుంచి నిర్వహించనున్నందున నాలుగో తేదీ నుంచి ప్రీఫైనల్‌ పరీక్షల నిర్వహణకు టైంబుల్‌ విడుదల చేశారు. ఉదయం 9.15గంటల మధ్యాహ్నం 12.30గంటల వరకు నిర్వహించనున్నారు.*

🔷️🔶️🔷️🔶️🔷️


Sunday, March 27, 2022

అమ్మఒడి జూన్ లో అని ప్రభుత్వం ప్రకటన విడుదల




అమ్మఒడి జూన్ లో అని ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది కావున ఈ రోజు నుండి మన పాఠశాల లో చదివే పిల్లల వివరాలు child info డేటా(CHILD ADHAAR,MOTHER NAME,MOTHER ADHAAR, MOTHER/GUARDIAN BANK ACCOUNT,IFSC CODE,FATHER NAME AND FATHER ADHAAR) అప్డేట్(ఒకసారి సరిచూసుకోండి) చేసుకోండి. తరువాత అప్డేట్ చేయమని ఉత్తర్వులు వస్తే  అందరూ ఒకేసారి చేస్తే server సరిగా పనిచేయడానికి ఇబ్బంది అవుతుంది. కావున ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి login అయ్యి పిల్లల వివరాలు ఎడిట్ చేయవచ్చు.



Monday, March 21, 2022

ప్రపంచ కవితా దినోత్సవం (మార్చి 21) సందర్భంగా🖋️🌷

🌹✒️ప్రపంచ కవితా దినోత్సవం (మార్చి 21) సందర్భంగా🖋️🌷


【మనసులో మెదిలే భావాలను కళాత్మక రూపంలో వర్ణించేదే కవిత】

 తమ కవితా తేజస్సుతో ప్రకాశించి 
       ప్రపంచాన్ని  ప్రకాశింపజేస్తున్న  కవులకు.....
    🏵️ప్రపంచ కవితా దినోత్సవ శుభాకాంక్షలు🏵️
   

✍️కవిత్వము లేని భాష లేదు. కవిత్వము పుట్టని ప్రాంతం లేదు . కాబట్టి ప్రపంచములోని నలుమూలలా ఉన్న కవితా వైవిధ్యాన్ని అర్ధము చేసుకుని , కవితా మాధుర్యాన్ని చవిచూసే లక్ష్యము తో కవితా దినోత్సవం యేర్పాటు చేసారు.

"✍️రవి కాంచనిచో కవి గాంచునే " అన్నది లోకోక్తి . . అంటే సూర్యుడి కన్నా కవే గొప్ప అని . సూర్యుడు ప్రత్యక్షదైవము , ఆయన కిరణాలు అన్నివైపులకు వ్యాపిస్తాయి . అయినా ఆ శక్తి వంతమైన కిరణాలు ప్రసరించలేని ప్రదేశాలు వుంటాయి. వాటి గురించి రవి కి తెలీదు . అటువంటి ప్రదేశాల గురించి కూడా కవి వర్ణించగలడు . అతడి ఊహాశక్తి పరిధి అంత విసృతమైనది . అందుకే కవులన్నా , కవిత్వమన్నా ప్రపంచవ్యాప్తం గా ఎంతో గౌరము ఉన్నది . ఆ గౌరవాన్ని తెలియజేసేందుకు ప్రపంచమంతటా ప్రతిసంవత్సరము మార్చి 21 వ తేదీన " కవితా దినోత్సవం " జరుపుకుంటునారు .

✍️కవిత్వము ఎంతో పురాతనమైనది . కవులను గౌరవించే సాంప్రదాయము మన దేశములోనూ ఉంది . ప్రతి రాజూ ఒక ఆస్థానకవిని నియమించుకుని గౌరవించేవాడు.ఇక శ్రీకృష్ణదేవరాయలు కాలములో ఏకంగా అష్టదిగ్గజాలే ఉన్నారు . అనేకమంది భారతీయ రాజులు కవి పోషణ లక్షణము గా తీసునేవారు.

✍️మార్చి 21న....

