Thursday, May 12, 2022

ఫ్లోరెన్స్ నైటింగేల్’ గారి జయంతి.

💊🌷లేడి విత్ ద ల్యాంప్‌”గా పిలువబడే ‘ఫ్లోరెన్స్ నైటింగేల్’ గారి జయంతి సందర్భంగా🌷💊

   #అంతర్జాతీయ నర్సుల దినోత్సవం.#







【 #ఫ్లోరెన్స్‌ నైటింగిల్‌ నర్సు వృత్తికి స్పూర్తిదాయకంగా నిలిచినందుకు ప్రపంచ వ్యాప్తంగా మే 12న ఆమె జయంతిని అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు.#】

#నర్సులు నిజంగానే సేవాముర్తులు.. చికిత్స చేయండి అని చేరిన నాటి నుంచి కోలుకొని తిరిగి వెళ్ళేవరకు వెన్నంటే ఉండి సేవలు చేస్తారు. అనుక్షణం నర్స్.. సిస్టర్ అంటూ పిలిచినా విసుగు చెందకుండ వస్తారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం సమయంలో కరోనాను కట్టడి చేసేందుకు అటు డాక్టర్స్‏తోపాటు నర్సులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివి. తమ ప్రాణాలను సైతం లేక్కచేయకుండా.. కరోనా రోగులకు దగ్గరుండి మరీ సేవలు అందించారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ.. రోగులే తమ పిల్లలుగా భావిస్తూ అహోరాత్రులు శ్రమిస్తున్న చల్లని దేవతలు. కరోనా బాధితులకు ఫ్లూయిడ్స్‌ అందించడం,ఆక్సిజన్‌ పెట్టడం వంటి అనేక సపర్యలు చేస్తున్నారు. కరోనా పోరులో సేవలు చేస్తూ.. వారిలో కొందరు ఈ మహమ్మారికి బలయ్యారు. అయిన ఏమాత్రం అధైర్య పడకుండా.. కోవిడ్ బాధితులకు బాసటగా నిలుస్తున్నారు. అటు డాక్టర్లకు, ఇటు రోగులకు అనునిత్యం అందుబాటులో ఉంటూ స్వీయ రక్షణతోపాటు… బాధితులను కూడా రక్షించేందుకు పాటుపడుతున్నారు. 

#బాల్యం ఇంతటి సేవ చేస్తూ.. ఉద్యోగంలో ఎదురయ్యే ఒత్తిళ్లను ఎదుర్కోంటూ.. వ్యక్తిగత జీవితానికి, కుటుంబానికి దూరంగా ఉంటూ ఈ కష్ట కాలంలో సేవలు అందిస్తున్న ప్రతి ఒక్క నర్సుకు మనస్పూర్తిగా ధన్యవాదలు తెలుపుతుంది ఈ సమాజం.

 నేడు మే 12 అంతర్జాతీయ నర్సుల దినోత్సవం రోగులకు వైద్యులు ఇచ్చే ఔషధం ఎంత ముఖ్యమో నర్సులు చేసే సేవలు కూడా అంతే ముఖ్యం. చిరునవ్వుతో పలకరిస్తూ, సేవలు చేసే నర్సులను చూడగానే రోగి రోగం సగం నయమౌతుంది. 

#ధనవంతుల కుటుంబంలో జన్మించి, వివాహం చేసుకోకుండా తన జీవితాన్ని సేవకే అంకితం చేసిన మహనీయురాలు “లేడి విత్ ద ల్యాంప్‌”గా పిలువబడే ‘ఫ్లోరెన్స్ నైటింగేల్’ 1820 మే 12న ఇటలీలో జన్మించిన ఫ్లోరెన్స్ నైటింగేల్ బాల్యం నుండి భిన్నంగా ఆలోచించి తోటి వారికి సాయపడటంలో ఎక్కువ ఆనందం పొందేది. ఆ ఆనందమే ఆమెను నర్స్ ట్రైనింగ్‌కి పంపింది. తమ వంటి ఉన్నత కుటుంబంలోని అమ్మాయి హాయిగా వెళ్లి చేసుకుని ఆనందంగా జీవితం గడపాలని ఈ రోగుల సేవ ఏమిటని తల్లి కోపగించినా ఫ్లోరెన్స్ తన మనసు మార్చుకోలేదు. 

