💐💐ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి వర్థంతి సందర్భంగా....💐💐
46 మంది #దోషులను మరణశిక్ష (ఉరి) నుండి రక్షించాలని సీనియర్ న్యాయవాది వాదించారు. అప్పుడు అతని సహాయకుడు వచ్చి అతనికి ఒక చిన్న కాగితం ఇచ్చాడు. న్యాయవాది దాన్ని చదివి జేబులో పెట్టుకుని తన వాదనను కొనసాగించాడు
#భోజన విరామ సమయంలో, న్యాయమూర్తి అతనిని "స్లిప్లో మీకు ఏ సమాచారం వచ్చింది" అని అడిగారు. న్యాయవాది "నా భార్య చనిపోయింది" అని అన్నారు. న్యాయమూర్తి ఆశ్చర్యపోయాడు మరియు "అప్పుడు మీరు ఇక్కడ ఏమి చేస్తున్నారు?" ఎందుకు మీరు మీ ఇంటికి వెళ్ళలేదు ". న్యాయవాది అన్నారు…. "నేను నా భార్య జీవితాన్ని తిరిగి తీసుకురాలేను, కాని ఈ 46 స్వాతంత్య్ర సమరయోధులకు జీవితాన్ని ఇవ్వడానికి మరియు వారు చనిపోకుండా నిరోధించడంలో నేను సహాయపడగలను". ఆంగ్లేయుడైన న్యాయమూర్తి మొత్తం 46 మందిని విడుదల చేయాలని ఆదేశించారు. న్యాయవాది మరెవరో కాదు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు.
*** *** *** *** ***
#ప్రపంచానికి విజ్ఞానం పరిచయం చేసిన "వేద భూమి" దుష్టుల పాలనలో విభజింపబడి 'వేదన'కు గురైతే భరతమాత ముద్దుబిడ్డ సర్ధార్ వల్లభాయ్ పటేల్ అకుంటిక కార్యదక్షతతో 550 సంస్థానాలను ఒక్క తాటిపై నిలిపి భారతదేశ ఐకమత్యం ప్రపంచానికి చాటారు.
గుజరాత్ రాష్ట్రంలోని ‘నడియాడ్లో 1875 అక్టోబర్ 31వ తేదీన జవేరాబాయి పటేల్, లాడ్బాయి దంపతులకు, నాలుగవ సంతానంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మించాడు. పటేల్ తన 6వ ఏటనే కరమ్సాద్లోని ఒక గుజరాతీ పాఠశాలలో విద్యాభ్యాసం ప్రారంభమయింది. కానీ ఆయనకు ఆంగ్ల విద్యనభ్యసించాలనే ఉబలాటం ఉంది. ఆ పరిస్థితిలో అదృష్టం అతని ఇంటి తలుపు తట్టినట్టయింది. తన ఊరిలోనే ఒక ప్రైవేటు ఆంగ్ల పాఠశాల స్థాపించబడింది. మూడు సంవత్సరాలు ఆ పాఠశాలలో విద్యార్జన చేసాడు. పిదప పెట్లాడ్ గ్రామంలో పటేల్ తన ఊరివారైన ఆరుగురు విద్యార్థులతో ఒక వసతి గృహాన్ని ఏర్పరుచుకున్నాడు. అన్యాయాన్ని ఎదిరించడం, అందుకోసం ఎంతటివారితోనైనా తలపడటం పటేల్కు చిన్ననాటి నుండి ఉన్న గుణం.
కేవలం #తిరుగుబాటుతత్వమే గాక అవసరమైనప్పుడు తోడ్పడే సుగుణం కూడా పటేల్లో ఉంది. పటేల్కు 22 సంవత్సరాలు వచ్చేసరికి మెట్రిక్ పూర్తయింది. న్యాయవాదిగా జీవితం సాగించాలనే కాంక్ష ఉందిగానీ యల్.యల్.బి. పూర్తి చేయాలంటే కనీసం 6 సంవత్సరాలు పడుతుంది. అంతటి తీరికగాని ఆర్థిక స్థోమతగానీ తనకు లేదు. పుస్తకాలను స్థానిక న్యాయవాదుల వద్ద అడిగి తెచ్చుకొని 3 సంవత్సరాలు నిర్విరామ కృషి సల్పి ప్లీడర్ పరీక్ష పాసయ్యాడు. వకీలుగా ఆయన గోద్రాలో రెండు సంవత్సరాలు ప్రాక్టీసు చేసారు. కొద్ది రోజులలోనే ఆయన క్రిమినల్ లాయర్గా మంచి పేరు సంపాదించుకున్నారు.
