💐💐ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు టెలికాం విప్లవం పితామహుడు శ్రీ రాజీవ్ గాంధీ గారి వర్థంతి సందర్భంగగా💐💐
【#జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం】
"సార్..#ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు లైన్ లో వున్నారు..మీతో మాట్లాడుతారుట "..#ఫోన్ పట్టుకుని #వాజపేయి దగ్గరికి వచ్చి చెప్పాడు ఆయన వ్యక్తిగత కార్యదర్శి.."
" ఫోన్ అందుకున్న వాజపేయి ప్రధానమంత్రి తో రెండు నిమిషాలు మాట్లాడారు.."
" ఫోన్ పెట్టేసి వాజపేయి కార్యదర్శి వంక చూసి " మనం ప్రధానమంత్రి తో పాటు ఐక్యరాజ్యసమితి సమావేశంలో పాల్గొనటానికి అమెరికా వెళ్తున్నాం..ఏర్పాట్లు చూడండి "..అనడంతో తను విన్నది నిజమేనా అని ఆశర్యంతో మరోమారు అటల్జీ ని అడిగి కన్ఫర్మ్ చేసుకున్నాడు కార్యదర్శి.."
" సార్..పత్రికలకు ప్రెస్ నోట్ పంపమంటారా ? నసిగాడు కార్యదర్శి "
" వాజపేయి ఒక్క క్షణం అతనివంక చూసి నవ్వుతూ " నిక్షేపంగా " అన్నారు.."
" ఈ వార్త అప్పట్లో ఇటు కాంగ్రెస్ పార్టీలోనూ.. అటు బీజేపీ లోనూ పెద్ద దుమారం సృష్టించింది..రాజీవ్గాంధీ నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు సైతం ముక్కున వేలేసుకున్నారు..సాక్షాత్తు ప్రధానమంత్రి హోదాలో ఐక్యరాజ్యసమితి ప్రతినిధుల సమావేశానికి అటెండ్ అవుతూ ప్రతిపక్షపార్టీ నేతను వెంటపెట్టుకెళ్లటం ఏంటి ? అంటూ పార్టీలో సన్నాయి నొక్కులు నొక్కారు..కానీ రాజీవ్ గాంధీ మాత్రం వాజపేయి ని తీసుకెళ్లడం వెనుక అసలు కారణాన్ని ఎవరికీ చెప్పలేదు ..
కానీ ఆయన మరణానంతరం వాజపేయే అసలు విషయాన్ని ప్రపంచానికి చెప్పారు.. ఆన్ టోల్డ్ వాజపేయి అనే పుస్తకం ద్వారా..అదీ ఆయన మాటల్లోనే..
1985 లోనే నాకు ఒక కిడ్నీ దెబ్బ తిని వైద్యం తీసుకుంటున్నా..1988 నాటికి రెండో కిడ్నీ కూడా దెబ్బతింది..డాక్టర్లు తక్షణం వైద్య చికిత్స అవసరం అన్నారు..ఇక్కడ కన్నా అమెరికాలో మెరుగైన వైద్యం అందుబాటులో ఉన్నందున అక్కడికి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారు..ఈ విషయం తెలుసుకున్న రాజీవ్ గాంధీ ఐక్యరాజ్యసమితి ప్రతినిధుల సమావేశానికి నన్ను కూడా వెళ్లాలని ఫోన్ లో కోరారు..కానీ చివరగా ఆయన ఒక మాట చెపుతూ " అటల్ జీ..ఈ పర్యటనను పూర్తిగా మీ వైద్యానికి ఉపయోగించుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఇండియా కి రండి "..అని చెప్పారు..ఈ రోజు నేను ప్రాణాలతో ఉన్నానంటే అది రాజీవ్ గాంధీ నాకు చేసిన ఉపకారం వల్లనే....నా కన్నా ఇరవై ఏళ్ళ చిన్న వాడు అయిన రాజీవ్ నాకు తమ్ముడి లాంటి వాడే ".
పొద్దున్న లేస్తే ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకునే పార్టీల నాయకులు రాజకీయాలు పక్కన పెట్టి అప్పుడప్పుడన్నా నైతిక విలువలు పాటించాలన్న సూత్రం ఇలాంటి విషయాలు తెలుసుకుని అయినా పాటిస్తే బాగుండు!
