Friday, December 23, 2022

అపర చాణిక్యుడు, నూతన ఆర్థిక సంస్కరణల పితామహుడు శ్రీ పి.వి. నరసింహారావు గారి వర్థంతి.

💐🇮🇳అపర చాణిక్యుడు, నూతన ఆర్థిక సంస్కరణల పితామహుడు శ్రీ పి.వి. నరసింహారావు గారి వర్థంతి  సందర్భంగా🇮🇳💐





#ఆర్థికవ్యవస్థ దివాళా అంచున ఉన్న సమయంలో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన #తెలుగు #కీర్తి శిఖరం. అనేక సవాళ్లను ఒంటిచేత్తో ఎదుర్కొన్న అపర చాణక్యుడు  భారత ప్రధాన మంత్రి పదవిని అధిష్టించిన మొదటి దాక్షిణాత్యుడు, ఒకేఒక్క తెలుగువాడు, పాములపర్తి వేంకట నరసింహారావు 
భారతదేశ ప్రధానమంత్రిగా, అవిభక్త ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన పాములపర్తి వెంకట నరసింహారావు జూన్ 28, 1921న జన్మించారు. వరంగల్ పట్టణ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామం వీరి స్వగ్రామం. పి.వి.గా అందరికి సుపరిచితులైన వీరు 1971-73 కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అంతకు క్రితం రాష్ట్ర మంత్రివర్గంలో న్యాయ, ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. 1991-96 కాలంలో ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించి ఈ పదవి చేపట్టిన తొలి దక్షిణాది వ్యక్తిగా రికార్డు సృష్టించారు. పలు భాషలలో నిష్ణాతులైన పి.వి. విశ్వనాథ సత్యనారాయణ రచించిన వేయిపడగలను సహస్రఫణ్ పేరుతో హిందీలో అనువదించారు. ది ఇన్‌సైడర్ పేరుతో స్వీయచరిత్రను కూడా రచించారు. రాజకీయాలలో అపర చాణుక్యుడిగ్ ఫేరుగాంచిన పి.వి. డిసెంబరు 23, 2004న మరణించారు.

#బాల్యం, విద్యాభ్యాసం:

పి.వి.నరసింహారావు వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో 1921 జూన్ 28 న రుక్నాబాయి, సీతారామారావు దంపతులకు జన్మించారు. వరంగల్లు జిల్లాలోనే ప్రాథమిక విద్య మొదలుపెట్టారు. తరువాత కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మలు ఆయనను దత్తత తీసుకోవడంతో అప్పటినుండి పాములపర్తి వెంకట నరసింహారావు అయ్యారు. 1938 లోనే హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెసు పార్టీలో చేరి నిజాం ప్రభుత్వ నిషేధాన్ని ధిక్కరిస్తూ వందేమాతరం గేయాన్ని పాడినందుకు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బహిష్కరణకు గురయ్యారు. నాగపూరు విశ్వవిద్యాలయంలో చేరి న్యాయశాస్త్రం అభ్యసించారు. స్వామి రామానంద తీర్థ, బూర్గుల రామకృష్ణారావుల అనుయాయిగా స్వాతంత్ర్యోద్యమంలోను, హైదరాబాదు విముక్తి పోరాటంలోను పాల్గొన్నారు. 1951 లో అఖిల భారత కాంగ్రెసు కమిటీ లో సభ్యుడిగా స్థానం పొందారు.

#రాజకీయ జీవితం:

1957లో మంథని నియోజక వర్గం నుండి శాసనసభకు ఎన్నికవడం ద్వారా పీవీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రస్థాయి పదవీ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇదే నియోజకవర్గం నుండి వరుసగా నాలుగు సార్లు శాసన సభ్యునిగా ఎన్నికయ్యారు. 1962 లో మొదటిసారి రాష్ట్రమంత్రి అయ్యారు. 1962 నుండి 1964 వరకు న్యాయ, సమాచార శాఖ మంత్రి గాను, 1964 నుండి 67 వరకు న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి, 1967 లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, 1968-71 కాలంలో న్యాయ, సమాచార శాఖ మంత్రి పదవులు నిర్వహించారు. 1969 నాటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమం అప్పుడే చల్లారింది. ముఖ్యమంత్రిని మార్చడమనేది కాంగ్రెసు పార్టీ ముందున్న తక్షణ సమస్య. తెలంగాణా ప్రజల, ఉద్యమనేతల సెంటిమెంట్లను దృష్టిలో ఉంచుకుని తెలంగాణా ప్రాంత నేతను ముఖ్యమంత్రిగా ఎంపిక చెయ్యడమనేది అనివార్యమయింది. వివాదాల జోలికి పోని ఆయన వ్యక్తిత్వం, పార్టీలోని ఏ గ్రూపుకూ చెందని ఆయన రాజకీయ నేపథ్యం ఆయనకు 1971 సెప్టెంబర్ 30 న ముఖ్యమంత్రి పదవిని సాధించిపెట్టాయి.

#ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా:

ముఖ్యమంత్రి పీఠం ఎక్కగానే పార్టీలో అసమ్మతి తలెత్తింది. ఆ సమయంలోనే ముల్కీ నిబంధనలపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో ఆందోళన చెందిన కోస్తా, రాయలసీమ నాయకులు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోరుతూ జై ఆంధ్ర ఉద్యమం చేపట్టారు. పీవీని తెలంగాణా నాయకుల పక్షపాతిగా ఆంధ్ర, రాయలసీమ నాయకులు ఆరోపించారు. ఉద్యమంలో భాగంగా ఆ ప్రాంత మంత్రులలో చాలామంది రాజీనామా చేసారు. రాజీనామా చేసిన మంత్రుల స్థానంలో 1973 జనవరి 8 న కొత్త మంత్రులను తీసుకుని పీవీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేసారు. అయితే పార్టీ అధిష్టానం ఆలోచన పూర్తిగా భిన్నంగా ఉంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగిన మరునాడే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి, శాసనసభను సుప్తచేతనావస్థలో ఉంచి, రాష్ట్రపతి పాలనను విధించింది. ఆ విధంగా పీవీ ముఖ్యమంత్రిత్వం ముగిసింది. 1972లో పీవీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ ఎన్నికలలో 70% వెనుకబడిన వారికిచ్చి చరిత్ర సృష్టించారు. తాను ముఖ్యమంత్రిగా ఉండగా భూసంస్కరణలను అమలుపరచేందుకు చర్యలు తీసుకున్నారు.

#కేంద్ర రాజకీయాలలో:
లోకసభ సభ్యుడిగా పి.వి. తొలిసారి హనుమకొండ స్థానం నుండి ఎన్నికయ్యారు. రెండోసారి మళ్ళీ హనుమకొండ నుంచే ఎన్నిక కాగా, మూడవసారి ఎనిమిదో లోక్‌సభకు మహారాష్ట్రలోని రాంటెక్ నుండి ఎన్నికయ్యారు. తొమ్మిదో లోక్‌సభకు మళ్ళీ రాంటెక్ నుంచే ఎన్నికయ్యారు. 1980-1989 మధ్య కాలంలో కేంద్రంలో హోంశాఖ, విదేశవ్యవహారాల శాఖ, మానవ వనరుల అభివృద్ధి శాఖ లను వివిధ సమయాల్లో నిర్వహించాడు.

#ప్రధానమంత్రిగా:

1991 సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేయకుండా, దాదాపుగా రాజకీయ సన్యాసం తీసుకున్నారు. ఆ సమయంలో రాజీవ్ గాంధీ హత్య కారణంగా కాంగ్రెసు పార్టీకి నాయకుడు లేనట్టయింది. ఆ సమయంలో తనకంటూ ప్రత్యేక గ్రూపు లేని పీవీ అందరికీ ఆమోదయోగ్యుడుగా కనిపించారు. దాదాపుగా వానప్రస్థం నుండి తిరిగివచ్చి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. నంద్యాల లోకసభ నియోజకవర్గం నుండి గంగుల ప్రతాపరెడ్డిచే రాజీనామా చేయించి, అక్కడి ఉప ఎన్నికలో గెలిచి, పీవీ లోకసభలో అడుగుపెట్టారు. ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ లేని పరిస్థితిలో కూడా  తన సహజ సిద్ధంగా ఉన్న తెలివితేటలు, కేంద్రంలో వివిధ మంత్రిత్వ శాఖల్లో ఆయనకు ఉన్న అపార అనుభవంతో ఐదు సంవత్సరాల పరిపాలనా కాలాన్ని పూర్తి చేసుకొన్నారు. ఐదేళ్ళ పూర్తి పాలనా కాలాన్నినిర్వహించడం నెహ్రూ, గాంధీ కుటుంబంబాల బయటి మొదటి వ్యక్తి, పీవీయే. మైనారిటీ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తూ కూడా, ఇది సాధించడం ఆయన రాజనీతికి, చాకచక్యానికి నిదర్శనం. అందుకే ఆయన భారత రాజకియాలలో అపర చాణక్యుడుగా పరిగణించబడతారు.

