Friday, December 23, 2022

జాతీయ రైతు దినోత్సవం (కిసాన్ దివస్) సం【భారతదేశపు రైతుల విజేత' చరణ్ సింగ్ గారి జయంతి】

🔹🌴🌾జాతీయ రైతు దినోత్సవం (కిసాన్ దివస్) సందర్భంగా🌾🌴🔹
【భారతదేశపు రైతుల విజేత' చరణ్ సింగ్ గారి జయంతి】




#భారత భాగ్య విధాతా! #జీవన సౌభాగ్య ప్రధాతా! ఓ రైతన్నా నీకు మా నెనరులు! ఈ లోకాన్నీ నడిపించే ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడైతే ఆ సూర్యుని నుంచి వచ్చే శక్తిని వినియోగించుకుని లోకంలోని ప్రజలందరి ఆకలి బాధను తొలగించే పరోక్ష దైవాలు రైతులు. నేల తల్లిని నమ్ముకొని, పలు రకాల ప్రతికూల పరిస్థితులను తట్టుకుంటూ, శ్రమించి పంటలను పండించి దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తారు #వ్యవసాయదారులు. 

దేశానికి పట్టెడన్నం పెట్టే రైతన్న ల పరిస్థితి అతివృష్టి, అనావృష్టిల ధాటికి నేడు అతలాకుతలం అవుతోంది.. దేశానికి రక్షించే జవాన్‌లకు ఎంత ప్రాముఖ్య త ఉందో పట్టెడన్నం పెట్టే అన్నదాతలకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. అందుకే జై జవాన్‌... జై కిసాన్‌ అనే నినాదం యావత్‌ భారతవనిలో వినిపిస్తుంది. దేశానికి వెన్నుముకగా రైతులను అభివర్ణిస్తారు. 

#అంతర్జాతీయ వ్యవసాయదారుల దినోత్సవం ఏప్రిల్‌ 17 నజరుపుతారు. అయితే మనదేశం తమకంటూ ప్రత్యేకంగా వ్యవసాయదారుల దినోత్సవం ఉండాలనే లక్ష్యంతో  చరణ్‌సింగ్‌ జన్మదినోత్సవాన్ని అందుకు ఎంచుకున్నారు.  చరణ్‌సింగ్‌ చేపట్టిన ఉద్యమాల ఫలితంగానే జమీందారీ చట్టం రద్దు అయింది. కౌలుదారీ చట్టం వచ్చింది. మరికొందరు నాయకుల ఆలోచనల నుంచి #భూసంస్కరణలొచ్చాయి. పేదలకు భూముల పంపిణీ జరిగింది. వ్యవసాయదారులకు అనుకూలమైన పలురకాల విధానాలను రూపొందించడం జరిగింది. రైతులను వడ్డీ వ్యాపారుల కబంధహస్తాల నుంచి విడిపించి వారికి బ్యాంకు రుణాలు అందించే విధానం ప్రవేశపెట్టేలా చేయడం వెనుక చరణ్‌సింగ్‌ నిర్వహించిన రైతు ఉద్యమాలున్నాయి. రైతుల గురించి, వ్యవసాయం గురించి అంతగా ఆలోచించి, వారి సమస్యల పరిష్కారానికి కషిచేసిన చరణ్‌ సింగ్‌ దేశ ప్రధాని అయినపుడు రైతాంగం ఆనందపడింది.

#రైతు కుటుంబము నుంచి వచ్చి ప్రధాని పదవిని అలంకరించి,భారతదేశపు రైతుల విజేత "గా చెప్పుకునే చరణసింగ్‌ జన్మదినమైన డిశంబరు 23ని జాతీయ వ్యవసాయదారుల దినోత్సవంగా (కిసాన్‌ దివస్‌) జరుపుకుంటోంది భారతదేశం.

1979 జూలై 28 నుండి 1980 జనవరి 14 వరకు చరణ్ సింగ్ #భారతదేశ 5వ #ప్రధానమంత్రిగా పనిచేశాడు. ప్రధానమంత్రి కంటే ముందు ఈయన ఉప ప్రధానమంత్రిగా కూడా పనిచేశాడు.

#కార్యక్రమాలు:

రైతు దినోత్సవం సందర్భంగా వ్యవసాయరంగంపై చర్చలు, సదస్సులు, క్విజ్ పోటీలు, శిక్షణా శిబిరాలు, ఎగ్జిబిషన్ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు.

#రైతు సమస్యలపై అవగాహన:

కిసాన్ దివస్‌ను జరుపుకోవటంలో ప్రధాన ఆంతర్యం ఏడాదిలో ఒక్కరోజైనా అన్నదాతల కష్ట సుఖాలు, బాగోగులపై చర్చ జరిగి, వాటిపై సామాన్యులకు అవగాహన కల్పించటమే. రోజంతా శ్రమించే రైతన్నల గురించి కిసాన్ దివస్ రోజు అవగాహన కల్పిస్తారు. రైతులు ఎదుర్కొనే సమస్యలు, వాటి పరిష్కారాలపై ఈరోజు దృష్టిసారించేలా జాతీయ రైతు దినోత్సవాన్ని జరుపుకుంటారు.

#రైతు బంధుగా పేరుతెచ్చుకున్న చరణ్ సింగ్ సమాధిని కిసాన్ ఘాట్ అని పిలుస్తారు. అతని మూడవ వర్థంతి (1990, మే 29) సందర్భంగా భారత ప్రభుత్వం అతని చిత్రంతో తపాలా బిళ్లను విడుదలచేసింది.

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో నగరంలో ఉన్న అమృత్ సర్ విమానాశ్రయానికి " చరణ్ సింగ్ అంతర్జాతియ విమానాశ్రయం"గా నామకరణం చేసారు. మీరట్ లోని విశ్వవిద్యాలయానికి "చరణ్ సింగ్ విశ్వవిద్యాలయం"గా పేరు పెట్టారు. ఎటావా జిల్లాలోని కళాశాలకు " చరణ్ సింగ్ పోస్టు గ్రాడ్యుయేట్ కళాశాల"గా నామకరణం చేసారు. బులంద్‌షహర్ జిల్లాలో ఒక ఆసుపత్రికి అతని పేరు పెట్టారు.

#ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు దినోత్సవం:

గత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జన్మదినం రోజైన జులై 08 ను రాష్ట్ర రైతు దినోత్సవంగా  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2019 లో ప్రకటించింది.

#వివిధ దేశాలలో రైతు దినోత్సవాలు:

Pakistan - December 18
America - 12 October
Ghana - First Friday of December
India - December 23
Zambia - First Monday Of August.

మన #భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. మనదేశంలో వ్యవసాయం ఆధారంగా అనేక పంటలు రైతే పండిస్తాడు. దేశ ప్రజల తినే ఆహారం అంతా, దేశంలో రైతులు పండించే పంటలపై ఆధారపడి ఉంటుంది.
🙏🔹🌾🌴🔹🙏

0 comments:

Post a Comment