అటువంటి విశిష్ట సాంప్రదాయం మనకు అనాధిగా ఉన్నా ఐరోపాలో మాత్రము 18 వ శతాబ్ధము వరకు లేదు . ఆ శతాబ్దములో రోమన్‌ కవి ' విర్రీన ' పేరున అక్టోబర్ లో కవితా దినోత్సవాన్ని తొనిసారిగా జరిపారు . నాడు ఆ ఉత్సవం అక్టోబర్ నెలలో జరిగింది . అప్పటినుండి ఐరోపా వారిని అనుకరిస్తూ ఇతర ప్రదేశాలలో కూడా కవితా దినోత్సవం జరపడం మొదలైనది . ఐక్యరాజ్యసమితి విభాగమైన యునెస్కో తన 30 వ సమావేశాన్ని 1999 లో పారిస్ లో జరిపింది . ఆ సందర్భములో మార్చి 21 తేదీని ' ప్రపంచ కవితా దినోత్సవం ' గా జరపాలనే తీర్మానము చేసారు . ఆ నాటి నుండి ప్రతి ఏటా ప్రపంచ కవితా దినోత్సవాన్ని జరపుతున్నారు.

✍️ప్రతి సంస్కృతిలోనూ...

చరిత్ర అంతటా, కవిత్వం ప్రపంచంలోని ప్రతి సంస్కృతిలోనూ ఉంది. సరళమైన మరియు సంక్లిష్టమైన రెండు రూపాల్లో, క్రియాశీలత మరియు మార్పును తీసుకురావడానికి లేదా ప్రేమ మరియు నష్టాన్ని వ్యక్తీకరించడానికి లేదా కథలు మరియు కథలను వివరించడానికి కవిత్వం అత్యంత శక్తివంతమైన సాధనాల్లో ఒకటిగా ఉపయోగించబడింది. కవిత్వం ప్రజలు ప్రపంచాన్ని చూసే విధానాన్ని మార్చగలదు, ఇతరులకు స్ఫూర్తినిస్తుంది మరియు ప్రజల మధ్య బంధాలను పునరుద్ధరించగలదు.

✍️ప్రపంచ భాషావైవిధ్యాన్ని కవిత్వము మాత్రమే వెలుగు లోకి తీసుకురాగలదు అని యునెస్కో భావించింది . భావవ్య్క్తీకరణకు కవిత్వమే తగిన సాధనము . అందువల్ల కవ్త్వానికి ప్రోత్సాహము ఇస్తే భాషలు బతికివుంటాయని యునెక్సో తన విశ్వాసాన్ని ప్రకటించింది.అన్ని ప్రాంతాలలో అన్ని భాషలవారూ కవిత్వాన్ని రాయడం , చదవడం మొదలు పెడితే భాషకు విసృత ప్రచారము లభిస్తుంది.

✍️కవిత్వము మీద శ్రద్ధ , ఆసక్తి పెంపొందింప జేసేందుకు....

కవిత్వము మీద శ్రద్ధ , ఆసక్తి పెంపొందింపజేసేందుకే ఐక్యరాజ్యసమితి పాఠశాల స్థాయినుండి విశ్వవిస్యాలయ స్థాయివరకు భాషాపాఠ్యాంశాలలో కవిత్వభాగాలను పెంచమని సూచించింది . పిల్లలలో ఆసక్తి పెంచేందు కు అన్ని స్థాయిలలో కవితా క్లబ్ లను ఏర్పాటు చేయమంటున్నది . భావయుక్తం గా కవిత చదివే పిల్లలను ప్రోత్సహించి తీర్చిదిద్దమని సూచనలు ఇస్తుంది.

*✍️భాషా భిన్నత్వాల్ని, కవితా ప్రచారం ద్వారా ఏకం చేసేందుకు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అంతరించిపోతున్న భాషలను తిరిగి కాపాడటం కూడా ఈ దినోత్సవ ఏర్పాటు యొక్క  ఉద్దేశ్యం.*

✍️ ప్రపంచ కవితా దినోత్సవ ముఖ్య ఉద్దేశ్యాలు:

• కవితా ప్రచారం ద్వారా భాషా భిన్నత్వానికి చేయూతనివ్వడం.
• అంతరించిపోతున్న భాషలకు తోడ్పాటు అందించి, తిరిగి కాపాడటం
• అశువుగా కవిత్వాన్ని చెప్పే కళా సంస్కృతిని ప్రోత్సహించి ప్రతిస్థాపన చేయడం
• రంగస్థలం, నృత్యం సంగీతం మరియు చిత్రకళలతో కవిత్వానికి గల సంవాదాన్ని పెంచడం మరియు
• చిన్న ప్రచురణకర్తలకు చేయూతనిచ్చి, ప్రసారమాధ్యమాల్లో కవిత్వానికి అత్యున్నత స్థాయిని కల్పించడం.

✍️అందమైన పదాల పలకరింపులు
తీరైన భావాల కలబోతలు
వెన్నెల వెలుగులు వేకువ కాంతులు
హృదయ నివేదనలను
అక్షరాల విరిమాలలుగా చేసి
అలరిస్తూ స్తూర్తినింపుతున్న
కవులందరికీ పేరు పేరునా
కవితాదినోత్సవ శుభాకాంక్షలు...




