Sunday, May 1, 2022

కళాప్రపూర్ణ' శ్రీకాశీనాథుని నాగేశ్వరరావు గారి జయంతి

💐💐పాత్రికేయుడు, వ్యాపారవేత్త, స్వాతంత్ర్య సమర యోధుడు, రాజకీయ నాయకుడు, గ్రంథాలయాల విస్తరణకు కృషి చేసిన విద్యా వేత్త, దానశీలి, దేశోధ్ధారక, విశ్వదాత, 'కళాప్రపూర్ణ' శ్రీ
కాశీనాథుని నాగేశ్వరరావు గారి జయంతి సందర్భంగా💐


#ఆంధ్రపత్రిక నడపడమంటే పెద్ద తలనొప్పి సుమండీ!’ అన్నారట కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారు,పరవాలేదు, అమృతాంజనం కూడా మీదే కదా!’అని చమత్కరించారట. రాజాజీ"#

#భారతీయ పత్రికలను బ్రిటిష్‌ ప్రభుత్వం వెంటాడుతున్న కాలమది. అలాగే స్వాతంత్య్రోద్యమాన్ని కర్కశంగా అణచివేస్తున్న సమయం కూడా అదే. ఆ సమయంలో ఇటు పత్రికా నిర్వహణలోను, అటు స్వరాజ్య సమరంలోను కీలకంగా నిలిచినవారు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు. ఆయన స్థాపించిన ఆంధ్రపత్రిక తెలుగువారి ఉద్యమానికి, సంస్కృతికి, సాహిత్యాభిలాషకి అద్దం పట్టింది. తలనొప్పి – అమృతాంజనం జంటపదాలైనాయి. ఎన్నో పత్రికలు రావచ్చు. పోవచ్చు.  కానీ ఆంధ్రపత్రికకు ఉన్న స్థానం చరిత్రలో మరొక పత్రికకు రాలేదు. అలాగే తలనొప్పికి అమృతాంజనమే ఈరోజుకీ దివ్యౌషధం.

 #భారత స్వాతంత్య్ర సమరం పదునెక్కుతున్న సంగతిని గమనించి అందుకు సంబంధించిన వార్తలను తెలుగులో అందించాలన్న ఆశయంతో ఆంధ్రపత్రికను స్థాపించారు పంతులుగారు. ఆయన స్వయంగా స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నారు. 1838 ప్రాంతంలో తెలుగులో పత్రికల ప్రచురణ (వృత్తాంతి) ప్రారంభమైనప్పటికీ ఆంధ్రపత్రిక వచ్చే వరకు వాటికి పూర్తి స్వరూపం రాలేదంటే అతిశయోక్తి కాదు. కృషి, దీక్ష పట్టుదలతో వివాహానంతరం కూడా విద్యాభ్యాసము కొనసాగించారు. అటు పిమ్మట ముంబై మహానగరానికి వెళ్లి అక్కడి జన  సముద్రంలో ఆటుపోట్లను ఎదుర్కన్నారు. అమృతాంజనాన్ని  తయారుచేసి అమ్మకాన్ని కొనసాగించారు . అమృతాంజనాన్నివీరికి అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. కొంత ధనార్జ న చేసిన పిదప కాశీనాధుని వారు ఆంధ్ర పత్రికకు  అంకురార్పణ చేసారు. ఆంధ్ర పత్రిక సంవత్సరాది సంచికలను ప్రారంభించారు. ప్రతి ఏడాది ఉగాది నాడు అద్బుతంగా రంగుల ముఖచిత్రాలతో సంత్సరాది సంచికలను విడుదల చేసారు. 

#చెన్నై లోని నాగేశ్వరరావు నివాసమైన శ్రీబాగ్ లోనే చారిత్రాత్మక శ్రీబాగ్‌ ఒడంబడిక కుదిరింది. కోస్తా, రాయలసీమ నాయకుల మధ్య కుదిరిన ఈ ఒడంబడిక ద్వారా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమమైంది.#

#జీవిత విశేషాలు

కాశీనాధుని నాగేశ్వరరావు కృష్ణా జిల్లా ఎలకుర్రు గ్రామంలో 1867లో మే 1న జన్మించాడు. తల్లిదండ్రులు: శ్యామలాంబ, బుచ్చయ్య. స్వగ్రామంలోనూ, తరువాత మచిలీపట్నంలోనూ విద్యాభ్యాసం కొనసాగింది. 1891లో 'మద్రాసు క్రిస్టియన్ కాలేజి'లో పట్టభద్రుడయ్యాడు. ఆ కాలేజిలో ప్రమముఖ విద్యావేత్త డా.రెవరెండ్ మిల్లర్ ప్రభావం అతనుపై బడింది. వివేకవర్ధనిలో కందుకూరి వీరేశలింగం వ్యాసాలు కూడా అతనును ప్రభావితం చేశారు.

#దేశోద్ధారక:

మద్రాసు ప్రెసిడెన్సీనుండి ఆంధ్ర ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా విభజించాలన్న ఉద్యమానికి అరంభదశనుండి నాయకులుగా ఉన్నవారిలో నాగేశ్వరరావు ఒకడు. ఈ విషయమై తన పత్రికలలో విస్తృతంగా ప్రచారం నిర్వహించాడు. ఈ విషయంలోనూ, తెలుగు భాష, సంస్కృతిలకు సంబంధించిన ఇతర విషయాలలోనూ అతను తెలుగు జాతికి చేసిన సేవను గౌరవిస్తూ తెలుగువారు అతనును దేశోధ్ధారక అని సత్కరించారు.

