Friday, December 16, 2022

స్వాతంత్ర్య సమరయోధులు చింతలపాటి సీతా రామచంద్ర వరప్రసాద మూర్తి రాజు గారి జయంతి సందర్భంగా

🌷🙏1800 ఎకరాలు దానం చేసిన దాత,68 విద్యాసంస్థలను స్థాపించిన విద్యా దాత,ఆక్వా పరిశ్రమకు ఆద్యుడు, విద్యాదాత, అభినవ భోజుడు, గాంధేయవాది, కొల్లేరు రాజుగా గుర్తింపు పొందిన, స్వాతంత్ర్య సమరయోధులు
చింతలపాటి సీతా రామచంద్ర వరప్రసాద మూర్తిరాజు గారి  జయంతి  సందర్భంగా.....🙏🌷






#చింతలపాటి సీతా రామచంద్ర వరప్రసాద మూర్తిరాజు ప్రముఖ #గాంధేయవాది. స్వాతంత్ర్యసమరయోధులు.
1800 #ఎకరాలు దానం చేసిన దాత-సర్వోదయ ఉద్యమానికి చేయూత-ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక-ఆక్వా పరిశ్రమకు ఆద్యుడు-నిడమర్రు, విద్యాదాత, అభినవ భోజుడు, గాంధేయవాది, సర్వోదయ నాయకుడు.పశ్చిమగోదావరి జిల్లా రాజకీయ ప్రముఖుడు.ఆయన కొల్లేరు రాజుగా గుర్తింపు పొందారు

ఈయన పశ్చిమగోదావరి జిల్లా చిననిండ్రకొలను గ్రామంలో 1919 డిసెంబర్ 16న బాపిరాజు మరియు సూరయ్యమ్మ దంపతులకు జన్మించారు. శ్రీ మూర్తిరాజు గారి ధర్మపత్ని సత్యవతి దేవి గారు. వీరి పుట్టినిల్లు మొగల్తూరు. నారాయణపురంలో ప్రాథమిక విద్య, తణుకులో ఉన్నత పాఠశాల విద్య అభ్యసించారు.

సర్దార్ దండు నారాయణరాజు గారి దేశ భక్తి, సమాజసేవా భావాలు మూర్తిరాజులో బలంగా నాటుకున్నాయి. తణుకు స్కూలులో చదువుతున్న రోజుల్లోనే విద్యార్థికార్యదర్శిగా ఉండి స్వదేశీ దుస్తులు ధరించి, ఖద్దరు టోపీ ధరించి స్కూలుకి వెళ్ళేవారు. కర్రసాము విద్యను అభ్యసించిన వీరు దినచర్యలో కూడా ఎంతో క్రమబద్ధమైన జీవితాన్ని అలవర్చుకున్నారు. డాక్టర్ రాజేంద్రప్రసాద్, జయప్రకాశ్ వంటి నాయకుల ఉపన్యాసాలకు ఉత్తేజితులై చైతన్యబాటను ఎన్నుకొన్నారు.

1942 లో #క్విట్ ఇండియా ఉద్యమాన్ని బలపరుస్తూ ఉద్యమ కార్యకర్తలకు చేదోడు వాదోడై నిలిచారు. పశ్చిమగోదావరి జిల్లా బోర్డు సభ్యునిగా పోటీలేకుండా ఎన్నికైయ్యారు. ఇదే మూర్తిరాజుకి మచ్చలేని రాజకీయ జీవితానికి రంగప్రవేశం అయ్యింది. 1952 లో ఉమ్మడి మద్రాసు రాష్ట్ర అసెంబ్లీకి తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి ఎన్నికయ్యారు. 1955 లో  వీరు తిరిగి 1955 లో విజయాన్ని అందుకున్నారు. 1961 లో అఖిల భారత సర్వోదయ సమ్మేళనాన్ని పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరులో ఏర్పాటు చేశారు. డాక్టర్ రాజేంద్రప్రసాద్, ఆచార్య వినోబా భావే, జయప్రకాశ్ నారాయణ, ఆర్యనాయకం చౌదరి, శంకర్ రావ్ దేవ్ వంటి నాయకులు ఈ సమ్మేళనాన్ని విజయవంతం చేశారు.

#హరిజనులకోసం కాలనీలను, పేదలకోసం ఇళ్లను, బాటసారుల కోసం విశ్రాంతి గృహాలను, భూదాన యజ్ఞానికి అనేక ఎకరాలను, అనేక విద్యాసంస్థలకు స్థల భవనాలను దానం చేసిన అపర కర్ణుడు.