Sunday, March 20, 2022

సైన్సు పితామహుడు, భౌతిక, గణిత, ఖగోళ శాస్త్రవేత్త, తత్వవేత్త సర్ ఐజాక్ న్యూటన్ వర్థంతి.

💐💐సైన్సు పితామహుడు, భౌతిక, గణిత, ఖగోళ శాస్త్రవేత్త, తత్వవేత్త  సర్ ఐజాక్ న్యూటన్ వర్థంతి  సందర్భం




【వర్క్  ఫ్రమ్ హోం..గురుత్వాకర్షణ సిద్ధాంతానికి ఇదే మూలం!】

✍️విజ్ఞాన శాస్త్ర రంగం మీదకు ఐన్ స్టయిన్ వచ్చేదాకా మూడు దశాబ్దాల పాటు శాస్త్ర సామ్రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలినవాడు ఐసాక్ న్యూటన్. ఇప్పటికీ ఆయన చలన సూత్రాలు కొన్ని పరిమితులకు లోబడి సజావుగా పనిచేస్తోనే ఉన్నాయి.మూడు వందల ఏళ్ళపాటు భౌతిక శాస్త్రంలోనూ గణిత శాస్త్రంలోనూ అంతటి ప్రతిభాశాలి, అంతటి ప్రభావశీలి మరొకరు లేరు. ఆయన కాలంలో ఆయననూ ఆయనలాంటివారినీ ప్రకృతి తాత్వికులుగా పిలిచేవారు.

నేడు విద్యార్ధులు నేర్చుకుంటున్న పలు మాధమేటిక్ , ఫిజిక్స్ విభాగాలకు #ఆద్యుడు న్యూటన్. ఆప్లిక్స్ కాలుక్యులస్ ఆయన సృష్టించినవే ఖగోళ లెక్కలు ఆయన కట్టినవే. ఆకాలంలో సాటి పరిశోధకులతో ఫలితాల విషయంలో పోటీపడడటమే కాదు, పోరాటాలు చేశాడు న్యూటన్. న్యూటన్ పేరు తెలియకుండా పాటశాల విద్య ముగియదు. సూర్యకాంతిలో ఏడు రంగులున్నాయన్న న్యూటన్ సూత్రం ఆకాశంలో ఇంద్రధనుస్సు చూసినపుడల్లా గుర్తుకు వచ్చి తీరుతుంది. న్యూటన్ ఒక అపూర్వ మేధావి. మాధమేటిక్స్ ఫిజిక్స్, ఖగోళ శాస్త్రం, మత శాస్త్రాలన్నింటిని అధ్యయనం చేసిన వాడు. 17వ శతాబ్దపు విజ్ఞాన విప్లవంలో కీలక పాత్ర పోషించారు సర్ ఐజాక్ న్యూటన్.

✍️మానవ ప్రపంచానికి విశ్వ రహస్యాలను విడమర్చి చెప్పిన "సర్ ఐజాక్ న్యూటన్" ఒక ఆంగ్ల భౌతిక, గణిత, ఖగోళ శాస్త్రవేత్త. ఈయన ఓ సిద్ధాంత కర్త మరియు తత్వవేత్త కూడా. 

✍️ప్రకృతిసిద్ధమైన తత్వశాస్త్రం సైన్సుగా ఎలా పరిణామం చెందిందన్న అంశంపై చేసిన ఎనలేని కృషికిగానూ ఆధునిక ప్రపంచం అంతా ఆయనను "సైన్సు పితామహుడు"గా కీర్తించింది. 

✍️బాల్యం:

జనవరి 4, 1643వ సంవత్సరంలో నెలలు నిండకుండానే జన్మించాడు ఓ చిన్నారి. ఆ చిన్నారే పెరిగి పెద్దయి ప్రపంచంలోనే మేటి శాస్త్రవేత్తల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. ఆ ముద్దులొలికే చిన్నారే సర్ ఐజాక్ న్యూటన్. ఈ రోజు అంతరిక్షంలోకి రాకెట్లలో రివ్వున దూసుకెళ్తున్నామంటే, అందుకే న్యూటన్ ప్రతిపాదించిన సిద్ధాంతాలే కారణం.
విశ్వ రహస్యాలను మానవాళికి విశ్లేషించి చెప్పిన న్యూటన్ ఇంగ్లండ్‌కు దగ్గర్లోగల ఉల్‌తోప్ అనే గ్రామంలో ఒక సామాన్య రైతు కుటుంబంలం జన్మించాడు. తను పుట్టడానికి మూడు నెలల ముందుగానే తండ్రి చనిపోగా, తనకు మూడేళ్ల వయసులో తల్లి వేరే పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. దీంతో న్యూటన్ చిన్నప్పటి నుంచి అమ్మమ్మ వద్దనే పెరిగి పెద్దయ్యాడు.

