Monday, January 24, 2022

భారత అణు పితామహుడు హోమీ జహంగీర్ భాభా వర్థంతి

💐💐అణుశక్తిమాన్! భారత అణు పితామహుడు హోమీ జహంగీర్ భాభా వర్థంతి సందర్భంగా




 ✍️జవహర్‌లాల్ నెహ్రూకు భాభా అత్యంత సన్నిహితుడు. భాభాను నెహ్రూ ‘సోదరా’ అని పిలిచేవారు


✍️ముంబైలోని రెండు గంభీరమైన సంస్థలు... టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్, భాభా అటామిక్ రిసెర్చ్ సెంటర్ లతో ముడివడివున్న సాధుశీల అణుభౌతిక నామం... హోమీ జహంగీర్ భాభా.
 ఈ పేరులోని ‘హోమీ’కి పార్శీ భావం ‘#కాంకరర్ ఆఫ్ ది వరల్డ్’. #జగద్విజేత!

అయితే ఆయనెప్పుడూ తన దేశాన్నే ముందు వరుసలో ఉంచాలనుకున్నారు తప్ప అణు పితామహుడిగా ఎదగాలన్న ధ్యాసతో లేరు.
 పితామహుడన్నది ఈ దేశం గౌరవసూచకంగా ఆయనకు పెట్టుకున్న పేరు.

1966 జనవరి 24న హోమీ భాభా ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా విమానం 101 ఫ్రాన్స్‌లోని మాంట్ బ్లాంక్‌లో కుప్పకూలిపోకుండా ఉన్నట్లయితే, కొద్ది గంటల తర్వాత భారతీయ అణు కార్యక్రమంపై వియన్నా సమావేశంలో అతడు సమర్పించబోతున్న కీలకమైన పత్రాలను ఆయన తీసుకు వెళ్లగలిగి ఉంటే... ఏమో,   ✍️అంతర్జాతీయ అణుశక్తి రంగంలో భారత్ జగద్విజేతగా నిలిచి ఉండేదేమో!  
దురదృష్టం. ఆ ప్రమాదంలో హోమీ భాభా మరణించారు. భాభా స్థాపించి, డెరైక్టర్‌గా ఉన్న పై రెండు సంస్థలు ప్రస్తుతం భారతీయ అణుసామర్థ్య అభివృద్ధిలో ఆయన ఆశయాలకు అనుగుణంగా నిబద్ధతతో పనిచేస్తున్నాయి. భాభా ఆశయం అణుశక్తి మాత్రమే కాదు. అణుశాంతి కూడా!
 
నేర్చుకోవడం, దేశానికి సేవ చేయడం అన్నవి పారంపర్య సంప్రదాయంగా ఉన్న సంపన్న కుటుంబంలో 1909 అక్టోబర్ 30న జన్మించారు హోమీ జహంగీర్ భాభా. తండ్రి జహంగీర్ హార్‌ముస్జీ భాభా. ప్రసిద్ధ న్యాయవాది. తల్లి మెహరిన్. ప్రాథమిక, ప్రాథమికోన్నత, కళాశాల విద్యాభ్యాసాలు ముంబైలో పూర్తయ్యాక, మెకానికల్ ఇంజినీరింగ్‌లో అధ్యయనానికి కేంబ్రిడ్జి వెళ్లారు హోమీ. సెలవులకు ఆయన ఇండియా వచ్చేనాటికి రెండో ప్రపంచ యుద్ధ మేఘాలు దట్టంగా అలుముకుని ఉన్నాయి. ఇక ఇక్కడే ఉండిపోయి.

బెంగుళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ సైన్స్‌లో ఫిజిక్స్ రీడర్‌గా చేరారు. అప్పుడా సంస్థకు నేతృత్వం వహిస్తున్నది నోబెల్ గ్రహీత సీవీ రామన్. ఆయన ఆధ్వర్యంలో హోమీ అణుశాస్త్రానికి సంబంధించి కాస్మిక్ కిరణాలపై కీలకమైన పరిశోధనలు, ప్రయోగాలు చేశారు. అంతర్జాతీయ ఖ్యాతి గడించారు.  భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూతో ఉన్న సాన్నిహిత్యం వల్ల భారత అణు, అంతరిక్ష కార్యక్రమాలను రూపొందించడానికి అవసరమైన ప్రభుత్వ సహకారాన్ని తీసుకోగలిగారు.

అది 1974 మే 18. రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌ ప్రాంతంలో శాస్త్రవేత్తలు ఓ పరీక్ష నిర్వహించారు. విజయవంతమైన ఆ ప్రయోగం, ప్రపంచంలో న్యూక్లియర్‌ పరిశోధనలు జరిపే దేశాల సరసన భారత్‌ను నిలిపింది. ఆనాటి విజయానికి ఎన్నో ఏళ్ల ముందే బాటలు పరిచిన వ్యక్తిగా, 'భారత #పరమాణు విధానానికి పితామహుడి'గా హోమీ జె. భాభా పేరొందారు. ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్‌తో సత్కరించింది

 
భాభా బ్రహ్మచారి. పెళ్లెందుకు చేసుకోలేదని చనువున్న వారెవరైనా అడిగితే ఆయన చిరునవ్వు నవ్వేవారు. ‘‘భౌతికశాస్త్రంలోని   ✍️సృజనాత్మకతతో నా వివాహం బాల్యంలోనే జరిగిపోయింది’’ అనేవారు. అణుశక్తి రంగంలో అపారమైన, అమూల్యమైన సేవలను అందించారు హోమీ భాభా.