#సాహితీవేత్తగా:

#బహుభాషా కోవిదుడైన పీవి విశ్వనాథ సత్యనారాయణ రచించిన "వేయిపడగలు"ను సహస్రఫణ్ పేరుతో హిందీలో అనువదించారు. ఈ పుస్తక అనువాదంకై పీవీకి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. ఇన్‌సైడర్ రచన ఆయన ఆత్మకథ.

#అబల జీవితం: పన్ లక్షత్ కోన్ ఘతో అనే మరాఠీ  పుస్తకానికి తెలుగు అనువాదం.
ఇన్‌సైడర్: ఆయన ఆత్మకథ. ఇది వివిధ భాషల్లోకి అనువాదమయింది.
ప్రముఖ రచయిత్రి "జయ ప్రభ" కవిత్వాన్ని ఆంగ్లంలోకి అనువదించాడు.
తెలంగాణా సాయుధ పోరాట నేపథ్యంలో "గొల్ల రామవ్వ" కథ విజయ కలంపేరుతో కాకతీయ పత్రికలో 1949లో ప్రచురితమైంది. 1995లో "విస్మృత కథ" సంకలనంలో ప్రచురించబడేప్పుడు కథారచయిత శ్రీపతి చొరవ, పరిశోధనలతో ఇది పి.వి.నరసింహారావు రచనగా నిర్ధారణ అయింది.
ఇవేగాక మరెన్నో వ్యాసాలు కలం పేరుతో వ్రాసాడు. కాంగ్రెసువాది పేరుతో 1989 లో మెయిన్‌స్ట్రీం పత్రికలో వ్రాసిన ఒక వ్యాసంలో రాజీవ్ గాంధీ పాలనను విమర్శించాడు. 1995 లో ఆ విషయం ఫ్రంట్‌లైన్ పత్రిక ద్వారా వెలుగులోకి వచ్చింది. తన ఆత్మకథ రెండో భాగం వ్ర్రాసే ఉద్దేశ్యం ఆయనకు ఉండేది. ఆ కార్యం నెరవేరకుండానే  పి.వి.నరసింహారావు కన్నుమూసాడు.

పీవీ తెలుగుతో సహా 17 #భాషలలో ధారాళంగా మాట్లాడగలిగిన ప్రజ్ఞ ఉండేది. 1983 అలీన దేశాల శిఖరాగ్ర సమావేశంలో స్పానిష్ లో మాట్లాడి క్యూబా అధ్యక్షుడు ఫీడెల్ కాస్ట్రో ను అబ్బురపరచారు.
#బహుభాషా కోవిదుడిగా వాసికెక్కినా, అరవయ్యో పడిలో కంప్యూటర్‌ కోడింగ్‌ నేర్చుకొన్న పీవీ జిజ్ఞాస నేటి తరానికి #ఆదర్శప్రాయం.

రాష్ట్ర, జాతీయ స్థాయిలలో కీలక పదవులు చేపట్టి, రాష్ట్రం నుంచే కాకుండా పొరుగున ఉన్న మహారాష్ట్ర నుంచి కూడా లోకసభకు ఎన్నికై సాహితీరంగంలో కూడా ప్రతిభ చూపిన పీవి నరసింహరావు  2004 డిసెంబర్ 23న మరణించారు. హైదరాబాదులో నిర్మించిన అతిపొడవైన ఫైఓవర్‌కు ఆయన పేరుపెట్టబడింది.
దేశ పథగమనాన్నే అనుశాసించిన పీవీ- తెలుగు జాతి అనర్ఘరత్నం,   ఆయన ఖ్యాతి అజరామరం.
🙏

0 comments:

Post a Comment