Sunday, December 25, 2022

దేశ ఉత్తమ ప్రధానిగా..: అటల్ బిహారీ వాజపేయి గారి జయంతి సందర్భంగా💐🌷

🌷💐మిడిల్‌క్లాస్ ఫ్యామిలీ నుంచి దేశ ఉత్తమ ప్రధానిగా..: అటల్ బిహారీ వాజపేయి గారి జయంతి సందర్భంగా💐🌷
(Good governance day)




అటల్ బీహారి వాజ్ పేయి అందరిలా మామూలు రాజకీయ నేత కాదు. రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్న గొప్ప లీడర్. ప్రజా సేవ కోసం బ్రహ్మచారిగా ఉండిపోయి... తన జీవితం మొత్తం దేశం కోసం అంకితం చేశారు. రెండు సీట్ల పార్టీని దేశ రాజకీయ చరిత్రలోనే అధికార పార్టీగా మలచిన అపర చాణుక్యుడు.

1924 డిసెంబర్ 25న మధ్యప్రదేశ్ గ్వాలియర్ లో వాజ్ పేయి జన్మించారు. తల్లిదండ్రులు కృష్ణదేవి, కృష్ణ బీహారి వాజ్ పేయి. తండ్రి హైస్కూల్ హెడ్ మాస్టర్. దీంతో వాజ్ పేయి ప్రాథమిక విద్య అంతా గ్వాలియర్ లోని సరస్వతి శిశుమందిరంలోనే గడిచింది. అనంతరం అక్కడే విక్టోరియా కాలేజ్ లో డిగ్రీ పట్టా పొందారు. అనంతరం కాన్పూర్ వెళ్లిన ఆయన ఎంఏ పొలిటికల్ సైన్స్ చేశారు. 1939లో ఆర్ఎస్ఎస్ లో చేరారు. 1944 నుంచి ఆర్ఎస్ఎస్ లో పూర్తి స్తాయి కార్యకర్తగా ఎదిగారు. ఆర్య సమాజ్ కు 1944లో జనరల్ సెక్రటరీగా పనిచేసిన వాజ్ పేయి విభజన అల్లర్లు కారణంగా చదువకు స్వస్తి చెప్పి యూపీలో కొన్ని పత్రికల్లో పనిచేశారు. 1975 ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ టైంలో వాజ్ పేయి కొంతమంది ప్రతిపక్ష నేతలతో కలిసి జైలుకు కూడా వెళ్లారు.

1977 సార్వత్రిక ఎన్నికలలో జనతా పార్టీ విజయం తరువాత ఆయన మొరార్జీ దేశాయ్ మంత్రివర్గంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశాడు. విదేశీ వ్యవహారాల మంత్రిగా ఆయన ఐక్యరాజ్యసమితి యొక్క సర్వప్రతినిధి సభలో హిందీలో ప్రసంగించిన మొట్టమొదటి వ్యక్తిగా నిలిచాడు.చైనాతో భారత్ సంబంధాలను మెరుగపర్చటానికి ప్రయత్ననం చేశాడు.

1980 ఏప్రెల్ 6న వాజ్ పేయి, ఎ‌ల్ కే అద్వానీతో కలిసి భారతీయ జనతా పార్టీని స్థాపించారు. అప్పట్లో ఆయనే.. ఆ పార్టీకి తొలి అధ్యక్షుడిగా నియామకం అయ్యారు. తొలి నాళ్లలో రెండు సీట్లకే పరిమితం అయిన పార్టీని 1996 సాధారణ ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయికి తీసుకెళ్లిన ఘనత వాజ్ పేయి, అద్వానీలదే. అప్పట్లో తొలిసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వాజ్ పేయి
లోక్ సభలో పూర్తి మెజారిటీ రాకపోవడంతో 13 రోజులకే పదవి నుంచి వైదొలిగారు. ఆ తర్వాత 1998లో రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అప్పట్లో ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న ఏఐఏడీఎంకే బయటకురావడంతో ఒక్క ఓటు తేడాతో వాజ్‌పేయి ప్రభుత్వం పడిపోయింది.  దీంతో 13 నెలలకే ప్రధాని పదవి నుంచి వాజ్ పేయి దిగిపోయారు. తర్వాత 1999 నుండి 2004వరకు 
ప్రధాని గా ఉన్నాడు.

