Wednesday, January 12, 2022

భారత దేశ శాస్త్రవేత్త , వైద్య విజ్ఞాన వైతాళికుడు యల్లాప్రగడ సుబ్బారావు గారి జయంతి

💊🌷ప్రపంచం గర్వించదగ్గ భారత దేశ శాస్త్రవేత్త , వైద్య విజ్ఞాన వైతాళికుడు యల్లాప్రగడ సుబ్బారావు గారి జయంతి సందర్భంగా...🌷💊



తమ్ముడు పదిరోజులుగా బాధపడుతున్నాడు. రక్తహీనతవల్ల నానాటికి కృషిస్తున్నాడు. పలుమార్లు విరేచనాలవుతున్నాయి. వ్యాధి మరింత తీవ్రమైంది. తమ్ముని భాధను చూస్తూ నిస్సహాయుడై నిల్చున్నాడు అన్న. పెద్ద వైద్యం చేయించేందుకు డబ్బుల్లేని వాడు ఆ బాలుని తండ్రి. చూస్తుండగానే తమ్ముడు శాశ్వతంగా కన్నుమూశాడు. పన్నెండేళ్ళ అన్న కన్నీళ్ళు కారుస్తూ ఈ రోగానికి మందేలేదా? అని తనలో తాను ప్రశ్నిఎంచుకున్నాడు.

'భయంకరమైన ఈ వ్యాధిని నిర్మలించాలి. ఇందుకు మందు కనిపెట్టాలి. నేను #డాక్టర్ని కావాలి' అని బాలుడు నిచ్ఛయంచేకున్నాడు. ఆ బాలుడే దీక్ష నిరంతరాశ్రమ, పరిశోధనల వల్ల గొప్పవైద్యశాస్త్రవేత్తగా ప్రపంచ ప్రజల మన్నునాలందుకున్న డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు.
ఆధునిక వైద్య విజ్ఞాన, శాస్త్ర, పరిశోధనారంగ ధన్వంతరి యల్లాప్రగడ సుబ్బారావు. ఆయన అక్షరాలా ఆంధ్రుడు. అనేక కష్టనష్టాలు, సవాళ్ళు ఎదుర్కొని, #అద్భుతమైన ప్రాణధార మందులను కనుగొన్నాడు. ఆరోమైసిన్‌, ఫోలిక్‌ యాసిడ్‌, టెట్రాసైక్లిన్‌, బోదవ్యాధి మందు ఆయన #మానవజాతికి అందించిన దివ్య ఔషధాలు. టైఫాయిడ్, పాండురోగం మున్నగు వ్యాధులకు పూర్తిగా నిర్మూలింపగల మందులను కనుగొన్నాడు.

#ఏషియన్‌ లూయీపాశ్చర్‌:

భారత దేశానికి చెందిన వైద్య శాస్త్రజ్ఞులలో చాలా ప్రసిద్ధి చెందిన వ్యక్తి. లెడర్లీ ప్రయోగశాలలో వైద్యబృందం నాయకులుగా ఫోలిక్ ఆమ్లం యొక్క నిజస్వరూపాన్ని కనుగొన్నవాడు ,అందులోని బంగారు వన్నె భస్మం స్ప్రూ వ్యాధి, మక్రోసైటిక్ అనీమియా అను రక్తహీనత వల్ల కలిగే వ్యాధి నిర్మూలనకు అసమానమైన, అద్భుతమైన మందును,   క్షయరోగ నివారణియగు బసోనికోటి నికాసిడ్, హైడ్రాక్సైడ్ మందులను కనుగొన్న మన తెలుగు వాడు యల్లాప్రగడ సుబ్బారావు.
బోదకాలు, టైఫాయిడ్, పాండురోగం మున్నగు వ్యాధులకు పూర్తిగా నిర్మూలింపగల మందులను కూడా ఈయన కనుగొన్నాడు.
#మానవజాతికి మహోపకారం చేసిన వ్యక్తులలో డాక్టర్‌యల్లాప్రగడ సుబ్బారావు ప్రముఖులు. అందుచేతనే ” #ఏషియన్‌ #లూయీపాశ్చర్‌” గా సుబ్బారావు ప్రపంచ వ్యాప్తంగా కీర్తింపబడ్డారు.