*****
శ్రీ రాజీవ్ గాంధీ
40 ఏళ్ళ వయసులో భారత యువ #ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్గాంధీ బహుశా #ప్రపంచంలోనే అతి పిన్నవయస్కులైన #ప్రభుత్వాధినేతల్లో ఒకరు కావచ్చు. ఆయన తల్లి ఇందిరాగాంధీ 1966లో మొదటిసారి ప్రధానమంత్రి అయినప్పుడు ఆమె రాజీవ్ గాంధీ కంటె 8 ఏళ్ళు (48) పెద్ద. ప్రఖ్యాతివహించిన ఆయన తాత పండిట్ జవహర్లాల్ నెహ్రూ స్వేచ్ఛా భారతానికి తొలి ప్రధానిగా బాధ్యతలు చేపట్టేనాటికి వయసు 58 సంవత్సరాలు.
దేశంలో తరం మార్పుకు సంకేతంగా రాజీవ్గాంధీ దేశ చరిత్రలోనే అతిపెద్ద మెజార్టీ సాధించారు. హత్యకు గురైన తన తల్లి అంత్యక్రియలు పూర్తికాగానే ఆయన లోక్సభ ఎన్నికలకు ఆదేశించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అంతకుముందు 7 సార్లు జరిగిన ఎన్నికలలో కంటే అత్యధిక ఓట్లను సాధించింది. 508 లోక్సభ సీట్లలో రికార్డుస్థాయిలో 401 సీట్లు గెలుచుకుంది.
7 కోట్ల మంది భారతీయులకు నాయకునిగా అటువంటి శుభారంభం చేయడం అది ఎటువంటి పరిస్థితి అయినా చెప్పుకోదగిందే. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రాజీవ్గాంధీ పూర్తిగా రాజకీయ కుటుంబానికి చెందినవారు అయినప్పటికీ ఆలస్యంగా, అయిష్టంగా రాజకీయాల్లో ప్రవేశించి కూడా ఇంత పెద్ద మెజార్టీ సాధించడం, స్వాతంత్ర ఉద్యమంలోను, ఆ తరువాత 4 తరాలపాటు భారతదేశానికి సేవలు అందించిన రాజకీయ కుటుంబానికి చెందిన రాజీవ్గాంధీ అనివార్య పరిస్థితుల్లోనే రాజకీయ ప్రవేశం చేశారు.
రాజీవ్గాంధీ 1944 ఆగస్టు 20 న జన్మించారు. భారతదేశం స్వాతంత్య్రం సాధించేనాటికి ఆయన తాత ప్రధానమంత్రి అయ్యేనాటికి రాజీవ్ వయసు కేవలం 3 సంవత్సరాలు. ఆయన తల్లిదండ్రులు లక్నో నుంచి ఢిల్లీకి మకాం మార్చారు. తండ్రి ఫిరోజ్ గాంధీ పార్లమెంటు సభ్యుడు అయ్యారు. నిర్భయంగా కష్టపడి పనిచేసే పార్లమెంటేరియన్గా పేరు తెచ్చుకున్నారు.
రాజీవ్గాంధీ తన బాల్యాన్ని తాతగారితో కలసి తీన్మూర్తి హౌస్లో గడిపారు. అక్కడ ఇంధిరాగాంధీ ప్రధానమంత్రి సహాయకురాలిగా పనిచేశారు. డెహ్రాడూన్లోని వెల్హామ్ ప్రెప్ స్కూల్కు కొద్దికాలంపాటు వెళ్ళిన రాజీవ్గాంధీ తరువాత రెసిడెన్షియల్ డూన్ స్కూల్కు మారారు. అక్కడ ఆయన అనేక మందితో ప్రగాఢ మైత్రిని పెంపొందించుకున్నారు. చిన్నతమ్ముడు సంజయ్గాంధీ కూడా ఆయనతో కలిశారు.
స్కూల్ చదువు పూర్తయిన తరువాత రాజీవ్గాంధీ కేంబ్రిడ్జి ట్రినిటీ కళాశాలలో చేరారు. అయితే త్వరలోనే లండన్లోని ఇంపీరియల్ కాలేజ్కి మారారు. అక్కడ మెకానికల్ ఇంజినీరింగ్ కోర్సు చేశారు.