#రాజకీయాలలో:

టంగుటూరి ప్రకాశం సమకాలీనుడైన నాగేశ్వరరావు 1924 - 1934 మధ్యకాలంలో నాలుగు సార్లు ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షునిగా ఉన్నాడు. ముఖ్యంగా ఖద్దరు ఉద్యమానికి నాగేశ్వరరావు బలమైన మద్దతును, సహకారాన్ని అందించాడు. అలాగే ఉప్పు సత్యాగ్రహం సమయంలో చురుకుగా పాల్గొన్న నాయకులలో అతను ఒకడు. నాగేశ్వరరావుపై ప్రజలకు ఎంతో అభిమానం, నమ్మకం ఉండేవి.

#భగవద్గీత :

ఉప్పు సత్యాగ్రహ సందర్భంగా 1931లో ఒక సంవత్సరం జైలులో ఉన్నపుడు నాగేశ్వరరావు భగవద్గీత గురించి వ్యాఖ్య వ్రాసాడు. గీత ఒక మతానికి పరిమితమైనది కాదనీ, దాని సందేశం సమస్తమానవాళికీ వర్తిస్తుందనీ అతను వివరించాడు.

#విశ్వదాత :

నాగేశ్వరరావు అసమాణ దానశీలి. అతను ఇల్లు ఎప్పుడూ అతిధులతోనూ, అర్ధులతోనూ కళకళలాడుతుండేది. వివిధ సేవఅ కలాపాలకు ధారాళంగా అతను సహాయం చేస్తుండేవాడు. అతను ఇంటినుండి వట్టిచేతులతో ఎవరూ వెళ్ళేవారు కాదు. అతను దాతృత్వానికి అబ్బురపడి మహాత్మా గాంధీ అతనును విశ్వదాత అని కొనియాడాడు.

#తెలుగు భాషకు అతను సేవ:

కాశీనాథుని నాగేశ్వరరావు యొక్క తెలుగు భాషాభిమానము, సాహిత్యము, విజ్ఞానశాస్త్రములలో ఆసక్తి అతను ఆయారంగములో వివిధ పత్రికల ప్రచురణకు చేసిన విశేషకృషి వలన విదితం. ఇతను భారతి, ఆంధ్ర పత్రిక వంటి పత్రికలు, ఆంధ్ర గ్రంథమాల వంటి ప్రచురణలు, ఉగాది ప్రత్యేక సంచికలు వెలువరించాడు. ఆంధ్ర గ్రంథమాల ద్వారా అతను తెలుగు భాషలో అనేక భాషా, సాహితీ, విజ్ఞాన శాస్త్ర విషయాలపై గ్రంథాలను పరిచయం చేసి శాస్త్ర, సాహిత్య విజ్ఞానాభివృద్ధికి దోహదం చేశాడు.తెలుగు నాటకం అభివృద్ధి చేసేందుకు ఆంధ్ర నాటక కళా పరిషత్తును 1929లో స్థాపించిన నాటకరంగ ప్రముఖుల్లో అతను కూడా ఒకరు.

#అమృతాంజనము సృష్టి కర్త#

తలనొప్పి నివారిణి అమృతాంజనం" ఆవిష్కర్త
కాశీనాధుని నాగేశ్వర రావు పంతులుగారు.
ఒకసారి చధరంగపు చాంపియన్ బాబీ ఫిషర్ భారతీయ చదరంగపు అటగాడు విశ్వనాథన్ ఆనంద్ ను అమృతాంజనం గురించి అడిగాడట తన సొంత దేశము అయినా ఐస్ ల్యాండ్ లో అమృతాంజనం దొరకటం లేదని తనకు అమృతాంజనం కావాలని అడిగాడు అంటే అమృతాంజనం ప్రతిభ దేశాలు దాటి ప్రముఖుల చెంతకు చేరింది అని చెప్పవచ్చు. భారతదేశములో 1980 ,1990 ల మధ్య పెరిగిన ఏ పిల్లవాడిని అడిగినా అమృతాంజనం గొప్పతనము చెపుతాడు ఆ రోజుల్లో ఈ రోజుల్లో ప్రతి వారి ఇంట్లో విధిగా ఉండే మందు ఇది. అమృతాంజనం లేని ఇల్లు ఊహించటం చాలా కష్టము. ఈ పసుపు రంగు పేస్ట్ లాంటి ఔషధము విపరీతమైన తలనొప్పి ఒళ్ళు నొప్పులను జలుబును తగ్గించే అమోఘమైన మందు. తాతయ్యలు,భామ్మల కాలము నుండి అమృతాంజనం వాడకం ఉంది దీనిని వాడి తలనొప్పినుండి సత్వరమే ఉపశమనము పొందేవారు ఇంత అమోఘమైన మందును తయారుచేసింది శ్రీ కాశీనాధుని నాగేశ్వర రావు పంతులుగారు.

కాశీనాథుని నాగేశ్వరరావు 1938లోఏప్రిల్ 11న మరణించాడు. తెలుగు జాతికీ, తెలుగు భాషకూ, తెలుగు సంస్కృతికీ అతను సేవ ఎనలేనిది.

0 comments:

Post a Comment