దాయాది దేశం పాకిస్తాన్ తో భారత్ సంబంధాలు మెరుగు పడేలా దౌత్య చర్యలు ప్రారంభించారు. 1999లో వాజ్ పేయి హయాంలోనే ఢిల్లీ నుంచి లాహోర్ కు బస్ సర్వీస్ ను కూడా ప్రారంభించారు. దీంతో ఇరుదేశాల మధ్య లాహోర్ ఒప్పందం కుదిరింది. భారతదేశ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచే కార్గిల్ వార్ కూడా వాజ్ పేయి టైంలోనే జరిగింది. 1999 జూలైలో కాశ్మీర్ లోని కార్గిల్ జిల్లాలో... కొన్ని సరిహద్దు ప్రాంతాల్లో పాక్ సైనికులు... భారత్ ఆర్మీ మధ్య కార్గిల్ వార్ జరిగింది. ఇరుదేశాలకు మధ్య జరిగిన ఈ భీకర పోరులో ఇరు పక్షాలు.. తీవ్రస్థాయి ఇబ్బందులు ఎదుర్కొన్నాయి.

1974 లో తొలిసారిగా "ప్రోఖ్రాన్-I" అణుపరీక్ష జరిపిన భారతదేశం, మళ్ళీ 24 సంవత్సరాల తరువాత, 1998 మే నెలలో భారతదేశం రాజస్థాన్ లోని పోఖ్రాన్ ఎడారిలో ఐదు భూగర్భ అణు పరీక్షలను నిర్వహించింది. ఈ పరీక్షను "ప్రోఖ్రాన్-II"గా వ్యవహరిస్తారు

1988 చివరలో, 1999 మొదట్లో వాజపేయి పాకిస్తాన్‌తో శాంతి కోసం పూర్తిస్థాయి దౌత్యచర్యలు ప్రారంభించాడు. దీని ఫలితంగా ఢిల్లీ-లాహోర్ బస్సును 1999 ఫిబ్రవరిలో ప్రారంభమైంది. వాజపేయి కాశ్మీర్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా పాకిస్థాన్ తో నూతన శాంతి ఒప్పందంకోసం పాకిస్థాన్ ను ఆహ్వానించాడు.

వాజపేయి మూడవ దఫా పరిపాలనా కాలంలో అనేక దేశీయ ఆర్థిక, మౌలిక సంస్కరణలను చేపట్టాడు. వాటిలో ప్రైవేటు రంగాన్ని, విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించాడు. కొన్ని ప్రభుత్వరంగ సంస్థలలో పరిశోధన, అభివృద్ధిని ప్రోత్సహించాడు. ప్రభుత్వపు వృధాఖర్చులను తగ్గించి, పరిశోధన, అభివృద్ధిని ప్రోత్సహించారు. కొన్ని ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించాడు.గత 32 సంవత్సరాలలో అభివృద్ధి చెందిన రోడ్లలో సగం వరకు, వాజపేయి నేతృత్వంలోని ఎన్.డి.ఎ ప్రభుత్వం యొక్క ఐదేళ్ల పాలనలో అభివృద్ధి చెందినవే అని యు.పి.ఏ ప్రభుత్వం 2013, జూలై 1న సుప్రీంకోర్టు ఎదుట అంగీకరించింది

"నేషనల్ హైవే డెవలప్‌మెంటు ప్రాజెక్టు", "ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన" వాజపేయి అభిమాన ప్రాజెక్టులు.