#పోలీస్లు తెచ్చే కేసులలో ఆయన ముద్దాయిల తరఫున వాదించేవారు. వారు తెచ్చే దొంగ సాక్షులను తన ప్రశ్నల పంరపరతో తికమక పెట్టి ముద్దాయిలను విడుదల చేయించేవారు. స్వాతంత్య్రం వచ్చేసరికి దేశం రెండు ప్రాదేశికాలుగా చీలిపోయింది. అందులో ఒకటి బ్రిటిష్ సామ్రాజ్యం ఆధీనంలో ఉండగా సంస్థానాధీశుల ఏలుబడిలో ఉంది. సంస్థానాధీశులలో చాలా మంది దేశభక్తులు జాతీయవాదులు ఉన్నప్పటికీ, వారిలో ఎదురు తిరిగినవారు కూడా ఉన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా పుదుచ్చేరి, యానాం, కరైకాల్, డయ్యూ, డామన్ వంటి ప్రాంతాలు పరాయి ప్రాంతాలు పరాయి దేశాల పాలనలో ఉండేవి. ముఖ్యంగా శతాబ్దాల నుండి అనువంశిక పాలనలో ఉన్న సంస్థానాలను భారత్ యూనియన్లో విలీనయమ్యేటట్లు చేయడంలో పటేల్ సమయస్ఫూర్తి, ఓర్పు, నేర్పు అమోఘం.
#భారత రాజ్యాంగ సభలో ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మెన్ గా పనిచేశాడు. భారత పార్లమెంటులో రాష్ట్రపతి #ఆంగ్లో ఇండియన్ లకు నామినేట్ చేయు అధికారానికి కూడా అతనే ప్రతిపాదించాడు.
దేశ స్వాతంత్ర్యం కోసం విశేషకృషి సల్పిన వల్లబ్ భాయి పటేల్ కు సహజంగానే స్వాతంత్ర్యానంతరం ముఖ్యమైన పదవులు లభించాయి. జవహర్ లాల్ నెహ్రూ మంత్రిమండలిలో #హోంమంత్రిగాను, ఉప #ప్రధాన మంత్రిగాను 1947 నుంచి 1950 డిసెంబరు 15న మరణించేవరకు పదవులు నిర్వహించారు.
స్వాతంత్య్రం వచ్చిన(1947) తొమ్మిదేళ్లకుగానీ రాష్ట్రాల పునర్వవస్థీకరణ జరగలేదు. బ్రిటిష్ పాలనలో మద్రాస్ కలకత్తా బొంబాయి ప్రావిన్స్లు ఉండేవి. మన రాష్ట్రానికి చెందిన కోస్తా, రాయలసీమ ప్రాంతాలు మద్రాసు, ప్రావిన్సులను తెలంగాణా ప్రాంతం నైజాం పాల నలో ఉండేవి. అమర జీవి పొట్టి శ్రీరాములు ఆత్మ బలిదానంతో మద్రాసు ప్రావిన్సు నుంచి ‘కర్నూలు రాజ ధానిగా ఆంధ్ర రాష్ట్రం 1953లో ఏర్పడింది. ఆంధ్ర రాష్ట్రంకోసం స్వాతంత్య్ర సమరంలో భాగంగా ఉద్యమం సాగింది. తెలుగు వారందరిని కలిపి వుండేందుకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలన్న ఆకాంక్ష ఆనాడు అన్ని ప్రాంతాల వారిలోనూ ఉంది.