#కుటుంబ కట్టుబాట్లను ధిక్కరించి నర్స్‌గా సేవలు అందించటానికే జీవితం అంకితం చేసింది. తన తోటి నర్సులలో కలిసి బ్రిటిష్ సైనికులకు ఐరోపాఖండ యుద్ధంలో సహాయం అందించింది. ఏ సమయంలోనైనా ఆమె సేవకు సిద్ధంగా ఉండేది. దీపం చేతిలో పట్టుకుని గాయపడిన సైనికుల కోసం వెతికే ఫ్లోరెన్స్‌ను చూస్తే వారికి ప్రాణం లేచొచ్చేది. ఆమె చేయి పడితే తమ గాయాలు మానినట్లే అనుకునేవారు. ఆమె అసలు పేరు మరచి ‘లేడీ విత్ ద ల్యాంప్’ గా   పిలవటం మొదలు పెట్టారు.

 #ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉంటే రోగాలు దరిచేరవు, కోలుకునే రోగులకు పరిశుభ్ర వాతావరణం అందించాలి అనే సూత్రంతో పని చేసిన ఆమెకు సైనికుల సేవలో ఆరోగ్యం దెబ్బతిన్నది. దాదాపు 53 సంవత్సరాలు ఫ్లోరెన్స్ నైటింగేల్ జీవితం అనారోగ్య జీవితమే. మంచం మీదనే పడుకుని ఉండాల్సిన పరిస్థితి అయినా చురుకుదనంలో లోటుండేది కాదు. ఎప్పుడూ తన వెంట ఒక నోట్‌బుక్, పెన్సిల్ పట్టుకుని తనకు కలిగిన ఆలోచనలను రాసుకునేది. తన జీవితం ఎప్పుడైనా అంతం అవుతుందనుకునేది. ఆ కొద్దిపాటి మిగిలిన జీవితంలో సమావేశాలు, ప్రసంగాలు అంటూ కాలం వృథా చేసేకంటే, ప్రజల ఆరోగ్యం మెరుగు పరచే అంశాలపై మనసు పెట్టటం మంచిది కదా అనేది. అలా అనారోగ్యంతోనే ఫ్లోరెన్స్ 90 ఏళ్ల వరకు  బతికింది. 

#మొదట్లో ఆమెను చూసి అధికారులు జ్వలించి పోయేవారు. తరువాత ఆమె నిరుపమాన సేవకు ముగ్ధులయ్యారు. వారికి రోజూ రోగులకు కావల్సిన మందులు పరికరాలు పంపమని అభ్యర్థనలు పంపేది. చాలా సార్లు తన సొంత ఖర్చులతో అన్ని తెప్పించేది ఆసుపత్రులలో చోటు సరిపోకపోతే అధికారులను ఒప్పించి పాత ఇళ్లు, భవనాలను ఆసుపత్రులుగా మార్చేది. రాత్రులలో రెండు మూడు గంటలే పడుకుని అహర్నిశలు పని చేసే సరికి ఆమె చిక్కిపోయింది. అయినా రోగులకు ఆమె ఆరాధ్యదైవం. ఆమె నడచిన దారి అతి పవిత్రం ఆమె ఎక్కడికి వెళ్లినా సైనికులు అడవి పూలతో పుష్పగుచ్ఛాలను ఇచ్చేవారట. 

#అయినా ఆమె తన సేవలను మానకుండా సేవలు చేస్తుండగా ఒకనాడు స్పృహతప్పి పడిపోయింది. సైనికులకు వచ్చిన జ్వరమే ఆమెకు వచ్చింది. ఆసుపత్రిలో చేరి చికిత్స పొందిన అనంతరం, కొంచెం నయంకాగానే తిరిగి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ రోగులకు సేవలందించింది. దురలవాట్లకు బానిసలైన వారిలో మార్పు తేవటానికి ఎంతగానో కృషి చేసింది. తాగుడుకు ఖర్చుపెట్టకండి, మీ ఇళ్లకు ఆ డబ్బును పంపండి వారికి భుక్తి గడుస్తుందని చెప్పేది. అక్షరాస్యతను పెంచాలనే ఆలోచన వచ్చిందే తడవుగా గ్రంథాలయాలు, చదువుకునే గదులు అందరికి అందుబాటులో ఉండేటట్లు చేసింది” 1902 వచ్చే సరికి ఆమెకు కంటి చూపు మందగించింది చదవటం, రాయటం కష్టమైంది. 