#బాల్యం-విద్య:

ఇయన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం బస్తీలో 1895, జనవరి 12 న జన్మించారు. తండ్రి పేరు జగన్నాథం. ఎలిమెంటరీ, ఉన్నత పాఠశాల చదువులు పూర్తి చేసేటప్పటికి తండ్రి చిరు ఉద్యోగిగానే రిటైర్ అయ్యాడు. ఇక, ఈయనను చదివించడానికి తండ్రి వెనుకంజ వేయగా తల్లి పట్టుబట్టి ఈయనను రాజమండ్రికి పంపించి మెట్రిక్యులేషన్ పరీక్ష చదివించారు. ఫెయిలయ్యారు. ఇంతలో తండ్రి మరణించాడు. #తల్లి పట్టుదలతో మద్రాసుకు పంపదల్చగా చేత చిల్లిగవ్వ లేదు. #పుస్తెలు అమ్మి కొడుకు #చదువుకు ఇచ్చింది.

మద్రాసు హిందూ ఉన్నత పాఠశాలలో చేరి, చదువులో ముందడుగు వేశాడు. పేదరికంలో విద్యాపరమైన నైరాస్యంతో కూడా భవిష్యత్తు పట్ల ఆత్మవిశ్వాసంతో వర్తమాన ఇబ్బందులను అధిగమించే సాహసం ఈయనకు బాల్యంలోనే అబ్బింది. సంఘ సంస్కర్త చిలకమర్తి లక్ష్మీనరసింహం ప్రభావం ఈయన మీద బాగా పొడసూపింది. మద్రాస్, మైలాపూర్ లోని రామకృష్ణ మిషన్ వైపు కూడా ఆకర్షితుడాయ్యారు. వైద్యం నేచి, మిషన్ లో చేరి సన్యాసిగా అందరికీ వైద్య సేవలు అందించాలన్న అలోచన కూడా చేశారు. తన ఆలోచనను వివరింపగా, ససేమిరా అంగీకరించలేదు. బంధువుల సహకారంతో మద్రాసు మెడికల్ కాలేజీ ఇంటర్మీడియట్ డిస్టెంక్షన్ లో పాసయిన ఈయనను చేర్చిందింది. ఈ ఘటన చరిత్ర గతిని మార్చివేసింది.

#స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తితో:

దేశ స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తితో విదేశీ దుస్తులను బహిష్కరించి, ఖద్దరు దుస్తులతో కాలేజీకి చెళ్ళీన ఈయన కాలేజీ అధికారుల ఆగ్రహానికి గురయ్యారు. ఇంతలో మరో దుర్ఘటన జరిగింది. అత్యంత సన్నిహితుడైన పెద్దన్నయ్య పురుషోత్తం భయంకరమైన "స్ఫ్రూ" వ్యాధితో మరణించాడు. ఈ బాధ నుండి కోలుకోలేకముందే, వారం రోజుల వ్యవధిలో మరో సోదరుడు కృష్ణమూర్తి కూడా ఇదే వ్యాధికి బలయ్యాడు. ఈ రెండు మరణాలు ఈయనను తీవ్ర మనోవేదనకు గురిచేశాయి. ఎంతటి శ్రమపడి అయినా ఈ వ్యాధికి ముందు కనుగొనాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు.
ఆర్థిక ఒత్తిడి ఎంతగా ఉన్నా, ఎన్ని అవరోధాలు ఎదురైనా చదువు కొనసాగించాలని నిశ్చయించుకున్నాడు. మద్రాసు ఇండియన్ మెడికల్ కాలేజీలో ఎల్.ఐ.ఎం. చేసి, కార్పొరేషన్ ఆయుర్వేద హాస్పటల్ లో నెలకు అరవై రూపాయల జీతం మీద పనిచేశాడు. విదేశాలకు వెళ్ళీ పరిశోధనలు చేయాలని వైద్యశాస్త్రాన్ని శోధించి, పరిశోధించి అనేక రహస్యాలను వెలికి తీయానల్ల దృఢ కాంక్షను రోజు రోజుకీ బలపరచుకున్నాడు. 