#తెలంగాణా యోధులు అంతా ఎవరి పరిధిలో వారు అకుంఠిత దీక్షతో ఎన్నో త్యాగాలు, కష్టనష్టాలకు ఓర్చి నిరవధికంగా ఉద్యమాలు సాగించడం వలననే ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. వారి కృషికి కేంద్రంలో సర్దార్ పటేల్ తీసుకున్న చర్యలను ఎంతో దోహదం చేసాయి. ముఖ్యంగా సంస్థానాధీశులను ఒప్పించడంలో పటేల్ చూపిన ముందుచూపు, సమయస్ఫూర్తి, పట్టువిడుపుల వైఖరి నభూతో నభవిష్యత్.మహాత్మునికి అనుసరునిగా స్వాతంత్య్ర పోరాటంలో కాంగ్రెస్ పార్టీకి పటేల్ సారథ్యం వహించారు. జీవితాంతం గాంధీజీ ఆశయాలకు కట్టుబడి దృఢదీక్షాధ్యక్షునిగా స్వరాజ్య సాధనా సమరానికి అంకితమయ్యారు. దేశ సేవా తత్పరునిగా సర్వస్వం త్యాగం చేసి బ్రిటిష్ నిరంకుశ ప్రభుత్వం పారదోలడానికి అనుక్షణం శ్రమించారు.
#బాగ్దోలి ఉద్యమనేత 1931న కరాచి కాంగ్రెస్ అధ్యక్షునిగా కినిస్టిట్యూంట్ అసెంబ్లీ వివిధ కమిటీల చైర్మన్గా ఎన్నో సేవలందించారు. స్వాతంత్య్ర అనంతరం నవభారత ఐక్యతా, సమగ్ర జాతి నిర్మాతగా ఉక్కుమనిషిగా జాతీయ అగ్రశ్రేణి నేతగా ఆరాధ్యనీయుడయ్యా రు. హైదరాబాద్ సంస్థానం స్వతంత్య్ర సర్వాధిపత్య రాజ్యంగా పాలించాలనే రాజ్యకాంక్ష దాహంతో విర్రవీగి ఎదురు తిరిగిన నైజాం నవాబు 1948 సెప్టెంబరు 13, 18 తేదీల పోలీస్ చర్యకు లొంగి తలవంచి, ఇండియన్ యూనియన్కు దాసోహం ప్రకటించడం పటేల్ రాజనీతిజ్ఞతకు, ఉక్కుమనిషి సర్దార్ దీక్షాదక్షతలకు నిదర్శనం.నవభారత నిర్మాత, సుస్థిర రక్షకుడు, భారతజాతి ప్రియతమ నాయకుడు ఉక్కుమనిషి కార్యశూరుడైన పటేల్ తన 75వ ఏట 1950 డిసెంబరు 15వ తేదీన స్వర్గస్తులయ్యారు.
#ఆయన చివరి కోరిక ప్రకారం బొంబాయిలోని ”క్వీన్స్ మేరి శ్మశాన వాటికలో ఆయన పవిత్ర దేహాన్ని దహనం కావించారు. అగ్నిదేవుడా! శరీరాన్నాహుతి గొనేవేళ లక్షోప లక్షల ప్రజలు కన్నీరు మున్నీరుగా విలపించారు. ప్రధాని నెహ్రూ తన కుడి భుజం పడిపోయినట్లుగా ఎంతగానో వాపోయారు. నేటికీ దేశం ఏదైనా క్లిష్ట పరిస్థితి ఎదుర్కొన్నప్పు డు ‘ఈ సమయంలో #పటేల్ ఉంటే ఎంత బావుండేదో అనేమాట ప్రజల నాలుకలపై ఆడుతుంటుంది. కాశ్మీర్ సమస్య తలెత్తినప్పుడల్లా భారత్ ప్రజలు పటేల్ను జ్ఞాపకం చేసుకోని భారతీయులుండరు.
#బిరుదులు
1991లో భారత ప్రభుత్వం వల్లబ్ భాయి పటేల్ సేవలను గుర్తించి భారత రత్న బిరుదును మరణానంతరం ప్రకటించించింది.
#ఐక్యతా ప్రతిమ:
భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని 2018 అక్టోబర్ 31న ఆవిష్కరించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన విగ్రహం ఇది. దీని ఎత్తు 182 మీటర్లు. ఈ విగ్రహాన్ని ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ (ఎకత్వ చిహ్నము) అని పిలుస్తున్నారు.గుజరాత్లోని నర్మదా నదీ తీరంలోని సాధు బెట్ అనే చిన్న దీవిలో దీన్ని నిర్మించారు. ‘సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ ఇంటిగ్రేషన్ ట్రస్ట్’ ఈ స్టాట్యూ ఆఫ్ యూనిటీ ప్రాజెక్టును చేపట్టింది.
0 comments:
Post a Comment