అణు కార్యక్రమాలకు కావలసిన                 ✍️యూరేనియమ్ అనే ఇంధనం భారతదేంలో అంతగా లభించదు. కాబట్టి, దానికి ప్రత్యామ్నాయంగా థోరియం అనే ఇంధనాన్ని ఉపయోగించి అణుశక్తి ద్వారా విద్యుత్పత్తి చేసే కార్యక్రమాన్ని ఆనాడే బాబా రూపకల్పన చేశాడు.
నేడు భారతీయులందరూ గర్వించగలిగే అణుశాస్త్రవిజ్ఞానంలో ముందంజ వేయటానికి కారణం హోమీ బాబా స్ఫూర్తి అని ఆయనతో కలిసి పనిచేసిన మన మాజీరాష్ట్రపతి కలాం గారి అభిప్రాయం.

✍️ట్రాంబేలోని అణుశక్తి కేంద్రం పేరును అతని గౌరవార్థంగా భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్‌ గా మార్చారు.

 ✍️అతని మరణం తరువాత, అతని గౌరవార్థంగా అటామిక్ ఎనర్జీ స్థాపనను భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్‌గా మార్చారు. భాభా ఎలక్ట్రానిక్స్, అంతరిక్షశాస్త్రం, రేడియా ఖగోళశాస్త్రం మరియు సూక్ష్మజీవశాస్త్రంలో పరిశోధనను కూడా ప్రోత్సహించాడు. 

    ఊటీ, భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన రేడియా టెలిస్కోప్ అతని సంకల్పమే. ఇది 1970లో వాస్తవంగా ఆరంభించబడింది. భాభా అప్పటి నుంచి "భారతదేశం యెుక్క అణుశక్తి కార్యక్రమమునకు పితామహుడిగా" ఉన్నాడు. హోమీ భాభా ఫెలోషిప్ కౌన్సిల్ 1967 నుండి ఫెలోషిప్ లను అందిస్తోంది, ఇతర గుర్తింపు పొందిన సంస్థలలో డీమ్డ్ విశ్వవిద్యాలయం హోమీ భాభా నేషనల్ ఇన్స్టిట్యూట్ మరియు హోమీ భాభా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్, ముంబాయి, భారతదేశం ఉన్నాయి.

🇮🇳భారత అణు కార్యక్రమ పితామహుడిగా గుర్తింపు పొందిన శాస్త్రవేత్త హోమీ జహంగీర్ భాభాకు సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, పుస్తకాలంటే కూడా ఇష్టం.
హోమీ జహంగీర్ భాభా
ఫొటో క్యాప్షన్,
పేరొందిన శాస్త్రవేత్త సర్ సీవీ రామన్ తన సహచర శాస్త్రవేత్తల్ని ఎక్కువగా పొగిడేవారు కాదు. కానీ, హోమీ భాభాను ఆయన ‘భారత లియోనార్డో డావిన్సీ’ అని పిలిచేవారు.

✍️టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌లో ప్రతి బుధవారం అకడెమిక్ కాంగ్రెస్ జరిగేది. ఏ ఒక్క సమావేశానికీ ఆయన గైర్హాజరయ్యేవారు కాదు. ఇందులోనే చాలామందిని ఆయన కలుసుకునేవారు. ఏం జరుగుతోంది? ఏం జరగటం లేదు? అనేవి తెలుసుకునేవారు’ అని యశ్‌పాల్ చెప్పారు.

✍️కేవలం ఇద్దర్ని మాత్రమే #నెహ్రూ ‘సోదరా’ అని పిలిచేవారు. అందులో ఒకరు జయప్రకాశ్ నారాయణ్ కాగా మరొకరు భాభా’ **

✍️టాటా ఇన్‌స్టిట్యూట్‌లో ఒక గార్డెన్ ఉంది. దాని పేరు అమీబా గార్డెన్. దీన్ని రూపొందించింది, మొత్తం ఇన్‌స్టిట్యూట్ పచ్చగా, అందంగా ఉండేలా చేసిందీ భాభాయే.

**ఈ ప్రపంచంలో నేను కలిసిన ముగ్గురు గొప్ప వ్యక్తుల్లో హోమీ భాభా ఒకరు. మిగతా ఇద్దరు జవహర్‌లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ‌’ అని భాభాకు శ్రద్ధాంజలి ఘటిస్తూ జేఆర్‌డీ టాటా అన్నారు.

0 comments:

Post a Comment