2000 మార్చిలో అప్పటి అమెరికా అధ్యక్షుడు, బిల్ క్లింటన్ అధికారిక పర్యటనపై భారతదేశాన్ని సందర్శించారు. 22 యేళ్లలో భారత దేశాన్ని సందర్శించిన మొట్టమొదటి అధ్యక్షుడు ఆయనే. అమెరికా అధ్యక్షుడు భారతదేశాన్ని సందర్శించడం ఇరు దేశాల మధ్య సంబంధాల పురోగతికి ముఖ్యమైన మైలురాయిగా చెప్పవచ్చు. ఈ సందర్శనకు ముందు రెండు సంవతర్సాల క్రితమే భారత్ పోఖ్రాన్ అణు పరీక్షలు నిర్వహించి ఉండటం, సంవత్సరం ముందే కార్గిల్ యుద్ధం జరిగి ఉండటం, తదనంతరం పాకిస్తాన్ సైనికపాలనలోకి వెళ్ళటం వంటి సంఘటనల పూర్వరంగంతో జరిగిన ఈ పర్యటన, ప్రఛ్ఛన్న యుద్ధం తర్వాత అమెరికా విదేశాంగ విధానంలో చోటుచేసుకున్న పెనుమార్పులను ప్రతిబింబించింది. భారత ప్రధానమంత్రి, అమెరికా అధ్యక్షుడు వ్యూహాత్మక సమస్యలపై చర్చలు జరిపారు. కానీ ఈ చర్చల ప్రధాన ఫలితంగా ద్వైపాక్షిక వాణిజ్య, ఆర్థిక సంబంధాలు గణనీయంగా విస్తరించాయి. ఈ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య భవిష్యత్తు సంబంధాల అభివృద్ధికి అవలంబించవలసిన మార్గంపై, ప్రధాని వాజపేయి, అధ్యక్షుడు క్లింటన్ చారిత్రక విజన్ డాక్యుమెంట్ పై సంతకం చేసారు.
ఇలా ఒకటేంటి రాసుకుంటూ... చెప్పుకుంటూ పోతే ఎన్నో. ఆర్ఎస్ఎస్, జనసంఘ్ నుంచి వచ్చినా... బీజేపీ లీడర్ గా ఎదిగినా.. అన్నివర్గాల ప్రజల మనసును గెలుచుకున్న వ్యక్తి అటల్ బీహారీ వాజ్ పేయి. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఏర్పడ్డ ఎన్డీయే కూటమికి సెక్యూలర్ ఫేస్ ఇవ్వడానికి ఎంతగానో కృషిచేశారాయన. విధానాల్లో తేడా వస్తే... ఎంతటి నాయకుడ్ని అయినా.. నిలదీసే నైజం ఆయనది. పార్లమెంట్ సాక్షిగా నెహ్రూలాంటి నేతల్ని సైతం గడగడలాడించారు. హీటెక్కించే ప్రసంగాలు చేయడంలోనే కాదు.. హాస్యం పండిచండంలోనూ ఆయనకు ఆయనే సాటి. ప్రసంగాల్లో... చట్ట సభల్లో మధ్యమధ్యలో కవిత్వాన్ని కలగలిపి అందరితో శెభాష్ అనిపించుకున్నారు. ఆయన వాగ్ధాటి ఎలాంటిదంటే.. భారత ప్రధానిగా ఉన్న నెహ్రూనే ఓ సందర్భంలో.. అటల్ జీ దేశానికి ప్రధాని అవుతారని జోస్యం చెప్పారు.

వాజ్ పేయిపై తమకున్న అభిమానాన్ని చాటుకుంది బీజేపీ. *2014లో అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్ వాజ్ పేయికి సముచిత గౌరవాన్ని అందించింది. ఆయన పుట్టినరోజును సుపరిపాలన దినోత్సవంగా ప్రకటించింది*
అంతేకాదు.. దేశానికి వాజ్ పేయి చేసిన సేవలకు గానే.. 2015లో భారతరత్నతో సత్కరించింది. ఈ ప్రతి ష్టాత్మక పురస్కారాన్ని అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రోటోకాల్ ను పక్కన పెట్టి... వాజ్ పేయి నివాసానికి వెళ్లి మరీ అందించారు. అలాంటి మహోన్నత నేత 2009లో అనారోగ్యం కారణంగా క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. అనారోగ్య కారణాలతో అటల్ జీ 2018 ఆగష్టు 16న ఆశేష అభిమానులను శోక సంద్రంలో ముంచి తిరిగిరాని లోకాలకు పయనమయ్యారు. ఆయన మన మధ్యలేకపోయినా..ఆయన ఆశయాలు ఇప్పటికీ బతికే ఉన్నాయి.


0 comments:

Post a Comment