రాజకీయాలను జీవిత వ్యాపకంగా మలచుకోవాలని ఆయన ఎప్పుడూ అనుకోలేదు. ఆసక్తి కూడా చూపలేదు. సైన్సు, ఇంజినీరింగ్కు సంబంధించిన అనేక ఉద్గ్రంధాలు ఆయన బీరువాల నిండా ఉండేవని రాజీవ్ సహ విద్యార్థలు చెబుతారు. ఫిలాసఫీ, రాజకీయాలు లేదా చరిత్ర గురంచి ఆయన పట్టించుకునేవారు కాదు. అయితే సంగీతాన్ని ఇష్టపడేవారు. వెస్ట్రన్, హిందూస్థానీ శాస్త్రీయ సంగీతంతోపాటు ఆధునిక సంగీతాన్ని కూడా ఇష్టపడేవారు. రాజీవ్ ఆసక్తి కనబబరిచే ఇతర అంశాల్లో ఫొటోగ్రఫీ, అమెచ్యూర్ రేడియో ముఖ్యమైనవి.
కాగా, రాజీవ్కు అత్యంత ఇష్టమైనవి గాల్లో ప్రయాణించడం. ఇంగ్లండ్ నుంచి తిరిగివచ్చిన వెంటనే ఢిల్లీ ఫ్లైయింగ్ క్లబ్ ఎంట్రన్స్ పరీక్ష పాసై కమర్షియల్ పైలెట్ లైసెన్సు తీసుకోవడానికి వెళ్ళారు. అనతికాలంలోనే దేశీ విమాన సంస్థ ఇండియన్ ఎయిర్లైన్స్ లో పైలెట్ జీవితం ప్రారంభించారు.
1980లో సోదరుడు సంజయ్గాంధీ విమాన ప్రమాదంలో మరణించడంతో పరిస్థితి మారింది. అప్పట్లో అంతర్గతంగా, బహిర్గతంగా అనేక సవాళ్ళు చుట్టుముట్టిన పరిస్థితుల్లో తల్లికి చేయూతను ఇవ్వడానికి రాజకీయాల్లో చేరవలసిందిగా రాజీవ్గాంధీపై వత్తిడి పెరిగింది. మొదట్లో వీటిని ప్రతిఘటించినప్పటికీ తరువాత తల వొగ్గక తప్పలేదు. తమ్ముని మృతి కారణంగా ఉత్తరప్రదేశ్లోని అమేథీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో రాజీవ్గాంధీ గెలుపొందారు.
1982 నవంబర్లో భారత్ ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇచ్చినపుడు అంతకు చాలా సంవత్సరాల ముందు జరిగిన ఒప్పందానికి కట్టుబడి స్టేడియంలు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించే కార్యక్రమాన్ని రాజీవ్గాంధీ విజయవంతంగా పూర్తిచేశారు. వీటి పని సకాలంలో పూర్తయ్యేలా చూసే బాధ్యతను రాజీవ్గాంధీకి అప్పగించారు. ఈ లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తిచేయడం ద్వారా రాజీవ్గాంధీ తన సామర్థ్యాన్ని, సమన్వయ స్ఫూర్తిని చాటుకున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే ప్రక్రియను తన భుజస్కందాలపై వేసుకున్నారు. ఆ తరువాత కాలంలో అనేక పరీక్షా సమయాల్లో రాజీవ్గాంధీ శక్తి సామర్థ్యాలు, ప్రజ్ఞాపాటవాలు బయటపడుతూ వచ్చాయి.
1984 అక్టోబర్ 31న తల్లి ఇందిరాగాంధీ దారుణ హత్యకు గురైన సమయంలో ప్రధానమంత్రిగాను, కాంగ్రెస్ అధ్యక్షునిగాను ఆయన నిర్వర్తించాల్సి వచ్చింది. వ్యక్తిగత దుఃఖాన్ని, విచారాన్ని అణచుకొని జాతీయ బాధ్యతను ఎంతో హుందాగా, ఓర్పుగా తన భుజాలకు ఎత్తుకున్నారు.
1984 నుండి 1989 వరకు తన ఐదేళ్ల పాలనలో, యువ నాయకుడు దేశాన్ని 21 వ శతాబ్దానికి తీసుకెళ్లడానికి ప్రయత్నాలు చేశాడు.
#టెలికాం విప్లవం:
రాజీవ్ గాంధీని 'ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు టెలికాం విప్లవం యొక్క పితామహుడు' అని ప్రశంసించారు. అతను డిజిటల్ ఇండియా యొక్క వాస్తుశిల్పిగా పిలువబడ్డాడు.
అతడి పాలనలోనే అత్యాధునిక టెలికమ్యూనికేషన్ టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి మరియు భారతీయ టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ అవసరాలను తీర్చడానికి 1984 ఆగస్టులో సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (సి-డాట్) స్థాపించబడింది.