*#లోతైన పరిశోధనా పటిమా:

సుబ్బారావు భావాలలో నైశిత్యము ఉంది. లోతైన పరిశోధనా పటిమా ఉంది. 1925 ప్రాంతంలో ఆయన అతిసార వ్యాధితో శుష్కించిపోయారు. మద్రాసు లోనే ఉన్న ఆనాటి ప్రసిద్ధ ఆయుర్వేద భిషగ్వరులు ఆచంట లక్ష్మీపతి వైద్యం చేసి ప్రాణ రక్షణ చేశారు. ఈ వ్యాధినే ఉష్ణమండల స్ప్రూ వ్యాధిగా నిర్ధారించారు. ఇరువురు సోదరులూ ఈ వ్యాధితోనే మృతి చెందారు. ఆ రోజుల్లో దీనికి సరైన ఔషథం లేదు. రెండు దశబ్దాల అనంతరం దీనికి మందు (ఫోలిక్ ఆసిడ్) ఈయన కనిపెట్టారు.

#యాంటీబయాటిక్సును కనుగొనుట:

హార్వర్డ్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ నుండి డిప్లొమా పొందిన తర్వాత, హార్వర్డ్ లో తనకు ఆచార్య పదవి తిరస్కరించడము వలన ఈయన లెడర్లీ ప్రయోగశాలలో చేరాడు. ఈయన రూపొందించిన హెట్రజాన్ అను డ్రగ్ ప్రపంచ ఆరోగ్య సంస్థ చే ఫైలేరియాసిస్ (బోదకాలు వ్యాధి) నివారణకు ఉపయోగించబడింది. సుబ్బారావు పర్యవేక్షణలో బెంజమిన్ డుగ్గర్ 1945లో ప్రపంచములోనే మొట్టమొదటి టెట్రాసైక్లిన్ యాంటీబయాటిక్ అయిన ఆరియోమైసిన్ను కనుగొనెను.

#నోబెల్‌ #బహుమతి వస్తుందనుకొన్నారు......

1948లో ఆరోమైసిన్‌ అన్న బహుళ ప్రయోజనకారియైున యాంటీబయాటిక్‌ ఆవిష్కరణ సుబ్బారావు పరిశోధనా ఫలితాలు అన్నిటిలోకి తలమానికంగా భావించారు. ఆరోమైసిన్‌తో వైజ్ఞానిక లోకం సుబ్బారావుకి నోబెల్‌ బహుమతి వస్తుందనుకొన్నారు. కానీ నోబెల్‌ బహుమతికై తన పేరు పరిశీలించినట్లు వినలేదు. కాగా స్టాక్‌హోంలోని వైద్యరంగపు నోబెల్‌ కమిటీ కార్యాలయంలో సుబ్బారావు చిత్తరువు పెట్టబడినట్లు (బహుశా మరణం తరువాత) తెలియరావటం ఆశ్చర్యకరమైన ఒక పరిణామం. సుబ్బారావు యిన్ని విజయాల వెనుక పడ్డ వేదన చాలావరకు అరణ్యరోదనగానే నిలిచిపోయింది.

సుబ్బారావు సహచరుడు మరియు 1988లో గెట్రూడ్ ఎలియాన్తో కలిసి వైద్య శాస్త్ర నోబెల్ బహుమతి పంచుకొన్న జార్జ్ హిచ్చింగ్స్ మాటల్లో: "ఫిస్క్, అసూయతో సుబ్బారావు యొక్క పరిశోధనలను వెలుగు చూడనీయక పోవడము వలన సుబ్బారావు కనుగొనిన కొన్ని న్యూక్లియోటైడ్లను అనేక సంవత్సరాల తర్వాత ఇతర పరిశోధకులచే తిరిగి కనుగొనవలసి వచ్చినది".

#వ్యక్తిత్వం:

విద్యార్థులంటే డాక్టర్ సుబ్బారావుకు ఎంతో ప్రేమ. చాలామంది విద్యార్థులకు ఆయన ఆర్ధిక సహాయం అందించారు. ఆయనలోని మానవుడు, పరోశోధకుని కంటే గొప్పవాడై వెలిగాడు. తనతోపాటు పరిశోధన సాగిస్తున్న యువ పరోశోధకురాలు క్షయవ్యాధితో శానిటోరియం చేరితే, ఆమె చికిత్సకోసం తన వేతనం నుంచి ఆరుసంవత్సరాలపాటు ఆర్ధికసహాయం ప్రతినెలా పంపేవాడు. తాను అనాధనాని ఏ రోగి భావించరాదని చెప్పేవాడాయన.