**#మూర్తిరాజు తన తండ్రిగారి పేరిట చింతలపాటి బాపిరాజు ధర్మసంస్థను స్థాపించి ఉన్నత ఓరియంటల్, ప్రాథమిక, #జూనియర్, డిగ్రీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగాల్లో 68 విద్యాసంస్థలను స్థాపించారు. భారతీయ కళా పరిషత్తును స్థాపించి #కళాత్మకమైన సేవలను అందించారు **

#కొల్లేరు ప్రాంత రైతంగానికి సేవలందించారు.
జీవితం.. #ప్రజాసేవకే అంకితం: 

బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన మూర్తిరాజు తన జీవితమంతా ప్రజాసేవకే అంకితం చేశారు. చిన్నతనంలోనే మహాత్మాగాంధీ ప్రభావం ఆయనపై పడింది. చివరి వరకు ఆయన నిజమైన గాంధేయవాదిగానే ఉన్నారు. మహాత్మాగాంధీ దేశ పర్యటనలో భాగంగా 1929లో జిల్లాకు వచ్చినప్పుడు చేబ్రోలు రైల్వేస్టేషనులో ఆయనను చూశారు. అప్పటి నుంచి గాంధీ మార్గంలోనే నడిచారు. 
గాంధేయవాదిగా ముద్ర వేసుకొని సత్యం, అహింస, స్వదేశీ విధానాలను తాను ఆచరించడమే కాకుండా జిల్లా వ్యాప్తంగా వాటికి విశేష ప్రచారం కల్పించారు. మాంసాహారానికి దూరంగా ఉన్నారు. చిన్నతనం నుంచే ఖద్దరు వస్త్రాలను ధరించడం మొదలు పెట్టారు. తన పక్క గ్రామమైన పెదనిండ్రకొలనులో పార్లమెంటు నమూనాలో గాంధీభవనం నిర్మించి ప్రజల స్మృతిపథం నుంచి మహాత్ముని చెరిగిపోకుండా చేశారు. సర్వోదయ ఉద్యమానికి ఊపిరులూదారు. 1955లో వినోభాబావే భూదానోద్యమంలో భాగంగా జిల్లాకు వచ్చినప్పుడు 100 ఎకరాల భూమిని దానం చేశారు. 1961లో ఉంగుటూరు మండలం నాచుగుంటలో అఖిల భారత సర్వోదయ సమ్మేళనం నిర్వహంచారు.

#విద్యారంగంపై తిరుగులేని ముద్ర:

 విద్యారంగంలో మూర్తిరాజు తనదైన ముద్ర వేశారు. భీమవరం, ఏలూరు నగరాలకే పరిమితమైన విద్యను గ్రామీణ ప్రాంతాలకు తీసుకొచ్చిన ఘనత ఆయనదే. 

#మానవత్వం పరిమళించే గొప్ప దాతృత్వం కలిగిన మూర్తిరాజ గారు  81 పాఠశాలల్లో 61 పాఠశాలకు తన సేవాసంస్థ ద్వారా ఖర్చుపెట్టి ఆయన యావాదాస్తిని దారబోసారు. 
రాజకీయాల్లో ఉన్నా గాంధీజీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న వ్యక్తి, తప్పు చేస్తే ఏ స్థాయిలో ఉన్న వ్యక్తినైనా ప్రశ్నించేవాడు.

#తాను ఎస్‌ఎస్‌ఎల్‌సీ వరకు చదివినా చదువు విలువ గుర్తించి ప్రతి ఒక్కరూ విద్యావంతులను చేయాలనే తపన పడేవారు. బాపిరాజు ధర్మసంస్థ ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు ఏర్పాటు చేశారు. వాటన్నింటికి దేశ నాయకుల పేర్లు పెట్టారు. కుటుంబంలో మహిళ చదువుకుంటే ఆ ఇల్లంతా విద్యావంతులవుతారనేది ఆయన దృఢ విశ్వాసం. అందుకోసం ఆయన జీవితాంతం కృషి చేశారు. కళల్ని సాహిత్యాన్ని ప్రేమించే మూర్తిరాజు కళాకారులకు ఎందరికో ఉపాధి చూపించారు. భూరి విరాళాలిచ్చి అభినవ భోజుడిగా పేరుపొందారు.. నేడు సినీరంగంలో ప్రముఖ హాస్య నటునిగా కొనసాగుతున్న ఎంఎస్‌ నారాయణ, పురాణ వ్యాఖ్యాత మైలవరపు శ్రీనివాసరావు ఆయన నెలకొల్పిన పాఠశాలల విద్యార్థులే. ప్రముఖ రచయిత, నటులు పరుచూరి గోపాలకృష్ణ ఆయన స్థాపించిన కళాశాలలో అధ్యాపకులుగా పనిచేశారు. మాజీ మంత్రులు దండు శివరామరాజు, మరో మాజీ మంత్రి కంతేటి సత్యనారాయణరాజులు ఆయన శిష్యులే.

#గాంధేయవాది అయిన వీరు చిననిండ్రకొలనులో గాంధీజీ స్మారక భవనాన్ని నిర్మించారు. 1964 లో ఫిన్ లాండ్ ప్రపంచ శాంతి మహాసభలకు భారత ప్రతినిధిగా వెళ్ళారు. 1971 లో మార్కెటింగ్ శాఖామాత్యులుగా, 1972 లో దేవాదాయ శాఖామంత్రిగా,  వైద్య శాఖా మంత్రిగా సేవలందించారు. సుప్రసిద్ధ చరిత్రకారుడైన శ్రీ బుద్ధరాజు వరహాలరాజు గారు తన 'శ్రీ ఆంధ్ర క్షత్రియ వంశ రత్నాకరము' లో ఈయన గురించి వ్యాసము రచించారు. ఈయన 2012 నవంబర్ 12 న కాలం  చేశారు.


0 comments:

Post a Comment