సి-డాట్ భారతదేశంలోని పట్టణాలు మరియు గ్రామాలలో కమ్యూనికేషన్ నెట్వర్క్లో విప్లవాత్మక మార్పులు చేసింది. రాజీవ్ గాంధీ ప్రయత్నాల వల్ల పిసిఓ (పబ్లిక్ కాల్ ఆఫీస్) విప్లవం జరిగింది. పిసిఓ బూత్ గ్రామీణ ప్రాంతాలను కూడా బయటి ప్రపంచానికి అనుసంధానించింది.
1986 లో, MTNL (మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్) స్థాపించబడింది, ఇది టెలిఫోన్ నెట్వర్క్ వ్యాప్తికి సహాయపడింది. అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీకి సలహాదారుగా సామ్ పిట్రోడాతో, టెలికమ్యూనికేషన్స్, నీరు, అక్షరాస్యత, రోగనిరోధకత, పాల మరియు చమురు విత్తనాలకు సంబంధించిన ఆరు సాంకేతిక మిషన్లు స్థాపించబడ్డాయి.
#కంప్యూటరీకరణ:
రాజీవ్ గాంధీ సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు అనుబంధ పరిశ్రమలను ప్రోత్సహించారు. అటువంటి పరిశ్రమలపై, ముఖ్యంగా కంప్యూటర్లు, విమానయాన సంస్థలు, రక్షణ మరియు టెలికమ్యూనికేషన్లపై దిగుమతి కోటాలు, పన్నులు మరియు సుంకాలను తగ్గించడం ఒక మార్గం. కంప్యూటరీకరించిన రైల్వే టిక్కెట్లను ప్రవేశపెట్టిన తరువాత భారత రైల్వే ఆధునీకరించబడింది.
#ఓటింగ్ వయస్సు:
తాను యువకుడిగా ఉన్నందున, రాజీవ్ గాంధీ యువతకు అధికారం ఇవ్వడానికి ప్రయత్నించారు. ఆ దిశగా, రాజ్యాంగంలోని 61 వ సవరణ చట్టం 1989 లో ఆమోదించబడింది, ఓటింగ్ వయస్సును 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించింది. ఈ చర్య రాష్ట్రాలలో లోక్సభ ఎంపీలు, ఎమ్మెల్యేలను ఎన్నుకోవడంలో యువతకు అవకాశం కల్పించింది.
#పంచాయతీ రాజ్:
ప్రజాస్వామ్యాన్ని అట్టడుగు స్థాయికి తీసుకెళ్లేందుకు పంచాయతీ రాజ్ సంస్థలకు పునాది వేసిన ఘనత రాజీవ్ గాంధీకి దక్కింది. 1992 లో రాజ్యాంగంలోని 73 వ మరియు 74 వ సవరణల ద్వారా పంచాయతీ రాజ్ సృష్టించబడినప్పటికీ, రాజీవ్ గాంధీ హత్య చేయబడిన ఒక సంవత్సరం తరువాత, ఆయన నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో నేపథ్యం సిద్ధమైంది.
#రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా 1986 లో దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా కార్యక్రమాలను ఆధునీకరించడానికి మరియు విస్తరించడానికి #నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ (ఎన్పిఇ) ను ప్రకటించారు. ఎన్పిఇ అమల్లో ఉండటంతో, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో #జవహర్ నవోదయ విద్యాలయాలు అనే నివాస పాఠశాలలను ఏర్పాటు చేసి, గ్రామీణ ప్రతిభావంతులలో అత్యుత్తమమైన వారిని బయటకు తీసుకువచ్చారు. ఈ పాఠశాలలు ఆరు నుండి పన్నెండు వరకు గ్రామీణ ప్రజలకు ఉచిత నివాస విద్యను అందిస్తాయి.
#రాజీవ్ గాంధీ భారతీయ సమాజం మరియు రాజకీయాలపై చెరగని ముద్ర వేశాడు
ఆధునిక భావాలు, నిర్ణయాత్మక శక్తి కలిగిన రాజీవ్గాంధీ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన ప్రపంచంలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. తన ప్రధాన ఆశయాలలో భారత ఐక్యతను పరిరక్షిస్తూనే దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకువెళ్ళడం ముఖ్యమైనదని రాజీవ్ పదేపదే చెబుతూండేవారు.
స్వర్గీయ రాజీవ్గాంధీ జయంతి ని సద్భావన దినోత్సవంగా నిర్వహిస్తారు.
రాజీవ్ గాంధీ వర్ధంతి రోజును జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవంగా జరుపబడుతుంది.
0 comments:
Post a Comment