✍️న్యూటన్ చిన్నప్పుడు స్కూల్లో చదువుకంటే ఇతర సైన్సు పుస్తకాలు చదవటం, పెద్ద వస్తువుల్ని చూసి వాటినే చిన్న సైజులో తయారు చేయటం లాంటి పనులు చేస్తుండేవాడు. అలా చిన్న చిన్న మిషన్లు, నీటి గడియారం, ఎండలో పనిచేసే గడియారంలాంటివి కూడా ఆయన తయారు చేశాడు. ఆయన చేతిలో రూపుదిద్దుకున్న ఈ వస్తువులన్నీ ఇప్పటికీ లండన్ రాయల్ సొసైటీ మ్యూజియంలో ఉన్నాయి.

✍️ఉన్నత విద్య-గురుత్వాకర్షణ సిద్ధాంతం:

1661 లో ఉన్నత విద్య కోసం కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయంలో చేరిన న్యూటన్.. గణిత, భౌతిక, ఖగోళ శాస్త్ర పరిశోధనలపై మక్కువ పెంచుకున్నాడు. ఆ తరువాత అక్కడే ప్రొఫెసర్‌గా నియమితుడైన న్యూటన్‌, 1667లో పరావర్తన దూరదర్శినిని నిర్మించి సంచలనం సృష్టించాడు. చిన్నతనంలో చెట్టు నుంచి రాలిన యాపిల్‌ను గమనించిన న్యూటన్‌ అందుకు కారణాన్ని అన్వేషించే క్రమంలో గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.

భూమి, చంద్రుడు, గ్రహాలు, సూర్యుడు సహా విశ్వంలోని వస్తువులపై #గురుత్వ శక్తి ఎలా పని చేస్తుందో వివరిస్తూ విశ్వ గురుత్వ నియమాన్ని ప్రతిపాదిస్తూ, ఉన్నత విద్య నిర్వచించాడు. భౌతిక శాస్త్ర భావనలను వివరిస్తూ "ప్రిన్సిపియా మేథమేటికా" అనే గ్రంథాన్ని రచించాడు. కాంతిపై న్యూటన్‌ చేసిన పరిశోధనల ఫలితంగా "దృశాశాస్త్రం" పుట్టింది.

✍️మూడు గమన నియమాలు:

✍️ఐజాక్ న్యూటన్ వంటి మనిషిని మీరే కాదు, మరెవరూ చూచి ఎరుగరు. అతను చాలా చికాకు మనిషి. మనుషులంటే నచ్చని వాడు. ఎప్పుడు ఎలాగ ఉంటాడో తెలియదు. అందరూ తనకు శత్రువులు అనుకుంటాడు. ఎంతో రహస్యంగా ఉంటాడు. చివరికి అన్నం తినడం కూడా మరిచిపోతాడు. 
అతనిలో ఎవరికీ నచ్చని గుణాలు ఎన్నో ఉండేవి. కానీ అతను చాలా తెలివిగలవాడు. చాలా చాలా తెలివిగలవాడు. ఆ తెలివి కారణంగానే ప్రపంచం ఒక కొత్తబాటలో నడిచింది. అతను లెక్కలు చెప్పాడు. చిన్న, పెద్ద వస్తువుల మధ్యన ఉందే ఆకర్షణ గురించి చెప్పాడు. వస్తువుల కదలిక గురించి కూడా చెప్పాడు. ఐజక్ న్యూటన్ అన్న మనిషి ఆ కాలంలో ఆ సంగతులను ప్రపంచానికి వివరించకుంటే, సైన్స్ ఇవాళ ఇలా ఉండేది కాదు. ప్రపంచంలోని చాలా విషయాలు ఇవాళ ఇలా ఉండేవి కావు.

✍️మొదటి సూత్రము:

"బాహ్యబల ప్రయోగము లేనంత వరకు చలన స్థితిలో ఉన్న వస్తువు చలన స్థితిలోను, నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు నిశ్చల స్థితిలోనూ ఉంటుంది". ఈ వస్తు ధర్మాన్ని జడత్వము అంటారు.

✍️రెండవ సూత్రము: 

"ఒక వస్తువు ద్రవ్యవేగంలోని మార్పు ఆ వస్తువు పై ప్రయోగించిన బలానికి అనుపాతముగా ఉంటుంది. మరియు ఆ బలం ప్రయోగించిన దిశలో ఉంటుంది
ప్రచోదనం 
ఒక ప్రచోదనం j, ఒక బలం f, ఒక సమయం Δt లో ఒక వస్తువుపై పనిచేస్తే కలుగుతుంది

✍️న్యూటన్ మూడవ నియమం:

ఇది అసలైనది
న్యూటన్ సూత్రాన్ని దృష్టాంతం చేయడానికి ఇద్దరు స్కేటర్లు వ్యతిరేఖ దశలో ఒకరిని ఒకరు గెంటుకొనుచున్నారు.ఎడమవైపు మొదటి స్కేటర్ 12 కుడి వైపు దిక్కునకు, మరియు రెండవ స్కేటర్ N21 ఎడమ వైపు దిక్కునకు బలాన్ని ప్రయోగిస్తున్నారు.ఇద్దరి బలాలు సమానం కానీ న్యూటన్స్ మూడవ సూత్రం ప్రకారం వ్యతిరేఖ దశలో ప్రయోగించబడ్డాయి.
అన్ని శక్తులు రెండుగా ఉంటాయి.ఉదాహరణకు A, B అనే రెండు వస్తువులు ఉంటే A మీద B F (A) అనే శక్తిని ఉపయోగిస్తే, B మీద A F (B) ఏ‌ఎన్‌ఈ శక్తిని వ్యతిరేఖంగా కలిగిస్తుంది.
చర్యకు ప్రతి చర్య సమనంగా ఉండి వ్యతిరేక దిశలో పనిచేయును.
F (A) =-F (B)
(-గుర్తు వ్యతిరేకతను సూచిస్తుంది)
ఉదాహరణ: రాకెట్

✍️ఆయనకు 1672లో రాయల్‌ సొసైటీ ఫెలోషిప్‌ లభించింది. అప్పటి వరకూ ప్రకృతి శాస్త్రంలో ఒక భాగంగా ఉన్న భౌతిక శాస్త్రాన్ని న్యూటన్‌ ఆవిష్కరణలు, సిద్ధాంతాల వల్ల ప్రత్యేక శాస్త్రంగా గుర్తించారు. అందుకే న్యూటన్‌ను భౌతిక శాస్త్ర పితామహుడు అంటారు. 1705లో బ్రిటిష్‌ ప్రభుత్వం "సర్‌" అని బిరుదునిచ్చి సత్కరించింది. ఇక అప్పటినుంచి ఐజాక్ న్యూటన్ కాస్తా సర్ ఐజాక్ న్యూటన్‌గా మారిపోయారు.

 ఆ తరువాత కూడా ఎన్నో #మైలురాళ్లను అధిగమించిన న్యూటన్ తన 85 సంవత్సరాల వయస్సులో మార్చి 20, 1727లో తనకెంతో ఇష్టమైన విశ్వంలోకి ఆనందంగా పరుగులు పెడుతూ వెళ్లిపోయారు

 ✍️వర్క్  ఫ్రమ్ హోం..గురుత్వాకర్షణ సిద్ధాంతానికి ఇదే మూలం!!!

వాషింగ్టన్ పోస్ట్ అనే అంతర్జాతీయ పత్రిక ఇటీవల ప్రచురించిన కథనం
ఆ కథనం ప్రకారం.. గురుత్వాకర్షణ శక్తిని ప్రతిపాదించిన ఐజాక్ న్యూటన్ ఇరవయ్యో పడిలో ఉన్నప్పుడు లండన్‌ను గ్రేట్ ప్లేగ్ అనే వ్యాధి కుదిపేసిందట. అప్పుడు న్యూటన్ ట్రినిటీ కాలేజీలో చదువుకుంటున్నారు. కాగా.. వ్యాధి వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఇంగ్లండ్‌లో ప్రస్తుతం మనం చూస్తున్న జాగ్రత్తలే అమలు చేయాల్సి వచ్చింది. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. కాలేజీలు సెలవులు ప్రకటించాయి. న్యూటన్ చదువుకుంటున్న ట్రినిటీ కాలేజీ కూడా విద్యార్థులను ఇంటికి పంపించింది. అలా ఇంటికే పరిమితమైన న్యూటన్.. క్యాలిక్యులస్ వంటి కొత్త గణిత విధానాలకు రూపకల్పన చేశారట. అంతే కాదు... గురుత్వాకర్షణ సిద్ధాంతానికి కూడా అప్పుడే బీజం పడిందట. సో అదండీ.. వర్క్ ఫ్రమ్ హోంకు ఆసక్తికర నేపథ్యం.