#ఇతరులు వచ్చి ఆమెకు పుస్తకాలు చదివి వినిపించేవారు. నర్సింగ్ వృత్తిలో ఉన్నవారిని చూస్తే ఆమెకు ఉత్సాహం లేచి వచ్చేది. ‘ఫ్లోరెన్స్ నైటింగేల్’ వివాహం చేసుకోలేదు. చివరి దశలో ఆమెకోసం నర్సులను సహాయకులుగా నియమించారు. వారు ఆమెను జాగ్రత్తగా చూసుకుంటుంటే ఫ్లోరెన్స్ నెమ్మదిగా లేచి వెళ్లి రోగుల పక్కలు సర్ది గది శుభ్రం చేస్తుండేది. ఎంత వారించినా వినకుండా తన జీవితం చివరి క్షణం వరకు ఇలాగే సేవ చేస్తు గడిచిపోవాలనుకునేది. భారత దేశానికి కూడా ఆమె ఇతోధిక సేవలు అందించింది. 1859తో విక్టోరియా రాణి ఆరోగ్య సంస్కరణల కోసం ఒక కమిషన్‌ను నియమించింది. చెన్నై మేయర్ ఆడ నర్సుల శిక్షణను ప్రోత్సాహించారు. నగర పారిశుద్ధ్యం మెరుగు పడింది. ఫ్లోరెన్స్  సలహాలలో మనదేశంలో మరణాల రేటు తగ్గింది. మళ్లీ ఒక ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టి మన ప్రభుత్వ ఆసుపత్రులు మెరుగు పడాలని కోరుకుందాం.

#ఎంతో సేవాతత్పరతతో కూడిన నర్సింగ్‌ వృత్తికి, ఆధునిక నర్సింగ్‌ విద్యకు లేడీ విత్‌ ద ల్యాంప్‌ పేరుతో ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతినొందిన ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ ఆద్యురాలు, మార్గదర్శకురాలు, స్ఫూర్తి ప్రధాత. 

 30ఏళ్ల ప్రాయంలో #జర్మనీలోని కెయిసర్‌ వర్త్‌లో నర్సింగ్‌ విద్యాభ్యాసం చేసిన అనంతరం పారిస్‌లో విధి నిర్వహణ చేస్తున్న కాలంలో యూరప్‌లో జరిగన క్రిమియాన్‌ యుద్ధం గాయాలపాలై రక్తసిక్తమై అల్లాడుతున్న సైనికుల వ్యధాభరిత కథనాలను వార్తాపత్రికల్లో చదివి చలించిపోయింది. ఆ యుద్ధంలోని క్షతగాత్రులను ఎలాగైనా కాపాడాలని నిశ్చయించుకుని కొంతమంది నర్సుల బృందంతో టర్కిలో ఆ సైనికులున్న లుక్ట్రాయి హాస్పటల్‌కు చేరుకుంది. అక్కడ ప్రతీరోజూ వైద్య సేవలు చేస్తూ నిశిరాత్రిలో కూడా చిన్న లాంతరు పట్టుకుని ఆ వెలుగులో గాయాలపాలై బాధతో నిద్రపట్టక విలవిలలాడుతున్న సైనికులను ఓదార్చుతూ వారి కళ్ళలో వెలుగులు నింపేది. దాంతో అక్కడివాలందరూ నైటింగిల్‌ను లేడి విత్‌ ద ల్యాంప్‌ అని పిలవడంతో ఆమెకు ఆ పేరు సార్ధకమయింది.

1910 ఆగస్ట్ 13 లో ఫ్లారెన్స్ మరణించిన, సేవా నిరతిగల ప్రతి నర్సు లోను ఆమె కలకాలం జీవించి ఉంటుంది. రోగులు జ్యాపకమున్చుకోవలసిన ఆదర్శ మూర్తి .

1820 మే 12 ఇటలీలోని ఫ్లోరెన్స్‌ నగరంలో బ్రిటీష్‌ కుటుంబంలో జన్మించిన ఫ్లోరెన్స్‌ నైటింగిల్‌ నర్సు వృత్తికి స్పూర్తిదాయకంగా నిలిచినందుకు ప్రపంచ వ్యాప్తంగా మే 12న ఆమె జయంతిని నర్సుల దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది.

#భారతదేశంలో:

ఈ రోజున, నర్సింగ్ విభాగంలో దేశవ్యాప్తంగా విశేష సేవలందించిన నర్సులకు భారతదేశ రాష్ట్రపతి నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులను అందిస్తారు. 1973లో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రవేశపెట్టిన ఈ అవార్డులో భాగంగా కేంద్ర, రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంత, స్వచ్ఛంద సంస్థల్లో విశిష్ట సేవలందించిన నర్సులకు ఒక పతకం, ప్రశంసాపత్రము, జ్ఞాపికతోపాటు 50వేల రూపాయిల నగదు బహుమతిని బహుకరిస్తారు.

0 comments:

Post a Comment