'నేను పుట్టుకతో ఏమి పట్టుకొని రాలేదు. చనిపోయేటప్పడు ఏమి తీసికెళ్ళాను. నా ఆదాయవ్యయాలు నా జీవనోపాధికి తగినంత 
ఉందనే ఉదరాశయం కలిగినవాడాయన.

డాక్టర్ యల్లాప్రగడ 'కరోనరి త్రాంబసిన్' వ్యాధితో 1948 ఆగష్టు 9వ తేదిన అమెరికాలో కన్నుమూశారు. 

#గౌరవము:

*కొత్తగా కనుగొనిన ఒక శిలీంద్రము (ఫంగస్) నకు ఈయన గౌరవార్ధము సుబ్బారోమైసిస్ స్ప్లెండెన్స్ (Subbaromyces splendens) అని నామకరణము చేశారు. 
*1947లో అమెరికా పౌరసత్వమునకు అర్హత పొందినా సుబ్బారావు తన జీవితాంతము భారతీయ పౌరునిగానే మిగిలిపోయాడు. తన జీవితమును మొత్తము వైద్య శాస్త్ర పరిశోధనకు అంకితము చేశాడు.

*లెడర్లీ వైద్యపరిశోధనా కేంద్రం ముఖ ద్వారం దాటిన తర్వాత పెద్ద కాంస్య ఫలకంపై ఉన్న డా. యల్లాప్రగడ సుబ్బారావుగారి చిత్రం క్రింద "యల్లాప్రగడ సుబ్బారావు - 1886-1948 పరిశోధకులు, విద్యావేత్త, తత్వవేత్త, దయామయుడు. లెడర్లీ పరిశోధనా సంస్థ డైరెక్టర్." అన్న వాక్యాలు ఆయన జ్ఞాపకార్థం ఉంచింది. 
*ఈ ప్రముఖ భారతీయ వైద్యుని పట్ల గౌరవసూచకంగా బొంబాయిలోని బల్సార్‌లో నిర్మించిన తమ ప్రయోగశాలకు డా. యల్లాప్రగడ సుబ్బారావు సంస్థ అని నామకరణం చేశారు లెడర్లీ సంస్థ వారు.

*అఖండ ప్రజ్ఞాశాలి యల్లాప్రగడ స్మార కార్థం మనదేశం పోస్టేజిస్టాంపు విడుదల చేసింది.
యావత్‌ జీవితాన్ని నిస్వార్థంగా వైద్యశాస్త్ర పరిశోధనలకే అంకితం చేసిన మహామనిషి డాక్టర్‌ యల్లాప్రగడ సుబ్బారావు.

*ముంబయి లోని బల్సార్ లో నిర్మించిన తమ ప్రయేగాశాలకు 'డా. యల్లాప్రగడ సుబ్బారావు సంస్ధ' అని నామకరణం చేశారు లేడిర్లి సంస్ధవారు.
*ప్రముఖ వైద్యశాస్త్రవేత్త విలియం డామ్ షేక్ "1900 నుంచి 1950 వరకు జీవించిన, అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన రక్తవిజన శాస్త్రవేత్తలు (హిమాటాలజిస్టులు) పది మందిలో సుబ్బారావు అగ్రగణ్యుడు" అని సుబ్బారావును ప్రశంసించాడు. 
*న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్' లాంటి ప్రత్రికలు ఆయనను ప్రముఖంగా కీర్తించి జోహార్లు అర్పించాయి.

 #స్వయంగా ఎన్నో మందులు కనుగొన్నా ఒక్క మందుకు కూడా #పేటెంట్‌ హక్కు అడగని గొప్ప #ఉదాత్తుడు డాక్టర్‌ సుబ్బారావు.
యల్లాప్రగడ సుబ్బారావు జీవితం యువతకు స్ఫూర్తిదాయకం.
🙏🌷🏵️🌸🌹🙏


1 comment: